కొత్త కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ రాజకీయ ఖైదీలనందరినీ విడుదల చేయాలి
ఈ జూన్ 6 కు భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో జైలుకు పోయిన మొదటి ఐదుగురిలో నలుగురి జైలు జీవితం ఆరో సంవత్సరం పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఐదుగురిలో మొదటివాడుగా రోనా విల్సన్ను పేర్కొనవచ్చు. ఎందుకంటే అంతకన్నా ముందు 2018 ఏప్రిల్ 27న ఢిల్లీలో మునీర్కాలో వున్న ఆయన అద్దె గదిపై పూనే విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్ ఎసిపి శివాజీ పవార్ నాయకత్వంలో పోలీసులు రెయిడ్ చేసి ఆయన కంప్యూటర్ను , పెన్ డ్రైవ్లను, యితర ఎలక్ట్రానిక్ పరికరాలను, పుస్తకాలను ఎత్తుకపోయారు. మిగతా ఐదుగురిలో సుధీర్ ధావ్లే (రిపబ్లికన్ ప్యాంథర్స్ వ్యవస్థాపకుడు) ఉంటున్న










