వ్యాసాలు

బాల్జాక్ ప్రపంచంలో..

(ఇటీవల విరసం విడుదల చేసిన ముక్తవరం పార్థ సారథి  *బాల్జాక్ జీవితం - సాహిత్యం* పుస్తకానికి రాసిన ముందుమాట ) ముక్తవరం పార్థసారథి గారికి శరీరం లేదు. ఒక హోదా లేదు. అవార్డులు, రివార్డులు లేవు. పబ్లిసిటీ లేదు. ప్రచారం లేదు. ముఠాలు లేవు. సాహిత్యమే పార్థసారథి గారు. ఆయనతో మాట్లాడితే సాహిత్యం మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆయన్ని ఎరిగినవాళ్లు సాహితీ సంపదని ఎంతోకొంత సంగ్రహించకుండా ఉండరు. అందుచేతే ఎరిగినవాళ్లు, ఆయన్ని ఎరగని వాళ్లలా నడుచుకుంటారు. అయినా కించిత్తు కూడా విచారించరు. బావిలో నీళ్లు చేదకపోతే వూట తగ్గిపోతుందేమోనన్నట్టుగా, నిరంతరం ఒక ప్రవాహంలా సాహిత్యాన్ని వెలువరిస్తారు. ఆర్బిఐ లో అధికారిగా
వ్యాసాలు

సంతోషకరమైన దినాలు చెల్లిపోయాయి

మూడోసారి నరేంద్రమోదీ సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చాడు.  భారత ప్రజలు విచక్షణతో తీర్పు ఇచ్చారు. దేశంలోని రెండు కూటములకు తగిన ప్రాధాన్యతనిచ్చారు.  ఇది ఎన్నికల సమీకరణల మీద విశ్లేషణ. అయితే మొత్తానికి భారతీయుల సంతోషకర దినాలకు కాలం చెల్లింది.  నిరుద్యోగం, ఆర్థిక కుంగుబాటు భారతీయ కుటుంబాలలో సర్వసాధారణమైంది. అసంఘటిత కార్మికులలో పనిభద్రత ఒక సవాలుగా మారింది.  భారతదేశంలోని కొన్ని నగరాలలో జరుగుతున్న అభివృద్ధికి, నమూనా ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు వలస కూలీల అవసరం ఏర్పడుతుంది. దేశాన్ని   కలిపే అనేక రైళ్ళు వలస కూలీలతో నిండి ఈ మహా నగరాల వైపు  వెళుతున్నాయి.  గ్రామాలలో ఉపాధి తగ్గింది.  నరేంద్ర
వ్యాసాలు

ఇజ్రాయిల్ జైళ్ళలో పాలస్తీనా మహిళా జర్నలిస్టులు

పాలస్తీనా జర్నలిస్టులపై దాడులు ఎప్పుడూ విస్తృతంగానే జరుగుతున్నాయి. పాలస్తీనా మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ అధికారులు తరచూ "రెచ్చగొడుతున్నారనే" నేరారోపణతో  “రహస్య సాక్ష్యం” వుందని, "పరిపాలనా సంబంధ ఖైదీలు"గా జైలు శిక్షకు గురిచేస్తారు. ఈ రెండు ఆరోపణలు కూడా అబద్ధం. ఇజ్రాయెల్ నేరాలను బహిర్గతం చేయకుండా జర్నలిస్టులను అడ్డుకునేందుకు ఉద్దేశించినవే. ఇతర ఖైదీల మాదిరిగానే ఇజ్రాయెల్ జైళ్లలో జర్నలిస్టులు హింస, కొరడా దెబ్బలు, అవమానం, హింసలకు గురవుతున్నారు. అంతేకాదు, వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంపర్కమూ లేదు. 2024 జులై 11 నాటికి ఇజ్రాయెల్ జైళ్లలో ఆరుగురు పాలస్తీనా మహిళా జర్నలిస్టులు ఉన్నారు. నిత్యమూ ఇజ్రాయెల్ గార్డుల హింసకు గురవుతున్న
వ్యాసాలు

సత్యంపై గురి: గాజాలో మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు 

 పాలస్తీనా మహిళా జర్నలిస్టులకు ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రాధాన్యత లేదు; వారు కఠిన ఘర్షణ వాస్తవాలను ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న మానవతా సంక్షోభం మధ్య హింస, సామూహిక నిర్వాసిత్వం, వదలివేయబడటం వంటి తీవ్రమైన ప్రమాదాలతో వారు పోరాడుతున్నప్పుడు 8వ తేదీ వారికి ప్రాముఖ్యతలేని వేడుక అవుతుంది. తమ పనిలో వ్యక్తిగత ప్రమాదాలు ఉన్నప్పటికీ, ముందు వరుసలో నిలబడి ప్రతికూలతను తట్టుకు నిలబడేవారి  కథనాలను పంచుకోవడం, వారి బాధలకు సాక్ష్యమివ్వడం పైనే వారి దృష్టి ఉంటుంది. ముట్టడి - ప్రభావం ఏ యుద్ధంలోనైనా భయానక అనుభవాలు అనుభవించడం ఒక అసమానమైన పరీక్ష. ఏదేమైనా, ఆ యుద్ధ
వ్యాసాలు

ఖైదులో సురేంద్ర గాడ్లింగ్: అనేక క్రూరత్వాలు, వైచిత్రాలు, అన్యాయాలు

2024 జూన్ 6 నాటికి సురేంద్రను అరెస్టు చేసి ఆరేళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ ఆరేళ్లు! ఈ కాలాన్ని కొన్ని పదాల్లో వివరించడం చాలా కష్టం. ఈ ఆరేళ్లలో జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు వుండిన స్థిరత్వం, భద్రత, స్నేహితులు, బంధువులు, సంతోషాలతో  ఉన్న జీవితం అకస్మాత్తుగా పూర్తిగా మారిపోయింది. నా ఘోరమైన  పీడకలల్లో కూడా ఊహించలేనంత వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మా ఇంటిపై దాడి జరిగిన  2018 ఏప్రిల్ 17నాటి భయంకరమైన తెల్లవారుజామును నేను గుర్తుచేసుకున్నాను; సురేంద్రను తీసుకెళ్ళిన  2018 జూన్ 6 నాటి ఆ దుర్మార్గపు ఉదయం. ఇది నిజంగా జరిగిందని నమ్మడానికి నాకు చాలా సమయం
వ్యాసాలు

డ్యామ్ ఒద్దంటున్న అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు

సియాంగ్ నదిపై కట్ట తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టు ఆదివాసీల భూములను ముంపుకు గురిచేసే ప్రమాదం ఉంది. జూలై 8న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పర్యటనకు ముందు డ్యామ్ నిర్మాణ వ్యతిరేక కార్యకర్తలు యిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 22న, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా యంత్రాంగం 12 గ్రామాల పంచాయతీ సభ్యులు, పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సియాంగ్ నదిపై ప్రతిపాదిత జలవిద్యుత్ ప్రాజెక్ట్ వల్ల గ్రామాలన్నీ ప్రభావితమవుతాయి, ఈ ప్రాంత నివాసితులు సంవత్సరాలుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. టిబెట్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనది సియాంగ్. ఈ సమావేశం 10,000 మెగావాట్ల
వ్యాసాలు

“ఎన్నికల బహిష్కరణ” నినాదం – ప్రాముఖ్యత

(ఢిల్లీ నుంచి వచ్చే *నజారియా* పత్రికలో ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలో లా విద్యార్థిని రాసిన వ్యాసం ఇది . సాధారణ ఎన్నికల మీద భిన్న రాజకీయ కోణాల్లో చర్చలు  జరుగుతున్నసందర్భంలో మే 21, 2024 సంచికలో ఇది అచ్చయింది. వసంత మేఘం టీం ) ఇటీవలి సాధారణ ఎన్నికల సందర్భంగా కేరళలోని  వాయనాడ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని అనేక జిల్లాలు, ఇతర ప్రాంతాల నుండి సీపీఐ (మావోయిస్ట్) కార్యకర్తలు “ఎన్నికలను బహిష్కరించండి!” అనే నినాదంతో ప్రచారం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నినాదం వెనుక ఉన్న సంభావ్య తార్కిక కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తుంది. రివిజనిస్ట్
ఓపన్ పేజ్

భారత ప్రజాయుద్ధానికిఎల్లెలెరుగని సంఫీుభావం

ప్రపంచంలో ఎక్కడున్నా ప్రజల ఆకాంక్షలు కలుస్తాయి. మానవాళి  స్పందనలు ఉమ్మడి రూపం ధరిస్తాయి. ఒకే హృదయంలోంచి వ్యక్తమవుతాయి. చరిత్ర నిర్దేశించే లక్ష్యాలను విశాలమైన చూపులతో మారుమూలల నుంచి కూడా పోగు చేసుకుంటాయి.  విశ్వాసాలు, విలువలు, ప్రయోజనాలు భౌతిక రూపం ధరిస్తాయి. న్యాయాన్యాయ వైఖరులు ఎల్లప్పుడూ మానవీయత వైపే  నిలబడతాయి. లేకపోతే పాలస్తీనా అస్తిత్వం కోసం ప్రపంచమంతా  ఒకే గొంతుగా ఎట్లా ప్రతిధ్వనిస్తుంది? రక్తసిక్త  బస్తర్‌ అంతర్జాతీయ చైతన్యంగా ఎట్లా ప్రతిఫలిస్తుంది? దేశాల, సమూహాల ఉనికిని దురాక్రమిస్తున్న మార్కెట్‌కు, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ఎందుకు వెల్లువెత్తుతుంది? బాధితులకు ఈ ప్రపంచమంతా సంఫీుభావం ఎందుకు అందిస్తుంది? పాలస్తీనాలాగే బస్తర్‌ కూడా ఇవాళ
వ్యాసాలు

సోషలిస్టు సమాజ విజయాలు: విద్య – ఉపాధి

నేడు మన నిరుద్యోగ యువత ప్రభుత్వం ఉపాధి కల్పించమని రోడ్లపైకి వస్తే పోలీసుల లాఠీదెబ్బలు తిని చేసి జైలుకు వెళ్లాల్సి వస్తున్నది . కానీ కేవలం ఏడు దశాబ్దాల క్రితం, పూర్తిగా యిందుకు భిన్నంగా పాలన ఉన్న దేశాలు ఉన్నాయి. అంటే, మీరు పని లేదా ఉద్యోగం చేయకూడదనుకుంటే, మిమ్మల్ని అరెస్టు చేసి 'లేబర్ క్యాంపు'లో శ్రమ చేయడానికి పంపిస్తారు. మీరు పరాన్నజీవి వర్గానికి  చెందినవాళ్ళు కాబట్టి  మీరు పని చేయకూడదని అనుకుంటున్నారని భావిస్తారు. ఈ దేశాల్లో, 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలందరికీ ఉపాధి హామీ వుండింది. ఈ దేశాలను సోషలిస్టు దేశాలు అని పిలిచేవారు, ఆ
వ్యాసాలు

రోనా: జన హృదయాల్లోనిప్రతిఘటనా స్వరం

బి‌కె -16  కేసులో కటకటాల వెనుక ఉన్న కార్యకర్త రోనా విల్సన్ క్రియాశీలత ఫాసిస్టు  రాజ్యాన్ని      లక్ష్యంగా చేసుకొంది. కేరళలోని కొల్లంలో పెరిగి, 1990 ల ప్రారంభంలో న్యూఢిల్లీకి వెళ్ళిన రోనా తన అరెస్టు వరకు తన జీవితాన్ని అక్కడే గడిపాడు. దక్షిణ ఢిల్లీలోని మునీర్కా గ్రామంలో అద్దెకు తీసుకున్న ఒక గదిలో పూనే, ఢిల్లీ పోలీసుల సంయుక్త చర్యలో రోనాను అరెస్టు చేశారు. జంతుశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పొందిన తరువాత, రోనా తాను  కృషి చేయాల్సింది ఆ రంగం కాదని గ్రహించి, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌లో తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి