వ్యాసాలు

రాజును చంపడం ఎందుకు తప్పు?

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ పసిపాపను అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపిన రాజు రైలు పట్టాలపై శవమయ్యాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా, అతన్ని చంపేసి పట్టాలపై పడేశారా అన్న విషయంపై అనుమానాలున్నాయి కాని జనం న్యాయం జరిగిందని ఊపిరి పీల్చుకున్నారు. నిలువెల్లా గగుర్పాటు కలిగించిన సైదాబాద్ సంఘటనకు చలించని మనసు లేదు. ఎంత మంది తమ పిల్లలని పొదువుకొని గుండెలు గుబగుబలాడగా దుఃఖితులై ఉంటారో అందరూ ఆ పని చేసినవాడ్ని ఏం చేసినా పాపం లేదని అనుకొని ఉంటారు. అందరూ శపించినట్లుగానే రాజు దిక్కులేని చావు చచ్చిపోయాడు. న్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా న్యాయం
సాహిత్యం వ్యాసాలు

పోడు భూముల స‌మ‌స్య‌కు ఇదీ ప‌రిష్కారం

ఆదివాసీల అభివృద్ధికి, హక్కుల రక్షణ కొరకు రాజ్యాంగంలో పొందుపర్చిన ఐదవ షెడ్యూలు, ఆరవ "షెడ్యూలు - వీటి వెలుగులో ప్రత్యేకంగా తీసుకొచ్చిన పెసా చట్టం, 1/70 చట్టం ఆచరణలో నీరుగారిపోయిన ఫలితమే నేటి ఆదివాసీల దుర్భర జీవితాలు. అలాగే “నేషనల్‌ పాలసీ ఆన్‌ (టైబల్స్‌”లో గిరిజన జీవన వికాసానికి ప్రత్యేక సంస్థలు - సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐ.టి.డి.ఎ), సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు (ఐ.టి.డి.పి.), గిరిజన సహకార సంస్థలు (జి.సి.సి, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షణ - పరిశోధన కోసం “టైకార్‌” సంస్థలు దశాబ్దాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. విద్యారంగంలో ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్నియల్‌ స్కూల్స్‌, కాలేజీలు మరియు షెడ్యూల్‌
సాహిత్యం వ్యాసాలు

కార్పోరేట్లకు ప్రజల ఆస్తులు

ఎన్నికల ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అనివార్యంగా ప్రభుత్వాలు ప్రజోపయోగ చట్టాలు చేస్తాయి . కొంతమేరకు అమలుజేస్తాయి కూడా. గత కాంగ్రెస్ ప్రభుత్వం, భూసంస్కరణల, అటవీ, గ్రామీణ ఉపాధి కల్పనల చట్టాలను,  మధ్యతరగతి ప్రజాస్వామిక వాదుల   డిమాండ్ మేరకు సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటివి జేసింది. వాటి అమలులో చిత్తశుద్ధి లేదని మ‌న‌కు తెలుసు. అయినా చట్టలు  వుంటే, వాటి అమలుకై పోరాడే అవకాశం వుంటుంది, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ అవకాశం  కూడా లేకుండాపోయింది. సమాచారచట్టాన్ని, అటవీచట్టాలను,కార్మికచట్టాలను, వ్యవసాయరంగ చట్టాలను నీరుగార్చి పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను చేపడుతోంది. తానేమిజేసినా శ్రీరాముని కృప
సాహిత్యం వ్యాసాలు

ప్లేటో కవిత్వ ద్వేషకుడా?

ప్లేటో కవిత్వాన్ని-కవులను వ్యతిరేకించేవాడని మనకు గ్రీకు సాహిత్యంతో కొద్దోగొప్పో పరిచయమున్నా తెలిసే ఉంటుంది. నిజానికి ప్లేటో గ్రీకు తాత్త్విక అభివృద్ధికి బీజాలు వేసాడని మనం చెప్పుకుంటాము. అయితే హెగెల్ వంటి ప్రముఖ తాత్త్వికుడు పారమనిడ్స్ అనే తాత్త్వికుడి   పారమార్ధిక చింతన తత్త్వం మాత్రమే తత్త్వశాస్త్రం అనే శాఖ అభివృద్ధికి మూలమైనదని వివరించారు. ఏమైనా పారమనిడ్స్   ఈ పారమార్ధిక చింతన   జడత్వ సారం అలాగే జెనో యొక్క గతితార్కిక ప్రయోగాన్ని ప్లేటో సమన్వయించి తన తత్త్వశాస్త్రపు పద్ధతిని అభివృద్ధి పరిచాడు(మరికొంత మంది తాత్త్వికుల తత్త్వాలని సైతం సమన్వయం చేసాడు). పారమనిడ్స్ గతిని-చలనాన్ని కేవలం భ్రమ అని ఈ విశ్వం అనాది-అనంతం
సాహిత్యం వ్యాసాలు

సృజనాత్మకత‌ను నిషేధించగలరా?

యాభై సంవత్స‌రాల నుండి విరసం వైభవంగా వెలుగుతోంది. ఐతే ఆ ప్రయాణం సాఫీగా లేదు.చాల కష్టాలొచ్చాయి.నిర్బంధాలు  పెరిగాయి. కాని విరసం స్థిరంగా నిలిచింది. ఈ నిషేధం మొదటిదీ చివరిదీ కాదు. అసలు సృజనాత్మక‌త‌ని ఎవరైనా నిషేధించగలరా? అసలు నిషేధించాల్సిన అవసరం ఉందా..? చరిత్రలోకి పొతే సాహిత్యం మీద నిషేధం రకరకాల రూపాల్లో అమలుపరిచారు. సెక్స్ గురించి, రాజ్యం గురించి వ్యతిరేకంగా గొంతు విప్పితే నిర్బంధం అమలు చేసారు. చార్వాక సాహిత్యాన్ని నాశనం చేసారు. దీనిలో బ్రాహ్మణిజం ముఖ్య పాత్ర వహించింది. దేశంలో ఫాసిజం ప్రజల గొంతుల మీద ఉక్కుపాదం మోపుతున్నది. అన్ని ప్రజాస్వామిక సంస్థలని నాశనం చేస్తున్నది. ఇది
సాహిత్యం వ్యాసాలు

అమ‌రక‌వి యోధుడి డైరీ..

( పాతికేళ్ళు నిండకుండానే  విప్ల‌వ క‌వి కా. ఎంఎస్ ఆర్ బూటకపు ఎన్ కౌంటర్లో  సెప్టెంబర్ 3, 1992న అమ‌రుడ‌య్యాడు. ఆయ‌న ర‌చ‌న‌లు  "కాగడాగా వెలిగిన క్షణం" పేరుతో   నవంబర్ 1992 లో అచ్చ‌య్యాయి. ఇందులో ఆయ‌న డైరీ   కూడా భాగమైంది.    చేగువేరా , భగత్ సింగ్ డైరీల‌తో పోల్చ‌ద‌గిన‌ది ఇది. చిన్న‌వ‌య‌సులోనే  ఎంఎస్ ఆర్ త‌న  భావ‌నాశ‌క్తితో విప్ల‌వ క‌విత్వాన్ని అజ‌రామ‌రం చేశాడు. ఇప్ప‌డు మీరు చ‌దువబోయేది ఆయ‌న పుస్త‌కానికి ముందు  *క్షమాపణ కోరుతూ...*  అని అచ్చ‌యిన ఆయ‌న డైరీ ర‌చ‌న‌. ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా పున‌ర్ముద్ర‌ణ‌... వ‌సంత‌మేఘం టీం)  క్షమాపణ కోరుతూ... సూర్యునితోపాటు  మేల్కొన్నాను.
సాహిత్యం వ్యాసాలు

రాజ్యం సృజ‌నాత్మ‌క‌త‌కు వ్య‌తిరేకి

సవ్యసాచిదేవ్     కవి, రచయిత, విమర్శకుడు ఇప్పుడు నేను చెప్పేది కొత్త కాదు.సృజనాత్మకత‌ అంటే కొత్తది, ప్రగతిశీలకమైనది. దానికి  రాజ్యం వ్య‌తిరేకి. రాజ్యం ఎల్ల‌ప్ప‌డు సృజ‌నాత్మ‌క‌త‌ను  వ్యతిరేకిస్తది. అది పోలీసు , అధికార యంత్రాంగం ద్వారా నిషేధం తెస్తుంది. చరిత్రను వెనక్కి తిప్పే ప్రయత్నం జరుగుతుంది. ఉపన్యాసాలు, పుస్తకాలు, సామాజిక మాధ్య‌మాలను బాగా వాడుకొని పాత కాలమే బావుంటదని చెప్తారు. నాజీల లాగ ప్రజాస్వామ్య గొంతుల్ని వినరు. తమకు మద్దతుగా ప్రజలని కూడగడుతారు. అంతిమంగా తామే ప్రజాస్వామ్య వాదులమని చెప్పుకుంటారు.హిందువులు కానీ వారిపై దాడి చేస్తారు. వ్యక్తిగత విషయాలపై బురద చల్లుతారు. కాంగ్రెస్ కాలం లో తమను బాహాటంగా
వ్యాసాలు

రావణ కాష్టం – సోముని డప్పు

కా. నర్సన్న  స్మృతిలో... నర్సన్న గురించి రాయడమంటే దిగంబర కవులలో చెరబండరాజు గురించి రాయడం. అల్వాల్‌లో ఆరోజుల్లో మిలిటరీ సప్లయ్‌లలో పనిచేసిన కేరళకు చెందిన కుట్టి అనే విప్లవ సంస్కృతిలో ఆసక్తి ఉన్న వ్యక్తి గురించి రాయడం. అల్వాల్‌కు పెంపకం వచ్చిన బి. నర్సింగరావు గురించి రాయడం. వీళ్లను ఒక చోటకు తెచ్చిన కె.ఎస్‌. గురించి రాయడం. వీరిలో నాకు తెలిసిన నర్సన్నకు అటు నర్సింగరావుతో, ఇటు చెరబండరాజుతో ఉన్న పరిచయాలు, స్నేహాలు - సంబంధాలు. వీళ్లంతా నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమంతో ప్రభావితమయిన వాళ్లు. వీళ్లలో నర్సింగరావు దిగంబర కవులతో కూడా ప్రభావితమయిన వాడు. నెహ్రూ భావజాలం ఉన్న
వ్యాసాలు అనువాదాలు

స్టాన్‌స్వామి తొలిప్రేమ

"ఆదివాసీల్లో గల సమానత్వం,సమిష్టిభావం,నిర్ణయాత్మకశక్తి  చూసినాంక నాలో కొత్త చైతన్యం పొడసూపింది. "...స్టాన్ స్వామి..గత డెబ్బయి సంవత్సరాల సుదీర్ఘ కాలంలో,నిరంతరం ఆదివాసీలహక్కులకోసంపోరాడిన స్టాన్లీసాస్ లోర్దుస్వామి(స్టాన్ స్వామి)నిఅక్టోబరు 8,నాడు అరెస్టుచేయడం మధ్యభారతాన్ని కుదిపేసిందిఆయన ఎనభై నాలుగేళ్ళ వృద్ధుడు.పైగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడ్తున్నాడు..అట్లాంటి మనిషిని మావోయిస్టు సభ్యుడనీ,భీమా- కోరేగావ్ కేసులో నిందితుడనీ తీవ్ర నేరాలుమోపి జైలుకు పంపించారు(ఆయన కస్టడీ లో ఉన్న తొమ్మిది నెలల కాలం ఒక్క సారి గూడ ఇంటరాగేట్ చేయలేదు..)ఇదంతా ఆయన సన్నిహితులకు దారుణ మనిపించ వొచ్చు..ఇంతకూ స్టాన్లీస్వామి మంత్రమేమిటి?వేలాది మందిని ప్రభావితం జేసిన ఆయన వ్యక్తి త్వ సూత్రమేమిటి?  ఆయన కుల మత ప్రాంతాల కతీతంగా న్యాయం
వ్యాసాలు

‘మనోధర్మపరాగం’- పాఠకుడి నోట్స్

మా నాయనమ్మ పేరు వంగళాంబ. వాళ్ళ నాన్న పాలఘాట్ రామనాథఅయ్యర్. తమిళుడు. తెలుగు, తమిళనాడులు మదరాసు ప్రెసిడెన్సీగా వున్నప్పుడు కర్నూలు జిల్లాలో డోన్‌ అనబడే ద్రోణాచలం గ్రామానికి వచ్చి గడియారాల మరమ్మత్తు షాపు పెట్టుకున్నాడు. ముగ్గురు కూతుళ్లకు ఇక్కడి తెలుగు సంబంధాలే చేశాడు. పేదరికం వల్లనో ఏమో మా నాయనమ్మ మా తాతకు (జేనాన/జేజబ్బ) రెండవభార్యగా వచ్చింది. (ఆయన మొదటి భార్య పురిటిలో చనిపోయింది)కూతుళ్ళ పెళ్లిళ్లు అయిపోయాక ఆ కుటుంబం మదరాసుకు తరలిపోయింది. ఆ తరువాత నాయనమ్మకు పుట్టింటితో ఏ సంబంధాలూ లేకపోయాయి.ఎప్పుడైనా మూడు,నాలగేళ్లకోసారి ఆమె అక్క వచ్చి వారం రోజులుండేది.చెల్లెలు అసలు వచ్చేదేకాదు. అంతులేని ఇంటిబరువు, కుటుంబ