ప్రొ. సాయిబాబా కేసులో లాయర్ల అవిశ్రాంత కృషి
మా అప్పీలు విజయవంతం అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం వుంది. సాక్ష్యాలను బూటకమని నిరూపించగలమని మాకు తెలుసు.' ఇందుకోసం ఒక న్యాయవాదుల సేన పని చేయాల్సి వచ్చింది. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, అతని సహ నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి విజయవంతమైన పోరాటం వెనుక సంవత్సరాల తరబడి జరిగిన సన్నాహాలు వున్నాయి. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్కు జూనియర్లుగా ఉన్న న్యాయవాదుల బృందం చేసిన కృషి ఆ తయారీకి వెన్నెముక. కోర్టులో వాదించిన సీనియర్ అడ్వకేట్లు.. త్రిదీప్ పైస్, ప్రదీప్ మంధ్యాన్, ఎస్పీ ధర్మాధికారిలు అయితే వారికి వివరాలందించడానికి బృందంగా పనిచేసిన న్యాయవాదులు బరుణ్ కుమార్, నిహాల్ సింగ్ రాథోడ్, హర్షల్