గ్రామీణ ఉపాధి హక్కుపై ఉక్కుపాదం
1980ల నుండి ‘పనికి ఆహారం’ తదితర పేర్లతో కొనసాగిన పథకానికి 2006 సంవత్సరంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్(యుపిఎ) ప్రభుత్వం... గ్రామీణ ఉపాధి హామీ పథకంగా అమలు చేసింది. ప్రజానుకూల ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల ప్రొద్భలంతో గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో రూపుదిద్దుకుంది. 2009 సంవత్సరంలో ‘మహాత్మా గాంధీ’ పేరును పథకానికి ముందు జోడించింది. ఎం.జి నరేగా (గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రకటిత లక్ష్యపు దరిదాపులకు కూడా చేరుకోకపోయినప్పటికీ, ఎన్నో అవకతవకలు, లోటుపాట్లతో అవినీతిలో కూరుకుపోయినప్పటికీ... దేశంలోని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజానీకానికి ఏదో మేరకు ఉపశమనంగా పనిచేస్తోంది. ఈ పథకాన్ని సైతం










