లోచూపు

చరిత్ర పొడవునా ఫాసిజం

చారిత్రక కారణాలు ఏవైనా ఫాసిజం మన సామాజిక సాంస్కృతిక నేలలోనే మొలిచే విషపు కలుపు మొక్క. దానిని సకాలంలో గుర్తించి పెరికి వేయకపోతే పచ్చని పంట నాశనం అవుతుంది. సాధారణ కలుపు మొక్కలను ఏరివేయకపోతే పంట ఏపుగా పెరగదు గానీ, విషపు కలుపు మొక్క(ల)ను ఏరివేయకపోతే పంట నాశనం అవ్వడమే కాకుండా, నేల కూడా విషపూరితమై భవిష్యత్తులో ఏ పంటా పండని ప్రమాదం తలెత్తుతుంది. అటువంటి మనిషి మౌలిక మనుగడకే ప్రమాదకరమైన ఫాసిస్ట్ ఆక్టోపస్ తన విషపు కోరలతో మన దేశాన్ని కబళిస్తోంది. నిజమైన సంస్కరణోద్యమ పోరాటాలు, లౌకిక, ప్రజాస్వామిక, సమూల పరివర్తనా(విప్లవ) పోరాటాలు చాలా కాలంగా జరుగుతూనే
లోచూపు

సాహిత్య విమర్శకు కొత్త పునాదులు

విరసం మిత్రుడు పాణి తో చేపట్టిన సంభాషణను 'కొలిమి'  "ఫాసిజం-విప్లవోద్యమం- సాహిత్య విమర్శ" అనే పుస్తకంగా జనవరి 2024 లో ప్రచురించింది. పుస్తకం శీర్షికలో సాహిత్య విమర్శ అనే పేరుంది గానీ ఇందులో ఎటువంటి సాహిత్య వాచక ప్రస్తావనలు లేవు. దేని గురించి అయినా రొటీన్ గా ఆలోచించే సంప్రదాయ సాహిత్యకారులు, సాహిత్య విమర్శకులు ఎవరైనా దీనిని చదివితే చాలా నిరాశ పడిపోతారు. ఇది సాహిత్య విమర్శ కానే కాదని, ఫక్తు 'రాజకీయ విమర్శ' అని పెదవి విరవొచ్చు. ఇంకా కొందరైతే 'మావోయిస్టు విప్లవ విమర్శ' అని కూడా కొట్టి పారేయవచ్చు. కానీ నిరంతరం మారుతున్న సమాజాన్ని అర్థం
లోచూపు కాలమ్స్

రాజ్యాంగం – ప్రొ. శేషయ్యగారి విమర్శనాత్మక హక్కుల దృక్పథం

గతంలో రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూసే దృక్పథం కొరవడినందువల్ల దాని పట్ల వ్యవహరించిన తీరు కొంత సమస్యాత్మకంగా, పరస్పర విరుద్ధంగా ఉండేది. కానీ తదనంతర కాలంలో ప్రజా పోరాటాలు విస్తృతమౌతున్న కొద్దీ, ముఖ్యంగా తెలుగు సమాజాలలో లోతైన చర్చలు, అంతర్మథనం జరిగి హక్కుల దృక్పథం తాత్వికంగా బలోపేతం అయ్యే దిశగా వికాసం చెందనారంభించింది. ఆ క్రమంలో భాగంగానే ప్రొ.శేషయ్య గారి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని పరిశీలించా ‘రాజ్యాంగం-పౌరహక్కులు’ అనే ఈ  పుస్తకంలో ముఖ్యంగా రాజ్యాంగాన్ని చారిత్రకంగా చూడడంలో శేషయ్య గారి ప్రత్యేకమైన ముద్ర కనబడుతుంది. పౌర హక్కుల రంగానికి తనదైన సైద్ధాంతిక దృక్పధాన్ని రూపొందించుకునే క్రమంలో ఆయన పాత్ర ప్రముఖంగా పేర్కొనదగినది.
లోచూపు కాలమ్స్

కాషాయ ఫాసిజం ఒక విషపూరిత కషాయం

‘కాషాయ ఫాసిజం, హిందుత్వ తీవ్ర జాతీయవాదం, నయా ఉదారవాద వనరుల దోపిడి’ అనే ఈ పుస్తకం  అశోక్ కుంబం గారు  రాసిన ఇంగ్లీష్ వ్యాసానికి కా. సి యస్ ఆర్ ప్రసాద్ చేసిన అనువాదం. భారతీయ ఫాసిజం అనేది మన నేలమీది ఆధునిక పెట్టుబడిదారీ సామాజిక దుష్పరిణామమే. అంటే, ఇక్కడి ఫాసిజానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ,  దాని చుట్టూ ఉండే భిన్న సామాజిక సంస్కృతుల సంక్లిష్ట, సమాహారమైన నాగరికత అనే రెండు వైపుల నుంచి బలం సమకూరిందని అర్థం చేసుకోవాలి. అందువల్ల భారత ఫాసిజాన్ని స్థూలంగా చూసినప్పుడు గతకాలపు విదేశీ ఫాసిజంతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా పరిశీలించినప్పుడు
లోచూపు కాలమ్స్

ఆధునిక తెలుగు సాహిత్య చ‌రిత్రలో విర‌సం

చ‌రిత్ర  వికాసక్రమంలోని ప్రజల అనంతమైన ధిక్కారాలను, సాహసోపేతమైన పోరాట ఆచరణల  సారాన్ని  విప్లవ రచయితల సంఘం తనలో అంతరంగీకరించుకున్న‌ది.  చారిత్రక చోదకశీలమైన మానవ కర్తృత్వమనే సారభూతశక్తిని అపూర్వరీతిలో ప్రేరేపించింది. దీని వల్ల ఆధునిక కాల్పనికత విప్లవ కాల్పనికతగా రూపాంతరం చెందింది. ఈ కోణంలో చూస్తే మిత్రుడు పాణి రాసిన 'సృజనాత్మక ధిక్కారం' అనే పుస్తకానికి నిస్సందేహంగా అత్యంత చారిత్రక ప్రాసంగికత ఉన్నదని చెప్పవచ్చు.  విర‌సం యాభై ఏళ్ల సంద‌ర్భంలో త‌ను ఈ పుస్త‌కం రాశాడు.   మామూలుగా కల్పన అనగానే అది వాస్తవంతో ప్రమేయం లేని ఊహాజనితమని చాలా మంది  అనుకుంటారు. కాని కల్పనెప్పుడూ మనిషి భౌతిక అస్తిత్వ మూలాలతో
లోచూపు

అంబేద్కర్ అస్తిత్వవాది కాదు -అచ్చమైన దేశీయ ఆధునికతా వాది

భారతదేశంలో కుల సమస్యకు, స్త్రీ సమస్యకు సంబంధించి చాలా ఆధునికంగా ఆలోచించిన వాళ్ళల్లో అంబేద్కర్ చాలా ముఖ్యుడు. అందుకే ఆయన దేశీయ చరిత్రలోకి వెళ్లి లోతుగా పరిశోధించి కుల వ్యవస్థ మూలాలను కనుగొన్నాడు. అంత మాత్రమే కాదు, కులం పనితీరును, చారిత్రక గమనంలో దాని మార్పు క్రమాన్ని పరిశీలించి వివరించాడు. అయితే ఆధునికత వైపుగా జరగాల్సిన సామాజిక మార్పు క్రమానికి సంబంధించిన నిర్దిష్టత పట్ల అత్యంత సీరియస్ గా, మౌలికంగా ఆలోచించిన ప్రజా మేధావి అంబేద్కర్. అలాగే భారత సమాజాన్ని ఆదిమయుగపు అవశేషాలను నిలుపుకుంటూ వస్తున్న ఒక 'నాగరిక' సమాజం అని అంబేద్కర్ నిర్వచించాడు. అలాంటి ఆటవిక అవశేషాలలో
లోచూపు కాలమ్స్

పితృస్వామ్యంపై ఫేస్ ఆఫ్ ‘స్టోమా’

 కొన్ని పుస్తకాలు మనుషుల జీవిత గాథల్ని వినిపిస్తే,  మరికొన్ని పుస్తకాలు వాటిని వ్యాఖ్యానిస్తాయి. కానీ గీతాంజలి గారు రాసిన 'స్టోమా' పుస్తకం స్త్రీల విషాద లైంగిక గాథల్ని ఒక చలనచిత్రం వలె పాఠకుల కళ్ళముందు దృశ్యమానం చేస్తుంది. బయటకు కనబడని వికృత పురుష మానసికతను, అమానుష లైంగికతను లైవ్ గా చిత్రిస్తుంది. మన సమాజంలో స్త్రీల అనంత విషాదానికి ప్రత్యక్షంగా పురుషుడే కారకుడుగా కనిపించినప్పటికీ, పరోక్షంగా పురుషులను (స్త్రీలను) కూడా నడిపించే దుష్ట పీడక సంప్రదాయాలు, దోపిడి సామాజిక వ్యవస్థ ఉన్నాయనే వాస్తవాన్ని మనం పట్టించుకోకుండా ఉండలేము. ఇందులో చిత్రించిన 13 కథలకు ఎంతో వైవిధ్యపూరితమైన సామాజిక నేపథ్యం
లోచూపు కాలమ్స్

ప్రేమమయి, సాంస్కృతిక వారధి

(మొట్టమొదట ఈ పుస్తకం గురించి రాయడానికి  నిన్న నేటికి, నేడు రేపటికి విమర్శనీయం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మడమే ప్రధాన కారణమని చెప్పాలి. అయితే నిన్నటి తప్పులను నేడు సరిచేయలేం. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని నేడు అటువంటివి జరగకుండా ఆచరించడమే సరియైనది. ఎందుకంటే –నిజమైన మార్క్సిస్టుల దృష్టిలో నేర్చుకోవడమంటే మారడమే.) ఏ కాలపు మనుషుల జీవితాలైనా విలువలేనివేం కావు. కాని  విస్తృత సామాజిక సంబంధాలతో  కూడిన కొందరి జీవితానుభవాలు చాలా విలువైనవి. నిర్దిష్ట స్థల కాలాల జీవన వాస్తవికతను అవి సజీవంగా పట్టిస్తాయి. జీవన క్రమంలో స్వయం నిర్ణయపు  వ్యక్తిత్వ విశిష్టతలు, ఆత్మాభిమానపు స్పందనలు, సంవేదనలు ఎన్నెన్నో
లోచూపు కాలమ్స్

కుల గుట్టును రట్టు చేసిన కథలు

సుమారు మూడు దశాబ్దాల క్రితం  తెలుగునాట తలెత్తిన అస్తిత్వ ఉద్యమాలు వివిధ అస్తిత్వాల సమస్యలపై ప్రత్యేక అధ్యయనాలను ప్రేరేపించాయి. ఆయా సమస్యల మూలాలను పునఃపరిశోధించడం, సరికొత్త పరిష్కార మార్గాలను కనుగొనే ప్రయత్నాలూ  ముమ్మరమయ్యాయి. అలాగే వర్గపోరాట పద్ధతులను, ఫలితాలను పునఃసమీక్ష చేసుకునే చారిత్రక అనివార్యతను కూడా అవి సృష్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే- ఆయా సామాజిక అస్తిత్వ బృందాలు ‘తనలో తానుగా’ ఉన్న స్థితినుండి ‘తన కోసం తానైన’ స్థితి లోకి  మారడంగా ఆ అస్తిత్వవాద ఉద్యమాలను అభివర్ణించవచ్చు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు, దళితవాద ఉద్యమం గాని దళితవాద సాహిత్యం గాని లేవనెత్తిన విషయాలన్నీ ఆహ్వానించదగ్గవే. సామాజిక వాస్తవికతలో
లోచూపు కాలమ్స్

మ‌ర‌ణానంత‌ర వాస్త‌వం

మరణానంతర  జీవితం అనగానే కొంతమందికి అది ఒక ఆధ్యాత్మిక విశేషంగా స్ఫురించవచ్చు. కానీ  వ్యక్తుల  జననానికి ముందూ, మరణం తర్వాతా  కొనసాగే సామాజిక జీవితం గురించి,  అమానవీయ దోపిడీ పీడక  మానవ సంబంధాల గురించి నందిగం కృష్ణారావు గారి ఈ నవల అద్భుతంగా దృశ్యీకరిస్తుంది. ఈ నవల ప్రోలోగ్ (ప్రారంభం)లో ప్రస్తావించినట్టుగా  శవం కుళ్లకుండా ఉండటమేమిటి? కుళ్లకుండా చెట్టుకు వేలాడుతున్న శవం తానే ఒక ప్రశ్నయి  చ‌రిత్రను వేధించడం ఏమిటి? అట్టి  చరిత్ర  ‘ఆ శవం ఎందుకు కుళ్ళి   పోలేదు?’ అన్న ప్రశ్నను కాలాన్ని అడగడం అంటే అర్థం  ఏమిటి? ఆ  కాలం జీవమై శవం లోకి ప్రవేశించి