కార్పొరేట్ విస్తరణ – ఆదివాసీల ప్రతిఘటన
మహారాష్ట్రలోని సుర్జాగఢ్ గ్రామంలోనూ, మహారాష్ట్ర కొండలలోనూ ఆదివాసీ నిరసనకారులు, నాయకులు విపరీతమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సూర్జాగఢ్ ప్రాంతం కేంద్రంగా కార్పొరేటికరణ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో లాయిడ్ మెటల్ కంపెనీ గణితవ్వకాల విస్తరణ కోసం సత్వర కార్పొరేటీకరణకు లొంగిపోవాలని స్థానిక సముదాయాల మీద రాజ్యం – కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. నవంబర్ 20న, మహారాష్ట్రలోని సుర్జాగఢ్లోని నిరసన ప్రదేశాన్ని పారామిలటరీ బలగాలు చుట్టుముట్టి విధ్వంసం చేసాయి. ఎనిమిది మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను వారి గ్రామాల్లో గాలించి పట్టుకుని, అరెస్టుచేసి, జీపుల్లో తీసుకెళ్ళడం అనే సాధారణ పద్ధతిని వదిలేసి, హెలికాప్టర్ల ద్వారా అదే రాష్ట్రంలోని