సమకాలీనం

చె గువేరా’మోటార్ సైకిల్ డైరీస్’అంటే ఎందుకంత భయం?

చె గువేరా భూతం ఇప్పుడు భారత రాజ్యాధికారాన్ని వెంటాడుతోంది. అతని ఆత్మ సమాధి నుండి బయటకు వచ్చి భారతీయ పాలక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది. చె గువేరా ను చూసి భయపడే నేటి పాలకులను చూస్తుంటే , చె తనను కాల్చి చంపేస్తున్న అమెరికన్ సైనికులు తనపై తూటాలు పేల్చి చంపుతున్న అమెరికా సైనికులతో  సరిగ్గా చెప్పినట్లు అనిపిస్తుంది – “నన్ను కాల్చకండి! నేను చే గువేరాను. నేను బతికి వుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటాను. మరణానంతరం నేను మీకు మరింత ప్రమాదకరమని నిరూపిస్తాను” అలాగే జరిగింది. అమరత్వం తరువాత చే ప్రపంచ యువతకు విప్లవానికి,
సమకాలీనం

ఉత్తరాఖండ్‌లో ఖలంగా అడవి కోసం యువత, అడ్డుకున్న “దేశ భక్త” గుంపు

వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న ఈ కాలంలో, మరిన్ని చెట్లను నాటాలని, అడవులను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో   నగరం పక్కనే ఉన్న మరో అడవిని నాశనం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఈసారి  దట్టమైన సాల్ చెట్ల  ఖలంగా కొండల అడవి వాళ్ళ  లక్ష్యం. ఇక్కడ సౌంగ్ నది తాగునీటి పథకానికి సంబంధించిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏటా రెండు వేల చెట్లను నరికివేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  నరకబోయే చెట్లకు ఇటీవల గుర్తులు కూడా పెట్టారు. గుర్తు పెట్టడం అంటే నరకబోయే చెట్లకు గుర్తుగా గొడ్డలితో
సమకాలీనం

దేశద్రోహుల జేబు సంస్థ ఎన్‌ఐఏ ముస్లింలను దేశద్రోహులని ఆరోపించడమా?

నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) 18వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూకుమ్మడిగా ముస్లింల ఇండ్ల మీద దాడి చేసింది. దేశద్రోహ నేరారోపణ చేసి అరెస్టులు చేసింది.  హైదరాబాదులోని  తమ కార్యాలయంలో విచారణకు రావాలని కొన్ని డజన్ల మంది ముస్లింలకు  నోటీసులు ఇచ్చింది. వీళ్లందరూ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ నాయకులని, సభ్యులని, వీళ్లంతా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనుల్లో ఉన్నారని, దేశద్రోహ కార్యకలాపాలు నడుపుతున్నారని ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది.నిజామాబాద్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ముస్లింలకు లీగర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం పేరుతో కర్రసాము, కత్తిసాము నేర్పిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతోందనే ఒక కేసు స్థానిక పోలీసులు
వ్యాసాలు సమకాలీనం

‘నయా ఉదార వాద’ ఆర్థిక విధానాలు – శ్రీలంక సంక్షోభం

(నయా ఉదారవాదం అనే పదం నిజానికి ఒక misnomer – తప్పు సంకేతాన్ని ఇచ్చే పదం. కానీ కొన్ని సామ్రాజ్యవాద విధానాల సమాహారానికి నయా ఉదారవాదం అనే పేరు పడినందుకు మాత్రమే ఆ పదాన్ని ఈ వ్యాసంలో ఉపయోగించాను. సారాంశంలో అది సామ్రాజ్యవాద విధానమే, నయా వలసవాద దోపిడీ పద్ధతే.) దక్షిణ అమెరికా దేశాలలో పింక్ వెల్లువ తిరుగుబాట్లు, అరబ్ దేశాలలో జరిగిన అరబ్ వసంత తిరుగుబాట్లు, అమెరికా, యూరోప్ దేశాలలో జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ ఉద్యమాల తరువాత అంత పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు ఎగిసి పడుతున్న దేశం శ్రీలంక. ప్రజల తిరుగుబాటువల్ల తప్పనిసరి పరిస్థితిలో
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను
కాలమ్స్ సమకాలీనం వ్యాసాలు

రామానుజుడు-ఆయ‌న స‌మ‌త‌

క్రీశ 1017-1137 మ‌ధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయ‌న  తాత్వికంగా, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌స్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వ‌చ్చేనాటికి ఉన్న  చారిత్ర‌క , తాత్విక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న *స‌మ‌తా వాదాన్ని* కీర్తించడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం  ఏమీ ఉండ‌దు.  రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంక‌రుడి అద్వైతం బ‌లంగా ఉండింది.  *బ్ర‌హ్మ స‌త్యం- జ‌గం మిధ్య* అనేది ఆయ‌న ప్ర‌ధాన సిద్ధాంతం. దీన్నుంచే త‌త్వ‌మ‌సి అనే భావ‌న‌ను తీసుకొచ్చాడు.  ప‌ర‌బ్ర‌హ్మ‌వు నీవే. ఈశ్వ‌రుడు, మాన‌వుడు(ఆత్మ‌) వేరే కాదు. రెండూ ఒక‌టే అనేది అద్వైతం.  జ‌గం మిధ్య అన‌డంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీక‌రించ‌లేదు. 
కాలమ్స్ సమకాలీనం

ఆన్ లైన్ విద్య బోధనలో అసమానత్వం

కరోనా మూడవ వేవ్ రిత్యా తెలంగాణ సర్కారు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓయూ, జెఎన్ టి యు, శాతవాహన యూనివర్సిటీలతో పాటు మిగతా యూనివర్సిటీలు, ఉన్నత విద్యలో ఆన్ లైన్/డిజిటల్ విద్యభోదన జరుపుతామని ప్రకటించాయి. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యలో ఆన్ లైన్ భోదనకు మొగ్గుచూపుతున్న తెలంగాణ సర్కారు పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు వినేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మొదటి, రెండవ కరోనా వేవ్ లలో ఆన్ లైన్/డిజిటల్ భోదన పాఠాలు అందక తీవ్రంగా నష్టపోయిన పేద విద్యార్థులు మూడవ వేవ్ లో
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

పెరిగింది కొండంత – తగ్గింది గోరంత

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలను మోసం చేసే చర్యలను కొనసాగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా యధేచ్ఛగా పెట్రో ఉత్పత్తుల ధరలను భారీగా పెంచి, ప్రజల సొమ్మును యదేచ్ఛగా దోపిడీ చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో ప్రభుత్వానికి, ఉత్పాదక కంపెనీలకు, మార్కెటింగ్ కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా మార్కెట్ శక్తుల వల్లే జరుగుతోందని మోడీ ప్రభుత్వం చెబుతున్నదంతా శుద్ధ అబద్దం. వివిధ రాష్ట్రాల్లో అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో మోడీ సర్కార్ నవంబర్ 3న పెట్రోల్, డీజిల్ పై నామమాత్రపు తగ్గింపును ప్రకటించి, వ్యాట్ పేరుతో మిగిలిన దంతా రాష్ట్రాల పైకి నెట్టేసింది.
వ్యాసాలు సమకాలీనం

ఆకలి కడుపులతో అమృతోత్సవం!

బ్రిటీష్‌ వలసవాదుల నుంచి భారత పాలక వర్గాలకు అధికార బదిలీ జరిగి వచ్చే ఏడాది ఆగష్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో అమృతోత్సవం నిర్వహించాలని మోడీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. స్వాతంత్య్రం వచ్చింది దేశ భూభాగానికే కాదు ప్రజలకు సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం అని గమనిస్తే జనాభాలో సగం మంది  పేదరికంతో ఆకలితో అలమటిస్తుంటే, ప్రజలు ఉత్సవాలలో ఎలా పాల్గొంటారు? ఏడున్నర దశాబ్దాలలో ప్రజల మౌలిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, వైద్యం, విద్య ఇప్పటికీ ప్రజలందరికి అందుబాటులోకి రాలేదు. బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మోత
కాలమ్స్ సమకాలీనం

అమెరికా నిష్క్రమణ దేనికి సంకేతం?

రెండు దశాబ్దాల క్రితం ఉగ్రవాదం అణచివేత పేరుతో ఆఫ్ఘన్ నేల పై అడుగుపెట్టిన అమెరికా అవమానకరమైన రీతిలో తట్టా బుట్టా సర్దుకొని విమానమెక్కి ఉడాయించింది. రెండేళ్లుగా తనకు ఏ ప్రమాదం తలపెట్టకుండా వెళ్లనీయండoటూ తాలిబాన్ లతో రహాస్యంగా దోహలో మొదలైన చర్చలు పరిపూర్ణం కాకుండానే తానే విధించుకున్న గడువు ముంచుకు రావడంతో వియత్నాం ను విడిచివెళ్లిన చారిత్రక దృశ్యాలను ప్రపంచానికి మరోసారి గుర్తుకు చేస్తూ మరీ నిష్క్రమించింది అమెరికా. ఉగ్రవాదాన్ని అణచడమే మా పని.. జాతి నిర్మాణం కాదని ఇప్పుడు అంటోంది.  1980 తొలినాళ్లలో సోవియట్ సేనలను ఎదుర్కొనేందుకు తానే నాటిన ఛాందస బీజాలు నేడు పెరిగి పెద్దయిన