రాజధాని రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ భారత పార్లమెంటులో తీర్మానాన్ని ఆమోదించటం, తదుపరి కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపడంతో ఇక చివరిగా రాష్ట్రపతి ఆమోదం జరిగిన తర్వాత అది చట్టబద్ధం అయిపోతుంది. ఈ సందర్భంగా పార్లమెంటులోనూ, రాష్ట్రంలోనూ వైసీపీ అధినేతతో పాటుగా ఆ పార్టీ నాయకులు అమరావతిని వ్యతిరేకిస్తూ, అందుకు ప్రతిగా గుంటూరు- విజయవాడ- మచిలీపట్నం కారిడార్ గా "మావిగాన్ "ను రాజధానిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కూడా టిడిపి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 లో హైదరాబాదును 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా










