ఆర్ధికం

కృత్రిమ మేధస్సు 

‘మన కలలను సాకారం చేసుకోవడానికి, మనం ఊహించలేని వాటిని సృష్టించడానికి ఉపయోగించే ఒక సాధనం- టెక్నాలజీ’ అంటాడు లైనక్స్‌ కెర్నల్‌ (ఏకశిలా, మాడ్యులర్‌, మల్టీ టాస్కింగ్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కెర్నల్‌) సృష్టికర్త లైనస్‌ టోర్వాల్డ్‌. కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌... సంక్షిప్తంగా చెప్పాలంటే ఎఐ.. దీని వినియోగం ప్రపంచానికి మేలు చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. అంతేకాదు... భవిష్యత్తులో ఎన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం. మనిషి మేధస్సును కృత్రిమ మేధ అధిగమిస్తుందని నిపుణుల అంచనా. ఇప్పటికే కృత్రిమ మేధ ఎన్నో రకాల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. ఉద్యోగులను నిలువునా ముంచేస్తున్నది. డిగ్రీలు చేత
ఆర్ధికం

ఆకలి కేకలకు అంతమెప్పుడు?

ఐక్యరాజ్యసమితి ప్రధాన శాఖలైన ప్రపంచ ఆహార సంస్థ (యఫ్‌ఎఒ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌(ఐఎఫ్‌ఎడి), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్య్లూఎఫ్‌పి)లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా మే 2న ప్రపంచ ఆహార సంక్షోభాలపై నివేదికను విడుదల చేశాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డిజి) భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు, పోషకాహార లోపం లేకుండా చూస్తూ, ‘జీరో హంగర్‌ (ఆకలి లేని లోకం)’ సాధించాలనే ఉన్నత, ఉత్తమ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో పోషకాహార లోపం అత్యధికంగా ఆసియా దేశాల్లో 418 మిలియన్లు ఉండగా, ఆఫ్రికాలో 282 మిలియన్లు ఉన్నారని
లోచూపు

చరిత్ర పొడవునా ఫాసిజం

చారిత్రక కారణాలు ఏవైనా ఫాసిజం మన సామాజిక సాంస్కృతిక నేలలోనే మొలిచే విషపు కలుపు మొక్క. దానిని సకాలంలో గుర్తించి పెరికి వేయకపోతే పచ్చని పంట నాశనం అవుతుంది. సాధారణ కలుపు మొక్కలను ఏరివేయకపోతే పంట ఏపుగా పెరగదు గానీ, విషపు కలుపు మొక్క(ల)ను ఏరివేయకపోతే పంట నాశనం అవ్వడమే కాకుండా, నేల కూడా విషపూరితమై భవిష్యత్తులో ఏ పంటా పండని ప్రమాదం తలెత్తుతుంది. అటువంటి మనిషి మౌలిక మనుగడకే ప్రమాదకరమైన ఫాసిస్ట్ ఆక్టోపస్ తన విషపు కోరలతో మన దేశాన్ని కబళిస్తోంది. నిజమైన సంస్కరణోద్యమ పోరాటాలు, లౌకిక, ప్రజాస్వామిక, సమూల పరివర్తనా(విప్లవ) పోరాటాలు చాలా కాలంగా జరుగుతూనే
ఆర్ధికం

ప్రభుత్వ బ్యాంకుల మెడపై ప్రైవేట్‌ కత్తి

దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులను పెద్దపెద్ద కంపెనీలు నిలువునా ముంచేస్తున్నాయి. మొండిబకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌/ఎన్‌పిఎ).. పేర్లు ఏవైనా, లాభపడుతున్నది ఎగవేత కంపెనీలు.. నష్టపోతున్నది ప్రత్యక్షంగా బ్యాంకులు, పరోక్షంగా ప్రజలు. ఘరానా కంపెనీలు బ్యాంకులను ముంచకపోతే, ఈ బ్యాంకుల లాభాలు మరింతగా పెరిగి ఉండేవి. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు రుణాలను ఎగవేయడమే బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ప్రభుత్వం దర్జాగా మొండిబాకీలను రద్దు చేస్తోంది. ఇలాంటి రుణాలను రద్దు చేయడం కంటే, వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఎఐబిఇఎ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకపోగా, మరింతగా రాయితీలను
ఆర్ధికం

కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి సాధిస్తోందని.. ఇది మాములు విషయం కాదని ఇటీవల ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఇదే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఎందుకు నెలకొని ఉందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని మూడీస్‌, స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, ఫిచ్‌ వంటి రేటింగ్‌ సంస్థలు, నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) ఘోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ(ఐయంఎఫ్‌) 2023-24 వృద్ధి అంచనాను అంతకుముందున్న 6.1 శాతం
ఆర్ధికం

డాలర్‌ కోటకు బీటలు!

గ్లోబల్‌ కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. రిజర్వు కరెన్సీగా, కరెన్సీ మార్పిడి మాద్యమంగా ఏడు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్‌ ఇటీవలి కాలంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇప్పటిదాక అమెరికా సైనిక, ఆర్థిక దండోపాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. తనమాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్‌ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అగ్రరాజ్య అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇన్నాళ్లు ఏ డాలర్‌ అండతో అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమల దండులా కదం తొక్కుతున్నాయి. గ్లోబల్‌ కరెన్సీగా రాజ్యమేలుతున్న
ఆర్ధికం

గరిష్టానికి ప్రపంచ రక్షణ వ్యయం

ప్రపంచ సైనిక వ్యయం అల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022లో సైనిక వ్యయం అత్యధికంగా 2.24 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్లు ప్రముఖ రక్షణ అధ్యయన సంస్థ సైనిక వ్యయంపై స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ) మార్చి 13న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. విదేశాల నుండి సైనిక పరికరాలు కొనడానికి భారత్‌ 2020-21 లో రూ|| 4 లక్షల 71 వేల కోట్లు, 2021-22 లో రూ|| 4 లక్షల 78 వేల కోట్లు, 2022-23 లో రూ|| 5 లక్షల 25 వేల కోట్లు, 2023-24 లో రూ|| 5 లక్షల 93 వేల
ఆర్ధికం

అసమానతలు పెంచుతున్నఉపాధి రహిత వృద్ధి

తొమ్మిదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పాలనలో రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమానత్వాన్ని, లౌకిక  తత్వాన్ని తృణీకరించే మనువాద భావజాల పాలన కొనసాగుతోంది. ఈ కాలంలో ఆర్థిక అసమానతలు, సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగింది. సామాజిక, ఆర్థిక సమానత్వ ఆదర్శం బిజెపి- కార్పొరేట్‌ ఫాసిస్టు పెట్టుబడిదారీ విధానం వల్ల బీటలు బారింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉంటూ దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రభుత్వరంగ అభివృద్ధి, పౌరస్వేచ్ఛ, మానవ హక్కులను తుడిచివేసే ఫాసిస్టు పాలన కొనసాగుతోంది. ఫలితంగా
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

            మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నదా! ప్రపంచ దేశాలు మాంద్యం బారిన పడబోతున్నవా! రష్యా-యుక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పడికే భారీగా నష్టబోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు మళ్లీ చిల్లులు పడబోతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. గత ఆరు మాసాలుగా ప్రపంచ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు క్రమంగా ఒక్కొక్కటి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నదన్న సాకును చూపెడుతూ అన్ని దేశాల బ్యాంకులు వడ్డీ రేట్లను ఒక్క శాతం పైనే పెంచేశాయి. ఈ నిర్ణయాలతో మదుపరుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కరోనా సంక్షోభం
కథనం

విప్లవానికి వెలుగునిచ్చే అమ్మ ప్రేమ…

‌‌నవ మాసాలు మోసి   జన్మనిచ్చిన పిల్లలపై  ఏ అమ్మకు ప్రేమ ఉండదు!? స్వచ్ఛమైన అమ్మ ప్రేమని దేనితో వెలకట్టగలం? అమ్మ తన రక్తమాంసాలతో పుట్టిన పసికందును కంటికి రెప్పలా కాపాడుతుంది. చందమామను చూపిస్తూ ఆప్యాయత, అనురాగాలనే గోరుముద్దలుగా తినిపిస్తుంది. తొస్సుబోయే పసినాటి చిలిపి పలుకులకు మాటవుతుంది. బుడి, బుడి తప్పటడుగులకు నడకవుతుంది. ఈసమెత్తు కల్లాకపటం తెలియని మమకారాన్నందిస్తుంది. ఎవ్వరికీ తలొంచని తెగువ, ధైర్యాన్నిస్తుంది. ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకొని బతుకు బండి లాగుతుంది. పిల్లలు పెరిగి ప్రయోజకులైనప్పుడు ప్రపంచాన్నే జయించానని సంబరపడిపోతుంది. వారు సమాజమే హర్షించదగ్గ పిల్లలుగా పరివర్తన చెందినప్పుడు 'నింగి-నేలా నాదే ' అన్న పరిపూర్ణ విశ్వాసంతో