విరసం తొలితరం సభ్యుడుతన్నీరు కోటయ్య (జ్యోతి)కు నివాళి
విరసం తొలి దశలో సభ్యుడిగా ఉండి, అనంతరం నెల్లూరులో న్యాయవాదిగా పని చేసిన కోటయ్య ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన కవి, వ్యాస రచయిత. జ్యోతి పేరుతో రచనలు చేశారు. విప్లవ కవిత్వ చరిత్రలో నిషేధానికి గురై గుర్తుండిపోయే ‘లే’ కవితా సంపుటిలో ఆ శీర్షికతో కోటయ్య రాసిన కవిత ఉంది. ఆయన మొదట్లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో టైపిస్టుగా పని చేస్తుండే వారు. ఎమర్జన్సీలో అరెస్టు కావడంతో ఉద్యోగం పోయింది. ఆ తర్వాత తెలుగు ఎం.ఎ. చదివారు. తర్వాత ‘లా’ చేసి లాయర్ గా స్థిరపడ్డారు. విరసం సభ్యుడిగా కొనసాగకపోయినా చివరి దాకా విప్లవోద్యమ సానుభూతిపరుడుగా