దండకారణ్య సమయం

భారత రాజ్యం బస్తర్ పిల్లలను ఎలా చంపుతోంది?

రామ్లీ వయస్సు 17 సంవత్సరాలు. కానీ ఆసుపత్రిలో తన తల్లి వెనుక నిలబడిన ఆమెను చూసినప్పుడు 14 సంవత్సరాల కంటే పెద్దదానిలా అనిపించలేదు - లోతైన, సున్నితమైన కళ్ళలో తీక్ష్ణమైన  చూపుతో నిటారుగా నిలబడి ఉంది. శాలువా కప్పుకుని ఉన్న ఆమె ఆందోళనతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. నిశ్శబ్దంగా, నిశితంగా గమనిస్తోంది. అప్పుడప్పుడు చిరునవ్వులు చిందిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, బస్తర్ ప్రాంతంలోని భైరామ్‌గఢ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇచ్చిన చీటీలో ఆమె వెన్నెముక దగ్గర ఒక ‘బయటి వస్తువు’ చిక్కుకున్నట్లు మాత్రమే ఉన్నది.  ఏ వివరణా ఇవ్వని ఆ చీటీ మరొక ఆసుపత్రికి వెళ్ళమని సూచించింది. రామ్లి తల్లిదండ్రులు రాజే, విజ్జాలతో
దండకారణ్య సమయం ఇంటర్వ్యూ

“ఆపరేషన్ కగార్” సైనిక గడువు అదివాసులను అంతం చేయడానికే : సోనీ సోరి

(బస్తర్ లో ఈ రోజుల్లో ఒక మారణహోమం జరుగుతోంది. అక్కడ నక్సలైట్ల పేరుతో అర్ధ సైనిక బలగాలు పెద్ద ఎత్తున ఆదివాసీలను హత్య చేస్తున్నాయి. ఆదివాసీల భూమిని కార్పొరేట్ సంస్థలకు ఎలా స్వాధీనం చేయాలి అనేది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి అంటున్నారు. మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి మీనా కందసామి సోనీ సోరీతో మాట్లాడారు. ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూ ను ఇక్కడ అందిస్తున్నాము - ఎడిటర్) మీనా కందసామి: కార్యకర్తల అరెస్టుల పెరుగుదల గురించి నా మొదటి ప్రశ్న. మూల్‌వాసీ బచావో మంచర్ (ఎంబిఎం)
దండకారణ్య సమయం

ఆదివాసీ యువ  నేత అరెస్టు  

ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేస్తూ, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఖనిజ సంపన్న ప్రాంతానికి చెందిన ఆదివాసీ హక్కుల కార్యకర్త రఘు మిడియామిని ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను ఉపయోగించి అరెస్టు చేసింది. గోండ్ ఆదివాసీ సమాజానికి చెందిన 23 ఏళ్ల రఘుని నిన్న (ఫిబ్రవరి 27) సాయంత్రం అదుపులోకి తీసుకున్న తర్వాత ఈరోజు ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, జగదల్‌పూర్ జైలుకు పంపారు. రఘు నిషేధిత ఫ్రంట్ సంస్థకు అగ్ర నాయకుడు అని, ఈ సంస్థకు నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఉందని ఎన్‌ఐఎ ఆరోపిస్తోంది. తమ మాతృభూమిని భారత రాజ్యం కార్పొరేటీకరణ,
దండకారణ్య సమయం

ఆదివాసీ బిడ్డల నెత్తురు తాగి త్రేన్చిన మన రిపబ్లిక్!

ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా సరిహద్దులలో, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్‌ జిల్లా కలాఘర్‌ టైగర్‌ రిజర్వ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఉభయ రాష్టాల భద్రత దళాల సంయుక్త గాలింపు చర్యల్లో భాగంగా జరిగింది. జనవరి 20 తేది ఉదయం ప్రారంభమై 23 వరకు కొనసాగుతూనే ఉన్నది. ఇందులో గరియాబంద్‌ జిల్లా పోలీస్‌, సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా (కమాండో బెటాలియన్‌ ఫర్‌ రెసల్యూట్‌ యాక్షన్‌) అనే ఛత్తీస్‌గఢ్‌ లోని భద్రతా బలగాలతో పాటు ఒడిషా స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ ఎస్‌.ఒ.జి. పాల్గొన్నాయి. ఎస్‌.ఒ.జి. ఒడిషా లో ప్రత్యేకంగా నక్సల్స్‌ ఆపరేషన్స్‌లో శిక్షణ పొందిన గ్రూప్‌. ఈసారి ఒడిషాలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడి అక్కడ
దండకారణ్య సమయం

బస్తర్‍లో సమాధానం దొరకని ప్రశ్నలు 

నారాయణపుర్ జిల్లాలోని అడవుల్లో యూనిఫాం ధరించిన ఏడుగురు మావోయిస్టులను చంపినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించిన వారం తర్వాత డిసెంబర్ 19నాడు వారిలో నలుగురి  స్వస్థలం  కుమ్మంకి వెళ్లాను. అప్పటికే వారిని ఖననం చేసేసారు. వారు సాధారణ గ్రామస్తులని, మావోయిస్టులు కాదని, తమ పొలాలకు దగ్గరగా ఉన్న పొదల్లో భద్రతా బలగాలు చంపాయని వారి కుటుంబీకులు చెప్పారు. డిసెంబరు 12 నాడు కాల్పులు జరిగినట్లు పోలీసులు చెబుతున్న ప్రదేశానికి గ్రామస్థులు నన్ను తీసుకెళ్లారు. ఇది కల్హాజా-దొండెర్‌బెడా అడవుల నుంచి రెండున్నర గంటల నడకదూరంలో ఉంది. మేము ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఊహించని దుర్వాసన వచ్చింది. ముక్కు మూసుకుని దగ్గరకు వెళ్ళేసరికి,
దండకారణ్య సమయం

బీజాపూర్ హత్యాకాండపై డిజిపికి లేఖ

13 నవంబర్ 2024 డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్  విషయం: బీజాపూర్ జిల్లాలో చట్టవిరుద్ధమైన నిర్బంధాలు; చట్టాతీత హత్యలు – అన్ని నిర్బంచించిన వారిని వెంటనే  విడుదల చేయాలి; నిష్పాక్షిక విచారణను జరపాలి– సంబంధించి సర్, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయ ప్రొఫెసర్లు, ఇతర న్యాయ నిపుణుల జాతీయ సమిష్టి సభ్యులుగా, నేషనల్ అలయన్స్ ఫర్ జస్టిస్, అకౌంటబిలిటీ అండ్ రైట్స్ (నజర్) గా పిలువబడే మేము, ఛత్తీస్‌గఢ్,  బిజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు ఇటీవల, నవంబర్ 8, 2024, చేసిన చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ప్రముఖ కార్యకర్తలతో సహా
దండకారణ్య సమయం

ఛత్తీస్‍ఘడ్‍లో ప్రధాన స్రవంతి మీడియా

ప్రభుత్వం తప్పు చేస్తోంది, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు, ఎక్కడైనా ప్రమాదం జరిగింది, ఏదైనా ఘటన జరిగింది.. ఈ సమాచారాన్నంతటినీ  మీకు చేర్చేదాన్ని మీడియా అని అంటారు. ఈ మీడియానే  మీ మాటలను ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ “వార్త”ల వాళ్ళ “వార్త” ను ఇవాళ మీకు అందించాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభంగా మీరు భావించే మీడియా, మన దేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దేశం మొత్తం మీద ఇప్పుడు మీడియా పరిస్థితి ఏమిటి, సోషల్ మీడియా మాధ్యమంలో మొత్తం మాధ్యమాలతో పరిస్థితి ఏమిటి అని ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీడియా కార్పొరేట్ గుప్పిట్లో
దండకారణ్య సమయం

ఊర్మిళ @ నీతి-ఆధునిక మహిళ

ఆధునిక మహిళ రేపటి చరిత్ర రచిస్తుంది అని గురజాడ ప్యారిస్ కమ్యూన్కు బోల్షివిక్ విప్లవానికి మధ్యకాలంలో, బోల్షివిక్ విప్లవానికి సన్నిహిత కాలంలో చెప్పాడు. రష్యా, చైనా విప్లవాల కన్నా భారతదేశంలో విప్లవ విజయం ప్రపంచ పీడిత వర్గాల విముక్తికి దోహదం చేస్తుందనే ప్రామిస్ - వాగ్దానం నక్సల్బరీ చేసింది. మార్క్స్ ఆశించిన పెట్టుబడి పరాయికరణ నుంచి మానవసారం పొందే విముక్తి, లెనిన్ ఆశించిన సాంస్కృతిక విప్లవం, చైనాలో మావో తనపై తాను చేసే పోరాటంగా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ సారం నుంచి చారుమజుందార్ రచించిన స్వప్నం. చారుమజుందార్ చైనా శ్రామిక వర్గ మహత్తర సాంస్కృతిక విప్లవాన్ని బోల్షివిక్
దండకారణ్య సమయం వ్యాసాలు

లైంగిక హింస, అరెస్టులు:  ఆదివాసీ మహిళల పోరాట పటిమ

ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న అణచివేతలో పెద్ద భాగం బూటకపు ఎన్‌కౌంటర్లు. ముప్పులో ఉన్న తమ భూమి, జీవనోపాధిలపై  భద్రతా బలగాలు చేసే లక్షిత దాడులతో పాటు లైంగిక వేధింపులకు గురికావడం వల్ల మహిళలు ఈ ఘర్షణలో మరింతగా రక్షణ లేనివారిగా మారారు. సునీతా పొట్టెంని మొదటిసారి న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లోని మసకవెలుతురు వున్న ఒక ఖాళీ గదిలో కలుసుకున్నాం; 2023 అక్టోబర్. ఆదివాసీ హక్కుల కార్యకర్త అయిన ఆమెపైన  అప్పటికి "మావోయిస్ట్" అనే ముద్ర పడలేదు. సరిగ్గా మూడు నెలల క్రితం 2024 జూన్‌లో ఆమెను అరెస్టు చేశారు. మేము ఆమెను కలిసినప్పుడు – స్వేచ్ఛా, ధిక్కరణలు ధ్వనించే
దండకారణ్య సమయం

ఆరు రోజుల్లో తొమ్మిది మంది మహిళలు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు ముంచెత్తుతున్న ఈ వారంలో పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌లో పాలకులు పధ్నాలుగు మందిని చంపి నెత్తుటి వరదలు పారించారు. వీళ్లలో ఆదివాసులు ఎందరు? అచ్చమైన మావోయిస్టులు ఎందరు? అనే చర్చ ఆసక్తి ఉన్న వాళ్లు తేల్చుకోవచ్చు. ఈ హింసను ఖండిరచడానికి, లేదా మన రాజకీయ వ్యతిరేకతల వల్ల ఉదాసీనంగా ఉండటానికి మృతులను ఎలాగైనా గుర్తించవచ్చు. కానీ వాళ్లు మనుషులు. స్త్రీలూ పురుషులుగా చూడదల్చుకుంటే ఇప్పటికి తెలుస్తున్న వివరాల ప్రకారం తొమ్మిది మంది మహిళలు. మొదట ఘటనా వివరాలు చూద్దాం. ఆగస్టు 29వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో