కరపత్రాలు

అమరులను స్మరించుకుందాం, కగార్‌ యుద్ధాన్ని ఎదిరిద్దాం

జూలై 18 గురువారం మధ్యాన్నం 1.30  నుంచి సా. 6 గంటల దాకా బహిరంగ సభసుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమరయ్య హాలు, హైదరాబాదుఅధ్యక్షత: అంజమ్మ(ఎబిఎంఎస్‌)వక్తలు: రివేరా(విరసం)నారాయణరావు(పౌరహక్కుల సంఘం)బట్టు వెంకటేశ్వర్లు(ఆదివాసీ హక్కుల పోరాట సంఫీుభావ వేదిక)ప్రొ. హరగోపాల్‌ప్రజాకళామండలి, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు మనుషులందరూ సమానంగా ఉండాలని, కుల, మత, వర్గ, లింగ వివక్ష లేని సుందరమైన సమాజాన్ని నిర్మించాలని, తరతరాల దోపిడీ నుండి విముక్తికై పీడిత ప్రజానీకం ఏకమై నిరంతరం జరిపే వర్గ పోరాటమే మావోయిస్టు ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించి, మావోయిస్టు రహిత భారత్‌ ను నిర్మిస్తామని మోదీ, అమిత్‌ షా ప్రకటించారు. అందులో భాగంగానే మధ్య
కరపత్రాలు

కా. గంటి ప్రసాదంగారి 11వ వర్ధంతి సందర్భంగా..

కార్పొరేట్‌ హిందుత్వ కగార్‌ యుద్ధాన్ని ఎదిరిద్దాం భారత విప్లవోద్యమానికి అండగా నిలబడదాం సంస్మరణ సభ జూలై 6 శనివారం ఉదయం 11 గంటల నుంచి, బొబ్బిలి కా. గంటి ప్రసాదంగారు అమరుడై పదకొండేళ్లు. ఆయన నక్సల్బరీ చైతన్యంతో ఉత్తరాంధ్రలో సుదీర్ఘకాలం వివిధ రంగాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించారు. విప్లవ పార్టీల ఐక్యతా క్రమంలో   అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లారు. 2015లో అరెస్టయ్యాక జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అప్పటి నుంచి తిరిగి బహిరంగ ప్రజాపోరాటాల్లో భాగమయ్యారు. అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడిగా విప్లవ భావజాల ప్రచారానికి కృషి చేశారు. వివిధ రంగాల్లో ప్రజాస్వామిక పోరాటాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. విప్లవోద్యమానికి
కరపత్రాలు

Viksith Bharath @ 2047 – Corporate Hindu Rashtra

Seminar on the occasion on Revolutionary Writers Association Formation Day 10 AM to 6 PM Thursday, July 4, 2024 Sundarayya Vignana Kendram, BaghLingampally, Hyderabad The fact that a vulture that ate a hundred sheep won't fall with a singlepoll has been proven. However, the public has also reined in the arrogance of Hindutva fascists in the elections. Despite the lies, deceptions, distortions, and enticements in the election campaign, people were
కరపత్రాలు

వికసిత భారత్‌ @ 2047 – కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర

విరసం ఆవిర్భావ దినం సందర్భంగా సదస్సు జూలై 4 2024, గురువారం ఉ. 10 గంటల నుండి సా . 6 గంటల వరకుసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క పోలింగ్‌తో కూలిపోదని రుజువైంది. అయినా హిందుత్వ ఫాసిస్టు దురహంకారానికి ఎన్నికల్లో కూడా ప్రజలు కళ్లెం వేశారు. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, ప్రలోభాలతో సాగిన ఎన్నికల ప్రచారంలో సహితం ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు. ఫాసిస్టు నరేంద్ర మోదీ కళ్లలో భయం బట్టబయలైంది. రాముడు కాపాడలేడని కూడా తేలిపోయింది. ‘మందబుద్ధి’ని రెచ్చగొట్టి ఎల్లకాలం చెలామణి కాలేరని స్పష్టమైంది. ప్రజల వివేకం, సత్యాసత్యాల ఎరుక ఎంత
కరపత్రాలు

రాయలసీమకు ఏం చేస్తారో చెప్పండి, ఓట్ల కోసం వచ్చే  వైసీపీని, టీడీపీ కూటమిని నిలదీయండి

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని అంటారు. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు రాయలసీమ సమస్యలు ఇప్పటికీ గుర్తుకు రాలేదు. ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వైసీపీగాని, అంతక ముందు ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలి, మళ్లీ అధికారం కావాలనుకుంటున్న టీడీపీగాని ఫలానా రాయలసీమ ఫలానా సమస్యను పరిష్కరిస్తామని నిర్దిష్టంగా  మాట్లాడటం లేదు. రాయలసీమకు ఏ వాగ్దానమూ చేయకుండానే సీట్లు సంపాదించుకోవచ్చని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ అనుకుంటున్నాయి. ఉచితాలు, పింఛన్లు తప్ప రాయలసీమకు అతి ముఖ్యమైన నీటిపారుదల రంగం గురించి మాట్లాడటం లేదు. కరువుబారినపడి వేలాది గ్రామాలు వలస పోతున్న సీమ పల్లెల
కరపత్రాలు

అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో..

మార్చి 8, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో.. విప్లవోద్యమంపై నిషేధానికి, యుఎపిఎ కేసులకు, ఎన్‌ఐఎ దాడులకు వ్యతిరేకంగా సదస్సు మార్చి 2, 2024 శనివారం ఉదయం 10.30 నుంచి సాయంకాలం 6 గంటల దాకా అంబేద్కర్‌ భవన్‌, వరంగల్‌ మిత్రులారా! మార్చి8 అంతర్జాతీయ శ్రామిక మహిళల విముక్తి పోరాట దినం. చరిత్రలో శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి, రాజ్యహింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా మార్చి 8 స్త్రీలందరి విముక్తి ఉద్యమాల దినంగా నమోదైంది. పాలకులు మార్చి8ని వేడుకల దినంగా మార్చేసినా ఈ దేశంలోని కార్మిక, ఆదివాసీ, దళిత బహుజన మహిళలు
కరపత్రాలు

 ప్రజా పాలనా? నియంతృత్వ పాలనా?

పూసపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలి!   ఏజెన్సీ గ్రామాలపై కూంబింగ్‌ను నిలిపి వేయాలి!! ప్రియమైన ప్రజలారా, రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనూ అక్రమ అరెస్టులు, కుట్ర కేసులు, పోలీసు   కూంబింగ్‌లు  షరా మామూలుగానే వుండబోతున్నాయా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని రేవంత్‌రెడ్డి గారి ప్రభుత్వం యిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు విశదం చేస్తున్నాయి. సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ అశోక్‌ అన్న (కుర్సం వజ్జయ్య), రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ గోపన్న (దనసరి సమ్మయ్య), జిల్లా నాయకులు కామ్రేడ్స్‌ పుల్లన్న (సంగపొంగు ముత్తయ్య), ఎస్‌కె.మదార్‌, కలకొండ సురేశ్‌లను పోలీసులు అరెస్టు చేసిన తీరూ, వారితో పాటు మొత్తం
కరపత్రాలు

మార్పు కోసం ప్రాణాలు బలిపెట్టక తప్పదనేఅమరుల సందేశాన్ని ఎత్తిపడదాం

కరపత్రంజీవితమంతా విప్లవమేఅమరుల బంధుమిత్రుల సంఘం ఎబిఎంఎస్ 21వ ఆవిర్భావ దినం సందర్భంగాఅక్రమ కేసులకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా సభజూలై 18, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకుసుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌   కా. గంటి ప్రసాదం అమరుడై ఈ జూలై 4కు పదేళ్లు. 2013 జూలై 4న నెల్లూరిలో ప్రసాదాన్ని ప్రభుత్వ హంతక ముఠాలు హత్య చేశాయి. వేలాది మంది అమరుల స్ఫూర్తితో 20 ఏళ్ల కింద మొదలైన ఏబిఎంఎస్‌ ప్రసాదం త్యాగాన్ని గుండెలకు హత్తుకొని కన్నీటితోనే ఈ పదేళ్లుగా పని చేస్తున్నది. ఆయన మృత్యుముఖంలో ఉండి కూడా ‘వాళ్లు నన్ను చంపవచ్చు. నా స్పూర్తిని
కరపత్రాలు

ఆదివాసులపై మోడీ ప్రభుత్వ యుద్ధం

(30-04 -2023   నాగర్‌కర్నూల్‌ జిల్లా   అచ్చంపేటలో జరిగిన సభ కరపత్రం- వసంత మేఘం టీం ) దేశానికే మూలవాసులైన ఆదివాసీలను ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన ప్రభుత్వాలు, 1985 నుండి అమానుషంగా వేటాడి హత్యచేస్తున్నాయి. జల్‌, జంగిల్‌, జమీన్‌లపై ఆదివాసులకే హక్కని 1997 సమతా స్వచ్ఛంద సంస్థ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పులో కూడా అడవిపై హక్కు ఆదివాసీలదే అని స్పష్టం చేసింది. కాని అడవిలోని సహజ సంపదను కొల్లగొట్టడానికి, అడవిని విధ్వంసం చేయడానికి సిద్ధమైన పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులవైపే ప్రభుత్వాలు నిలబడ్డాయి. ఎలాగైతే నల్లమలలో ఉన్న 20 లక్షల టన్నుల యురేనియం వెలికి తీసి, అచ్చంపేట నల్లమల
కరపత్రాలు

Dangerous literary festival with dangerous writers

You are invited to a certain dangerous literary festival. We could not organize the 'People's Literary Festival' last year, a failure we blame on our inaction and weakness. These days the Hindutva-Fascist state has poisoned public consciousness with relentless religious sectarianism and hatred. Capitalism has consumed water, forests, lands and jobs. We consider it a crime not to fulfill our promise to stand by the masses in these troubled times.