జోలెకు
అటు అతడు
ఇటు నేను..

మా ఇద్దరి మధ్య
జోలె పెరు ఆకలి..

అల్యూమినియం బిళ్ళ కోసం
ఇద్దరిని దేహీ అంటూ అడిగింది
దేశ భవిష్యత్తు..

జోలెకు అటువైపు వ్యక్తి..
ప్రభువు దుఃఖంతో నిండిన
దరిత్రి మీదికి వస్తున్నాడని చెప్పాడు..
ఇటు వైపు నేను..
వస్తే ఛిద్రమైతూ
మన
మద్యున్నా ఈ దేశ భవిష్యత్ తో మాట్లాడే ధైర్యం చెయ్యమన్నాను..

రాం, రహీం,జీసస్
ఎవరచ్చిన అంగట్లో
అర్థకలితో,ఆర్తితో పోటీపడుతున్న
భవిష్యత్ భారతవనిని పలకరిస్తారా..?
అంతటి ధైర్యం చేస్తారా..?


(కరీంనగర్ బస్ స్టాండ్ లో జోలెతో ఉన్న చిన్నారితో ఎదురైనా సంఘటన పై)

21/01/2022

Leave a Reply