సమకాలీనం

విప్లవావసరానికి ఎన్నెన్నో సూచికలు

దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరిస్థితులు మారాయని, ప్రజలు విప్లవాన్ని కోరుకోవడం లేదని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు గదా, కొనసాగుతున్న పరిస్థితి ఏమిటో వెల్లడించిన రెండు తాజా నివేదికల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, మొత్తంగా దేశానికి సంబంధించినది. వరల్డ్ ఇనీక్వాలిటీ లాబ్ అనే సుప్రసిద్ధ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఏప్రిల్ మొదటి వారంలో వెలువరించిన ‘లాండ్ ఇనీక్వాలిటీ ఇన్ ఇండియా: నేచర్, హిస్టరీ అండ్ మార్కెట్స్’ (భారతదేశంలో భూ అసమానతలు: స్వభావం, చరిత్ర, మార్కెట్లు) అనే పత్రం. ప్రతి సంవత్సరమూ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ ప్రచురించే ఈ సంస్థ పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ ల సారథ్యంలో
సమకాలీనం

ఆదివాసిలపై ఒడిశా న్యాయస్థానాల కులవివక్ష

ఒడిశాలోని రాయగడ మరియు కలహండి జిల్లాల్లోని తిజిమాలి, ఇతర గ్రామాల నివాసులు ఒక కొత్త బాక్సైట్ గని ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులలో చాలామందిని అరెస్టు చేసి, వారి బెయిల్ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లను శుభ్రం చేసేలా బలవంతం చేశారు. ఒడిశాలో గనుల తవ్వకం  వ్యతిరేక నిరసనలు: ఒడిశాలోని దక్షిణాది జిల్లా అయిన రాయగడలో గనుల తవ్వకం  వ్యతిరేక నిరసనలను నేరపూరితం చేయడం 2023లో ప్రారంభమైంది. వేదాంత ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న దళిత, ఆదివాసీ గ్రామస్తులను అరెస్టు చేసినప్పుడు ఈ పరిస్థితి నెలకొంది. అప్పటి నుండి, కనీసం 40 మందిని అరెస్టు చేయగా, బెయిల్ షరతుగా కనీసం
సమకాలీనం

దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం

క్రిస్టియన్ మతం స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని సుఫ్రీం కోర్టు చెప్పిన తీర్పు  చట్ట వ్యతిరేకం మరియు రాజ్యాంగ వ్యతిరేకం, ముఖ్యంగా ప్రజా వ్యతిరేకం.రాజ్యంలోని ముఖ్య అంగమైన న్యాయ వ్యవస్థ దళితులకు వ్యతిరేకంగా కుల ఫ్యూడల్ పునాది పై నిర్మితమై పనిచేస్తుందో ఏ విధంగా వారి పట్ల కక్ష్య సాధింపు మరియు అణచివేత చర్యలకు పాల్పడుతుందో ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది.ఇంతకు ముందు విద్యా సంస్థలలో కుల వివక్షత అరికట్టడానికి ఉద్దేశించిన యూజిసి నిబంధనల పై కూడా స్టే విధించింది.అందుకే మనువాద బ్రాహ్మణీయ కుల భావజాలంతో పనిచేస్తున్న న్యాయ వ్యవస్థ దళితులను నిరంతరం అణగదొక్కుతూ,అవమానిస్తుందో,వివక్షత పాటిస్తుందో ఆ
సమకాలీనం

స్వేచ్ఛ, సమానత్వం కోసం మడవి సీమ పోరాటం

“పనిచేసే వాళ్లదే భూమి” –  బస్తర్ అమ్మాయి చూసిన అసమానతల నుంచి పుట్టిన ప్రజాస్వామిక నినాదం. 2025 ఏప్రిల్, మే నెలల్లో బస్తర్‌లోని కర్రెగుట్ట ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర పారామిలిటరీ బలగాలు “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్” పేరుతో భారీ దాడులు నిర్వహించాయి . ప్రభుత్వం ముప్పై వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది.  ఈ ఆపరేషన్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని అరెస్టు చేశారు. ఎన్నో గ్రామాలు ధ్వంసం అయ్యాయి. అరెస్టయిన వారిలో మడవి సీమ కూడా ఉంది. ఆమె వయస్సు పందొమ్మిదేళ్ళు. ఆమె ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉంది. పోలీసులు ఆమెను మావోయిస్టుగా అనుమానించి
సమకాలీనం

చాకలి కులస్థుల పై దాడి- ఆధిప‌త్య భావ‌జాలం

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టు గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా తేదీ 18 న టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారనే సాకుతో చాకలి కులస్థులు అయిన గణేష్, చంద్రకళ, మౌనికల పై అదే గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి నాయకత్వంలో సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి మొదలగు వారు అగ్రకుల దురహంకారంతో భయంకరంగా దాడి చేసి కొట్టారు. రెండు నెలల పసిపాపను కాళ్ళతో తన్నడంతో తీవ్రంగా గాయపడ్డ పాప 21 వ తేదీన చనిపోయింది. రెడ్లు చేసిన ఈ క్రూరమైన దాడిని మానవత్వం కలవారందరూ ఖండించాలి. హంతకుల పై మర్డర్ కేసు నమోదు
సమకాలీనం

కృత్రిమ మేధ –  పాలకవర్గం

 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో కృత్రిమ మేధ ప్రభావం పై అంతర్జాతీయ శిఖరాగ్ర సభ జరిగింది. ఈ సభలో 20 దేశాలకు చెందిన అగ్ర నేతలు, 60 దేశాలకు చెందిన మంత్రులు,  వందమంది కంపెనీ సీఈఓ లు పాల్గొన్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, "ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ అభివృద్ది,  నైపుణ్యాల పెంపుదల, ఉద్యోగ కల్పన, నైతికత, విధాన రూపకల్పనలు చేయడంగా ప్రకటించబడింది". కృత్రిమ మేధ అన్నది ఇప్పుడే పుట్టినది కాదు. 1950 లలోనే "డాక్ మౌత్" కంప్యూటర్ల తయారీ, వినియోగము, స్టోరేజీ, భాషల అనువాదం,హేతుబద్ద సమాధానాల రూపకల్పనలలో ఇంటర్నెట్ వాడకం నుంచే ఇది
సమకాలీనం

గ్రామీణ ఉపాధి హక్కుపై ఉక్కుపాదం

1980ల నుండి ‘పనికి ఆహారం’ తదితర పేర్లతో కొనసాగిన పథకానికి 2006 సంవత్సరంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్(యుపిఎ) ప్రభుత్వం... గ్రామీణ ఉపాధి హామీ పథకంగా అమలు చేసింది. ప్రజానుకూల ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల ప్రొద్భలంతో గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో రూపుదిద్దుకుంది. 2009 సంవత్సరంలో ‘మహాత్మా గాంధీ’ పేరును పథకానికి ముందు జోడించింది. ఎం.జి నరేగా (గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రకటిత లక్ష్యపు దరిదాపులకు కూడా చేరుకోకపోయినప్పటికీ, ఎన్నో అవకతవకలు, లోటుపాట్లతో అవినీతిలో కూరుకుపోయినప్పటికీ... దేశంలోని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజానీకానికి ఏదో మేరకు ఉపశమనంగా పనిచేస్తోంది. ఈ పథకాన్ని సైతం
సమకాలీనం

తుడిచివేతపై తుడిచివేత

'ది లాస్ట్ ప్లే ఇన్ గాజా' నాటకాన్ని ప్రదర్శించడానికి భారత వీసా నిరాకరించబడిన యాంటీ-జయోనిస్ట్ ఇజ్రాయెలీ నాటకకర్త ఐనాట్ వైజ్మాన్ ఈ వ్యాసం రాశారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య, అంటే జయోనిజం - హిందుత్వ మధ్య పెరుగుతున్న బంధం వెనుక ఉన్న అసలు రూపాన్ని ఈ చర్య ఎలా బయటపెడుతుందో ఆమె వివరించారు గత వారం కేరళలో జరిగిన ITFOK ఉత్సవంలో మా నాటకం "ది లాస్ట్ ప్లే ఇన్ గాజా" (గాజాలో చివరి నాటకం) ప్రదర్శించాల్సి ఉండింది. రెండు షోలు జరగాలి. ఈ నాటకం గాజాను తుడిచిపెట్టడానికి సంబంధించిన నాటకం. నాశనమైన దానిని థియేటర్ ద్వారా తిరిగి సృష్టించడానికి
సమకాలీనం

కేసులు కొట్టేసినా, జైలు నుంచి విడుద‌లైనా దొర‌క‌ని స్వేచ్ఛ 

2022 మే లో రతీరామ్ మాంఝీ మావోయిస్టు ఆరోపణల నుండి విముక్తి పొందారు, కానీ ఆ ఆరోపణల నీడ ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. హత్య, అల్లర్లు, ఆయుధ చట్టం, క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ కింద మహువాటాండ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బొకారోలోని ఒక సివిల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో సుదీర్ఘ న్యాయపోరాటం ముగిసినప్పటికీ, ఆయన జీవితం గతంలోలాగా సాధారణ స్థితికి చేరుకోలేదు. మిగిలిందల్లా పోలీసుల వేధింపులు, సామాజిక వివక్షతో కూడిన సంవత్సరాల తరబడి అవమానాలే. దీని పర్యవసానాలు ఆయనతోనే ఆగిపోలేదు, ఆయన కుటుంబాన్ని కూడా తాకాయి. ఒక పాఠశాల తన
సమకాలీనం

భీమా కోరెగావ్ శౌర్య దివ‌స్ లో మనువాద వ్య‌తిరేక స్ఫూర్తి 

దేశంలోని మెజారిటీ ప్రజలపై మనువాద అణచివేత, దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2025, అక్టోబర్ ఆరవ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై మనువాద భావజాలం కలిగిన ఒక లాయర్ బూటుతో దాడి చేశాడు. అనంతరం ఆ వ్యక్తి మాట్లాడుతూ తన మతానికి చెందిన దేవునిపై న్యాయమూర్తి వ్యాఖ్యలను నిరసిస్తూ దాడిచేశానని తనకు పశ్చాతాపం లేదని చెప్పారు. ఆ వ్యక్తిపై  కనీసం కేసు కూడా నమోదు కాలేదు.  అదే నెల 7 వ తేదిన హర్యానాలో కుల వివక్షత భరించలేక ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొన్నారు. అతను యస్సీ కులానికి చెందినవారు కావడంతో