వర్తమానంలో కె. వి. ఆర్.
“మినహాయింపులెప్పుడూ ... మౌలిక వాస్తవాన్నే రుజువు చేస్తాయి” చాలా ఆసక్తికరమైన ఈ వాక్యం కె.వి.ఆర్. ఆంధ్ర సాహిత్యంలో క్షీణయుగం గురించి రాస్తూ ప్రతిపాదించారు. ఈ వర్తమానం మీద నిలబడినప్పుడు కూడా మనకు ఈ మాట ఎంతో ఆశావహంగానే కాదు చరిత్ర సరికొత్తగా పునరావృత మవుతుందన్న ఆశయాన్ని ధ్రువీకరిస్తుంది. ఈ వెలుగుల్లో ఆయన రచన 'నిశీథిని' ని పర్యాలోకిద్దాం... 1565 తల్లికోట యుద్ధం, విజయనగర సామ్రాజ్య పతనం దీనికి"ఇరుగుపొరుగు సుల్తానులే కాదు రాజ్య శరీరంలో బలిసిన విష క్రిముల వంటి అమర నాయకులు కూడా కాదనలేము". కె వి ఆర్ చెప్పిన ఈ విషయం చరిత్ర పరిణామాల్ని గుర్తించడంలో










