సనాతనవాద సంకెళ్లు తెంచుకుందాం!
క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా నుండి పశుపాలక ఆర్యులు భారతదేశానికి మొదటిసారిగా వలస వచ్చారు. ఆ తదనంతర పరిణామ క్రమంలో ఇక్కడ పితృస్వామ్యం ఉనికిలోకి వచ్చింది. మాతృస్వామ్యం లేదా మాతృప్రధాన సింధూ నాగరికత ఆర్యుల దాడులతో దెబ్బతిని వారి పితృస్వామ్యమే ఇక్కడ క్రమంగా వేళ్లూనుకుంది. అయితే ఆర్యుల దాడులకు దూరంగా కొండ కోనలలో ఉండిపోయిన ఆర్యేతర మూలవాసీ ప్రజలలో మాతృ ప్రధాన లక్షణాలు నేటికీ అవశేషాలుగానైనా మిగిలి ఉన్నాయి. 19 -20వ శతాబ్దాలలో మూలవాసులలోకి బ్రాహ్మణవాదం వేగంగా చొచ్చుకురావడం, మూలవాసీ ప్రజలను బలవంతంగా హైందవీకరించడం జరుగుతోంది. భారతదేశానికి ఆర్యుల వలసతో అంతకు పూర్వపు నాగరికత చరిత్ర