కరపత్రాలు

మానవ హననం ఆపాలి…. శాంతి చర్చలు జరపాలి

*మధ్యభారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలి*శాంతి, ప్రజాస్వామ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టులు వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి ప్రియమైన ప్రజలారా, గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ఆదివాసులు, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, గడ్చిరోలి, ఒడిషా, ఆంధ్ర, తెలం గాణ, ఝార్ఖండ్, బెంగాల్, కేరళ  రాష్ట్రాలలోని ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలోనూ, విడిగా తమ తమ ఆదివాసీ సంఘాల నాయకత్వంలోనూ జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల న్నింటా ఉన్న అపారమైన ఖనిజాలను అదానీ, అంబానీ, వేదాంత, టాటా, బిర్లా తదితర కార్పొరేట్ సంస్థ లకు అప్పజెప్పడం కోసం అక్కడి ఆదివాసీలను తమ స్వంత గడ్డపై నుండి బేదఖలు
కరపత్రాలు

అమరులను స్మరించుకుందాం, కగార్‌ యుద్ధాన్ని ఎదిరిద్దాం

జూలై 18 గురువారం మధ్యాన్నం 1.30  నుంచి సా. 6 గంటల దాకా బహిరంగ సభసుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమరయ్య హాలు, హైదరాబాదుఅధ్యక్షత: అంజమ్మ(ఎబిఎంఎస్‌)వక్తలు: రివేరా(విరసం)నారాయణరావు(పౌరహక్కుల సంఘం)బట్టు వెంకటేశ్వర్లు(ఆదివాసీ హక్కుల పోరాట సంఫీుభావ వేదిక)ప్రొ. హరగోపాల్‌ప్రజాకళామండలి, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు మనుషులందరూ సమానంగా ఉండాలని, కుల, మత, వర్గ, లింగ వివక్ష లేని సుందరమైన సమాజాన్ని నిర్మించాలని, తరతరాల దోపిడీ నుండి విముక్తికై పీడిత ప్రజానీకం ఏకమై నిరంతరం జరిపే వర్గ పోరాటమే మావోయిస్టు ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించి, మావోయిస్టు రహిత భారత్‌ ను నిర్మిస్తామని మోదీ, అమిత్‌ షా ప్రకటించారు. అందులో భాగంగానే మధ్య
కరపత్రాలు

కా. గంటి ప్రసాదంగారి 11వ వర్ధంతి సందర్భంగా..

కార్పొరేట్‌ హిందుత్వ కగార్‌ యుద్ధాన్ని ఎదిరిద్దాం భారత విప్లవోద్యమానికి అండగా నిలబడదాం సంస్మరణ సభ జూలై 6 శనివారం ఉదయం 11 గంటల నుంచి, బొబ్బిలి కా. గంటి ప్రసాదంగారు అమరుడై పదకొండేళ్లు. ఆయన నక్సల్బరీ చైతన్యంతో ఉత్తరాంధ్రలో సుదీర్ఘకాలం వివిధ రంగాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించారు. విప్లవ పార్టీల ఐక్యతా క్రమంలో   అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లారు. 2015లో అరెస్టయ్యాక జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అప్పటి నుంచి తిరిగి బహిరంగ ప్రజాపోరాటాల్లో భాగమయ్యారు. అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడిగా విప్లవ భావజాల ప్రచారానికి కృషి చేశారు. వివిధ రంగాల్లో ప్రజాస్వామిక పోరాటాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. విప్లవోద్యమానికి
కరపత్రాలు

మధ్య భారతదేశంలో ఆదివాసుల హననానికి వ్యతిరేకంగా పోరాడుదాం

ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, చత్తీస్‌ఘడ్‌లో ఉన్న కోట్లాది విలువైన సహజ వనరులను బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం భారత ప్రభుత్వం దేశ మూలవాసులైన ఆదివాసీలపై అతిక్రూరంగా మారణకాండను దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. అలాగే వారికి మద్దతుగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ దానికి ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో లక్షలాది బలగాలతో మధ్య భారతాన్ని సరిహద్దు ప్రాంతంగా మారుస్తూ యుద్ధ స్థితిని కొన సాగిస్తుంది. ఇది గాజా, ఉక్రెయిన్‌ల కన్నా దారుణ స్థితిని దాటిపోయింది. మనపక్కన ఉన్న చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీల జీవితాలపై పై భారతసైన్యం తీవ్రంగా దాడి చేస్తున్న విధానాన్ని మానవతావాదులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష
కరపత్రాలు

Viksith Bharath @ 2047 – Corporate Hindu Rashtra

Seminar on the occasion on Revolutionary Writers Association Formation Day 10 AM to 6 PM Thursday, July 4, 2024 Sundarayya Vignana Kendram, BaghLingampally, Hyderabad The fact that a vulture that ate a hundred sheep won't fall with a singlepoll has been proven. However, the public has also reined in the arrogance of Hindutva fascists in the elections. Despite the lies, deceptions, distortions, and enticements in the election campaign, people were
కరపత్రాలు

వికసిత భారత్‌ @ 2047 – కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర

విరసం ఆవిర్భావ దినం సందర్భంగా సదస్సు జూలై 4 2024, గురువారం ఉ. 10 గంటల నుండి సా . 6 గంటల వరకుసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క పోలింగ్‌తో కూలిపోదని రుజువైంది. అయినా హిందుత్వ ఫాసిస్టు దురహంకారానికి ఎన్నికల్లో కూడా ప్రజలు కళ్లెం వేశారు. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, ప్రలోభాలతో సాగిన ఎన్నికల ప్రచారంలో సహితం ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు. ఫాసిస్టు నరేంద్ర మోదీ కళ్లలో భయం బట్టబయలైంది. రాముడు కాపాడలేడని కూడా తేలిపోయింది. ‘మందబుద్ధి’ని రెచ్చగొట్టి ఎల్లకాలం చెలామణి కాలేరని స్పష్టమైంది. ప్రజల వివేకం, సత్యాసత్యాల ఎరుక ఎంత
కరపత్రాలు

ఎవరీ ఆదివాసులు? వాళ్ళను ఎందుకు మన ప్రభుత్వం చంపుతోంది ?

ఈ మధ్య ఆదివాసులను  పోలీసులు కాల్చేస్తున్న వార్తలు మీరు పత్రికల్లో చదివే ఉంటారు. టీవీల్లో చూసే ఉంటారు. ఒక్కోసారి ఇరవై మందిని, ముప్పై మందిని ఎన్‌కౌంటర్‌ పేర చంపేస్తున్నారు. ఈ ఘటనలు   మన పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, రaార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయి.  ఇంతకూ ఎవరీ ఆదివాసులు? వాళ్లను ఎందుకు ఇట్లా కాల్చేస్తున్నారు? అనే ప్రశ్న మీకు తలెత్తే ఉంటుంది. ఆదివాసులంటే  అడవుల్లో జీవించే జనాలు. మనమంతా ఆదివాసుల నుంచే వచ్చాం.  మన మూలాలు ఆదివాసుల్లో ఉన్నాయి.  ఏది తినాలో, ఏది తినకూడదో మొదట ఆదివాసులే తెలుసుకున్నారు. ఏ నొప్పికి ఏ ఆకు వాడాలో, ఏ
కరపత్రాలు

రాయలసీమకు ఏం చేస్తారో చెప్పండి, ఓట్ల కోసం వచ్చే  వైసీపీని, టీడీపీ కూటమిని నిలదీయండి

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని అంటారు. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు రాయలసీమ సమస్యలు ఇప్పటికీ గుర్తుకు రాలేదు. ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వైసీపీగాని, అంతక ముందు ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలి, మళ్లీ అధికారం కావాలనుకుంటున్న టీడీపీగాని ఫలానా రాయలసీమ ఫలానా సమస్యను పరిష్కరిస్తామని నిర్దిష్టంగా  మాట్లాడటం లేదు. రాయలసీమకు ఏ వాగ్దానమూ చేయకుండానే సీట్లు సంపాదించుకోవచ్చని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ అనుకుంటున్నాయి. ఉచితాలు, పింఛన్లు తప్ప రాయలసీమకు అతి ముఖ్యమైన నీటిపారుదల రంగం గురించి మాట్లాడటం లేదు. కరువుబారినపడి వేలాది గ్రామాలు వలస పోతున్న సీమ పల్లెల
కరపత్రాలు

కార్పొరేటీకరణ – భారత రాజకీయార్థిక వ్యవస్థ సదస్సు

కామ్రేడ్‌ కనకాచారి స్మృతిలో దేశాన్ని అమ్మేస్తున్నవారే దేశభక్తిని ప్రచారం చేస్తున్నారు. దేశభక్తిలో తమను మించిన వాళ్లు లేరని దబాయిస్తున్నారు. మిగతా అందరినీ దేశద్రోహులని చెరసాలలో పెడుతున్నారు. ఇప్పుడు దేశభక్తి అంటే ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం. మోదీ తనకు ప్రియమైన ఆదానీని ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో నిలబెట్టడం. దీని కోసం ఉన్న చట్టాలన్నిటినీ ఉల్లంఘించడం. ఇష్టం వచ్చినట్లు మార్చేయడం. నిరంకుశ చట్టాలు తీసుకరావడం. ఇదీ ఇవాళ దేశభక్తి విశ్వరూపం. దేశభక్తి రహదారిలో భారత ఆర్థిక వ్యవస్థ కార్పొరేటీకరణ అంతిమ లక్ష్యంతో శరవేగంగా పరుగులు తీస్తోంది. ప్రజల రక్త మాంసాలతో ఉత్పత్తి అయిన సంపదలను, అపారమైన సహజ వనరులను
కరపత్రాలు

విరసం 24వ సాహిత్య పాఠశాల కరపత్రంసంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్రకా. సాయిబాబా సందర్భం

ఈసారి సాహిత్య పాఠశాల ఇతివృత్తం ‘సంక్షోభ కాలంలో సాహిత్యకారులు’. ఇటీవలే మనకు దూరమైన ప్రియతమ కామ్రేడ్‌, కవి , విప్లవ మేధావి ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా తన జీవితంతో, మరణంతో రగిలించిన ఉత్తేజమూ, సమాజంపైకి సంధించిన చురుకైన ప్రశ్నలూ ఒక కొత్త సందర్భాన్ని మన ముందుకు తీసుకొచ్చాయి. సంకెళ్లలోనే స్వేచ్ఛాగానం చేయడం, చీకటిలో వెలుగును కలగనడం, అణచివేస్తే విముక్తిని ప్రకటించుకోవడం, అంతిమంగా మృత్యువులో కూడా చావును నిరాకరించడం అనేవి ఇంకెంత మాత్రం రొమాంటిక్‌ వ్యక్తీకరణలు కాదని ఆయన నిరూపించారు. ఆయనకంటే ముందు అత్యంత దుర్భర స్థితిలో, వైద్యం అందక జైలులో మరణించిన మావోయిస్టు రచయిత్రి నర్మద(ఉప్పుగంటి నిర్మల) కూడా