సి.యస్.అర్.ప్రసాద్ అనువాదం చేసిన దివ్యా ద్వివేది, షాజ్ మోహన్, జె.రెఘు కలిసి రాసిన హిందూయిజం ఒక అబద్ధం అనే రచన వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకోడానికి సైద్ధాంతికంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ ముగ్గురు వ్యాస రచయితలు హిందూ మతాన్ని, కుల వ్యవస్థను కలిపి చూశారు. అందుకే హిందూ మెజార్టీ వాదం అగ్రకులాల సృష్టి అనే ఉప శీర్షిక దీనికి ఉంది. హిందూయిజాన్ని అర్థం చేసుకోడానికి అనేక చారిత్రక వాస్తవాలను వ్యాసకర్తలు ముందుకు తీసుకొచ్చారు. హిందూత్వ సంస్కృతిక జాతీయవాద భావజాలాన్ని చారిత్రక భౌతిక వాద దృక్పథంతో, మార్క్సియన్ కోణంలో ఈ రచయితలు చూశారు. దీనికి భారతీయ హిందూత్వ ఆధిపత్య