ఫాసిస్టు క్రమాల పరిశీలన
పెట్టుబడి తోపాటు ఆవిర్భవించిన ఆధునిక యుగంలోని రాజకీయాలకు రెండు తీవ్ర అంచులు ఉంటాయి. ఒకటి బూర్జువా ప్రజా స్వామ్యం, రెండు అత్యంత ప్రగతి నిరోధక ఫాసిజం. పెట్టుబడిదారీ రాజకీయాలు ఈ రెండు అంచుల ద్వంద్వం మధ్యనే లోలకంలా కొనసాగుతాయి. పెట్టుబడి కి ఉన్న స్వభావం వల్ల నే వలస రూపంలో ప్రపంచమంతటా విస్తరించింది. ఈ క్రమంలోనే దేశ దేశాలలో ప్రజలు సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రత్యక్ష వలస పెట్టుబడిదారీ విధానం అంతమై పరోక్ష వలస పెట్టుబడిదారీ విధానం మొదలైంది. పెట్టుబడి ద్రవ్య పెట్టుబడి గా బలపడినాక దాని పని విధానం మారించి. దాని