లోచూపు కాలమ్స్

సమకాలీన అంబేద్కర్ వాదులు-సంక్షోభం,సవాళ్ళు – ఒక చర్చ

గతంలో కంటే భిన్నంగా అంబేద్కర్ కృషి, ఆలోచనల ప్రాసంగికతను నానాటికి విస్తరిస్తోన్న  ప్రజాపోరాట శక్తులు మరెప్పటి కంటే ఎక్కువగా ఇటీవలి కాలంలో గుర్తిస్తూ ఉండడమే పాలకవర్గాల రాజకీయ వ్యూహంలోని మార్పుకు ప్రధాన కారణం. గతంలో చాలాకాలం అంబేద్కర్ ను  గుర్తించకుండా నిరాకరించడం లోనూ, నేడు ఎంతో గుర్తించినట్లు కనబడుతూ ఆరాధించడం లోనూ ఆయన మూల తాత్వికతను ప్రజలు గ్రహించకుండా చేయడమనే  పాలకవర్గాల కుటిలత్వమే దాగి  ఉన్నది.     ముఖ్యంగా  సమకాలీన సమాజంలో చాలామంది అంబేద్కర్ వాదులు కూడా అంబేద్కర్ మూల తాత్వికతను గ్రహించకుండా వారు నిర్వహిస్తున్న సామాజిక, రాజకీయ పాత్రను ఎత్తిచూపడానికి  2011 లోనే   ఆనంద్ తేల్ తుంబ్డే గారు
లోచూపు

మానవాకాశంలో వానవిల్లులా  సప్త వైవిధ్యాలు

మనం మనుషులతో సహా దేన్నైనా మామూలుగా దంద్వాలలో విలువ కట్టడం చేస్తూ ఉంటాం. మంచి, చెడు, తప్పు, ఒప్పు లాంటి తీర్పులు చెబుతూ ఉంటాం. అలాగే లింగపరంగా మనుషులను ఆడ, మగ అనే ద్వంద్వంలో వర్గీకరించడం కూడా పరిపాటిగా వస్తోంది. కానీ మొదట ఒకే ముద్దగా ఉన్న చిన్న మానవ సమూహం సుదీర్ఘకాల చరిత్ర గతిలో ఎంతెంత విస్తరించి, ఎన్నెన్ని శకలాలుగా విభజితమైపోయిందో ఇదివరకెప్పుడో మనకు తెలిసి వచ్చింది. ఇటీవల కాలంలోనైతే అది మరింత వైవిధ్యపూరితంగానూ, వైరుధ్య పూరితంగానూ మన అనుభవంలోకి వస్తోంది.మరి ఈనాటి సామాజిక సందర్భంలో మనుషులను సామాజికంగా గాని, లింగపరంగా గాని కేవలం ద్వంద్వాలలో విలువ
లోచూపు కాలమ్స్

మానవత్వం పరిమళించాలంటే పోరాటం అనివార్యం

ఇతరేతర జీవుల వలె కాకుండా, మనిషి ఒక విలక్షణ జీవి. పరిస్థితులకు లోబడి ఉండకుండా పోరాడే నైజం వల్లనే ఆ విలక్షణత మనిషికి అబ్బింది. కనుకనే ప్రకృతిలో భాగమైన మనిషి ఆ ప్రకృతితో పోరాడుతూనే ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం సాధించుకుంటున్న క్రమంలోనే మనుషులు తమలో తాము అనేక విభజనలకు గురయ్యారు. మనదేశంలో తొలుత ఆ విభజన ఆర్థికేతరమైన వర్ణవ్యవస్థ రూపంలో. ఆ తర్వాత ఆర్థిక కోణంలోని వర్గ వ్యవస్థ రూపంలోనూ రూపొంది, కులం, మతం, జెండర్ వంటి బహుళ ఆధిపత్య వ్యవస్ధల రూపాల్లోనూ ఆ విభజనలు  కొనసాగుతూ వస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా నేటి
లోచూపు కాలమ్స్

ఆజాదీ కీ ఆవాజ్

యూరప్ లో 14వ శతాబ్దము నుండి రెండు,మూడు శతాబ్దాల పాటు రాచరిక భూస్వామ్యం పై తీవ్రంగా ఘర్షణ పడి, దాన్ని ఓడించి గెలిచిన పెట్టుబడిదారీ వ్యవస్థ(తన స్వప్రయోజనం కోసమే అయినా) ‘మనుషులందరూ సమానమే’, ‘ఏ మనిషికైనా ఒకటే విలువ’ లాంటి కొన్ని ఆధునిక విలువలను ముందుకు తెచ్చింది. పెట్టుబడి తన విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా వలసలు ఏర్పరచుకునే క్రమంలో భారతదేశం కూడా ఒక బ్రిటిష్ వలసగా మారింది. ఆ తర్వాత వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమం ఫలితంగా అధికార మార్పిడి జరిగి,బూర్జువా ప్రజాస్వామ్యం ఇక్కడి భూస్వామ్యంతో తీవ్ర ఘర్షణేమీ లేకుండానే మనదేశానికి దిగుమతి కావడం వల్ల ప్రగతిశీల ఆధునిక
లోచూపు కాలమ్స్

కవిత్వమే సూక్ష్మదర్శిని, దూరదర్శిని

-మెట్టు రవీందర్ మనుషులు విడిపోవడం కంటే మించిన విషాదం లేదు మనుషులు కలవడం కంటే మించిన ఆనందమూ లేదు      అరసవిల్లి కృష్ణ రాసిన ‘ఈ వేళప్పుడు’ కవిత్వం కవి రాసినప్పటి క్షణానికి మాత్రమే సంబంధించినదేనా?  కానేకాదు. అలా ఏ కవిత్వమైనా అది రాయబడిన క్షణానికే   సంబంధించినదయితే, అది పుస్తక పుటల మధ్యనే  నలిగిపోయి    నశిస్తుంది. కానీ ‘ఈ వేళప్పుడు’ కవిత్వం ఒక సజీవమైన కవిత్వం. అది జీవజలం వలె పుస్తక పుటల్ని దాటి పాఠకుల హృదయాల్లోకి  అలవోకగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించే కవిత్వమే జీవిస్తుంది, జీవింపజేస్తుంది.      ఇందులో కవి చూసిన చూపులో  చాలా విశిష్టత ఉంది.
లోచూపు

సమాజ చలన విశ్లేషణ

మిత్రుడు ఎన్. వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసాలను గతంలో వేర్వేరుగా వీక్షణం పత్రికలో చదివినప్పటికీ, ఇటీవల వాటిని 'సమాజ చలనపు సవ్వడి' అనే పుస్తకం రూపంలో మళ్లీ ఒక్క చోట చదివితే ఏర్పడే అవగాహన మరింత శాస్త్రీయం,సమగ్రమూ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, సామాజిక పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేసి,వాటిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు రాజకీయార్థిక దృక్పథానికి మించిన ప్రత్యామ్నాయ దృక్పథం ఏదీ లేదని ఈ పుస్తకం రుజువు చేస్తుంది. సమాజ స్వభావం, సామాజిక మార్పు అనే విషయాలకు సంబంధించి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఈనాటికీ వ్యక్తమవుతున్న కాలంలో 'సమాజ చలనపు సవ్వడి' అనే ఈ పుస్తకం
లోచూపు సాహిత్యం

బ్రాహ్మణవాదం-  విమర్శనాత్మక  ప‌రిశీల‌న‌

కేర‌ళ‌కు చెందిన మావోయిస్టు మేధావి ముర‌ళీధ‌ర‌న్‌(అజిత్‌, ముర‌ళి) ఇంగ్లీషులో రాసిన క్రిటికింగ్ బ్రాహ్మ‌ణిజం  పుస్త‌కానికి  చాలా గుర్తింపు వ‌చ్చింది. దీన్ని విర‌సం బ్రాహ్మ‌ణ‌వాదం, మార్క్సిస్టు విమ‌ర్శ అనే పేరుతో తెలుగులో గ‌త ఏడాది అచ్చేసింది. బ్రాహ్మ‌ణ‌వాదం ఒక ఆధిక్య భావ‌జాలంగా, సంస్కృతిగా ప‌ని చేస్తున్న తీరు మీద ఈ పుస్త‌కంలో అజిత్ కేంద్రీక‌రించారు. బ్రాహ్మ‌ణ‌వాదాన్ని అర్థం చేసుకోడానికి ఇప్ప‌టి దాకా వ‌చ్చిన పుస్త‌కాల కంటే చాలా భిన్నమైన ఆలోచ‌న‌లు, ప‌రిశీల‌న‌లు, సూత్రీక‌ర‌ణ‌లు ఇందులో ఉన్నాయి.  బ్రాహ్మణవాదం  బ్రాహ్మణులకు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సమాజంలోని అన్ని వర్గాలను, మత సమూహాలను ప్రభావితం చేస్తున్న సజీవ ప్రతీఘాతుక పాలకవర్గ
లోచూపు కాలమ్స్

భూమి,సంస్కృతి,నాగరికత

నేటి అర్ధ వలస,అర్థ భూస్వామ్య సామాజిక వ్యవస్థలో ఈ దేశం పట్ల పాలకవర్గాల దృష్టికోణం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానుకూలంగా ఉండదు. ఒకప్పుడు గురజాడ ‘’దేశమంటే మట్టి కాదోయ్/ దేశమంటే మనుషులోయ్’’ అనంటే, నేటి పాలకులు దేశమంటే మట్టి మీద బతికే మనుషులు కాదు, ఆ మట్టి చుట్టూ పాతిన సరిహద్దులు, ఆ మట్టి కింద ఉన్న ఖనిజ వనరులేనని భావిస్తున్నారు. వాటిని తెగనమ్మి, పెట్టుబడిదారీ అభివృద్ధివైపే పాలకులు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ అభివృద్ధిలో ప్రజల నిజమైన అస్తిత్వ అభివృద్ధికి, జ్ఞానచైతన్యాల అభివృద్ధికి ఏ మాత్రం చోటు లేదు.ఉన్నదల్లా పెట్టుబడి వృద్ధియే. మనదేశంలో రైళ్ల విస్తరణ వల్ల సాపేక్షికంగా
లోచూపు కాలమ్స్

కులం, జెండర్ లను ఇలా చూద్దాం

కులం గురించి దళితవాదం చర్చిస్తుందని, జెండర్ గురించి స్త్రీవాదం చర్చిస్తుందని, ఒక్కో అస్తిత్వ సమస్యను ఆ నిర్దిష్ట అస్తిత్వవాదమే చర్చిస్తుందని, లేదా పరిష్కరిస్తుందనే  అస్తిత్వ వాదాల భావజాల వాతావరణం నెలకొని ఉన్న ఈనాటి సందర్భంలో ‘’స్త్రీవాద దృక్కోణంలో జెండర్, కులం’’ అనే ఈ పుస్తకం రావడం ఎంతో ఆహ్వానించదగింది. మన అంతరాలవారీ  సామాజిక వ్యవస్థలో జెండర్, కులం అనేవి విడివిడిగా కనబడుతున్నప్పటికీ, వాటి మధ్య నున్న సంబంధాలను లోతుగానే కాకుండా శాస్త్రీయంగా విశ్లేషించిందీ పుస్తకం. సుదీర్ఘ  పరిణామ క్రమంలో ఆ రెండింటి సాన్నిహిత్యం కారణంగా ఏర్పడిన వాటి  ఉమ్మడి చరిత్ర క్రమాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని రచయిత్రి
లోచూపు కాలమ్స్

మార్క్స్- అంబేద్కర్ : మానవ విమోచనా దృక్పథాలు 

మానవ విమోచనను మార్క్స్, అంబేద్కర్ లు ఎలా అర్థం చేసుకున్నారు? మానవ విమోచన పట్ల వాళ్ల అవగాహనల గురించి ప్రఖ్యాత రచయిత, పౌర హక్కుల నేత, ప్రజా మేధావి ఆనంద్ తేల్ తుంబ్డె  చేసిన లోతైన ఆసక్తికరమైన విశ్లేషణ ఈ పుస్తకం. ఆయన రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని సి. పటేల్ తెలుగులోకి అనువదించగా భూమి బుక్ ట్రస్ట్ (హైదరాబాద్)  మూడవ ముద్రణగా ప్రచురించింది. భారతదేశ చరిత్రలో వివిధ రంగాలలో ఆవిర్భవించి ముందుకు వచ్చిన మానవ విమోచనకు సంబంధించిన దృక్పథాలలో   మార్క్సిస్ట్, అంబేడ్కరిస్టు దృక్పథాలు   ముఖ్యమైనవి . భారత సమాజపు పితృ స్వామిక, కుల, వర్గ పునాదుల రీత్యా అవి