రాజ్యాంగం – హక్కులు
(రాజ్యాంగవాదం గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో పాఠకుల అవగాహన కోసం ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం. పౌరహక్కుల ఉద్యమ నాయకుడు, న్యాయశాస్త్ర ఆచార్యుడు ప్రొ. శేషయ్య 2008వ సంవత్సరంలో ప్రొద్దుటూరులో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ మిత్రుల కోసం చెప్పిన పాఠం ఇది. ఈ వ్యాసం ఆయన మరణానంతరం పౌరహక్కుల సంఘం ప్రచురిస్తున్న ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం-1లో అచ్చయింది) రాజ్యాంగం ప్రాథమికంగా అధికారం గురించి మాట్లాడుతుంది. మన భారతదేశంలో అధ్యక్ష తరహా పాలన కాకుండా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పార్లమెంటులోని రెండు సభలు, రాష్ట్రపతి కలిపి ఒక నిర్మాణం వుంటుంది. అది పని చేయాలంటే