భారత రాజ్యాంగం తన విముక్తి వాగ్దానాలను నెరవేర్చిందా?
స్వేచ్ఛా భారత రాజ్యాంగ భావనలపై ప్రముఖ మేధావులు రాసిన పదకొండు చిన్న వ్యాసాల పరంపరలో చివరి పుస్తకాన్ని రాసేందుకు ఆనంద్ తేల్తుంబ్డేను ఆహ్వానించడం సముచితమని మేము భావించాము. ఆయన భారతదేశపు అత్యంత గౌరవనీయ మేధావులలో ఒకరు. ఇటీవలే ‘మనస్సాక్షి’ ఖైదీ (prisoner of conscience) గా ఆయన జైలు జీవితం అనుభవించారు. మేము తీసుకు వచ్చిన ఈ పుస్తక పరంపరలో రాజ్యాంగాన్ని నాయకులు ఎలా ఊహించారు, ఎలా చర్చించారు, ఎలా రచించారు అనే అంశాలను మేము పరిశీలించాము. అలాగే లౌకికత్వం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగ దృక్పథాన్ని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సమాఖ్య వ్యవస్థ, శాస్త్రీయ దృక్పథం










