వ్యాసాలు

Windows to the Revolution

‘Viyyukka’, a word in Gondi language meaning morning star, is an anthology of stories written in Telugu by Maoist women revolutionaries over the past four decades. Some of these women were martyred in the cause of the revolution, while some are still continuing in it. Some were part of the movement for some years and were then either arrested or had come out of it due to various reasons. This
వ్యాసాలు

ఉజ్వల, విషాద అనంత గాథ

(ఇటీవల విడుదల అయిన రాయలసీమ విద్యావంతుల వేదిక బులిటెన్ -2 *మన రాయలసీమ* సంపాదకీయం) రాయలసీమ అనేక ఉప ప్రాంతాల ఉమ్మడి అస్తిత్వ సీమ. ఇవ్వాల్టి భౌగోళిక, పాలనా గుర్తింపులతో నిమిత్తం లేని చారిత్రక, సామాజిక, సాంస్కృతిక ప్రత్యేకతలు ప్రతి ఉప ప్రాంతానికీ ఉన్నాయి. మళ్లీ అన్నిటి మధ్య సాధారణ లక్షణాలు ఉన్నాయి.   వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో, సాంస్కృతిక వికాసంలో ఇవి కనిపిస్తాయి.   కనీసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి  వీటిని చాలా స్పష్టంగా  పరిశీలించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలోని ప్రతి ఉపప్రాంతం నిర్దిష్ట స్థానిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు తీవ్రమవుతున్నాయి.
వ్యాసాలు

“గుండె చప్పుళ్ళు”

(ఇటీవల విడుదలయిన కథా సంపుటికి రచయిత రాసిన ముందుమాట ) తెలుగు సాహిత్యంలో ఈ "ఏకలవ్య కాలనీ" మొదటి ఎరుకల కథా సంపుటి. ఇవి మా జీవితాలు. ఇవి మా ఎరుకల కథలు. ఈ దేశపు మూలవాసీల్లో, ఆదివాసీల్లో ముఖ్యమైన ఎరుకల జీవనగాథలివి. ఈ కథల్లోని మా అవమానాలు, దుఃఖాలు, మా ఓటములు, గెలుపులు, మా కన్నీళ్ళు, నవ్వులు మిమ్మల్ని మా గురించి ఆలోచించమంటాయి. ఒక భరోసా కోసం ఒక ఆసరా కోసం ఒక నమ్మకం కోసం ఒక ధైర్యం కోసం ఎదురుచూస్తున్న ఎరుకల బ్రతుకుల్లో నిజమైన మార్పు కోసమే ఈ కథలు.. 1991లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా
వ్యాసాలు

స్వీయాత్మకత నుంచి సమిష్టి ఆచరణలోకి

(ఇటీవల విడుదలైన  పాణి  నవల ‘అనేకవైపుల’కు రాసిన ముందుమాటలోంచి కొన్ని భాగాలు) అనేక ఉద్వేగాలతో పాణి రాసిన ‘అనేక వైపుల’ నవల చదవడమంటే నేర్చుకోవడమే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యుద్ధాలు, అంతర్యుద్ధాలు తీవ్రమవుతున్న వాతావరణం ఇది. సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజల మీద క్రూరమైన అణచివేత ప్రయోగిస్తున్నది. ప్రజా ప్రతిఘటన కూడా వీరోచితంగా సాగుతున్నది. మన దేశంలో యాభై సంవత్సరాలుగా ప్రజలు అన్ని రకాల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతూ యుద్ధరంగంలో ఉన్నారు. అనేక రకాల అణచివేతలకు దాటుకొని ముందుకు పోతున్నారు. ఇటువంటి ఉద్రిక్త ఉద్విగ్న హింసాత్మక వాతావరణంలో ఈ నవల రూపొందింది. ‘చదవడం అంటే నేర్చుకోవడమే. అమలు
వ్యాసాలు

ఛత్తీస్గఢ్లో ‘చట్టవ్యతిరేక’ కార్యకలాపాలు

ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం కింద ( సిఎస్‌పిఎస్ఎ) మూలవాసి బచావో మంచ్ (ఎంబిఎమ్)ని 'చట్టవ్యతిరేకమైన సంస్థ'గా ప్రకటిస్తూ 2024నవంబర్ 8 నాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది . చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ)చట్టం (యుఎపిఎ)- 1967 లాగానే, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం భావించే  సంస్థలను నిషేధించడానికి సిఎస్‌పిఎస్ఎ ప్రభుత్వానికి అధికారాన్నిస్తుంది. ఈ చర్య చేపట్టడానికి ఆ  నోటిఫికేషన్ రెండు కారణాలను పేర్కొంది: ఒకటి, "మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల "లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మంచ్ వ్యతిరేకిస్తోంది;  రెండు, తమ భూముల్లో సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తోంది.
వ్యాసాలు

బాబ్రీ వివాదంలోన్యాయం చేయని సుప్రీం కోర్టు

(ప్రసిద్ధ న్యాయవాది, రచయిత, పాత్రికేయుడు, కాలమిస్ట్, ప్రత్యేక/పత్రికా శీర్షికా రచయిత ఎ. జి. నూరానీ 2024 ఆగస్టు 29 నాడు (93 సంవత్సరాలు) మరణించారు. ఆయన మరణంతో మన దేశంలో చట్టాన్ని మాత్రమే కాకుండా, సమాజాన్ని కూడా పర్యవేక్షించే ఒక బలమైన ఆధార స్తంభం కూలిపోయింది. తన జీవితంలో ఎప్పుడూ రాజీపడని స్తంభం. జీవితాంతం తాను సృష్టించిన ప్రజాస్వామిక, లౌకికవాద విలువలకు కట్టుబడి జీవించాడు. ఎమర్జెన్సీకి, బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగానూ, కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలన్నింటిపైనా నిర్భయంగా రచనలు చేసాడు. బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా తన న్యాయవాద వృత్తి కాలంలో ఎప్పుడూ అన్యాయం చేయలేదు.
వ్యాసాలు

అబూజ్‌మాడ్‌ ‘ఆరతి’

అక్టోబర్‌ 4,2024. రాత్రి పడుకోబోయే ముందు వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే ఓ జర్నలిస్టు మిత్రుడి నుండి మెసెజ్‌ దర్శనమిచ్చింది “అబుజ్‌మాడ్‌ ఎన్‌కౌంటర్‌ గురించి ఏమైనా వివరాలున్నాయా..?” అంటూ. అతనో మీడియా సంస్థలో పనిచేస్తున్నా విషయం కన్ఫర్మ్‌ కోసం అప్పుడప్పుడు అడుగుతూ వుంటాడు. విప్లవ రాజకీయాల పట్ల సానుభూతిగా ఉంటూ, ఆ రాజకీయాలను దగ్గరి నుండి గమనిస్తుంటాను అనే కారణంతో కొంత మంది జర్నలిస్టు మిత్రులు ఏదైనా సమాచారం కోసం అప్పుడప్పుడు అడుగుతూ వుంటారు. అతని మెసెజ్‌ చూసే వరకూ అబూజ్‌మాడ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది అనే విషయమే తెలియపోవడంతో వాట్సాప్‌ గ్రూపుల్లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని ఒక్కొక్కటిగా వెతుకుతూపోయాను.
వ్యాసాలు

న్యాయవ్యవస్థను  ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా నియంత్రిస్తోంది ?

న్యాయవ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్‌  బలమైన పట్టు భారత రాజ్యాన్ని బలహీనపరచడం ద్వారా హిందూ-రాష్ట్రాన్ని సృష్టించే వారి అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో వారికి ఎలా సహాయపడుతుంది అనే అంశంపై  వివిధ పత్రికలు, సర్వేల నుండి వచ్చిన నివేదికలు వివరణాత్మక విశ్లేషణ చేసాయి. ఈ కథనం వివిధ వేదికలలో ప్రచురితమైన నివేదికలు, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందింది. న్యాయ వ్యవస్థలోని అన్ని రంగాలపై ఎబివిపి, ఇతర హిందూత్వ సంస్థలు, ముఖ్యంగా అఖిల భారతీయ న్యాయవాది పరిషత్ (ఎబి‌ఎపి)ల ఆధిపత్యం గురించిన వాస్తవాలను వ్యాసం విశ్లేషిస్తుంది. న్యాయవ్యవస్థ అనేది రాజ్యానికి ఒక సైద్ధాంతిక సాధనం; ఇది ప్రజాస్వామ్య ఆకాంక్షలకు సంబంధించి దృఢంగా ఉండాలి. అయితే
వ్యాసాలు

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ సభ(లు) జ్ఞాపకాలు కొన్ని

సిపిఐ (మావోయిస్టు) ఏర్పడి 2024 సెప్టెంబర్‌ 21 నాటికి 20 సంవత్సరాలు. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 20 వరకు నెల రోజుల పాటు ఈ రెండు దశాబ్దాల వార్షికోత్సవాలు జరుపుకోవాలని పీడిత, పోరాట ప్రజలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ శ్రేణులు, నాయకత్వం, విప్లవాభిమానులు దేశవ్యాప్తంగా ఈ 20 ఏళ్ల సభలు అమరుల స్మృతిలో నిర్వహించుకుంటారని కూడా ప్రకటించింది. ఈ 20 ఏళ్లలో 5250 మంది  పార్టీ సభ్యులు, 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది పోలిట్‌ బ్యూరో సభ్యులు అమరులయ్యారని, పార్టీ నిర్మాతలైన అమరులు కామ్రేడ్స్‌ చారుమజుందార్‌, కన్హయ్య చటర్జీతో పాటు
వ్యాసాలు దండకారణ్య సమయం

లైంగిక హింస, అరెస్టులు:  ఆదివాసీ మహిళల పోరాట పటిమ

ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న అణచివేతలో పెద్ద భాగం బూటకపు ఎన్‌కౌంటర్లు. ముప్పులో ఉన్న తమ భూమి, జీవనోపాధిలపై  భద్రతా బలగాలు చేసే లక్షిత దాడులతో పాటు లైంగిక వేధింపులకు గురికావడం వల్ల మహిళలు ఈ ఘర్షణలో మరింతగా రక్షణ లేనివారిగా మారారు. సునీతా పొట్టెంని మొదటిసారి న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లోని మసకవెలుతురు వున్న ఒక ఖాళీ గదిలో కలుసుకున్నాం; 2023 అక్టోబర్. ఆదివాసీ హక్కుల కార్యకర్త అయిన ఆమెపైన  అప్పటికి "మావోయిస్ట్" అనే ముద్ర పడలేదు. సరిగ్గా మూడు నెలల క్రితం 2024 జూన్‌లో ఆమెను అరెస్టు చేశారు. మేము ఆమెను కలిసినప్పుడు – స్వేచ్ఛా, ధిక్కరణలు ధ్వనించే