సమకాలీనం

ఎల్‌నినో: ప్రభుత్వాలు- ప్రజలు

 ఎల్ నినో అంటే సహజంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం, చల్లబడడం. ఇది  రెండు సంవత్సరాలకు ఒకసారి లేదా ఏడు సంవత్సరాలకు ఒకసారి జ‌రిగే ప్రక్రియ. దీని వలన 2020- 24 సంవత్సరంలో భారతదేశ ప్రజలు ఉష్ణోగ్రతలతో ఎప్పుడూ లేనంతగా బాధపడ్డారు. దీని ప్రభావం   కొన్ని నెలలు  ఎక్కువ‌గా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో వ్యాపార పవనాలు ఇవి, భూమధ్యరేఖ వైపు ఏడాది పొడవునా ఒకే దిశలో క్రమం తప్పకుండా వీచే శాశ్వతమైన గాలులు. ఇవి బలహీన పడినప్పుడు లేదా వ్యతిరేక దిశలో వీచినప్పుడు సముద్ర ఉపరితలం వేడెక్కి, మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపు వీస్తాయి. దీనివలన సముద్ర
ఆర్ధికం

నిప్పుల కొలిమిగా యూరప్

ఇవాళ యూరప్ నిప్పుల కొలిమిగా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, సుదీర్ఘమైన హీట్‌వేవ్  (వడగాల్పులు) కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన ఈ వేడి..  ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రజలను కష్టాల పాలు  చేస్తున్నది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి రాత్రిని నమోదు చేయగా..,  బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు జూన్ నెలలో ఆల్-టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు చ‌వి చూశాయి. ఎండ వేడికి పలుచోట్ల కాంక్రీట్ స్లాబ్‌లు పగుళ్లు పడుతున్నాయి. రైల్వే పట్టాలు క‌రిగిపోయి దెబ్బతినడం.. రోడ్లు బీటలు బారడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎండలతో యూరప్ దేశాలలో 6000  మందికి పైగా
సమకాలీనం

అవగాహన లేని విద్వేషపు మాటలే పవన్ కళ్యాణ్ రాజకీయమా?

అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని శాంతింపజేయటం పౌరుల బాధ్యత, ముఖ్యంగా రాజకీయాల్లో లీడర్ స్థానంలో ఉన్నవాళ్లకి అది మరింత ముఖ్యమైన బాధ్యత. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  విస్మరించారా ఉద్దేశ పూర్వకంగానే ఆ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం రాకమానదు. 2026 జూన్ 2 న అంటే తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగే సమయంలోనే తాను ఇక్కడ సభ పెడతానూ అనటం. భావోద్వేగాలను రెచ్చగొట్టటమే కాదా!?  ఆరోజున బహిరంగ సభ అంటే కచ్చితంగా అనుమతి నిరాకరిస్తారని ముందే తెలిసి, దానిని అణచివేత చర్యగా చెబుతూ తన ఇంటివద్దనే ప్రెస్‌మీట్ పెట్టడం కూడా
ఆర్ధికం

అప్పుల ఊబిలో భారత ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వం రుణంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం ద్వారా వృద్ధిని ఉత్తేజ పరిచి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతాన‌ని చెప్తుంది. కాని ప్ర‌భుత్వాలు చేస్తున్న‌ అధిక రుణాలు ప్రైవేట్ పెట్టుబడులను తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని పెంచడం, భవిష్యత్ తరాలపై అధిక పన్నుల భారాన్ని మోపడం వంటి ప్రమాదాలను కలిగి ఉంటాయి. దీని మొత్తం ప్రభావం రుణ-జిడిపి నిష్పత్తి, ఖర్చు ఉద్దేశ్యం, వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది.  తాజా గణాంకాల ప్రకారం మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల మొత్తం అప్పు 2026 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో సుమారు 81 శాతంగా ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభు త్వాల వాటా గణనీయమైనది.
సమకాలీనం

కాక్రోచ్‌ల ర‌ణ‌న్నినాదం

తానాషాహీ నహీ చలేగీ, నహీ చలేగీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి హమ్ నహీ డరేంగీ, నహీ డరేంగీ అనే యువతరం  రణ నినాదాలతో జంతర్ మంతర్ దద్దరిల్లింది. సంజయ్ దూబే అనే అడ్వకేట్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తనను సీనియర్ అడ్వకేట్ గా గుర్తింపు ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. ఆ కేసు విచారణ సందర్భంగా 15 మే 2026 న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ దేశ‌ పాలకులను సమర్ధిస్తూ, యువతను అవమానించే విధంగా వ్యాఖ్యానిస్తూ, "సమాజంలో ఇప్పటికే పరాన్న భుక్కులు ఉన్నారు. అటువంటి వారితో మీరు చేతులు కలప దల్చుకున్నారా?
సమకాలీనం

కరువుకు నిలయంగా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా   

ఉమ్మడి అనంతపురం జిల్లా ఎప్పటినుంచో కరువు ప్రాంతంగా పేరుగాంచింది. తక్కువ వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుదల, సాగు, తాగునీటి కొరత కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న జిల్లాలలో రాజస్థాన్ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా గార్లదిన్నె, పెద్దవడుగూరు, పామిడి, నార్పల, శిగనమల, యాడికి, బుక్కరాయసముద్రం మండలాల్లో చీని, నిమ్మ, అరటి లాంటి పండ్ల తోట పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ పంటలను హెచ్.ఎల్.సి ((హై లెవల్ కాలువ) ఆయకట్టు ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం కర్ణాటక ఎగువ ప్రాంతాలలో
సమకాలీనం

కడపటి యుద్ధం – స్వామి సనాతనం

దేని మీదైనా సరే, వ్యాసాలు రాశాక, ప్రసంగాలు చేశాక కూడా సాహిత్యంగా త‌ప్ప మ‌రోలా చెప్ప‌లేనిది మిగిలి ఉన్నప్పుడు రచయితలు కాల్పనిక ప్రక్రియల్లోకి వెళతారు. మానవ అనుభవాన్ని వర్ణించడానికీ, పంచుకోడానికీ సాహిత్య రచన తప్పనిసరవుతుంది. ఆ అనుభవం ఇవ్వాల్టిదైనా కావచ్చు. చరిత్రలోని సుదూర గతానిదైనా కావచ్చు. కానీ, సుప్రసిద్ధ రాయలసీమ రచయిత బండి నారాయణ స్వామి ఇటీవల 600 పేజీల ‘కడపటి యుద్ధం’ నవల రాశాక కూడా తన ఇతివృత్తం గురించి, అందులో తన ప్రతిపాదన గురించి ఆయన మళ్లీ వ్యాసాలు రాయవలసి వస్తున్నది. ఈ పని నవల ‘వెనుక మాట’తోనే ఆయన ఆరంభించారు. నవల ద్వారా తాను
ఆర్ధికం

భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం

పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి! ఇది యాధృచ్ఛికం కాదు. విధానపర మైన నిర్లక్ష్యం దౌర్బ‌ల్యం. అంత‌కు మించి ఆర్థిక నిర్వహణలో వైఫల్యం. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధ‌రలు తగ్గినా, ఆ లాభం వినియోగదారుడికి చేరట్లేదు. పెరిగితే మాత్రం వెంటనే ప్ర‌జ‌ల‌పై భారం మోపబ డుతున్న‌ది. ఇది మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానం. దాంతో రోజు రోజుకు తీవ్రతరం అవుతు న్న సంక్షోభ కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం విజృంభించి, వేత నాల ప్రతిష్టంభన ఏర్ప‌డింది. ఈ జంట సంక్షోభాలు ఉండగా అదనంగా యుద్ధం వల్ల ధరల పెరుగు దల  హడలగొడుతున్నాయి.  కొంత
ఆర్ధికం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అక్రమ యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలించేలా మారుతోంది. దేశ దేశాలు గ‌డ్డు ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యం.. గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా యుద్ధంలో పాల్గొనే దేశాలన్నీ వినాశకరమైన పరిణామా లను ఎదుర్కోవాల్సిందే అన్న సత్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆ దేశాల్లో మౌలిక సదుపాయాలు ద్వంసమై, పర్యావరణం దెబ్బతిని, ఆ దేశాల అబివృద్ధి దశాబ్ధాల వెనుక‌కు వెళ్లిపోయింది. ఇరాన్‌లోని విస్తారమైన చమురు వనరులను స్వాదీనం చేసుకోవాలనే దురాశతో ఉన్న అమెరికా పెట్టుబడిదారీ వర్గం అనుకూల సమయం
సమకాలీనం

విప్లవావసరానికి ఎన్నెన్నో సూచికలు

దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరిస్థితులు మారాయని, ప్రజలు విప్లవాన్ని కోరుకోవడం లేదని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు గదా, కొనసాగుతున్న పరిస్థితి ఏమిటో వెల్లడించిన రెండు తాజా నివేదికల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, మొత్తంగా దేశానికి సంబంధించినది. వరల్డ్ ఇనీక్వాలిటీ లాబ్ అనే సుప్రసిద్ధ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఏప్రిల్ మొదటి వారంలో వెలువరించిన ‘లాండ్ ఇనీక్వాలిటీ ఇన్ ఇండియా: నేచర్, హిస్టరీ అండ్ మార్కెట్స్’ (భారతదేశంలో భూ అసమానతలు: స్వభావం, చరిత్ర, మార్కెట్లు) అనే పత్రం. ప్రతి సంవత్సరమూ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ ప్రచురించే ఈ సంస్థ పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ ల సారథ్యంలో