ఈ నిషేధానికి అర్థం ఏమిటి ?
చరిత్రలో జరిగిన ప్రజా పోరాటాలే పౌర ప్రజాస్వామిక హక్కులకు జన్మనిచ్చాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నీ ఆ ప్రజా పోరాటాల ఫలితంగానే చట్ట రూపమెత్తాయి. ఇతర హక్కులతో పాటు, రాజ్యాంగంలో సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కును కూడా పొందుపరచడమే మన దేశ పాలకుల వర్గ ప్రయోజనాల ప్రతిఫలనం అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇదట్లా వుండగా మన దేశాన్ని స్వాతంత్రోద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాలని అధికారమార్పిడి అనంతరం మన పాలకులు ప్రకటించారు. ఆ పని చేయడానికి వాళ్లకు ఎటువంటి అడ్డు లేదు. కానీ దానికి పూనుకోలేదు. సర్వసత్తాక, సార్వభౌమాధికార, స్వతంత్ర దేశం అనే మాటలు రాజ్యాంగంలో