“మాడ్ బచావో” అంటే సైనిక బలగాల హత్యాకాండ
ఈ నెల ప్రారంభంలో, నలుగురు ఆదివాసీ రైతులను చంపి, మావోయిస్టులుగా ముద్రవేసి దాదాపు 90 మంది ఆదివాసీ రైతులను అరెస్టు చేయడంతో రాజ్యం ఆదివాసీ రైతులపై దాడిని మళ్లీ ప్రారంభించింది. ఆదివాసీలపై మారణహోమ దాడిని కొనసాగించింది. వైచిత్రమేమంటే, తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న ఛత్తీస్గఢ్ కొండల నుండి మావోయిస్టులను తరిమివేయడానికి మాడ్లో ప్రజా ఉద్యమాలు మారణహోమ మిలిటరీ ఆపరేషన్ను వ్యతిరేకించడానికి ఉపయోగించే “మాడ్ బచావో ఆందోళన్” పేరుతో అర్ధ సైనిక బలగాలు జరుపుతున్న సైనిక చర్యలో భాగంగా జులై 3న పెద్దఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు ప్రారంభించాయి. అలాంటి సైనిక చర్యలో నారాయణపుర్ జిల్లాలోని ఘమాండీ అడవుల్లో పారామిలిటరీ బలగాలు