సమకాలీనం

మావోయిస్టులపై యుద్ధం నేపథ్యంలో చంద్రార్కర్ హత్య

2025 మొదటి వారంలో బస్తర్‌లో 16 మంది మరణించారు. వారిలో ఒకరు యువకుడు, ధైర్యవంతుడైన జర్నలిస్టు, ముఖేష్ చంద్రార్కర్. బీజాపుర్ జిల్లాలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆయన  బయటకు తీసిన వార్తలు  ప్రభుత్వ దర్యాప్తుకు దారితీసిన ఐదు నెలల తర్వాత, ఆయన మృతదేహం రోడ్డు కాంట్రాక్టర్ కు చెందిన స్థలంలోని  సెప్టిక్ ట్యాంక్‌లో  దొరికింది. అవినీతిని బహిర్గతం చేసినందుకు జరిగిన చంద్రార్కర్ హత్య, సహజంగానే దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. అయితే ఈ ప్రాంతం మావోయిస్టుల  పోరాటంతో ఎంత సన్నిహితంగా ముడిపడి ఉందో కొద్ది మందికే తెలుసు. చంద్రాకర్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, 120
సమకాలీనం

ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థల బహిష్కరణ

"వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారణ చేయకుండా మేము మా మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి పని చేయలేం." పెర్సివల్ ఎవెరెట్, సాలీ రూనీ, వియట్ థాన్ న్గుయెన్, కవే అక్బర్, మిచెల్ అలెగ్జాండర్, అన్నీ ఎర్నాక్స్, నవోమి క్లైన్, టీ ఒబ్రెహ్ట్, పీటర్ కారీ, జెరిఖో బ్రౌన్, నటాలీ డియాజ్, మేరీ గైట్స్కిల్, హరి కుంజ్రు, రాచెల్ పా కుష్రు, జస్ట్ టి. లీలానీ, సుసాన్ అబుల్హావా, వలేరియా లూయిసెల్లి, జియా టోలెంటినో, బెన్ లెర్నర్, జోనాథన్ లెథెమ్, హిషామ్ మాటర్, మాజా మెంగిస్టే, చైనా మివిల్లే, టోర్రీ పీటర్స్, మాక్స్ పోర్టర్, మిరియమ్ టోవ్స్,
సమకాలీనం

పర్యావరణం కోసం ప్రాణాలు కోల్పోయిన  కార్యకర్తలు 

‘గ్లోబల్ విట్‌నెస్’ రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2012 నుండి పర్యావరణ పరిరక్షణా కర్తవ్యంలో  మొత్తం 2,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లోనే, కనీసం 196 మంది పర్యావరణ రక్షణ కార్యకర్తలు తమ ఇళ్లను లేదా సముదాయాలను రక్షించుకోవడానికి పోరాడుతూ మరణించారు. వీటిలో భారత్ పదో స్థానంలో ఉంది. పర్యావరణం, భూమి హక్కుల కోసం మాట్లాడే వారిపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఈ ఆందోళనకరమైన సంఖ్య ప్రపంచ సంక్షోభాన్ని నొక్కి చెబుతుంది. కొలంబియా వరుసగా రెండో ఏడాది కార్యకర్తలకు అత్యంత ఘోరమైన దేశంగా వుంది. 2023లో, గ్లోబల్ విట్‌నెస్ రికార్డ్ చేసిన ఒక్క సంవత్సరంలో మరే ఇతర దేశం కంటే
సమకాలీనం

చేయని నేరానికి ..

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో విషాదకర స్థితి ఏర్పడింది . ఇక్కడి ఆదివాసీలు తమ హక్కులు, గౌరవం, మనుగడ కోసం ప్రతిరోజూ పోరాడుతున్నారు. ఈ ప్రాంతంలో బెదిరింపులు, పేదరికం, పోలీసు క్రూరత్వాలు వారి జీవితాలను అనిశ్చితిలోకి నెట్టాయి; ఇక్కడ ప్రతి రోజు వారికి ఒక కొత్త సవాలును తెస్తుంది. వారు తమ స్వరాన్ని పెంచే ప్రయత్నాలకు పోలీసుల నుండి నిరాశ, ఉదాసీనత మాత్రమే ఎదురౌతాయి. సోన్‌భద్ర ఆదివాసుల పట్ల పోలీసుల ప్రవర్తన వారి వాస్తవికతను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భూమిపై శాశ్వత యాజమాన్యం లేదా ఆర్థిక శక్తి లేని పేద ఆదివాసీలు శక్తివంతమైన పోలీసుల నుండి అణచివేతను ఎదుర్కొంటున్నారు.
సమకాలీనం

వాళ్లిద్దరి విడుదల గురించీ నినదించలేమా?

చిలకలూరిపేట బస్సు దహనం కేసు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 1993 మార్చి 8న జరిగిన ఆ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధనరావులు అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ గుంటూరు కోబాల్డ్ పేట కు చెందిన దళిత యువకులు. కేవలం ఆర్ధిక అవసరాల కోసం ఇతరత్రా డబ్బులు దొరకని అప్పు పుట్టని పరిస్థితుల్లో వారు దోపిడీ చేయాలనుకున్నారు. అలాంటి ఆలోచనలకు ఆ ఇద్దరూ నెట్టివేయబడడానికి కారణం ఖచ్చితంగా సమాజమే. ఈ విషయం కన్వీనియంట్ గా మర్చిపోతాంగానీ ... ఇదే అసలు సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది. బస్సు దహనం జరిగిన సందర్భంగా 23
సమకాలీనం

అవార్డును తిరస్కరించిన రచయిత్రి జసింతా కెర్కెట్

పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ బాధితులకు సంఘీభావంగా యునైటెడ్  ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూ‌ఎస్‌ఎఐ‌డి), రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ సంయుక్తంగా ఇచ్చిన అవార్డును స్వీకరించడానికి ఆదివాసీ కార్యకర్త, రచయిత్రి జసింతా కెర్కట్ట నిరాకరించారు. ఆమె పుస్తకం, కవితల సంపుటి అయిన జిర్హుల్, చిల్డ్రన్స్ బుక్ క్రియేటర్స్ అవార్డులలో 'రూమ్ టు రీడ్ యంగ్ ఆథర్ అవార్డు'కి ఎంపికైంది. ఈ నిర్ణయంపై అవార్డు యిచ్చేవారు ఇంకా బహిరంగంగా స్పందించలేదు. బాలల సాహిత్య అవార్డుల 2వ ఎడిషన్ వేడుక అక్టోబర్ 7న జరుగుతుందని దాని వెబ్‌సైట్ పేర్కొంది. పిల్లల కోసం పుస్తకాలు ముఖ్యమైనవి కానీ పెద్దలు
సమకాలీనం

గెస్టపోలాంటిదే ఎన్ఐఎ

వర్సైల్స్ ఒడంబడిక* లోని అవమానకరమైన నిబంధనలు జర్మన్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయి. ఈ ఒప్పందం దేశ సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక  స్వాతంత్య్రాన్ని  అంతం చేసింది. వారు విజేతల ముందు తలవంచవలసి వచ్చింది (ట్రిపుల్ అలయన్స్). వర్సైల్స్ ఒప్పందం ప్రకారం, జర్మనీ $33 బిలియన్ డాలర్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది; విలువైన విదేశీ వలసలను వదులుకుంది; ఫ్రాన్స్, పోలాండ్‌లకు తన స్థానిక భూములలో విలువైన భాగాలను అప్పగించింది. జర్మన్ సైన్యం గణనీయంగా తగ్గిపోయింది; జలాంతర్గాములు లేదా వైమానిక దళం నిషేధానికి గురయింది. "మేము జర్మన్ నిమ్మకాయను దాని విత్తనాలు కేకలు వేసే వరకు పిండి పిప్పి చేస్తాం!"1 అని ఒక
సమకాలీనం

మానేసర్‌ మారుతీ ప్లాంట్‌లో కార్మికుల నిరవధిక ధర్నా

ఆటోమొబైల్ కంపెనీ మారుతీకి చెందిన మనేసర్ ప్లాంట్‌లో కార్మికుల పోరాటంలో జరిగిన  హింసాత్మక ఘటనల తర్వాత 2012లో తొలగించబడిన కార్మికులు తమ ఉద్యోగాలను తిరిగి పొందాలని డిమాండ్ చేస్తూ మనేసర్ తహసీల్ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా ప్రారంభించారు. హర్యానాలోని మానేసర్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో 2012లో యాజమాన్యం తొలగించిన 100 మందికి పైగా కార్మికులు,  సుదీర్ఘమైన 12 సంవత్సరాల తర్వాత,  2024 సెప్టెంబర్ 18 నాడు తిరిగి తమను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు దగ్గర నిరవధిక ధర్నాకు కూర్చున్నారు. సత్యం ఆటో యూనియన్, లుమాక్స్ మజ్దూర్ యూనియన్, ఎఎస్‌ఐ యూనియన్, బెల్సోనియా ఆటో
సమకాలీనం

జంషెడ్పూర్ పౌరులు వర్సెస్ టాటా కంపెనీ

జార్ఖండ్ ప్రభుత్వం జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సౌరభ్ విష్ణు, జంషెడ్‌పూర్‌కు చెందిన 50 మందికి పైగా పౌరులు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జంషెడ్‌పూర్ నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చిన తర్వాత, నగరంలోని చాలా మంది పౌరుల హక్కులు చాలా పరిమితం అవుతాయి; టాటా కంపెనీ హక్కులు చాలా ఎక్కువైపోతాయి. జార్ఖండ్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 23న నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 13న, జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌ను గౌరవ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజిత్ నారాయణ్ ప్రసాద్, గౌరవనీయులైన జస్టిస్ అరుణ్
సమకాలీనం

చంచల్‌గూడ జైలులో రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

రోజంతా ఏకాంతవాసంలో(ఒంటరిగదుల్లో) నిర్బంధించకూడదనే ఏకైక డిమాండ్‌తో చంచల్‌గూడ సెంట్రల్ జైలు, నర్మదా బ్లాక్‌లోని రాజకీయ ఖైదీలు 2024 ఆగస్టు 27 నాడు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. గత కొంతకాలంగా, సీపీఐ (మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ఖైదీలు చంచల్‌గూడ జైలు నిర్బంధంలో వున్నారు. వారు విచారణ ఖైదీలైనప్పటికీ జైలు అధికారులువారి హక్కులను నిరంకుశంగా అణిచివేస్తున్నారు. జైలు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పులను (ఉదాహరణకు సునిల్ బాట్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, 1980)సైతం లెక్కచేయడంలేదు. చదవడానికి పుస్తకాలు, పత్రికలు కావాలని, రాసుకోవడానికి పెన్నులు, నోట్‌ బుక్స్ లాంటి కనీస అవసరాల కోసం ఖైదీలు