సాహిత్యం కవిత్వం

ఏది ప్రజాస్వామ్యం

శవాలపైన భవంతులు కట్టిబంగారు పళ్ళెంలోపంచభక్ష్య పరమాన్నాలు తినేదొరలుగల్ల దేశంలోఏది ప్రజాస్వామ్యం రెడ్ కార్పెట్ వేసికుక్కల్ని పిలిచితల్లి దేహాన్నిముక్కలుగ నరికివిందునేర్పరిచేగుంట నక్కలున్నఈ రామ రాజ్యంలోఏది ప్రజాస్వామ్యం సైన్సును సాగిలబడేసినాన్ సైన్స్నునాన్సెన్స్లచేతుల బెట్టిననపుంసకులెలేఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం ప్రశ్నించేప్రజాస్వామ్యంఅని చెప్పిఉపా చట్టాలు బెట్టిఅండా సెల్లులోజీవితాలనుఅంధకారంచేస్తున్న ఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం మూడత్వంమురుగు నీటిలోదైవత్వందయా దక్షిన్యాలతోఉపొంగుతూ ప్రవహిస్తున్నశవాల కాల్వలున్నఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం
కాలమ్స్ సమకాలీనం

తబ్లీగీ జమాత్ కరోనా జిహాద్ అయితే మరి కుంభమేళా?

"కరోనా ఆయా౼ మౌలానా లాయా" అనే వ్యంగ్యపూరితమైన, అపహాస్యమైన, అవమానకరమైన, నేరారోపణతో కూడిన ఈ మాటలు గత సంవత్సరం సామాజిక మాధ్యమాలల్లో ప్రదానంగా ఉత్తర భారతంలో ఎక్కువగా వినిపించినవి. కరోనా చైనా సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చుట్టేసే తరుణంలో అంతటా అలుముకున్న భయం భారతదేశం లోను విస్తరించింది. మునుపెన్నడూ చూడని ఒక మహా విపత్తు  అన్ని దేశాలను వణికించింది. యూరప్ లో అతి వేగంగా విస్తరించి, అమెరికాను ముంచెత్తిన కరోనా ఇండియా ను చేరడానికి పెద్దగా ఆలస్యమేమి చేయలేదు. ప్రపంచ వైద్య రంగం ఎన్నడూ ఎరుగని, అంతుపట్టని అదృశ్య జీవి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆ
కాలమ్స్ కథావరణం

“దుఃఖానికి ఆసరా మనిషే!-అంటున్న కథ

ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. మనిషి లోపలి ఒంటరితనాల గురించి, బాహ్యప్రపంచంలో మనిషి ఎదుర్కొనే  ఒంటరితనాల గురించిన కథలు మనల్ని కల్లోల పరుస్తాయి. కలవర పెడతాయి. అప్పటిదాకా రాని ఆలోచనలు ఇలాంటి కథలు చదివితే కొత్తగా పుట్టుకు వస్తాయి. ఏవో ఖాళీలు, ఏవో అంతరాలు, మరేవో అడ్డుగోడలు ఒక్కసారిగా కథలో కనిపిస్తాయి. అవన్నీ అంతకు ముందు మనం చూసినవే, అయినా చూసినా  నిజంగా చూడలేనివి. అప్పటిదాకా చూసినదాన్నే, చూసినా చూడలేని దాన్నే కొత్తగా చూపించేవే మంచి కథలు. నడవడం స్థానంలో పరిగెత్తడం మొదలయ్యాక వేగం పెరిగాక, మనుషులకు దూరంగా మనుషులు కదలటం మనుషులు దూరంగా మనుషులు వెళ్లిపోవడం చాలా