ఇంటర్వ్యూ

రచయిత తన రచన పట్లనిర్మమకారంగా ఉండాలి

మహమూద్‌ నాకెంతో ఇష్టమైన కవుల్లో ఒకడు. ఆ మాటకొస్తే సొంత ఊరు వాడు కాబట్టి ఇంకాస్త ఎక్కువే ఇష్టం. మహమూద్‌ని నేను మొదటి సారి 1999 -2000 ప్రాంతంలో  ప్రొద్దుటూరుకు వెతుక్కుంటూ వెళ్లి కలిశాను. అప్పటి నుంచి నాకు అతనితో సాన్నిహిత్యం ఉంది. నాకు మహమూద్‌ అంటే మిత్రజ్యోతి సంస్థ వ్యవస్థాపక సభ్యుడు.  “సీమ కవిత’’ సంకలనం ఎడిటర్‌. “మిష్కిన్‌’’ కథా రచయిత. ఇప్పుడు “ఆస్మాని’’ కవి.కవిగా, కథకుడిగా, కార్యనిర్వాహకుడిగా సీమ సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేసినవాడు. అక్కడి ఒక తరానికి స్ఫూర్తినిచ్చినవాడు. క్షణం క్షణం పొట్ట తిప్పల కోసం పాకులాడుతూనే మరోవైపు తాను పుట్టిన గడ్డ కోసం, సమాజం కోసం పరితపించినవాడు. కీర్తి కోసం కాకుండా
ఇంటర్వ్యూ

కశ్మీర్ ఒక ప్రయోగశాల

(2023 మే 2న, కశ్మీర్‌లో లోయలో రాజ్యహింసకు పాల్పడుతున్న ఒక ప్రసిద్ధ జర్నలిస్టును రెజాజ్ ఎం షీబా సైదీక్ ఇంటర్వ్యూ చేశారు. భారత ప్రభుత్వం నుండి రాబోయే పరిణామాలను ఊహించిన ఆ జర్నలిస్ట్ తన పేరు బయటపెట్టవద్దని అంటే అతనికి "ఫ్రీడమ్" (స్వేచ్ఛ) అని పేరు పెట్టాం. హడావిడిగా తీసుకున్న ఈ చిన్న ఇంటర్వ్యూ వెనుక ఉన్న రాజకీయ కారణాన్ని తన పేరును అజ్ఞాతంగా వుంచాలనే అతని అభ్యర్థన నుండి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అనామకతను పిరికితనం అనే  దృష్టితో చూడలేం. కానీ "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో" వున్న"ప్రజాస్వామ్యం- స్వాతంత్ర్యాల "వాస్తవాన్ని, భారతదేశ ప్రధాన భూభాగంలోనూ, కశ్మీర్‌లోనూ
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజాస్వామ్యంలోనూ ఫాసిజం వస్తుంది

- సిద్ధికీ కప్పన్‌, రైహానాలతో ఇంటర్వ్యూ  (సిద్ధికీ కప్పన్‌ 43సంవత్సరాల వయసున్న మళయాళీ జర్నలిస్టు. కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ ఢల్లీి శాఖకు కార్యదర్శి. ఆయన్ను 5 అక్టోబర్‌ 2020న ఉత్తరప్రదేశ్‌లోని మథుర టాల్‌ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఇద్దరు విద్యార్థి కార్యకర్తలు అతికూర్‌ రహ్మన్‌, మసూద్‌ అహ్మద్‌, డ్రైవర్‌ మొహ్మద్‌ ఆలంను కూడా నిర్బంధించారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ అనే గ్రామంలో నలుగురు అగ్రకుల ఠాకూర్‌లు ఒక దళిత బాలికమీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో నిజనిర్ధారణకోసం ఆ గ్రామానికి వెళుతుండగా ఈ అరెస్టులు జరిగాయి. కప్పన్‌పై ఊపా, పియమ్‌ఎల్‌ఏ లతో సహా అనేక ఇతర
ఇంటర్వ్యూ

చరిత్రను తిరగ రాయడం  వీరోచితం అనుకుంటున్నారా ?

గణేష్‌ నారాయణ్‌ దేవి జ్ఞానానికి, శక్తికి మధ్య వుండే సంబంధం గురించి పరిశోధిస్తూ అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించారు. మానవ చరిత్రలో శిష్టవర్గాలు, జ్ఞానాన్ని నిర్వచిస్తూ దానిపై గుత్తాధిపత్యాన్ని ఎలా సాధించారో ఆయన వివరించారు.  ఆయన గుజరాత్‌లోని వడోదరా (బరోడా)లో ‘‘భాషా రీసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్‌ సెంటర్‌’’ను, తేజ్‌ఘర్‌లో ‘‘ఆదివాసీ అకాడమీ’’ని స్థాపించారు.  2010లో ఆయన నాయకత్వంలో జరిగిన ‘‘భారతదేశంలో ప్రజల భాషల సర్వే’’ నేటికీ సజీవంగా వున్న 780 భారతీయ భాషలను రికార్డు చేసింది. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్టు, సార్క్‌ దేశాల సాహిత్య అవార్డు, ప్రిన్స్‌ క్లాస్‌ (PrinceClaus)1 అవార్డు, అంతర్జాతీయ లింగ్వాపాక్స్‌ బహుమతి (
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజల్లోకి వెళ్లి రాసాను

(ప్రముఖ సాహిత్య, జీవిత చరిత్రల పరిశోధకుడు డా. కె ముత్యం *శ్రీకాకుళ విప్లవోద్యమం - తెలుగు సాహిత్యంపై ప్రభావం* అనే అంశంపై 1984 - 90 మధ్య పరిశోధన చేశారు. ఆ సందర్భంగా ఆయన శ్రీకాకుళ విప్లవోద్యమంతో, ఆ  సాహిత్యంతో  పరిచయం ఉన్న అనేక మందిని కలిశారు. వారి అభిప్రాయాలు సేకరించారు. వాటిని ఇటీవల ముత్యం  వెలుగులోకి తెచ్చారు. ఎక్కడా అచ్చుకాని అభిప్రాయాలు ఇవి. ఇందులో ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ 9-3- 1987  కె ముత్యంతో పంచుకున్న అనుభవాలు పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) 1. శ్రీకాకుళం ప్రాంతమంతా మీరు కలెదిరిగారు
ఇంటర్వ్యూ సంభాషణ

 అవును. ఈరోజు యుధ్ధ పరిస్థితి వుంది” – హిమాంశు కుమార్

'ఆసియన్ స్పీక్స్' , 'అరోరా ఆన్‌లైన్' కోసం రెజాజ్ ఎం షీబా సిదీక్ 2022 ఆగస్టు 26న గాంధేయవాది, మానవ హక్కుల కార్యకర్త హిమాంశు కుమార్‌ను ఎర్నాకులంలో ఇంటర్వ్యూ చేశారు. యుఏ(పి)ఏకి వ్యతిరేకంగా జరిగిన మానవహక్కుల సదస్సులో ప్రసంగించేందుకు హిమాంశు కుమార్ కేరళకు వచ్చారు.  సుమారు ఒక గంటసేపు జరిగిన సంభాషణలో హిమాంశు భగత్ సింగ్ మాటలను ప్రతిధ్వనించారు, “భారతదేశ శ్రామిక ప్రజానీకాన్ని, సహజ వనరులను కొన్ని పరాన్నజీవులు దోపిడీ చేస్తున్నంత కాలం యుద్ధస్థితి ఉనికిలో ఉంది, ఉంటుంది. వారు పూర్తిగా బ్రిటిష్ పెట్టుబడిదారులు లేదా మిశ్రణ బ్రిటీష్-ఇండియన్ లేదా పూర్తిగా భారతీయులు కావచ్చు”.  గోంపాడ్ ఊచకోతపై స్వతంత్ర దర్యాప్తును కోరినందుకు
ఇంటర్వ్యూ

మత రహిత , కుల రహిత అస్తిత్వం  కోసం.. 

1.నో కేస్ట్ నో రెలిజియన్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది.. ?    మీ ప్రశ్న చిన్నదే ..  అయితే  ఈ ప్రయత్నం వెనక ఒక  పెద్ద ప్రయాణం ఉంది..  ఈ ఆలోచన వెనక   నా/ మా   జీవిత సంఘర్షణ  ఉంది.  అందువల్ల  కొద్దిగా  ఆ నేపథ్యం  చెప్పాలి.. వీలయినంత సంక్షిప్తంగా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.   నా చిన్నతనం అంటే హై స్కూల్ / 10వ తరగతి వరకు  నేను ఒరిస్సా   రాష్ట్రంలోని  సుందరగడ్  జిల్లా బండముండ అనే ఊరిలో  చదువుకున్నాను.  మా నాన్న దువ్వూరి వీర వెంకట సత్య సూర్య దుర్గా ప్రసాద్ రామారావు , అమ్మ 
ఇంటర్వ్యూ నా క‌థ‌తో నేను

నిల‌దీసే క‌థ‌లు అవ‌స‌రం

1. కథలోకి ఎలా వచ్చారు? జ. మాది ఏ నీటి అదరుపూ లేని మారుమూలన ఉండే మెట్ట ప్రాంతం. నిత్యం కరువుతో పోరాడుతూనే. కథలతో కాలక్షేపం చేస్తూ ఎప్పటికప్పుడు జీవితేచ్ఛను రగిలించుకోవడం మా ప్రాంత లక్షణం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం, మా అమ్మ ఈశ్వరమ్మ అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న రెడ్డెప్పాచారి కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి మంచి కథకులు. మా ఊళ్లో కాదరిల్లి తాత, బడేసాబ్ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి
ఇంటర్వ్యూ

వ్య‌క్తి స్వేచ్ఛలేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీకి అవ‌కాశ‌మే లేదు

ప్రొ. ప‌ద్మ‌జా షా (ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోయే రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తీవ్రంగానే ప్ర‌భావితం చేస్తాయ‌ని ప్రొ. ప‌ద్మ‌జాషా(జ‌ర్న‌లిజం విభాగం, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం) అంటున్నారు. ఇండియాలో లిబ‌రల్ డెమోక్ర‌సీ పాదుకొన‌డానికి అవ‌కాశం లేని సామాజిక ఆర్థిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.  వ్య‌క్తి స్వేచ్ఛ లేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీ ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆమె ఇంట‌ర్వ్యూ పాఠ‌కుల కోసం..వ‌సంత‌మేఘం టీం) 1. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఫాసిస్టు తీవ్రతను ఎట్లా అంచనా వేయవచ్చు? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బట్టి పరిణామాలు ఉంటాయి. మళ్ళీ ఫాసిస్ట్ శక్తులు పెద్ద ఎత్తున గెలిచి వస్తే దేశంలో చాలా
ఇంటర్వ్యూ సంభాషణ

రాజ్యాంగాన్ని విమ‌ర్శ‌నాత్మ‌కంగా చూడాలి

(భార‌త రాజ్యాంగానికి ఈ వ్య‌వ‌స్థ‌ను య‌థాత‌ధంగా ప‌ట్టి ఉంచే స్వ‌భావం ఉంద‌ని ఎన్ వేణుగోపాల్ అంటున్నారు. రాజ్యాంగంలోని ఉన్న ప్ర‌జానుకూల ఆద‌ర్శాలు అమ‌లు కాగ‌లిగే స్థితిలో మ‌న రాజ‌కీయార్థిక, సాంఘిక వ్య‌వ‌స్థ లేద‌ని అంటున్నారు. కాబ‌ట్టి రాజ్యాంగాన్ని మొత్తంగా నెత్తికెత్తుకోవ‌డ‌మో, తిర‌స్క‌రించ‌డ‌మోగాక విమ‌ర్శ‌నాత్మ‌కంగా ఉండాల‌ని ఈ ఇంటర్వ్యూలో అంటున్నారు..వ‌సంత మేఘం టీం) 1. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అన‌గానే ఇంత ప్ర‌తిస్పంద‌న ఎందుకు వ‌స్తోంది? రాజ్యాంగాన్ని మార్చాలని కె సి ఆర్ స్పష్టంగానే అన్నప్పటికీ అన్న సందర్భం మాత్రం కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పెత్తందారీ వైఖరిని ఖండించే సందర్భం. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య