ఇంటర్వ్యూ

ప్రమాదకరమైనా సరే అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందే

(దశాబ్ద కాలం తరువాత ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు నిర్దోషిగా విడుదలైన్ హేమ్ మిశ్రా తన జైలు శిక్ష, విచారణ, అనుభవాల గురించి ‘అవుట్ లుక్’కు చెందిన విక్రమ్ రాజ్ తో మాట్లాడారు) హేమ్ మిశ్రా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు 2013 లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మొదటిసారి అరెస్టు చేసారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు కొరియర్గా పనిచేశాడని, దేశంపై యుద్ధం చేస్తున్నాడని అభియోగాలు మోపారు. 2017మార్చి 7నాడు గడ్చిరోలి సెషన్స్ కోర్టు హేమ్, మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2024మార్చి 5నాడు బాంబే హైకోర్టు-నాగ్పూర్ బెంచ్ ఈ కేసులో హేమ్, మరో
ఇంటర్వ్యూ

మత రహిత , కుల రహిత అస్తిత్వం  కోసం.. 

1.నో కేస్ట్ నో రెలిజియన్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది.. ?    మీ ప్రశ్న చిన్నదే ..  అయితే  ఈ ప్రయత్నం వెనక ఒక  పెద్ద ప్రయాణం ఉంది..  ఈ ఆలోచన వెనక   నా/ మా   జీవిత సంఘర్షణ  ఉంది.  అందువల్ల  కొద్దిగా  ఆ నేపథ్యం  చెప్పాలి.. వీలయినంత సంక్షిప్తంగా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.   నా చిన్నతనం అంటే హై స్కూల్ / 10వ తరగతి వరకు  నేను ఒరిస్సా   రాష్ట్రంలోని  సుందరగడ్  జిల్లా బండముండ అనే ఊరిలో  చదువుకున్నాను.  మా నాన్న దువ్వూరి వీర వెంకట సత్య సూర్య దుర్గా ప్రసాద్ రామారావు , అమ్మ 
ఇంటర్వ్యూ

పదముగ్గురు నక్సలైట్ల ఎన్‌కౌంటర్ బూటకమేనా?

(నిజ నిర్థారణకు వెళ్ళి వచ్చాక బస్తర్ జంక్షన్ అనే యూ ట్యూబ్ ఛానెల్ తో సంభాషణ. హిందీ  వీడియోకి తెలుగు అనువాదం) బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఘటనా స్థలం నుంచి ఎల్‌ఎమ్‌జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయి నివేదిక కూడా చేశాం.. మీరు మా గత నివేదికలు చూడవచ్చు. ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సందేహాలు తలెత్తుతున్నాయి, పోలీసుల వ్యవహార శైలి, వారి వాదనలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి, పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి, ఈ ప్రశ్నలు
ఇంటర్వ్యూ

ఉపా లేకుంటే ఈ రాజ్యం మ‌నుగ‌డ క‌ష్ట‌మే

దేశ‌మంతా ఉపా విస్త‌రిస్తోంది. ఎవ‌రి మీదైనా చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద కేసు పెట్ట‌వ‌చ్చు. ఎవ‌రి మీదికైనా ఎన్ఐఏ అనే ద‌ర్యాప్తు సంస్థ వెళ్ల‌వ‌చ్చు. ఇదంతా కాక‌తాళీయంగా జ‌రుగుతున్న‌ది కాద‌ని, దీని వెనుక భార‌త రాజ‌కీయార్థిక వ్య‌వ‌స్థ‌లోని సంక్షోభాలు, ప్ర‌జా పోరాటాల ఒత్తిళ్లు  ఉన్నాయ‌ని, యుఏపీలే లాంటి పాసిస్టు చ‌ట్టాలు లేకుంటే భార‌త రాజ్యం మ‌నుగ‌డ సాధ్యం కాని ప‌రిస్థ‌తి ఏర్ప‌డింద‌ని పౌర‌హ‌క్కుల నాయ‌కుడు చిలుకా చంద్ర‌శేఖ‌ర్ అంటున్నారు.  1) యుఏపీఏ చట్టం తీసుకుని రావటం వెనుక ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం ఏమిటి ?   ప్రభుత్వాలు తమ రాజకీయ సుస్థిర‌త  కోసం చట్టాలను చేస్తూ ఉంటాయి. ఈ
ఇంటర్వ్యూ

యూఏపీఏను రద్దు చేయాలి  – ఇందిరా జైసింగ్

( ప్రొ.జి.ఎన్.సాయిబాబా, అతని తోటి నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై ట్వీట్ చేసిన వారిలో మొదటివారు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల నుండి, విప్లవ కవి వరవరరావు (భీమా కోరేగావ్ కేసులో నిందితులు, 2021లో బెయిల్ వచ్చింది) మొదటి మహిళా అదనపు సొలిసిటర్ వరకు, ప్రాథమిక హక్కులను కోల్పోయిన వారి కోసం అనేక న్యాయ పోరాటాలు విజయవంతంగా చేయడంలో ఆమె గుర్తింపు పొందింది.   1986 మేరీ రాయ్ కేసు, 1999 గీతా హరిహరన్ కేసు వంటి మహిళల వివక్షకు వ్యతిరేకంగానూ, జనరల్ కేసులను కూడా చేసారు. ఆనంద్ గ్రోవర్‌తో పాటు, ఆమె ఆన్‌లైన్
ఇంటర్వ్యూ నా క‌థ‌తో నేను

నిల‌దీసే క‌థ‌లు అవ‌స‌రం

1. కథలోకి ఎలా వచ్చారు? జ. మాది ఏ నీటి అదరుపూ లేని మారుమూలన ఉండే మెట్ట ప్రాంతం. నిత్యం కరువుతో పోరాడుతూనే. కథలతో కాలక్షేపం చేస్తూ ఎప్పటికప్పుడు జీవితేచ్ఛను రగిలించుకోవడం మా ప్రాంత లక్షణం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం, మా అమ్మ ఈశ్వరమ్మ అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న రెడ్డెప్పాచారి కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి మంచి కథకులు. మా ఊళ్లో కాదరిల్లి తాత, బడేసాబ్ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి
ఇంటర్వ్యూ సంభాషణ

మమత ఫాసిస్టు వ్యతిరేకి కాదు

1. బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుగు ప్రాంతాల్లోని కొందరు వామపక్ష మేధావులు  కూడా  మమతకు  జేజేలు పలుకుతున్నారు. ఈ విషయం వింటే మీకేమనిపిస్తోంది? ఇది ప్రతిచోటా జరుగుతోంది. బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు ఆమెను ఎంతో గౌరవంతో, ఆపేక్షతో చూస్తున్నాయి. ఈ ఎన్నికల విజయం ఆమెను ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యమైన వ్యక్తిగా మార్చింది అనడంలో సందేహం లేదు. కొంతమంది ‘వామపక్ష’ మేధావులు మమతకు జేజేలు పలుకుతున్నారు లేదా జనాకర్షణ పొందిన రాజకీయాలను ముందుకు వెళ్ళే అంతిమ మార్గంగా సిద్ధాంతీకరించడం కొత్తేమీ కాదు. బెంగాల్‌లో చాలా మంది ‘వామపక్ష ’ మేధావులు నిజమైన “అట్టడుగు వర్గాల (సబల్టర్న్)” పార్టీగా
ఇంటర్వ్యూ సంభాషణ

హక్కుల భావజాలాన్ని హిందుత్వ అంగీకరించదు

1. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులను హక్కుల నాయకుడిగా ఎలా చూస్తున్నారు? వామపక్ష భావాలుగల మేధావుల పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్న బిజెపి రాజ్యాంగ సూత్రాలకు దూరంగా వెళ్లిపోయింది. ప్రజాస్వామ్య ప్రాతిపదికన పరిపాలనను తిరస్కరించి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలపరంగా పరిపాలన సాగించాలనుకోవడం సమస్యకు మూలం. పరిపాలన పరంగా భారత రాజ్యాంగానికి, హిందుత్వ భావజాలానికి మధ్య వున్న తేడాను బిజెపి చెరిపివేసింది. దీని వల్ల సమాజం చాలా నష్టపోతున్నది. తనకు నచ్చని భావజాలంతో వున్న వారిపై దాడులకు దిగుతోంది. మనుషుల విశ్వాసాలను ప్రమాణంగా తీసుకొని వేరు చేస్తుంది. వేరైన వారిని ఏరివేయాలని పరితపిస్తోంది. అందుకు గాను జాతీయ దర్యాప్తు
ఇంటర్వ్యూ

పిటిషన్ల కన్నా సమిష్టి పోరాటం ముఖ్యం

 (స్వలింగ వివాహాలను స్పెషల్ మ్యారేజి యాక్ట్ ప్రకారం గుర్తించాలని  కోరుతూ  ట్రాన్స్ జెండర్  సమూహం  పిటిషన్ ల పై సుప్రీం కోర్ట్ ఇటీవల స్పందిస్తూ .. దీని మీద పార్లమెంట్  చట్టం చేయాలని ప్రభుత్వానికి చెప్పింది. దీనిపై   కృషాణు (krishanu)  అనే క్వియర్  స్పందన ఇది)    1. ఈ తీర్పు పై మీ ప్రతి స్పందన ఏమిటి ? చాలా నిరాశ కు గురయ్యాను  కానీ , ఇలా  జరగదని  నేను అనుకోలేదు. 2. ఇప్పటి వరకు  ఈ సమస్య తెలియని  పాఠకుల కోసం  ఈ పిటిషన్ నేపథ్యాన్ని కాస్త  వివరిస్తారా .. 2020 లో  క్వీర్ జంటలు
ఇంటర్వ్యూ

వ్య‌క్తి స్వేచ్ఛలేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీకి అవ‌కాశ‌మే లేదు

ప్రొ. ప‌ద్మ‌జా షా (ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోయే రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తీవ్రంగానే ప్ర‌భావితం చేస్తాయ‌ని ప్రొ. ప‌ద్మ‌జాషా(జ‌ర్న‌లిజం విభాగం, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం) అంటున్నారు. ఇండియాలో లిబ‌రల్ డెమోక్ర‌సీ పాదుకొన‌డానికి అవ‌కాశం లేని సామాజిక ఆర్థిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.  వ్య‌క్తి స్వేచ్ఛ లేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీ ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆమె ఇంట‌ర్వ్యూ పాఠ‌కుల కోసం..వ‌సంత‌మేఘం టీం) 1. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఫాసిస్టు తీవ్రతను ఎట్లా అంచనా వేయవచ్చు? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బట్టి పరిణామాలు ఉంటాయి. మళ్ళీ ఫాసిస్ట్ శక్తులు పెద్ద ఎత్తున గెలిచి వస్తే దేశంలో చాలా