సమకాలీనం

గెస్టపోలాంటిదే ఎన్ఐఎ

వర్సైల్స్ ఒడంబడిక* లోని అవమానకరమైన నిబంధనలు జర్మన్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయి. ఈ ఒప్పందం దేశ సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక  స్వాతంత్య్రాన్ని  అంతం చేసింది. వారు విజేతల ముందు తలవంచవలసి వచ్చింది (ట్రిపుల్ అలయన్స్). వర్సైల్స్ ఒప్పందం ప్రకారం, జర్మనీ $33 బిలియన్ డాలర్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది; విలువైన విదేశీ వలసలను వదులుకుంది; ఫ్రాన్స్, పోలాండ్‌లకు తన స్థానిక భూములలో విలువైన భాగాలను అప్పగించింది. జర్మన్ సైన్యం గణనీయంగా తగ్గిపోయింది; జలాంతర్గాములు లేదా వైమానిక దళం నిషేధానికి గురయింది. "మేము జర్మన్ నిమ్మకాయను దాని విత్తనాలు కేకలు వేసే వరకు పిండి పిప్పి చేస్తాం!"1 అని ఒక
సమకాలీనం

మానేసర్‌ మారుతీ ప్లాంట్‌లో కార్మికుల నిరవధిక ధర్నా

ఆటోమొబైల్ కంపెనీ మారుతీకి చెందిన మనేసర్ ప్లాంట్‌లో కార్మికుల పోరాటంలో జరిగిన  హింసాత్మక ఘటనల తర్వాత 2012లో తొలగించబడిన కార్మికులు తమ ఉద్యోగాలను తిరిగి పొందాలని డిమాండ్ చేస్తూ మనేసర్ తహసీల్ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా ప్రారంభించారు. హర్యానాలోని మానేసర్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో 2012లో యాజమాన్యం తొలగించిన 100 మందికి పైగా కార్మికులు,  సుదీర్ఘమైన 12 సంవత్సరాల తర్వాత,  2024 సెప్టెంబర్ 18 నాడు తిరిగి తమను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు దగ్గర నిరవధిక ధర్నాకు కూర్చున్నారు. సత్యం ఆటో యూనియన్, లుమాక్స్ మజ్దూర్ యూనియన్, ఎఎస్‌ఐ యూనియన్, బెల్సోనియా ఆటో
సమకాలీనం

జంషెడ్పూర్ పౌరులు వర్సెస్ టాటా కంపెనీ

జార్ఖండ్ ప్రభుత్వం జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సౌరభ్ విష్ణు, జంషెడ్‌పూర్‌కు చెందిన 50 మందికి పైగా పౌరులు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జంషెడ్‌పూర్ నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చిన తర్వాత, నగరంలోని చాలా మంది పౌరుల హక్కులు చాలా పరిమితం అవుతాయి; టాటా కంపెనీ హక్కులు చాలా ఎక్కువైపోతాయి. జార్ఖండ్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 23న నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 13న, జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌ను గౌరవ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజిత్ నారాయణ్ ప్రసాద్, గౌరవనీయులైన జస్టిస్ అరుణ్
సమకాలీనం

చంచల్‌గూడ జైలులో రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

రోజంతా ఏకాంతవాసంలో(ఒంటరిగదుల్లో) నిర్బంధించకూడదనే ఏకైక డిమాండ్‌తో చంచల్‌గూడ సెంట్రల్ జైలు, నర్మదా బ్లాక్‌లోని రాజకీయ ఖైదీలు 2024 ఆగస్టు 27 నాడు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. గత కొంతకాలంగా, సీపీఐ (మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ఖైదీలు చంచల్‌గూడ జైలు నిర్బంధంలో వున్నారు. వారు విచారణ ఖైదీలైనప్పటికీ జైలు అధికారులువారి హక్కులను నిరంకుశంగా అణిచివేస్తున్నారు. జైలు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పులను (ఉదాహరణకు సునిల్ బాట్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, 1980)సైతం లెక్కచేయడంలేదు. చదవడానికి పుస్తకాలు, పత్రికలు కావాలని, రాసుకోవడానికి పెన్నులు, నోట్‌ బుక్స్ లాంటి కనీస అవసరాల కోసం ఖైదీలు
సమకాలీనం

చె గువేరా’మోటార్ సైకిల్ డైరీస్’అంటే ఎందుకంత భయం?

చె గువేరా భూతం ఇప్పుడు భారత రాజ్యాధికారాన్ని వెంటాడుతోంది. అతని ఆత్మ సమాధి నుండి బయటకు వచ్చి భారతీయ పాలక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది. చె గువేరా ను చూసి భయపడే నేటి పాలకులను చూస్తుంటే , చె తనను కాల్చి చంపేస్తున్న అమెరికన్ సైనికులు తనపై తూటాలు పేల్చి చంపుతున్న అమెరికా సైనికులతో  సరిగ్గా చెప్పినట్లు అనిపిస్తుంది – “నన్ను కాల్చకండి! నేను చే గువేరాను. నేను బతికి వుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటాను. మరణానంతరం నేను మీకు మరింత ప్రమాదకరమని నిరూపిస్తాను” అలాగే జరిగింది. అమరత్వం తరువాత చే ప్రపంచ యువతకు విప్లవానికి,
సమకాలీనం

ఉత్తరాఖండ్‌లో ఖలంగా అడవి కోసం యువత, అడ్డుకున్న “దేశ భక్త” గుంపు

వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న ఈ కాలంలో, మరిన్ని చెట్లను నాటాలని, అడవులను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో   నగరం పక్కనే ఉన్న మరో అడవిని నాశనం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఈసారి  దట్టమైన సాల్ చెట్ల  ఖలంగా కొండల అడవి వాళ్ళ  లక్ష్యం. ఇక్కడ సౌంగ్ నది తాగునీటి పథకానికి సంబంధించిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏటా రెండు వేల చెట్లను నరికివేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  నరకబోయే చెట్లకు ఇటీవల గుర్తులు కూడా పెట్టారు. గుర్తు పెట్టడం అంటే నరకబోయే చెట్లకు గుర్తుగా గొడ్డలితో
సమకాలీనం

దేశద్రోహుల జేబు సంస్థ ఎన్‌ఐఏ ముస్లింలను దేశద్రోహులని ఆరోపించడమా?

నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) 18వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూకుమ్మడిగా ముస్లింల ఇండ్ల మీద దాడి చేసింది. దేశద్రోహ నేరారోపణ చేసి అరెస్టులు చేసింది.  హైదరాబాదులోని  తమ కార్యాలయంలో విచారణకు రావాలని కొన్ని డజన్ల మంది ముస్లింలకు  నోటీసులు ఇచ్చింది. వీళ్లందరూ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ నాయకులని, సభ్యులని, వీళ్లంతా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనుల్లో ఉన్నారని, దేశద్రోహ కార్యకలాపాలు నడుపుతున్నారని ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది.నిజామాబాద్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ముస్లింలకు లీగర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం పేరుతో కర్రసాము, కత్తిసాము నేర్పిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతోందనే ఒక కేసు స్థానిక పోలీసులు
వ్యాసాలు సమకాలీనం

‘నయా ఉదార వాద’ ఆర్థిక విధానాలు – శ్రీలంక సంక్షోభం

(నయా ఉదారవాదం అనే పదం నిజానికి ఒక misnomer – తప్పు సంకేతాన్ని ఇచ్చే పదం. కానీ కొన్ని సామ్రాజ్యవాద విధానాల సమాహారానికి నయా ఉదారవాదం అనే పేరు పడినందుకు మాత్రమే ఆ పదాన్ని ఈ వ్యాసంలో ఉపయోగించాను. సారాంశంలో అది సామ్రాజ్యవాద విధానమే, నయా వలసవాద దోపిడీ పద్ధతే.) దక్షిణ అమెరికా దేశాలలో పింక్ వెల్లువ తిరుగుబాట్లు, అరబ్ దేశాలలో జరిగిన అరబ్ వసంత తిరుగుబాట్లు, అమెరికా, యూరోప్ దేశాలలో జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ ఉద్యమాల తరువాత అంత పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు ఎగిసి పడుతున్న దేశం శ్రీలంక. ప్రజల తిరుగుబాటువల్ల తప్పనిసరి పరిస్థితిలో
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

రామానుజుడు-ఆయ‌న స‌మ‌త‌

క్రీశ 1017-1137 మ‌ధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయ‌న  తాత్వికంగా, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌స్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వ‌చ్చేనాటికి ఉన్న  చారిత్ర‌క , తాత్విక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న *స‌మ‌తా వాదాన్ని* కీర్తించడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం  ఏమీ ఉండ‌దు.  రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంక‌రుడి అద్వైతం బ‌లంగా ఉండింది.  *బ్ర‌హ్మ స‌త్యం- జ‌గం మిధ్య* అనేది ఆయ‌న ప్ర‌ధాన సిద్ధాంతం. దీన్నుంచే త‌త్వ‌మ‌సి అనే భావ‌న‌ను తీసుకొచ్చాడు.  ప‌ర‌బ్ర‌హ్మ‌వు నీవే. ఈశ్వ‌రుడు, మాన‌వుడు(ఆత్మ‌) వేరే కాదు. రెండూ ఒక‌టే అనేది అద్వైతం.  జ‌గం మిధ్య అన‌డంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీక‌రించ‌లేదు.