వ్యాసాలు

ఎప్‌స్టీన్ ఫైల్స్ .. వ్యవస్థల పతన గాథ

ఎప్‌స్టీన్‌ ఫైల్స్… సంచలనం కాదు.. వ్యవస్థల శవపరీక్ష!" జెఫ్రీ ఎప్‌స్టీన్‌... ఇది కేవలం ఒక నేరగాడి పేరు కాదు, చట్టాన్ని చుట్టచుట్టి జేబులో పెట్టుకున్న ఒక వికృత వ్యవస్థకు చిహ్నం. ఫిబ్రవరి 2026 నాటికి వెలుగులోకి వచ్చిన 6 మిలియన్ల పేజీల పత్రాలు, మనం గొప్పగా చెప్పుకునే 'నాగరిక లోకం' ముసుగును చీల్చి పారేస్తున్నాయి. ఇవి కేవలం అరాచకాల జాబితా కాదు. అధికారం ఉంటే అమానుషత్వాన్ని కూడా అలంకారంగా మార్చుకోవచ్చని నమ్మే 'ఎలైట్' వర్గాల అంతర్గత డైరీ. ధనం ముందు న్యాయదేవత కళ్లు గంతలు కట్టుకున్న వైనానికి, పెట్టుబడిదారీ సమాజం సృష్టించిన ఈ 'మృగ సామ్రాజ్యం' ఒక నిలువెత్తు
వ్యాసాలు

నాలుగేళ్ల నరమేధం.. ఆగేదెప్పుడు?

2014లో యుక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించున్నాక కూడ రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున దాడి చేసింది. దాంతో యుక్రెయిన్ త‌న శ‌క్తినంతా కూడ‌దీసుకొని ప్ర‌తిఘ‌టించ‌టం ప్రారంభించింది. ఇది 2014 నుండి కొనసాగుతున్న రష్యా  ఆధిప‌త్యానికీ యుక్రెయిన్ ఎదురొడ్డి నిలిచి చేస్తున్న‌ యుద్ధం  తీవ్రతను సూచిస్తుంది. ప్ర‌ధానంగా 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇటీవ‌లి చరిత్రలో సుదీర్ఘ యుద్ధంగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలను ఓడించడానికి సోవియట్ యూనియన్‌కు 14 వందల 18 రోజులు పట్టగా, గత నెలలోనే ఆ సమయాన్ని రష్యా-యుక్రెయిన్ యుద్ధం దాటేసింది. అప్పటి
వ్యాసాలు

షాహిద్ పునర్ధర్శనం: వ్యవస్థపైన విశ్వాసం కోసం అవిశ్రాంత అన్వేషణ

న్యాయవాది షాహిద్ అజ్మీని 2010 ఫిబ్రవరి 11నాడు (1977-2010)అతని ఆఫీసులోనే దుండగులు కాల్చి చంపారు; ఆ నిందితులు నేటికీ ఎటువంటి శిక్షా అనుభవించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 2000వ దశకంలో ముంబై పరిసర ప్రాంతాలలో జరిగిన భారీ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, పోలీసు బలగాల ద్వారా హడావుడిగా జైలుకు పంపిన క్లయింట్ల తరపున వాదించినందుకే ఆయనను చంపారని నమ్ముతారు. 1994 నాటి టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (టాడా) కింద బలహీనమైన సాక్ష్యాలతో నిందితుడిగా ఏడేళ్ల పాటు జైలు జీవితం గడిపిన అజ్మీ, ఇలాంటి కేసులను నిర్వహించడంపైన లోతైన అవగాహన పెంచుకున్నారు. జైలులో ఉన్నప్పుడే ఆయన చదువుకుని,
వ్యాసాలు

స్టోలోపిన్ నిర్బంధ కాలంలో విప్లవోద్యమం-మేధావులు

(ర‌ష్యా విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌లో 1905 తిరుగుబాటు ఓట‌మి ఘోర‌మైన అనుభ‌వం. ఉద్య‌మం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఆ స‌మ‌యంలో   ప్రతికూల మేధావులు, పార్టీ మేధావుల్లో కొంద‌రు మార్క్సిజంలోని మౌలిక భావ‌న‌ల‌కు, విప్ల‌వాచ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా త‌యార‌య్యారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని తిరగదోడే  ప్రయత్నం చేశారు.  విప్ల‌వ పంథా త‌ప్ప‌ని ప్ర‌చారం చేశారు.  మెన్షివిక్ నాయ‌కుడైన ప్ల‌హ‌నోవ్ *వారు ఆయుధాలు ప‌ట్టుకోవ‌ల‌సింది కాదు* అన్నాడు. దానికి లెనిన్ స‌మాధానం ఇస్తూ *మ‌నం సాయుధ పోరాటాన్ని మ‌రింత దృఢంగా, శ‌క్తివంతంగా నిర్వ‌హించి ఉండ‌వ‌ల‌సింది* అన్నాడు. ఆ కాలంలో తాత్విక రంగంలో త‌లెత్తిన మార్క్సిస్టు వ్య‌తిరేక వాద‌న‌ల‌ను తిప్పి కొడుతూ లెనిన్   “భౌతికవాదం- అనుభవవాద విమర్శ” అనే
వ్యాసాలు

సవర్ణ ఫాసిస్టుల దుశ్చర్యలకు వ్యతిరేకంగాబహుజనులు మేల్కోవాలి

దళిత బహుజన విద్యార్ధుల పై ఉన్నత విద్యా సంస్థలలో అమలు జరుగుతున్న కుల వివక్షను నిర్మూలించి సమానత్వ భావనలు నెలకొల్పడానికి బహుజనులు, ప్రజాస్వామికవాదులు చేసిన నిరంతర పోరాటాల ఫలితంగా దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ విద్యా కమిటీ చేసిన సిఫార్సులను ఆధారం చేసుకుని ఇంతకు ముందు యూజిసి వివక్ష పరిధిలో ఉన్న ఎస్సి,ఎస్టీలతో పాటు ఓబిసిలను కూడా ఈ సిఫార్సుల పరిధిలోకి చేర్చారు.ఒకప్పుడు దళిత బహుజనులకు విద్య నిషేదించిన మనువాద అగ్రవర్ణాలు నేడు రాజ్యాంగం ప్రకారం లభించిన రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల పట్ల అగ్రవర్ణాల విద్యార్ధులు,అధ్యాపకులు చూపుతున్న వివక్ష,వేదింపులు,దాడులు నిరంతరం జరుగుతూ,ఏటేటా
వ్యాసాలు

యు జి సి నిబంధనలు-కులవివక్ష: సుప్రీం కోర్టు దృక్కోణం

ఉన్నత విద్యాసంస్థలలో కులవివక్షతను రూపుమాపేందుకై  యుజిసి ఈ  జనవరి 14 న నియమ నిబంధనల విడుదల చేసింది. పై  వాటిపై ఉన్నత కులాలనే వారినుండి తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. అవి కేంద్రప్రభుత్వాన్ని ఇబ్బందులలో పెడుతాయని మనలాంటి వారు భావించినా, వాస్తవంలో అవి మోడీ, షా రాజకీయ ఎత్తుగడలలో భాగమని చెప్పక తప్పదు. గతంలో, 1990 లో మండల్ నివేదికకు వ్య‌తిరేకంగా అగ్రవర్ణ విద్యార్థులురోడ్డు ఎక్కిన విషయం విదితమే.  నాడు వి. పి . సింగ్,  తన పదవిని కోల్పోయేoదుకు సిద్ధమై వాటిని అమలుచేయడం, ఆ తర్వాత కమండల్ ఉద్యమం మొదలు కావడమూ మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు మోదీ,
వ్యాసాలు

పుస్తకం వల్లనే చాలా మారాను…

1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి? జ.పాఠశాల స్థాయి నుంచే తెలుగు మీద మమకారం పెంచుకున్నాను.1992 ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా రెండో అన్న హుస్సేన్ భావకవిత్వం రాసేవాడు. మా వాడి కవిత్వం రహస్యంగా చదివేవాడిని. సాహిత్యం అంటే ఏమో తెలుసుకోవాలనిపించింది. మా తెలుగు లెక్చరర్ ను అడిగితే బైపీసీ వాడికి తెలుగు సాహిత్యం తో ఏం పని అన్నారు. నీకు అభిలాష ఉంటే పుస్తకాలు బయట అద్దెకు దొరుకుతాయి అవి చదువు అన్నారు. ఇక అదే సందర్భంలో ఆదోనిలో పుస్తకాలు అద్దెకు తెచ్చుకుని చదివేవాడిని.. మొదట ఫిక్షన్, కొమ్మనాపల్లి గణపతిరావు,
వ్యాసాలు

నవతగా సులోచన

(భారత విప్లవోద్యమంలో అత్యుత్తమ విప్లవకారిణి కా. నవత అమరత్వం తర్వాత 2016 జులై లో అమరుల బంధుమిత్రుల సంఘం ప్రచురించిన పుస్తకానికి రాసిన ముందుమాట ఇది. మొదట ఈ పుస్తకం పేరు ఆదర్శవీర వనిత కామ్రేడ్ నవత. అచ్చుకు వెళ్లే క్షణాన కామ్రేడ్ అమ్మగా మారింది. ఫిబ్రవరి 5వ తేదీ గడ్చిరోలీలో జరిగిన దాడిలో నవత జీవన సహచరుడు కా. ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అమరుడయ్యాడు. ఆ ఇద్దరి స్మృతిలో ఈ వ్యాసం పునర్ముద్రణ ..వసంతమేఘం టీం) ఆరోజు కామారెడ్డిలో బస్సు దిగే సరికి ఉదయం పది గంటలైంది. అక్కడి విలేఖర్లకు ఫోన్ చేసి సంగోజివాడికి ఎలా
వ్యాసాలు

కామ్రేడ్ నవతా!

(ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ గ‌డ్చిరోలీలో జ‌రిగిన దాడిలో అమ‌రుడైన కా.ప్ర‌భాక‌ర్ అలియాస్ ప‌డ్క‌ల్ స్వామి  2016లో త‌న జీవ‌న స‌హ‌చ‌రి కా.సులోచ‌న అలియాస్ న‌వ‌త అమ‌ర‌త్వ సంద‌ర్భంగా రాసిన వ్యాసం ఇది. అప్ప‌ట్లో అమ‌రుల బంధుమిత్రుల సంఘం ప్ర‌చురించిన పుస్త‌కంలో ఇది అచ్చ‌యింది. మొద‌ట ఈ పుస్త‌కం పేరు ఆద‌ర్శ‌వీర వ‌నిత కామ్రేడ్ న‌వ‌త‌. అచ్చుకు వెళ్లే క్ష‌ణాన కామ్రేడ్ అమ్మ‌గా మారింది. కా.ప్ర‌భాక‌ర్  స్మృతిలో ఈ వ్యాసం పున‌ర్ముద్ర‌ణ.. వ‌సంత‌మేఘం టీం) నిన్ను, మన పిల్లల్ని కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఉద్యమ అవసరాల రిత్యా కొంత లేటయినా చివరికి మనందరిని కలుసుకొమ్మని మనకు ఓ మంచి అవకాశం పార్టీ
వ్యాసాలు

భావ‌జాల, సాంస్కృతిక రంగాల్లో వ‌ర్గపోరాటం

(జ‌న‌వ‌రి 24, 25 తేదీల్లో జ‌రిగిన విర‌సం 30 మ‌హా స‌భ‌ల కీల‌క ప‌త్రంలోంచి కొన్ని భాగాలు- వ‌సంత‌మేఘం టీం) ఉపోద్ఘాతం: విరసం ముప్పైవ మహా సభలకు హాజరైన కామ్రేడ్స్‌కు విప్లవాభివందనాలు. మార్క్సిజం లెనినిజం మావోయిజం   మార్గదర్శకంగా విప్లవ సాహిత్య, భావజాల, సాంస్కృతికోద్య‌మాల‌ను నిర్వహిస్తున్న విరసం ఈ మహా సభల ఇతివృత్తంగా వర్గపోరాటాన్ని ఎంచుకున్నది. వర్గపోరాటం చరిత్ర నియమమే అయినా అది నిర్దిష్ట స్థల కాలాల్లో కొనసాగుతూ ఉంటుంది. నక్సల్బరీతో మొదలైన విప్లవోద్యమ చరిత్రలోని అనుకూల, ప్రతికూల సందర్భాలన్నిటినీ విరసం తన ప్రాపంచిక దృక్పథంతో వర్గపోరాటం గీటురాయి మీద విశ్లేషిస్తూ వచ్చింది. అట్లాగే ప్రస్తుత విప్లవోద్యమ సంక్షోభాన్ని అర్థం