ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థికం

ఫిబ్రవరి 24వ తేదీ న్యూఢిల్లీలో జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్‍ బ్యాకుంకు గవర్నర్ల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఇది! ‘‘భారత ఆర్థిక వ్యవస్థ అద్బుతంగా పురోగమిస్తోంది.భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగానూ ఉన్నారు. దీని నుండి ప్రపంచ దేశాలు స్ఫూర్తిని పొందాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల దృక్పథాన్ని అందించగలరని మేం ఆశిస్తున్నాం. ప్రపంచ వృద్ధిలో స్థిరత్వాన్ని, నమ్మకాన్ని సాధించాలంటే అదొక్కటే మార్గం’’. ప్రధాని ఆ మాటలు చెప్పి పది రోజులు గడవకవ•ందే వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ తాజాగా దానికి పూర్తి భిన్నమైన
ఆర్ధికం

ప్రజా వ్యతిరేక బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌  దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధిక ధరలు, పేదరికం వంటి పేద ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్‌ శక్తులను ఊతమిచ్చే విధంగా ఉంది. బడ్జెట్‌ అంటే ప్రభుత్వ ఆదాయ-వ్యయాల చిట్టా మాత్రమే కాదు. దానికి ఒక తాత్విక చింతన ఉండాలి. ఆదాయం ఎవరి నుంచి వస్తుంది, వ్యయం ఎవరి కోసం చేస్తున్నారనేది బడ్జెట్‌లో కీలకాంశం. ప్రధానంగా దేశ ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ఏలా అభివృద్ధి చేయాలనే కనీస ఆలోచన ఉండాలి. కాని మన పాలకులకు ప్రజలు కనిపించడం
కాలమ్స్ ఆర్ధికం

అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన  సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్‌ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్‌ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల
కాలమ్స్ ఆర్ధికం

వ్యక్తిగత గోప్యతకు చెల్లు చీటీ – నూతన టెలికామ్‌ బిల్లు – 2022

మోడీ పాలనలో పౌరుల వ్యక్తిగత గోప్యత మన దేశంలో ఎండమావిగా మారింది. పెగాసస్‌ వంటి స్పైవేర్‌ను రచయితలపై, ప్రతిపక్షాలపై, సామాజిక మేధావులపై, జర్నలిస్టులపై, న్యాయమూర్తులపై ఉపయోగించింది. ఇప్పటిదాకా రహాస్యంగా సాగిస్తున్న నిఘాకు, డేటా చౌర్యానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్‌ వ్యూహాలు పన్నుతున్నది. అందులో భాగంగానే కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  ఇప్పుడున్న ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1985, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రఫీ యాక్ట్‌ 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ (చట్ట విరుద్ధ స్వాధీనం) యాక్ట్‌ 1950 స్థానంలో నూతన టెలికాం ముసాయిదా బిల్లు- 2022ను కేంద్రం సెప్టెంబర్‌లో విడుదల చేసింది. భారత వినియోగదారులు, నియంత్రణ
కాలమ్స్ లోచూపు

వర్ణం నుండి కులం దాకా ఒక సృజనాత్మక మార్క్సిస్టు విశ్లేషణ

భారత సమాజాన్ని విదేశీ ఆలోచనాపరులే కాకుండా ఎంతోమంది స్వదేశీ ఆలోచనాపరులు కూడా ఒక చలనరహిత సమాజంగా నేటికీ చూస్తూనే ఉన్నారు. గత కాలం నుండి ఈనాటి వరకు భారత సమాజంలో వర్ణం, కులం ఎటువంటి మార్పు లేకుండా అస్తిత్వంలో ఉన్నాయని వారంటారు. కాని భారత సమాజపు అసలు వాస్తవికత సంక్లిష్టమైనదని, అది కులవ్యవస్థ రూపంలో వ్యక్తమవుతుందని గుర్తిస్తారు. ఆ సంక్లిష్ట వాస్తవికతను 'చాతుర్వర్ణ' నమూనా వివరించజా లదని తెలిసినప్పటికీ, సైద్ధాంతికంగా దానిని ఎంత మాత్రమూ తిరస్కరించరు.                                  మరి కొంతమంది ఆలోచనాపరులు ఆసియాతరహా ఉత్పత్తి విధానం ఆధారంగా భారతీయ సమాజపు చలనరాహిత్యాన్ని గురించి తమ వాదనలు చేస్తారు. అయితే వర్ణం,
లోచూపు

స్వచ్ఛ భారత్లో స్వచ్ఛత ఎక్కడ’?

మన ఇంటికి గోడలు ఎంత అవసరమో కిటికీలు, దర్వాజలు అంతకంటే ఎక్కువ అవసరం. అవి లేకుండా మనం గోడల మధ్య బందీలమైతే మనను బైటి గాలులేవీ తాకవు. బయటి వెలుతురేదీ మనకు సోకదు. మన ఇంటి గోడల బయటి కైవారాలు సురక్షితంగా ఉన్నాయా, లేదా కూడా మనకు తెలియదు. కనుక మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే మనం గోడలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇతర ఇళ్లకు చెందిన బయటి గోడలను పరిశీలించాల్సి ఉంటుంది. వివిధ ఇళ్ల గోడల మధ్యన ఉన్న రక్షక వ్యవస్థలను పరిరక్షించుకోవలసి ఉంటుంది. విధ్వంసక వ్యవస్థలను రూపుమాపుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇలాగే మన స్వీయ అస్తిత్వాలను
ఆర్ధికం

భారత్‌ను ఆవరిస్తున్న ఆర్థిక మాంద్యం

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో మనదేశ పరిస్థితి చూస్తే రూపాయి విలువ వెలవెలపోతూ… రికార్డు స్థాయి పతనాన్ని చవి చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చరిత్రలోనే ఇదివరకూ ఎప్పుడూ లేని స్థాయిలో రూపాయి పతనమయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపునకు తోడు పలు దేశీయ కారణాలతో సెప్టెంబర్‌ 27న రూపాయి విలువ 82కు పతనమయ్యింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెటులో డాలరుతో రూపాయి మారక విలువ అక్టోబర్‌ 19న ఏకంగా 79 పైసలు కోల్పోయింది. తొలిసారి రూపాయి మారకం విలువ 83.20కి క్షీణించింది. రూపాయి మారక విలువ చరిత్రలోనే ఇది అతిపెద్ద పతనం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రూపాయి మారకం
ఆర్ధికం

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న మాంద్యం

కొవిడ్‌ తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో  పులి మీద పుట్రలా యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం రావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుంగిపోతుందన్న భయాలు పెరుగుతున్నాయి.  ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లూటిఓ) మాంద్యం తప్పదని హెచ్చరిస్తోంది. డాలర్‌ దెబ్బకు  ప్రపంచ దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. డాలర్‌ డామినేషన్‌ దినదినం పెరుగుతోంది. ప్రపంచం మరో ఉత్పాతానికి దగ్గరగా చేరుకుంటోంది. ద్రవ్యోల్బణం, రుణభారం,  మాంద్యం ఒకపక్క,  ఇంధన కొరతలు,  ఆకలికేకలు,  ఎంతకీ వీడని కొవిడ్‌ వైరస్‌,  యుద్ధ ప్రభావం మరోవైపు కలిసి ఏకకాలంలో మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాంద్యం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది 2008 ఆర్థిక సంక్షోభమే.
లోచూపు

సమాజ చలన విశ్లేషణ

మిత్రుడు ఎన్. వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసాలను గతంలో వేర్వేరుగా వీక్షణం పత్రికలో చదివినప్పటికీ, ఇటీవల వాటిని 'సమాజ చలనపు సవ్వడి' అనే పుస్తకం రూపంలో మళ్లీ ఒక్క చోట చదివితే ఏర్పడే అవగాహన మరింత శాస్త్రీయం,సమగ్రమూ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, సామాజిక పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేసి,వాటిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు రాజకీయార్థిక దృక్పథానికి మించిన ప్రత్యామ్నాయ దృక్పథం ఏదీ లేదని ఈ పుస్తకం రుజువు చేస్తుంది. సమాజ స్వభావం, సామాజిక మార్పు అనే విషయాలకు సంబంధించి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఈనాటికీ వ్యక్తమవుతున్న కాలంలో 'సమాజ చలనపు సవ్వడి' అనే ఈ పుస్తకం
కాలమ్స్ క్లాసిక్స్ ప‌రిచ‌యం

హెర్‌ వోగ్ట్‌

Herr Vogt జర్మన్‌ ప్రచురణ-1860 ఇంగ్లిష్‌ అనువాదం : 1982 పుస్తకం కంపోజింగ్‌, ముద్రణ, బైండింగ్ -  ట్రేడ్‌యూనియన్‌ లేబర్‌ కార్ల్‌మార్క్స్‌ విస్తృత రచనల్లో ఒక విస్మృత గ్రంథం Herr Vogt. ఆయన సమగ్ర రచనల జాబితా తయారు చేసేటప్పుడు తప్ప ఈ పుస్తకం పేరు మరెక్కడా వినపడదు. మార్క్స్‌ ఇతర రచనల గురించి సుదీర్ఘంగా, సూక్ష్మంగా చర్చించిన పండితులు కూడా ఈ పుస్తకాన్ని, ఎందుకోగాని విస్మరించారు. ఏది ఏమైనప్పటికీ, CAPITAL రాస్తున్న దశలో ఒక సంవత్సరంపాటు ఆ కృషికి విరామమిచ్చి, ఈ పుస్తకం రాశాడు మార్క్స్‌. తనూ, ఎంగెల్స్‌ ఇతర మిత్రులకు వ్యతిరేకంగా కార్ల్‌వోగ్ట్‌ అనబడే పెద్దమనిషి