సంపాదకీయం

ఇదొక హిందుత్వ దారి…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రెండు  ప్రధానమైన విషయాలు చర్చనీయాంశంగా వున్నాయి.మొదటిది భావ ప్రకటనా  స్వేచ్ఛపై నియంత్రణ. రెండవది కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతన వాదిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం . ఈ రెండు విషయాలు పరిష్పర ఆధారితాలు. భావ ప్రకటన స్వేచ్ఛను తెలుగుదేశం పార్టీ  తన ప్ర త్యర్థి జగన్ కాంగ్రెస్ నుండి లాక్కోవడం  మాత్రమే కాదు. ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసుల దగ్గర పంచాయితీ ,అరెస్టులు ఉంటాయనే విషయాన్ని చంద్రబాబు, పవన్ చెబుతున్నారు. వందలాదిమంది   యూట్యూబర్లను  పోలీస్ స్టేషన్ కు పిలిచి రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు.    పదేళ్ల కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో 
కవిత్వం

ఒక నిస్సహాయుడి తలపోత

ఇంత ఉక్కపోతలో కాసింత ఊరటకి సంతోషపడిపోవడంగురించి కాదు..వచ్చే మంటల ఊడ్పులమండుటేసవి గురించే దిగులంతా -ఊచలు వంచుకొనిరాజ్యం కోరలు వంచిబయటకురావడం చూసికళ్ళు చెమర్చడం గురించి కాదు ..మనసు చిగుర్చడం గురించి కాదు..చేయని నేర నిరూపణలలోనే జీవితాల హరణ గురించే వేదనంతా-మనుషుల ఉదాసీనత మేత మేసిరాజ్య క్రూరత్వం ఇబ్బడిముబ్బడి కావడం వెచ్చని సుఖ జీవితాలుచల్లబడిన రక్తాల విరామ స్థలాలవడంరంగువెలసిన ఎర్రరంగులుఒక సమాధానపడిన ఎర్రగాబొగులుపోవడం గురించేఅసలు భయమంతా..పొడిచిన సూర్యోదయం లేఎండలో కాసింత ఒళ్లు కాగుతున్నంతలోనేప్రజా జీవితాల పొద్దు కుంగుతుందేమోననిఅభద్రతాఅనకొండ చుట్టుకౌగిలిలోపెనుగులాటల గురించే..కొన్ని నల్లకోటుల పట్టుదలలుకొన్ని వసంతాల ప్రేమలతలుఅండా సెల్లో పళ్ళ బిగువున ఒక చక్రాలకుర్చీ దివ్యాంశ యుద్ధంజీవితాశల తరువుకి ఒక లేతాకులారోజు రోజు
దండకారణ్య సమయం

ఊర్మిళ @ నీతి-ఆధునిక మహిళ

ఆధునిక మహిళ రేపటి చరిత్ర రచిస్తుంది అని గురజాడ ప్యారిస్ కమ్యూన్కు బోల్షివిక్ విప్లవానికి మధ్యకాలంలో, బోల్షివిక్ విప్లవానికి సన్నిహిత కాలంలో చెప్పాడు. రష్యా, చైనా విప్లవాల కన్నా భారతదేశంలో విప్లవ విజయం ప్రపంచ పీడిత వర్గాల విముక్తికి దోహదం చేస్తుందనే ప్రామిస్ - వాగ్దానం నక్సల్బరీ చేసింది. మార్క్స్ ఆశించిన పెట్టుబడి పరాయికరణ నుంచి మానవసారం పొందే విముక్తి, లెనిన్ ఆశించిన సాంస్కృతిక విప్లవం, చైనాలో మావో తనపై తాను చేసే పోరాటంగా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ సారం నుంచి చారుమజుందార్ రచించిన స్వప్నం. చారుమజుందార్ చైనా శ్రామిక వర్గ మహత్తర సాంస్కృతిక విప్లవాన్ని బోల్షివిక్
పత్రికా ప్రకటనలు Press notes

చ‌ల‌ప‌తి, విజ‌య‌వ‌ర్ధ‌న‌రావుల విడుదలకై పోరాడుదాం

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ, ప్ర‌జాసంఘాల‌కూ జీవిత ఖైదీల విడుద‌ల సాధ‌న స‌మితి త‌ర‌పున ఆహ్వానం. మిత్రులారా.. చిల‌క‌లూరి పేట బ‌స్సు ద‌హ‌నం కేసు మ‌న‌లో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. 1993 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆ దుర్ఘ‌ట‌న కు బాధ్యులైన చ‌ల‌ప‌తిరావు విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు సంఘ‌ట‌న జ‌రిగిన రెండు మూడు రోజుల‌కే అరెస్ట్ అయ్యారు. వారు ఆ నేరం బ‌స్సులో ఉన్న వారిని చంపాల‌నే ఉద్దేశ్యంతో చేయ‌లేదు. కేవ‌లం బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను బెదిరించి దోపిడీ చేసే ఉద్దేశ్యంతో మాత్ర‌మే చేశారు. అయితే అనుకోని విధంగా బ‌స్సు ద‌హ‌నం జ‌రిగిపోయింది. చ‌ల‌ప‌తి విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు అరెస్ట్ అయిపోయారు.
stories

Tender Hands

It is the courtyard of a police station, which is not like the current ultra-modern hi-tech police station with bright colours and high impenetrable walls. We are talking of a time before somebody with a heart burn blasted it with bombs. It is an old building with tiled veranda and mud coloured walls. The courtyard is surrounded by a four foot high compound wall. Chitti, who was thrown into a
సంపాదకీయం

ఏసేబు ఒక్కడే కాదు.. వేలు , లక్షలు 

జీవించి ఉండగానే మరణానంతర వైభవానికి కూడా అన్నీ సిద్ధం చేసుకొనే వాళ్లున్న చోట మరణించి జీవించడం మొదలు పెట్టేవాళ్లు దిగ్భ్రాంతికరంగా తయారవుతారు. అలాంటి వాళ్లను  అంగీకరించడానికి మనసు సిద్ధం కాదు. అసలు వాళ్లున్నట్లు కూడా తెలియదనే రక్షణ వలయంలో సేదతీరుతాం. ఒకవేళ తెలిసి ఉంటే వాళ్లను మినహాయింపు అనుకుంటాం. తీసి పక్కన పెట్టేస్తాం. మన నిరాశలకు, నిట్టూర్పులకు, చరిత్రపట్ల పిల్ల చేష్టలకు తగిన దారికి ఇలాంటి వాళ్లు అడ్డం లేకుండా చూసుకుంటాం. సుఖమయ వాదనల విశాల రంగస్థలానికి  ఈ ఏర్పాట్లు అవసరం మరి. వాదననలను ప్రతిసారీ సత్యాన్వేషణ కోసమే చేస్తామనే గ్యారెంటీ ఏమీ లేదు. ఆసత్యానికి ఆవలి అంచున 
కవిత్వం

సత్యమెప్పుడూ ఓడిపోదు

ఒక్కొక్కరూ నిన్ను చెరిపేస్తామని చెప్పే వాళ్ళే కానీ ప్రతి సారీ నువ్వో కొత్త చరిత్రగా నెత్తుటి సంతకంగా వేలాది పుటలుగా వెలుగొందుతున్నావు కోట్లాది ప్రజల ఆకాంక్ష కలలు నీలో దాగున్నవి వాటిని ఛిద్రం చేసేందుకు వాడెప్పుడూ ఆయుధాలనే నమ్ముకున్నాడు కానీ నువ్వెప్పుడూ నిరాయుధ ప్రజల చేతులలో సుత్తి కొడవలి నాగలిపనిముట్లతోనే ఇన్నేళ్ల యుద్ధాన్ని పోరాడుతూ సేద్యం చేస్తున్నావు పుడమీ ఆకాశమూ సూర్యుడూ చంద్రుడూ తోడుగా సాగే బాట నీది వాడెప్పుడు ఏవేవో కుట్రలు కుతంత్రాలతో నిన్ను ఓడిద్దామని విరుచుకు పడుతుంటాడు కానీ గడ్డి పరకలతో ఏనుగును బంధించిన చేతుల చేవ నీదని చరిత్ర చెబుతోంది మనుషులను చంపితే నిన్ను
వ్యాసాలు

భారతదేశంలో రాజకీయ ఖైదీలు: రాజ్య కుట్రపూరిత వ్యాజ్యాలు, ఏజెన్సీలు

5 మార్చి 2024న, బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీ, మహేష్ టిర్కీలను వారిపై ఉన్న అన్ని అభియోగాల నుండి నిర్దోషులుగా ప్రకటించింది. కేవలం 33 ఏళ్ల పాండు నరోటే జైలులో ఉండగానే మరణించాడు. నిజానికి ఇది కస్టడీ హత్య అని, సంబంధిత అధికారులపై విచారణ జరిపి శిక్షించాలన్నారు. ఎంతటి క్రూరత్వం అంటే.. అతను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా జైలు పాలకవర్గం అతనికి వైద్యం చేయించలేదు. అతని జీవితపు చివరి రోజుల్లో కళ్ళ నుండి, మూత్రంలో రక్తస్రావం జరిగింది. మిగిలిన ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు
సమకాలీనం

చంచల్‌గూడ జైలులో రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

రోజంతా ఏకాంతవాసంలో(ఒంటరిగదుల్లో) నిర్బంధించకూడదనే ఏకైక డిమాండ్‌తో చంచల్‌గూడ సెంట్రల్ జైలు, నర్మదా బ్లాక్‌లోని రాజకీయ ఖైదీలు 2024 ఆగస్టు 27 నాడు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. గత కొంతకాలంగా, సీపీఐ (మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ఖైదీలు చంచల్‌గూడ జైలు నిర్బంధంలో వున్నారు. వారు విచారణ ఖైదీలైనప్పటికీ జైలు అధికారులువారి హక్కులను నిరంకుశంగా అణిచివేస్తున్నారు. జైలు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పులను (ఉదాహరణకు సునిల్ బాట్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, 1980)సైతం లెక్కచేయడంలేదు. చదవడానికి పుస్తకాలు, పత్రికలు కావాలని, రాసుకోవడానికి పెన్నులు, నోట్‌ బుక్స్ లాంటి కనీస అవసరాల కోసం ఖైదీలు