దండకారణ్య సమయం

దండకారణ్య నిర్మాణ చిత్తరువు

నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల వెనుకంజ తర్వాత విప్లవోద్యమాన్ని ప్రజాపంథాలో పునర్నిర్మించడానికి అట్టడుగు స్థాయి నుంచి ప్రయత్నించిన నాయకుల్లో కటకం సుదర్శన్‌ ఒకరు. ఆనంద్‌ పేరుతో ఆయన సింగరేణి బొగ్గుబాయిల నుంచి, బస్తీల నుంచి, కళాశాలల నుంచి, పల్లెల నుంచి పని ఆరంభించి ప్రజాపంథాను సృజనాత్మకంగా ఆవిష్కరించి గోదావరి తీరం దాటించి దండకారణ్యం దాకా విస్తరింపజేశాడు. అక్కడి నుంచి వివిధ రంగాల్లో తన సహచరులతో కలిసి దేశవ్యాప్తం చేశారు. ఆచరణలో వర్గపోరాటం ఎన్నెన్ని తలాల్లో, ఎన్నెన్ని రూపాల్లో సాగడానికి అవకాశం ఉన్నదో నిరూపణ కావడానికి ఆయన అజరామర నాయకత్వం దోహదం చేసింది. ప్రత్యామ్నాయ ప్రజాఽధికారం, కింది నుంచి ప్రజాస్వామ్యం, అన్ని
దండకారణ్య సమయం వ్యాసాలు

కోత్రి వంతెన ఎవరి కోసం? 

వంద రోజులు దాటిన వెచ్చఘాట్‌ పోరాటం దేశమంతా కార్పొరేట్ల కోసం చాలా అభివృద్ధి చెందుతోంది. ఏం చేస్తే కార్పొరేట్ల దోపిడీకి విచ్చలవిడి అవకాశాలు ఉంటాయో అవన్నీ చేయడమే అభివృద్ధి అని అడుగడుగునా రుజువు అవుతోంది. కార్పొరేట్‌ సంస్థల సహజవనరుల దోపిడీ కోసం అడవులలో తలపెట్టిన పోలీసు క్యాంపులు, రోడ్డు, వంతెనలు, ఇతర నిర్మాణ పనులు, పర్యాటక కేంద్రాలు, డ్యాంలు మాకొద్ద్దంటూ ప్రజలు పోరాడుతున్నారు. ఉత్తర్‌ బస్తర్‌ (కాంకేర్‌) జిల్లా కోయిల్‌బేడ బ్లాక్‌లోకి ఛోటావెటియాపోలీసు స్టేషన్‌ పరిధిలోని కోత్రి నదిపైన వెచ్చఘాట్‌ వద్ద రూ. 15 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కాంకేర్‌ జిల్లాలోనే మరోడా అనే గ్రామం
దండకారణ్య సమయం

ఆరు రోజుల్లో తొమ్మిది మంది మహిళలు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు ముంచెత్తుతున్న ఈ వారంలో పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌లో పాలకులు పధ్నాలుగు మందిని చంపి నెత్తుటి వరదలు పారించారు. వీళ్లలో ఆదివాసులు ఎందరు? అచ్చమైన మావోయిస్టులు ఎందరు? అనే చర్చ ఆసక్తి ఉన్న వాళ్లు తేల్చుకోవచ్చు. ఈ హింసను ఖండిరచడానికి, లేదా మన రాజకీయ వ్యతిరేకతల వల్ల ఉదాసీనంగా ఉండటానికి మృతులను ఎలాగైనా గుర్తించవచ్చు. కానీ వాళ్లు మనుషులు. స్త్రీలూ పురుషులుగా చూడదల్చుకుంటే ఇప్పటికి తెలుస్తున్న వివరాల ప్రకారం తొమ్మిది మంది మహిళలు. మొదట ఘటనా వివరాలు చూద్దాం. ఆగస్టు 29వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో
దండకారణ్య సమయం

మావోయిస్టు నిర్మూలనకు మరో వాయిదా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన ప్రధాన లక్ష్యం మావోయిజాన్ని అంతం చేయడం గురించి గురించి మాట్లాడటం. ఛత్తీస్‌గఢ్‌ మాత్రమే కాదు, మావోయిజం ప్రభావం ఉన్న పరిసర ప్రాంతాల రాష్ట్ర అధికారులతో సహా వరుస సమావేశాలు నిర్వహించి చర్చించారు. అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత చివరగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కేవలం దండకారణ్య,  బస్తర్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుండి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగానే మావోయిజాన్ని నిర్మూలిస్తామని చెబుతూ అందుకు ఒక తేదీని, 2026 మార్చి కూడా ఇచ్చారు. వ్యూహాలు రచిస్తున్న తీరు, ప్రభుత్వం
దండకారణ్య సమయం

భారత రాజ్యం బస్తర్ పిల్లలను ఎలా చంపుతోంది?

రామ్లీ వయస్సు 17 సంవత్సరాలు. కానీ ఆసుపత్రిలో తన తల్లి వెనుక నిలబడిన ఆమెను చూసినప్పుడు 14 సంవత్సరాల కంటే పెద్దదానిలా అనిపించలేదు - లోతైన, సున్నితమైన కళ్ళలో తీక్ష్ణమైన  చూపుతో నిటారుగా నిలబడి ఉంది. శాలువా కప్పుకుని ఉన్న ఆమె ఆందోళనతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. నిశ్శబ్దంగా, నిశితంగా గమనిస్తోంది. అప్పుడప్పుడు చిరునవ్వులు చిందిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, బస్తర్ ప్రాంతంలోని భైరామ్‌గఢ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇచ్చిన చీటీలో ఆమె వెన్నెముక దగ్గర ఒక ‘బయటి వస్తువు’ చిక్కుకున్నట్లు మాత్రమే ఉన్నది.  ఏ వివరణా ఇవ్వని ఆ చీటీ మరొక ఆసుపత్రికి వెళ్ళమని సూచించింది. రామ్లి తల్లిదండ్రులు రాజే, విజ్జాలతో
ఇంటర్వ్యూ దండకారణ్య సమయం

“ఆపరేషన్ కగార్” సైనిక గడువు అదివాసులను అంతం చేయడానికే : సోనీ సోరి

(బస్తర్ లో ఈ రోజుల్లో ఒక మారణహోమం జరుగుతోంది. అక్కడ నక్సలైట్ల పేరుతో అర్ధ సైనిక బలగాలు పెద్ద ఎత్తున ఆదివాసీలను హత్య చేస్తున్నాయి. ఆదివాసీల భూమిని కార్పొరేట్ సంస్థలకు ఎలా స్వాధీనం చేయాలి అనేది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి అంటున్నారు. మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి మీనా కందసామి సోనీ సోరీతో మాట్లాడారు. ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూ ను ఇక్కడ అందిస్తున్నాము - ఎడిటర్) మీనా కందసామి: కార్యకర్తల అరెస్టుల పెరుగుదల గురించి నా మొదటి ప్రశ్న. మూల్‌వాసీ బచావో మంచర్ (ఎంబిఎం)
దండకారణ్య సమయం

పెట్టుబడి సంచయనంలో రక్తమొడుతున్న అడవులు

గత కొద్ది మాసాలుగా ఆపరేషన్ కగార్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎందుకింత చర్చ జరుగుతుందనే సందేహానికే తావు లేకుండా శవాల కుప్పలు జవాబులు చెపుతున్నాయి. ఇప్పటికీ నాలుగు మాసాలుగా మధ్య భారతంలోని అడవులు ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులలోని అడవులు తుపాకీ మోతలతో దద్దరిల్లుతున్నాయి. ఈ అడవులు దండకారణ్యంగా మన దేశ రాజకీయ చిత్రపటంపై అనధికారికంగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అనధికారికంగానే అత్యున్నత పోలీసు అధికారుల కనుసన్నలలో మీడియా అతి ఉత్సాహంతో ఆ అడవుల గుండా నేపాల్ సరిహద్దుల వరకు కొనసాగే రోడ్ మ్యాప్ ను రూపొందించి ఆ నడవాకు రెడ్ కారిడార్ గా
దండకారణ్య సమయం

ఆదివాసీ యువ  నేత అరెస్టు  

ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేస్తూ, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఖనిజ సంపన్న ప్రాంతానికి చెందిన ఆదివాసీ హక్కుల కార్యకర్త రఘు మిడియామిని ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను ఉపయోగించి అరెస్టు చేసింది. గోండ్ ఆదివాసీ సమాజానికి చెందిన 23 ఏళ్ల రఘుని నిన్న (ఫిబ్రవరి 27) సాయంత్రం అదుపులోకి తీసుకున్న తర్వాత ఈరోజు ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, జగదల్‌పూర్ జైలుకు పంపారు. రఘు నిషేధిత ఫ్రంట్ సంస్థకు అగ్ర నాయకుడు అని, ఈ సంస్థకు నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఉందని ఎన్‌ఐఎ ఆరోపిస్తోంది. తమ మాతృభూమిని భారత రాజ్యం కార్పొరేటీకరణ,
దండకారణ్య సమయం

మన కాలపు భగత్‌సింగ్‌తో కలిసి నిలబడటం కష్టం

ఛత్తీస్‌గఢ్‌లో 29 మందిని చంపిన సందర్భం మొదటగా, బ్రిటీష్ సామ్రాజ్యం భారతదేశంలోని మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని భగత్ సింగ్ నమ్మాడు. గుర్తుంచుకోండి, అందరూ కాదు –మెజారిటీ. బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి పెద్ద పాలులో భారతీయులు ప్రయోజనం పొందుతూండేవారు. వారికి మద్దతుగా వుండేవారు. వారే రాజులు-చక్రవర్తులు, భూస్వాములు-నవాబులు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు, పోలీసులు, సైన్యం మొదలైనవారు . బ్రిటీష్ ఉన్నతాధికారులు (బ్యూరాక్రసీ), న్యాయమూర్తులలో అధిక భాగం భారతీయులే. సైన్యంలో మెజారిటీ భారతీయులు, పోలీసులలో భారతీయులు మాత్రమే ఉన్నారు. రెండవది, భగత్ సింగ్, అతని సహచరులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకలించి పారేయాలని  నిర్ణయించుకున్నారు. శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలతో కాదు,
దండకారణ్య సమయం

బస్తర్‌లో జరిగిన నక్సల్ వ్యతిరేక చర్యలో చనిపోయినవారిలో సాధారణ గ్రామస్థులు

భద్రతా దళాలు 2017 సంవత్సరం తరువాత జరిగిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక చర్యగా చెబుతున్న ఘటనలో  బస్తర్‌లో పోలింగ్‌కు పదిహేను రోజుల ముందు, పదముగ్గురిని చంపాయి. వారిలో కనీసం ఇద్దరు ఆదివాసీ గ్రామస్థులు, వారిలో ఒకరు చెవిటి బాలిక. ఈ కథనంలో లైంగిక హింస, పోలీసు క్రూరత్వం, ఇతర రకాల హింసల ప్రస్తావనలు ఉన్నాయి కమ్లీ కుంజమ్‌కి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదు, కడుపునొప్పి, సరిగ్గా తినలేకపోతోంది. 2024 ఏప్రిల్ 2, ఉదయం 9 గంటలకు, ఆమె నేంద్ర గ్రామంలోని తన మట్టి ఇంటి వరండాలో పడుకుని, విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు  పోలీసులు ఇంట్లోకి రావడంతో భయపడి లోపలికి