కేరళకు చెందిన మావోయిస్టు మేధావి మురళీధరన్(అజిత్, మురళి) ఇంగ్లీషులో రాసిన క్రిటికింగ్ బ్రాహ్మణిజం పుస్తకానికి చాలా గుర్తింపు వచ్చింది. దీన్ని విరసం బ్రాహ్మణవాదం, మార్క్సిస్టు విమర్శ అనే పేరుతో తెలుగులో గత ఏడాది అచ్చేసింది. బ్రాహ్మణవాదం ఒక ఆధిక్య భావజాలంగా, సంస్కృతిగా పని చేస్తున్న తీరు మీద ఈ పుస్తకంలో అజిత్ కేంద్రీకరించారు. బ్రాహ్మణవాదాన్ని అర్థం చేసుకోడానికి ఇప్పటి దాకా వచ్చిన పుస్తకాల కంటే చాలా భిన్నమైన ఆలోచనలు, పరిశీలనలు, సూత్రీకరణలు ఇందులో ఉన్నాయి. బ్రాహ్మణవాదం బ్రాహ్మణులకు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సమాజంలోని అన్ని వర్గాలను, మత సమూహాలను ప్రభావితం చేస్తున్న సజీవ ప్రతీఘాతుక పాలకవర్గ