ఆర్ధికం

టారిఫ్‌ ఉత్పాతానికి షేర్‌మార్కెట్‌ పతనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతోన్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచమంతటా నెలకొంది. వాణిజ్య యుద్ధానికి తెర లేపి ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లను కుప్పకులేలా చేసిన ట్రంప్‌ విధానాలు మరిన్ని ప్రమాదాలను సృష్టించనుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలకిందులు చేయాలన్న (డీ డాలకైజేషన్‌) సంకల్పం... అందువల్ల ట్రంప్‌ చర్యలతో అమెరికా భారీగా లాభపడుతుందన్న గుడ్డి విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసానంగా ఏప్రిల్‌ 3 నుంచి అంతర్జాతీయ
మీరీ పుస్తకం చదివారా ?

ఎవడ్రా ఈ నేల నాది కాదన్నది..?

‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.అధర్మం. అన్యాయం.’ ‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.’ ఈ
సమకాలీనం

శాంతి చర్చల పూర్వాపరాలు

(రంగులు మారుతున్న నక్సలిజం - సదస్సుకు ప్రతిస్పందన) కమ్యూనిస్టులు కానివారు, అశేష ప్రజాదరణ ఉన్నవారు విప్లవకారులను పీడిత ప్రజలలో పని చేస్తున్నట్లు గుర్తించి నక్సల్బరీ కాలం నుంచీ సంభాషణ జరుపుతున్నారు . అప్పటి  నుంచీ  దానికి  గుండెలు బాదుకుంటున్నవారు  కూడా ఉన్నారు. వీళ్లు భావజాల రీత్యా బ్రాహ్మణీయ, మార్కెట్ శక్తుల ప్రతినిధులు.  శంకరన్, పొత్తూరి విప్లవకారులతో సంభాషణ జరిపి, ప్రభుత్వంతో చర్చల దాకా తీసుకువచ్చి చర్చల వైఫల్యానికి, తర్వాత హింసా విధ్వంసాలకు ప్రభుత్వమే కారణమనడం ఇప్పటికీ వీళ్లకు మింగుడు పడడం లేదు. పుబ్బలో పుట్టి మఖలో మాయమయే ఇటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. హరగోపాల్ పోరాట రూపాలు ప్రజలు
ఆర్ధికం

మందగమనంలో ఆరిక్థ వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థపై అతిగా ప్రచారం చేస్తున్న ప్రధాని మాటలని నమ్మని పెట్టుబడిదారులు విశ్లేషకులు. దేశ ఆర్థిక  వ్యవస్థపై మోడీ సర్కారు గతంలో ఎన్నడూ లేని హైప్‌ను సృష్టిస్తున్నది. తమ పాలనలో భారత్‌ 5వ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పుకుంటున్నది. ఇదంతా తమ పాలనలో తీసుకున్న విధాన నిర్నయాల కారణంగానేనని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ నుంచి ఆ పార్టీ కీలక నాయకుల వరకు ఇదే మాటలు చెప్తున్నారు. టివీ డిబేట్లలో, సోషల్‌ మీడియాలో తమ, తమ అనుబంధ గోడీ మీడియా ద్వారా ఆర్థిక వ్యవస్థపై హైప్‌ను బిజెపి ఊదరగొడుతున్నది. అయితే, పెట్టుబడిదారుల్లో మాత్రం
మీరీ పుస్తకం చదివారా ?

పదునెక్కిన ఆయుధం కదా జీవితం..!

స్వేచ్ఛ నాకు జీవితం మించిన కల అంటూ లోసారి సుధాకర్‌ ‘ఆయుధంలాంటి మనిషి’ కవిత్వం తెచ్చారు. జీవితం ఎలా పదునక్కుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని కన్నీళ్ళు, ఇంకొన్ని దు:ఖాలు, మరికొన్ని విషాదాలు కవిత్వంలో కనబడతాయి. వర్తమాన కవిత్వలోకంలో విస్తృతంగా కవిత్వం వస్తునే వుంది. నవతరం యువ కవులు కవిత్వం రాస్తూనే ఉన్నారు. కవిగమ్యం, కవిత్వ పరిణామం ఏమిటి అని ప్రశ్నించినపుడు జవాబు మనికిప్పుడు అస్పష్ట్టంగానే వినబడుతుంది.  సామాజికవాస్తవాన్ని నొక్కి చెప్పగలిగిన కవిత్వం వర్తమాన సాహిత్యంలో చాలా అరుదుగా కనబడుతుందన్న విషయం కొద్ది మందికే తెలుసు. సామాజిక వాస్తవాన్ని కవిత్వంలో చెప్పాలనుకున్నప్పుడు కవికి సైద్దాంతికబలం ఉండాలి. అలా ఉన్నప్పుడే కవి
సమకాలీనం

అటవీ హక్కుల చట్టంపై పొంచి ఉన్న ముప్పు; రాజ్యాంగబద్ధతపై విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

షెడ్యూల్డ్ తెగలు (అనుసూచిత తెగలు- ఆదివాసులు) ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2006, (దీనిని సాధారణంగా అటవీ హక్కుల చట్టం అని పిలుస్తారు) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల ఆధారంగా సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 2న కేసున విచారణ చేపట్టనుంది. షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులను అటవీ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో తరలించడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, చట్టపరమైన అడ్డంకులు, పర్యావరణ విధ్వంసం పెరుగుతున్న ముప్పులు, ఇవి చాలా ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. మరోవైపు, అటవీ హక్కుల చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పైన ప్రశ్నలు లేవనెత్తుతూ,
కాలమ్స్ లోచూపు

మార్క్స్- అంబేద్కర్ : మానవ విమోచనా దృక్పథాలు 

మానవ విమోచనను మార్క్స్, అంబేద్కర్ లు ఎలా అర్థం చేసుకున్నారు? మానవ విమోచన పట్ల వాళ్ల అవగాహనల గురించి ప్రఖ్యాత రచయిత, పౌర హక్కుల నేత, ప్రజా మేధావి ఆనంద్ తేల్ తుంబ్డె  చేసిన లోతైన ఆసక్తికరమైన విశ్లేషణ ఈ పుస్తకం. ఆయన రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని సి. పటేల్ తెలుగులోకి అనువదించగా భూమి బుక్ ట్రస్ట్ (హైదరాబాద్)  మూడవ ముద్రణగా ప్రచురించింది. భారతదేశ చరిత్రలో వివిధ రంగాలలో ఆవిర్భవించి ముందుకు వచ్చిన మానవ విమోచనకు సంబంధించిన దృక్పథాలలో   మార్క్సిస్ట్, అంబేడ్కరిస్టు దృక్పథాలు   ముఖ్యమైనవి . భారత సమాజపు పితృ స్వామిక, కుల, వర్గ పునాదుల రీత్యా అవి
కాలమ్స్ మీరీ పుస్తకం చదివారా ?

‘మన్‌ కీ బాత్‌ : వొట్టి మాయా పాచిక’

A poem is what happens when it is read- Christopher Caudwell భారతీయ సాహిత్యంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవి అఫ్సర్‌. కథ, కవిత్వం, విమర్శ ఏది రాసినా తనదైన భావజాలానికి అతీతంగా, తనదైన శైలికి భిన్నంగా రాయరు. అఫ్సర్‌ ఏది రాసినా పదికాలాలు గుర్తిండిపోయే అక్షరాలకు జన్మనిస్తాడు. ప్రగతిశీల రక్తకణాలను నరనరాల్లో నింపుకుని పిడికిలి బిగించి విప్లవోద్యమాన్ని నడిపిన కౌముది కొడుకే అఫ్సర్‌. ఈ తరానికి ఆయన కవిగానే తెలుసు. కానీ ఆయనది నాల్గున్నర దశాబ్దాల సుధీర్ఘ సాహిత్య ప్రయాణం. సమసమాజ నిర్మాణానికి రాళ్ళెత్తిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే! దేశంకాని దేశంలో
సమకాలీనం

ఆదివాసులను హింసించిమావోయిస్థులపై విజయం సాధించగలరా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 15నాడు  రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును ప్రదానం చేశాడు. శాంతిభద్రతల పరిరక్షణలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, రాష్ట్రంలో శాంతిని కాపాడటంలో వారు చేస్తున్న ఆదర్శవంతమైన పనిని ప్రశంసించాడు. (యుద్ధ సమయంలోనూ, శాంతి సమయంలోనూ అసామాన్య సేవలు చేసినందుకు వాయు, నౌకా సేవా బలగాలకు ఇచ్చే పతకాలు అవి) ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం నుండి నక్సలిజాన్ని నిర్మూలించడానికి 2026 మార్చి 31ని గడువుగా పెట్టాడు. ఆ ప్రయత్నంలో సాధించిన పురోగతిని ఎత్తిపడుతూ, భద్రతా బలగాలు
కాలమ్స్ సమకాలీనం

వరికపూడి సెల (దమ్మర్ల గొంది) ప్రాజెక్టును  నిర్మించాలి

పల్నాడు జిల్లాలో ఒకవైపు కృష్ణానది పరవళ్ళు  తొక్కుతున్న  దాని అతి సమీపంలో ప్రజలు త్రాగునీరు సాగునీరు లేక  వలసలు పోతున్నరు, పశువులకు నీళ్లు దొరకని ప్రాంతం కూడా ఎగువ పల్నాడు లోని వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలం, ప్రకాశం జిల్లా పుల్లల  చెరువు, ఎర్రగొండపాలెం  ప్రాంతాలు, 1944 ప్రాంతంలో నందికొండ  ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది, 1954లో నందికొండ ప్రాజెక్టు (నాగార్జునసాగర్ ) నిర్మాణం సందర్భంగా  కోస్ల  కమిటీ వెల్దుర్తి, దుర్గి,మాచర్ల, బొల్లాపల్లి, పుల్లలచెరువు తదితర మండలాలు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుండడంతో దీనికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేయాలని సూచించారు.