ఎ.నర్సింహారెడ్డి

          వ్యవసాయ రంగంలో వినూత్న పరిశోధనల ఫలితంగా పంటల ఉత్పత్తి పెరుగుతున్నా నేడు చాలా దేశాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న దీనదృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు పర్యావరణ విధ్వంసం, వీటికి తోడు అనేక దేశాల్లో అంతర్గత యుద్దాలు వెరసి ఆహారకొరత కోట్లాది మంది జీవితాలను నరకంగా మారుస్తున్నది. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిగ్గుతేల్చాయి. తగిన పోషకాహారం అందక పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోనూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట ప్రమాదకరంగా మారింది. నానాటికి ప్రపంచ జనాభా పెరుగుతున్నందున ఆహార భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత గల సమస్యగా పరిణమించింది. మలేరియా, క్షయ, హెచ్‌ఐవి వ్యాధుల కంటే పోషకాహార లోపంతో నీరసించి మృత్యువు పాలవుతున్న వారి సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనకరం.

          చాలా దేశాల్లో కొనుగోలు శక్తిలేని ‘పేదవర్దాల వారు ఆహార ఉత్పత్తులను అందుకోలేక పోతున్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల వల్లనే గత దశాబ్ద కాలంలో ఆకలి సమస్య కారణంగా పేద దేశాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలుపోతూ శరణార్థులుగా మారుతున్నారు. ఈ శరణార్థులు ఆహారానికే కాదు, కనీస మానవ హక్కులకు కూడా దూరమవుతున్నారు. వీరు ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. అధిక ధరలకు ఆహార పదార్థాలను కొనలేని ప్రజలు వ్యాధులకు లోనై అస్థిపంజరాలను తలపిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 11 శాతం మంది పోషకాహార లోపంతో సతమతమవుతుండగా, మరోవైపు 40 శాతం మంది మధ్య వయస్కులను అధిక బరువు వేధిస్తుండడం విచిత్రమైన పరిణామం. పేద దేశాల్లో ఆకలి తాండవిస్తుండగా, పెద్దల్లో ఊబకాయం పెరగడం సమాంతర పరిణామం. శరీరం శుష్మించి పోవడం, ఊబకాయం… ఈ రెండూ ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి.

          ఇవాళ ప్రపంచ జనాభాలో 30 శాతం మందికి తగినంత ఆహారం దొరకడం లేదు. దీనికి కారణం మంచి పోషకాలున్న ఆహారాన్ని కొనుగోలు చేయడం సామాన్యులకు “ఖరీదైన” వ్యవహారంగా మారింది. అల్పాదాయ వర్గాలు ప్రజలు నాణ్యత లేని, పోషక విలువలులేని ఆహారాన్ని కొనక తప్పడం లేదు. సామాన్యులు తక్కువ ధరకు లభించే ఆహారంతోనే సంతృప్తి పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ ఆహార భద్రత అన్న నినాదం ఓ ప్రహసనంగా మారింది. 2080  నాటికి క్షుద్చాధను నివారించలన్నది ఐక్యరాజ్య సమితి లక్ష్యం అయినప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వల్ల అది సాకారమయ్యే పరిస్థితి కానరావడం లేదు. అన్ని దేశాల్లోనూ పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారిలో కొనుగోలు శక్తి పెంచేలా, నిత్యావసర సరుకులను  సరసమైన ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

          సరైన పోషకాహారం లభించక విశ్వవ్యాప్తంగా లక్షలు, కోట్లలో మరణాలు సంభవిస్తుండగా… మరోవైపు అంటువ్యాధులు, జీవనశైలి వ్యాధులు, ఎబోరా, కరోనా, మార్చర్గ్‌, డెంగ్యూ వంటి వైరస్లు దాడి చేస్తున్నాయి. ఒకప్పుడు కలరా, మలేరియా, క్షయ, హెచ్‌ఐవి వంటి అంటువ్యాధులపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందగా ఇప్పుడు అపరిశుభ్రమైన తాగునీరు, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో వ్యాధుల బారినపడుతున్న వారి సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. వ్యాధి నివారణ చర్యలను తీసుకుంటున్నట్టు దేశవిదేశాల్లో పాలకవర్గాలు ఘనంగా ప్రకటిస్తున్నప్పటికీ పరిసరాల పరిశుభ్రత, నాణ్యమైన మంచినీటి సరఫరా అనేవి పూర్తి స్థాయిలో జరగడం లేదు. క్యాన్సర్‌, మధుమేహం,శ్వాసకోశ వ్యాధులపై దృష్టి సారించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటువ్యాధుల ఫలితంగా సంభవిస్తున్న మరణాల్లో అల్బాదాయ వర్షాల వారు 71 శాతం మంది ఉండడం గమనార్హం.

          పోషకాహార లోపం, రక్తహీనత వల్ల భారత్‌ సహా అనేక దేశాల్లో మాతాశిశు మరణాలు అధిక సంఖ్యలో సంభవిస్తున్నట్టు అధికారిక నివేదికలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా అయిదేళ్లలోపు చిన్నారుల మరణాలు అనేక దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పేద, అల్పాదాయ వర్గాల గర్భిణులు, బాలింతలకు రక్తహీనత ప్రాణాలనే బలిగొంటుంది. పోషకాహారం అందక శిశువులు, బాలింతలు మరణాలకు చేరువవుతున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ విషయంలోనే కాదు, వారి పెంపకంలోనూ అనేక లోటుపాట్లు ఎదురవుతున్నాయి. ఎలాంటి వివక్ష లేకుండా ఆడపిల్లలకు కూడా విద్యాహక్కును అందించాలి. అవిద్య కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా మహిళలు సాధికారతను సాధించలేకపోతున్నారు. లింగ వివక్షను నిర్మూలించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథాన దూసుకుపోతుందని, నేటి ఆధునిక యుగంలోనూ అసమానతలు కొనసాగడం అర్థరహితమని ఐరాస పేర్కొంది.

          ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో మన దేశం రెండవ స్థానంలో ఉండడం ఒకవైపు, మరోవైపు పోషకాహార లోపంలో అగ్రస్థానంలో ఉంటూనే ఆకలి కేకల్లో భారత్‌ తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా బియ్యం, గోధుమలు, చక్కెర, పల్లికాయ, కూరగాయలు, పండ్లు, చేపల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్నది. ఆహార ధాన్యాల ఉత్పత్తి క్రమేణా పెరిగినా, అదే క్రమంలో ఆకలి కూడా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

            2021  అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం పోషకాహార లోపంతో, 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరక్కపోవడం గమనించారు. కరోనా వైరస్‌ విజ్బంభణతో అదనంగా 11.8 కోట్ల ప్రజలు ఆకలి కోరలలో చిక్కుకున్నారు. 2021-22 లో 816  మిలియన్‌ టన్నుల రికార్డ్‌ స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది. 2020-21లో 311 మిలియన్ టన్నులు, 2019-20లో 298 మిలియన్‌ టన్నులు, 2018-19లో 285 మిలియన్‌ టన్నులు భారతదేశం ఆహారధాన్యాలలో స్వయం సంవృద్ధి స్థాయికి చేరినా, పోషకాహార లోపం 2018లో 18.8 శాతం ఉండగా 2020లో 15.8 శాతం వరకు క్రమంగా పెరుగుతూనే ఉన్నది. నిరుద్యోగం, పేదరికంతో కొనుగోలు సామర్థ్యం కొరవడిన కారణంగా పోషకాహాలోపం, ఆకలి చావులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో దాదాపు 14 శాతం (అనగా 190 మిలియన్లు) ప్రజలు పోషకాహార లోపంతో, 20 శాతం 5-ఏండ్ల లోపు పిల్లలు తక్కువ బరువుతో, 35 శాతం పిల్లలు స్టంటెడ్‌ గ్రోత్తో, 52 శాతం 15-419 ఏండ్లలోపు మహిళలు రక్తహీనతతో సతమతం అవుతున్నారు.

          ప్రపంచ దేశాల సగటు కంటే భారత్‌లో ఆకలి చావులు ఎక్కువ ఉందని పలు నివేదికలు తెలిపాయి. దేశంలో ప్రతిరోజూ దాదాపు 19 కోట్ల మంది ఆకలి కడుపులతో నిద్రపోతున్నారని, ప్రతి దినం 1500 మంది ఐదేళ్లలోపు బాలలు పోషకాహార లోపం వల్ల చనిపోతున్నారని, ఆ విధంగా ఏటా 3 లక్షల మంది బాలలు ప్రాణాలు కోల్పోతున్నారని 2020 జాతీయ ఆరోగ్య నివేదిక నిగ్గు తేల్చింది. పోషకాహార లేమి ఉన్నమాట నిజమేనని అంగీకరించిన మోడీ ప్రభుత్వం ఆకలి చావుల సమాచారం తమ వద్ద లేదంటున్నది. పేదల కోసం ఇప్పటికే చాలా చేశామంటున్నది. ఇక ఎంతమాత్రం భారం మోయలేనంటోంది. ఏ చావు మీద ఆకలి చావు అని రాసి ఉండదు. పేదరికం, పోషకాహార లేమి, సరైన విద్య, చికిత్స చేయించుకోలేని స్థితి అలాగే సామాజిక న్యూనతను అనుభవించే నేపథ్యం తప్పనిసరిగా అకాల ఆకలి చావులకు దారి తీస్తాయి.

          కరోనా వైరస్‌ వల్ల దేశ ప్రజల ఆదాయాలు పడిపోయాయని, ఆహార అభద్రత పెరిగిందన్న హంగర్‌ వాచ్‌-2 నివేదికలోని అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్‌ రెండవ దశ అనంతరం ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేయడం కోసం రైట్ టు ఫుడ్‌ క్యాంపెయిన్‌, సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌ సంస్థలు 2021 డిసెంబర్‌ నుండి 2022 జనవరి వరకు 14 రాష్ట్రాల్లో సర్వే చేపట్టాయి. తమ ఆదాయాలు కొవిడ్‌ రాక ముందునాటి కంటే తగ్గిపోయాయని సర్వేలో సమాధానాలిచ్చిన వారిలో 66 శాతం అంటే మూడింట రెండువంతుల మంది చెప్పారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో విధితమవుతోంది. పట్టణాల్లో నెలకు రూ.3,000, అంతకన్నా తక్కువ ఆదాయం పొందుతున్న కుటుంబాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది.

          ఆహార లేమి, అభద్రత వంటి అంశాల్లో భారత్‌ దిగజారడం హఠాత్పరిణామం కాదు. 2021  ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం 116 దేశాల్లో భారత్‌ 101వ స్థానంలో ఉంది. అంతకు ముందరి ఏడాది 94వ స్థానంలో ఉన్నది. ఇలా దిగజారి ‘తీవ్ర స్థాయిలో ఆకలి కలిగిని దేశాల జాబితాలో చేరింది. ఎత్తుకు తగిన బరువుకన్నా చాలా తక్కువ గల పిల్లలున్న దేశాల్లో భారత్ ఒకటయింది. మన దేశ బాలబాలికల్లో పౌష్టికాహార లోపం, శిశు మరణాల రేటు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తేల్చింది. ఇలా ఏ జాతీయ, అంతర్జాతీయ సర్వే లేదా అధ్యయన నివేదికలన్నీ మన దేశ పరిస్థితి అంతకంతకూ కుంగిపోతున్నదని స్పష్టం చేస్తున్నాయి. నరేంద్ర మోడీ చెప్పిన అచ్చే దిన్‌, సబ్‌ కా వికాస్‌ వంటి మాటలు నీటి మూటలై ఆకలి భారతం అయిపోయింది.

          రేషన్‌ కార్టులున్నవారిలో 90 శాతం మంది ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పొందగలిగామని సర్వేలో చెప్పారు. కనుక ప్రజా పంపిణీ వ్యవస్థను విసృృతం చేయడానికి సర్కారు కృషి చేయాలి. కాని, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రేషన్‌ కార్జులన్నిటికీ సబ్సిడీపై ఆహార ధాన్యాలను కేంద్రం సమకూర్చడం లేదు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కార్డులకు మాత్రమే ఇస్తామంటోంది. మిగతా కార్జులన్నిటి సబ్సిడీ మొత్తాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి వస్తోంది. మొత్తంగా చూస్తే సుమారు 40 కోట్ల మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థకు వెలుపలనే ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయడం మానేసి ‘ఒక దేశం ఒకే రేషన్‌ కార్డు వంటి మాటల మాటున ఉన్నదానికి మరిన్ని చిల్లులు పెట్టడం అమానుషం. తిండికే అష్టకష్టాలు పడుతున్న దుస్థితిలో చిన్నారుల చదువులకూ తిప్పలు తప్పడం లేదు. తమ కుటుంబాల్లో కనీసం ఒకరు ఈ కాలంలో పాఠశాల డ్రాపొట్‌ అయ్యారని 18 శాతం మంది గృహస్తులు ‘పేర్కొన్నారంటే భవిష్యత్‌ భారతం ఎంత అంధకారమయమవుతుందో ఊహకే అందడం లేదు.

          ప్రపంచీకరణ మార్కెట్‌ సిద్ధాంతం ఒకవైపు, హిందూత్వ ఫాసిస్టు పాలన మరోవైపు కలిసి ప్రజల్ని విభజించే ప్రయత్నాలు చేస్తూ వారి దృష్టిని వాస్తవాల నుంచి పక్కకు మళ్లిస్తున్నాయి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు హిందూత్వ మతోన్మాదం కారణంగా సమాజంలో ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ఒకవైపు గిడ్డంగుల్లో ఆహారధాన్యాలు పుచ్చిపోతాయి. మరోవైపు పేద జనపు డొక్కలు తిండిలేక మాడిపోతాయి. ఒకవైపు సంపద పోగుపడి బిలియనీర్ల సంఖ్య ఎగబాకుతుంటుంది. ఆ పక్కనే మరికొన్ని కోట్ల పేదల ఆదాయం పడిపోయి, పేదరికం కూడా పెరిగిపోతుంటుంది. దీనికి కారణం మూడున్నర దశాబ్ధాలుగా అమలు చేస్తున్న ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు ఆర్థిక అసమానతలను, నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచాయి.

          ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రపంచ దేశాలు సైనిక వ్యయానికి 5100 కోట్ల (రూ.3,82,500 కోట్లు) డాలర్లు యేటా ఖర్చు చేస్తున్నాయి. దేశం పేదది కాకపోయినా దేశంలో ఇంకా పేదవాళ్లున్నారు. అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకుంటున్న దేశమైనప్పటికీ, దేశంలో ప్రాంతీయ, జెండర్‌, కులాల అసమానతలున్నాయి. మరోవైపు అవినీతి పెచ్చరిల్లిపోతోంది. అందుకే ఈ దేశంలోని వైవిధ్యాలనే కాదు, వైరుధ్యాలనూ తరచి చూసుకోవాలి. జనాల మధ్య సాంఘీకార్థిక అంతరాలను తగ్గించడం ద్వారానే ఈ దేశాన్ని ఒక్కటిగా చేయగలం అని గుర్తించాలి. అయితే, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలను, ఆశ్రిత పెట్టుబడిదారీ విధఆనాలను నెత్తికెత్తుకున్న సర్కారుకు సామాన్య ప్రజల సంక్షేమం పట్టదు, కనుక బలమైన ఐక్య ప్రజా ఉద్యమాలనే అంకుశంతో దాన్ని పొడవాలి.

Leave a Reply