కరపత్రాలు

విర‌సం 30వ  మహాసభలు – భావజాల, సాంస్కృతిక  రంగాల్లో వర్గపోరాటం

2026 జనవరి 24-25, సుందరయ్య విజ్ఞానకేంద్రం,"బాగ్‍లింగంపల్లి, హైదరాబాద్‍. నక్సల్బరీ ఉద్యమం భారతదేశ ప్రజా రాజకీయాల్లోకి వర్గపోరాటాన్ని తీసుకొచ్చింది. వర్గపోరాట అత్యున్నత రూపంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను పీడిత వర్గానికి అందించింది. ఒక సమగ్ర పోరాట మార్గంగా ప్రజా జీవితంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. నక్సల్బరీ ప్రజ్వలనలో పుట్టిన విప్లవ రచయితల సంఘం భావజాల, సాంస్కృతిక  రంగాల్లో వర్గపోరాట రాజకీయాలను ఆచరిస్తోంది. తన సృజనాత్మక రచనతో, విశ్లేషణతో ముందుకు తీసుకపోతోంది.  వర్గపోరాటం ఒక చారిత్రక నియమమే అయినా, అది  నిర్దిష్ట స్థల కాల రూపాల్లో కొనసాగుతుంది. తక్షణ, దీర్ఘకాల సామాజిక పరిణామాలను వ్యక్తులు గ్రహించలేకపోయినా మానవ సమాజం వర్గపోరాటం మీదే
కరపత్రాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర‌హక్కుల సంఘం 20వ రాష్ట్ర మ‌హాస‌భ‌లకు రండి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర‌హక్కుల సంఘం 20వ రాష్ట్ర మ‌హాస‌భ‌లకు రండి జ‌న‌వ‌రి 10, 11 2026, తిరుప‌తి ప్ర‌జలారా!          ఎవరి హక్కుల కోసం మరెవ్వరూ గొంతెత్తరో, అలాంటి వారి హక్కుల కోసం గొంతెత్తడమే లక్ష్యంగా,  తెలుగురాష్ట్రాల్లో గత ఐదు దశాబ్దాలకు పైగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేస్తున్న పౌరహక్కుల సంఘం తన 20వ రాష్ట్రమహాసభల్ని తిరుపతిలో జరుపుకుంటున్నది. పౌరహక్కుల సంఘం ఆవిర్భవించిన తొలినాళ్ళల్లో రాజ్య హింసకు వ్యతిరేకంగా మాత్రమే పని చేసిన పౌరహక్కుల సంఘం, తరువాత కాలంలో తన కార్యరంగాన్ని విస్తృత‌ పరచుకుని, సమాజంలో వివిధ ఆధిపత్య వ్యవస్థల మూలంగా అణచివేతకు గురి అవుతున్న ప్రజల హక్కుల కోసం
కరపత్రాలు

మార్పు కోసం ప్రాణాలు బలిపెట్టక తప్పదనేఅమరుల సందేశాన్ని ఎత్తిపడదాం

కరపత్రంజీవితమంతా విప్లవమేఅమరుల బంధుమిత్రుల సంఘం ఎబిఎంఎస్ 21వ ఆవిర్భావ దినం సందర్భంగాఅక్రమ కేసులకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా సభజూలై 18, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకుసుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌   కా. గంటి ప్రసాదం అమరుడై ఈ జూలై 4కు పదేళ్లు. 2013 జూలై 4న నెల్లూరిలో ప్రసాదాన్ని ప్రభుత్వ హంతక ముఠాలు హత్య చేశాయి. వేలాది మంది అమరుల స్ఫూర్తితో 20 ఏళ్ల కింద మొదలైన ఏబిఎంఎస్‌ ప్రసాదం త్యాగాన్ని గుండెలకు హత్తుకొని కన్నీటితోనే ఈ పదేళ్లుగా పని చేస్తున్నది. ఆయన మృత్యుముఖంలో ఉండి కూడా ‘వాళ్లు నన్ను చంపవచ్చు. నా స్పూర్తిని
కరపత్రాలు

విప్లవం మన శ్వాస – విప్లవం మన ధ్యాసరండి.. కలబోసుకుందాంభారత ప్రజాయుద్ధం-సమకాలీన సందర్భం

సదస్సు7, డిసెంబర్ 2025 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకాసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు నేల నెత్తుటి చిత్తడిగా మారుతున్నది. చరిత్ర విలపిస్తున్నది. తాను కన్న అత్యుత్తమ వీరుల మరణాలతో బెంగటిల్లుతున్న ది. విప్లవకారుల అమరత్వం మన కాలపు మహా విషాదంగా ఆవరించింది. దీన్ని తట్టుకొని నిలబడటం కష్టమే. కానీ తప్పదు. వందల వేల ఏళ్లుగా మానవాళి మోసుక తిరుగుతున్న స్వప్నం గాయపడిన వేళ చరిత్ర మీద తార్కిక విశ్వాసం నిల బెట్టుకోవాల్సిందే. దుఃఖంతో పూడుకపోతున్న మన కంఠస్వరాన్ని భవిష్యత్ నిర్మాణానికి తగినట్లు సవరించుకోవాల్సిందే. ఇంతటి ఆపద కాలంలో సాయుధ పోరాట
కరపత్రాలు

Don’t be desperate – Don’t lose confidence in class struggle

When the revolutionary movement is strong, generally anyone like to walk with it. They hail it. They glorify the period when they were in the movement. All this is very easy. But it is hard to walk with the same revolutionary movement when it is entangled in war and is suffering losses. It is very difficult too, to understand its phenomena. The number of people who say that the revolutionary
కరపత్రాలు

ఆదివాసులపై మోడీ ప్రభుత్వ యుద్ధం

(30-04 -2023   నాగర్‌కర్నూల్‌ జిల్లా   అచ్చంపేటలో జరిగిన సభ కరపత్రం- వసంత మేఘం టీం ) దేశానికే మూలవాసులైన ఆదివాసీలను ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన ప్రభుత్వాలు, 1985 నుండి అమానుషంగా వేటాడి హత్యచేస్తున్నాయి. జల్‌, జంగిల్‌, జమీన్‌లపై ఆదివాసులకే హక్కని 1997 సమతా స్వచ్ఛంద సంస్థ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పులో కూడా అడవిపై హక్కు ఆదివాసీలదే అని స్పష్టం చేసింది. కాని అడవిలోని సహజ సంపదను కొల్లగొట్టడానికి, అడవిని విధ్వంసం చేయడానికి సిద్ధమైన పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులవైపే ప్రభుత్వాలు నిలబడ్డాయి. ఎలాగైతే నల్లమలలో ఉన్న 20 లక్షల టన్నుల యురేనియం వెలికి తీసి, అచ్చంపేట నల్లమల
కరపత్రాలు

Dangerous literary festival with dangerous writers

You are invited to a certain dangerous literary festival. We could not organize the 'People's Literary Festival' last year, a failure we blame on our inaction and weakness. These days the Hindutva-Fascist state has poisoned public consciousness with relentless religious sectarianism and hatred. Capitalism has consumed water, forests, lands and jobs. We consider it a crime not to fulfill our promise to stand by the masses in these troubled times.
కరపత్రాలు

తెలంగాణలో కాల్పుల విరమణ కోసం ప్రజలతో, ప్రభుత్వంతో సంభాషణ

 ప్రజలు శాంతిని కోరుకుంటున్న కాలం ఇది. సమాజం ప్రశాంతంగా ఉన్నప్పుడే  ప్రజా సమస్యలు చర్చనీయాంశం అవుతాయి. వాటికి అర్థవంతమైన పరిష్కారాలు  దొరుకుతాయి. కానీ శాంతి, సామరస్యం నానాటికీ అడుగంటిపోతున్నాయి. హింస, విద్వేషం లెక్కలేనన్ని రూపాల్లో పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులుగా మంచి సమాజం కోసం ప్రయత్నించిన మేము ఇప్పుడున్న ఈ స్థితిని గ్రహించాం. దీన్ని మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు తోడు నిలబడాలని అనుకున్నాం. యుద్ధాలు ఉన్నంత కాలం శాంతి ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు దేశాల మధ్య, దేశాల లోపలా దురాక్రమణ యుద్ధాలు  సాగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా కోటానుకోట్ల మంది ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు.  శాంతి ఒక పోరాట నినాదంగా మారింది.
కరపత్రాలు

తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత

(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా జులై 6 న హైదరాబాదులో నిర్వహిస్తున్న సదస్సు సందర్భంగా విడుదల చేసిన కరపత్రం నుంచి ...) ఆపరేషన్‌ కగార్‌ను ఆపివేయాలని తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ వివిధ స్థాయి నాయకులు కోరుతున్నారు.  మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలనే ప్రజా ఉద్యమంలో భాగమవుతున్నారు. జాతీయస్థాయిలోనూ ఇదే వైఖరి వినిపిస్తోంది. మావోయిస్టు ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా కాక సామాజిక సమస్యగా తమ ప్రభుత్వం చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే ఇవన్నీ నోటి మాటలుగానే ఉండిపోయాయి. బీజేపీ మతతత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని  కాంగ్రెస్‌  అధిష్టానం పదేపదే చెబుతోంది. సంఫ్‌ుపరివార్‌ నుంచి
కరపత్రాలు

మనమంతా ఒకే గొంతుగా నినదిద్దాం

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌, చిత్తనూరులో ఏర్పరుస్తున్న ఇథనాల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీని వెంటనే ఎత్తివేయాలి పాదయాత్ర తేది : 11.02.2023 చిత్తనూరు నుండి  తేది : 21.02.2023 ఆత్మకూరు దాకా ప్రియమైన సోదరీ సోదరులారా ! మిత్రులారా ! జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌ వారు చిత్తనూరు శివారులో మూడు పంటలు పండే భూములలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు అబద్దాలు చెబుతూ మోసపూరితంగా చిత్తనూరు, ఎక్లాస్పూర్‌, జిన్నారం గ్రామాలకు చాలాదగ్గరలో జనావాసాల నడుమ ఈ కంపెనీ పనులు శరవేగంతో నిర్వహిస్తున్నారు. వాళ్ళు తొలుత మనకు నేరేడు పండ్లతోట పెడతామని చెప్పారు. కొద్దిరోజులలోనే ఇథనాల్‌ కంపెనీ నిర్మిస్తున్నారనే