భారీ వర్షానికి తోడు ప్రభుత్వఅధికారుల నిర్లక్ష్యం విజయవాడ వరద ముంపుకు కారణం
గత ఆగస్టు చివరి వారంలో కురిసిన అత్యంత భారీ వర్షం విజయవాడలో మూడవ వంతు ప్రాంతం ప్రజాజీవితాల్నీ అతలాకుతలం చేసింది. పట్టణం లో అత్యంత పేదల జీవితాల్ని కోలుకోనంత దెబ్బతీసింది. సుమారు 64 డివిజన్ లలో 32 డివిజన్ ల ప్రజానీకం 65 మంది వివిధ వయస్సుల వారు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 4,5 డివిజన్ లలో మాత్రం పాక్షికంగా వరద నష్టం జరిగింది. పైన అంతస్తు లేని ప్రజలు అత్యధిక మంది కట్టు బట్టలు, వరద తేచ్చిన అనారోగ్యంతో మిగినవారు చాలా మంది ఉన్నారు. వీరి ఇండ్లలో అన్ని రకాల సామాన్లు పడుకునే మంచాలు, కప్పుకునే దుప్పట్లు,










