నివేదిక

మావోయిస్టు నిర్మూనలకు రూ.5 కోట్ల ప్రోత్సాహకం 

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో వున్నారు. ఈ సంవత్సరం, ఛత్తీస్‌గఢ్‌  ఈ ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని పోలీసులు పేర్కొన్నారు.  ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ. ఈ సీరీస్‌లో ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో మాట్లాడి ఆ సంఖ్యల వెనుక ఉన్న కథనాలను స్క్రోల్‌ వెబ్‌ సైట్‌ అందిస్తోంది. ఆ ఫోటోలో మహిళ
ఆర్ధికం

సెబీలో ‘హిండెన్ బర్గ్’ తుఫాన్

 18 నెలల క్రితం అదానీ గ్రూప్ ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మరోసారి 'సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా' అంటూ 'ఎక్స్'లో ఆగష్టు 10న పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్స్, షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్  ఫండ్స్ లో, బెర్ముడా (బ్రిటిష్), సింగపూర్లో లో గౌతమి ఆదానీ అన్న వినోద్ అదానీ నెలకొల్పిన కంపెనీలో 'సెబి చైర్ పర్సన్' మాధవి పూరి బుచ్' తో పాటు ఆమె భర్త 'ధవళ్ బుచ్'
సంభాషణ

కగార్ అమరుల స్థూపాల కూల్చివేత సందర్భంలో ఇంద్రవెల్లి, హుస్నాబాద్

చావంటే భయం లేని వాళ్లకు భయపడి చంపేశాడు. చచ్చి అమరత్వం పొందిన వాళ్లకు భయపడి స్థూపాలను డైనమెట్లతో కూల్చేసాడు. నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్లకు జోహార్లు, నక్సలైట్లు నాతో చేతులు కలిపితే ఢల్లీి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరవేస్తానని నర్సంపేట, ములుగు, ఏటూరు నాగారం సభల్లో వాగ్దానం చేసిన (విప్లవకారుల దృష్టిలో ప్రగల్బాలు పలికిన) ఎన్‌.టి.ఆర్‌. 1985 సెప్టెంబర్‌ 3న డాక్టర్‌ రామనాథం హత్యతో తీవ్ర నిర్బంధం ప్రారంభించాడు. అక్కడి నుంచి పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల నాయకుల హత్యలను, టాడా ప్రయోగాన్ని, మిస్సింగ్‌ కేసులను (కొడవటి సుదర్శన్‌ ఆర్‌.వై.ఎల్‌. కార్యకర్త) కె.ఎస్‌. వ్యాస్‌ నాయకత్వంలో కుఖ్యాతి వహించిన గ్రేహౌండ్స్‌ను
ఓపన్ పేజ్

భారత ప్రజాయుద్ధానికిఎల్లెలెరుగని సంఫీుభావం

ప్రపంచంలో ఎక్కడున్నా ప్రజల ఆకాంక్షలు కలుస్తాయి. మానవాళి  స్పందనలు ఉమ్మడి రూపం ధరిస్తాయి. ఒకే హృదయంలోంచి వ్యక్తమవుతాయి. చరిత్ర నిర్దేశించే లక్ష్యాలను విశాలమైన చూపులతో మారుమూలల నుంచి కూడా పోగు చేసుకుంటాయి.  విశ్వాసాలు, విలువలు, ప్రయోజనాలు భౌతిక రూపం ధరిస్తాయి. న్యాయాన్యాయ వైఖరులు ఎల్లప్పుడూ మానవీయత వైపే  నిలబడతాయి. లేకపోతే పాలస్తీనా అస్తిత్వం కోసం ప్రపంచమంతా  ఒకే గొంతుగా ఎట్లా ప్రతిధ్వనిస్తుంది? రక్తసిక్త  బస్తర్‌ అంతర్జాతీయ చైతన్యంగా ఎట్లా ప్రతిఫలిస్తుంది? దేశాల, సమూహాల ఉనికిని దురాక్రమిస్తున్న మార్కెట్‌కు, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ఎందుకు వెల్లువెత్తుతుంది? బాధితులకు ఈ ప్రపంచమంతా సంఫీుభావం ఎందుకు అందిస్తుంది? పాలస్తీనాలాగే బస్తర్‌ కూడా ఇవాళ
వ్యాసాలు

సోషలిస్టు సమాజ విజయాలు: విద్య – ఉపాధి

నేడు మన నిరుద్యోగ యువత ప్రభుత్వం ఉపాధి కల్పించమని రోడ్లపైకి వస్తే పోలీసుల లాఠీదెబ్బలు తిని చేసి జైలుకు వెళ్లాల్సి వస్తున్నది . కానీ కేవలం ఏడు దశాబ్దాల క్రితం, పూర్తిగా యిందుకు భిన్నంగా పాలన ఉన్న దేశాలు ఉన్నాయి. అంటే, మీరు పని లేదా ఉద్యోగం చేయకూడదనుకుంటే, మిమ్మల్ని అరెస్టు చేసి 'లేబర్ క్యాంపు'లో శ్రమ చేయడానికి పంపిస్తారు. మీరు పరాన్నజీవి వర్గానికి  చెందినవాళ్ళు కాబట్టి  మీరు పని చేయకూడదని అనుకుంటున్నారని భావిస్తారు. ఈ దేశాల్లో, 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలందరికీ ఉపాధి హామీ వుండింది. ఈ దేశాలను సోషలిస్టు దేశాలు అని పిలిచేవారు, ఆ
వ్యాసాలు

రోనా: జన హృదయాల్లోనిప్రతిఘటనా స్వరం

బి‌కె -16  కేసులో కటకటాల వెనుక ఉన్న కార్యకర్త రోనా విల్సన్ క్రియాశీలత ఫాసిస్టు  రాజ్యాన్ని      లక్ష్యంగా చేసుకొంది. కేరళలోని కొల్లంలో పెరిగి, 1990 ల ప్రారంభంలో న్యూఢిల్లీకి వెళ్ళిన రోనా తన అరెస్టు వరకు తన జీవితాన్ని అక్కడే గడిపాడు. దక్షిణ ఢిల్లీలోని మునీర్కా గ్రామంలో అద్దెకు తీసుకున్న ఒక గదిలో పూనే, ఢిల్లీ పోలీసుల సంయుక్త చర్యలో రోనాను అరెస్టు చేశారు. జంతుశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పొందిన తరువాత, రోనా తాను  కృషి చేయాల్సింది ఆ రంగం కాదని గ్రహించి, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌లో తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి
వ్యాసాలు

“ఎన్నికల బహిష్కరణ” నినాదం – ప్రాముఖ్యత

(ఢిల్లీ నుంచి వచ్చే *నజారియా* పత్రికలో ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలో లా విద్యార్థిని రాసిన వ్యాసం ఇది . సాధారణ ఎన్నికల మీద భిన్న రాజకీయ కోణాల్లో చర్చలు  జరుగుతున్నసందర్భంలో మే 21, 2024 సంచికలో ఇది అచ్చయింది. వసంత మేఘం టీం ) ఇటీవలి సాధారణ ఎన్నికల సందర్భంగా కేరళలోని  వాయనాడ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని అనేక జిల్లాలు, ఇతర ప్రాంతాల నుండి సీపీఐ (మావోయిస్ట్) కార్యకర్తలు “ఎన్నికలను బహిష్కరించండి!” అనే నినాదంతో ప్రచారం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నినాదం వెనుక ఉన్న సంభావ్య తార్కిక కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తుంది. రివిజనిస్ట్
కాలమ్స్

ఈ కవిత్వం గూర్చి మాట్లాడదాం రండి..!!

(ప్రముఖ కవి , సాహిత్య విశ్లేషకుడు , సాహితి స్రవంతి నాయకుడు కంగార మోహన్ ఈ సంచిక నుంచి కొత్త పుస్తకాల సమీక్షా కాలం *ఈ పుస్తకం  చదివారా ?* ప్రారంభిస్తున్నారు - వసంత మేఘం టీం ) సాహిత్యంలో వస్తువు పాఠకులకొక సారాన్ని అందించాలి. అలా అందించడానికి తగిన రచనా విధానాన్ని వదిలిపెట్టి, వస్తువుకు అనవసరమైన అలంకరణల్ని అతికించడం వల్ల ప్రయోజనం లేదు. సాహిత్యాన్ని చదివినవాడు లేదా విన్నవాడు ఆనందించడంతోబాటు ఎంతో కొంత చైతన్యానికి గురికావాలి. సుష్టుగా భోంచేశాక నిద్ర వచ్చినట్టుండకూడదు సాహిత్యం. అది ఆలోచింపజెయ్యాలి. ఆ ఆలోచనచైతన్యాన్నివ్వాలి. ఆ చైతన్యం కార్యరూపం ధరించాలి. ఆనందించడానికే అయితే
Stories

A Mother and Father in the Revolution

“How come you are back so early?” asked Myni anxiously when she saw Rukni and Sindayi coming towards her when she looked up from her writing. She had sent them to the village on work just a short while ago. “I believe the police are here. Comrades from Salepal village met us and told us”. “Where did they come?” “Supposedly to Bodili village” “Who saw them?” asked Myni closing her
కవిత్వం

శబ్దం పురివిప్పితే

ప్రతి అడుగులో మట్టిని ముద్దాడినఆమె పాదాలనునీ ఇనుప గొలుసులేం చేస్తాయ్ప్రతి అక్షరానికి కశ్మీర్ గాయాన్ని పూసిన ఆమె సత్తువనునీ సంకెల్లేం చేస్తాయ్ప్రతి పదంలో ఆకుపచ్చరంగు పోసిఅడవిని కట్టిన ఆమె హృదయాన్ని నీ ఖాకీ కుక్కలేం చేస్తాయ్ ప్రతి వాక్యంలో ఎరుపురంగును వొంపిఅమరులకు స్థూపాన్ని కట్టిన కలం మేస్త్రీలనునీ పోలీసు గూండాలేం చేస్తారుఆమె గొంతులోంచి ఆజాదీ శబ్దం పురివిప్పితేనియంతలు నెత్తురు కక్కి చస్తారుఇప్పుడు దేశమంతా ఆజాదీనేకశ్మీర్ టు కన్యాకుమారివయా అరుంధతీ రాయ్.