జీవించే హక్కు కోసం శాంతి చర్చలు
మధ్యభారత ప్రాంతం ఆదివాసీల హననానికి కేంద్రంగా మారేలా భారత ప్రభుత్వం చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను దింపి ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి చంపేస్తున్నారు. ఆపరేషన్ కగార్ 15 నెలలుగా మధ్యభారతంలో నిరంతరాయంగా కొనసాగుతూ వందల సంఖ్యలో ఆదివాసీల ప్రాణాల్ని హరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీకి మధ్య యుద్ధం సమ ఉజ్జీవుల మధ్య యుద్ధం కాకపోయినప్పటికి దశాబ్దాలుగా త్యాగాలతోనే విప్లవోద్యమాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అశేష ప్రజానీకం మద్దతు సానుభూతి కూడాగట్టడంలో విజయం సాధించారు. అది విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతాంగ శ్రేణుల నుంచి బలం వచ్చి చేకూరింది.