దేశవాళీ ప్రాంతీయ ప్రాతినిధ్య కథకుడు సభా
ఇది కె. సభాగారి శత జయంతి సంవత్సరం (01-07-1923 - 04-11-1980) దేశవాళీ గుభాలింపును, రాయలసీమ నుడికారాన్ని మానవ సంబంధాల వైచిత్రిని, పల్లె సొగసులని, సంస్కృతి సంప్రదాయాలని ఆటపాటలని వంటలని, పండుగలని, ప్రకృతి అందాలను ఇలా సమస్తాన్ని తన రచనల్లో అత్యంత హృద్యంగా చిత్రీకరించిన తెలుగు రచయిత కె .సభా గారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా, రైతు ఉద్యమాలలో ప్రత్యక్షంగా ప్రజలు, రైతులు, దళితులు వైపు నిలబడి పోరాడడానికి పది సంవత్సరాలుగా పని చేస్తున్న ఉపాధ్య వృత్తి నుండి బయటపడి పత్రికా రంగాన్ని ఎన్నుకొని ఉద్యమ స్పూర్తితో పాత్రికేయుడుగా, సంపాదకుడిగా ఒక సామాజిక కార్యకర్తగా పనిచేసిన