వ్యాసాలు

పోస్కో దారిలోనే జిందాల్ పోక త‌ప్ప‌దు

నేప‌థ్యంః దక్షిణ కొరియా స్టీల్ కంపెనీ పోస్కో కోసం  ఒడిశా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న  వ్యవసాయ భూమిని  రైతులు పోరాడి సాధించుకున్నారు. ఈ పోరాటం ద‌శాబ్దంపైగా న‌డిచింది. సుమారు 3,000 వ్యవసాయ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి.    ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం అదే భూమిని భారతీయ ఉక్కు కంపెనీకి అప్పగించింది. తిరిగి ఆ ప్రాంతం మళ్లీ నిరసనలు, ఘర్షణల‌తో అట్టుడుకుతున్న‌ది. ఎప్ప‌టిలాగే పోలీసుల క్రూరత్వంతో అల్లకల్లోలమైంది. ధింకియా, నవ్‌గావ్, గడకుజంగా అనే మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఎనిమిది గ్రామాలలో దాదాపు 20,000 మంది  ఉంటున్నారు. వారిలో  అత్యధికులు షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందినవారు. వీరు 60% కంటే
వ్యాసాలు

ప్రజల ప్రజాస్వామ్య ప్రతిఘటనను  దెబ్బతీసేoదుకై   మారణహోమ సైనిక విధానం

బస్తర్ చరిత్ర అంటేనే పోరాటాల చరిత్ర. తమ భూమిని, జీవితాలను, ప్రకృతి వనరులను దోచడమే గాక, తమ స్వీయ గౌరవాన్ని దెబ్బతీసే శక్తులను బస్తర్ తీవ్రంగా ప్రతిఘటించింది. అలాంటి తిరుగుబాట్లలో 1910 లో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన  భూంకాల్ తిరుగుబాటు ఒకటి. గుండాదుర్ అనే ఆదివాసీ నాయకత్వాన ఆదివాసీలు వలసవాదుల అటవీ మరియు ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. నాటినుండి నేటిదాకా, బస్తర్ లో లభించే అపారమైన ప్రకృతి వనరుల దోపిడీకి వేచి చూస్తున్న దేశ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల రక్షణకై ప్రభుత్వo చేస్తున్న సైనికీకరణను, బస్తర్ ప్రజలు సాయుధంగా ఎదుర్కొంటూనే వున్నారు. పూనెం సోమ్లి ఒక
సాహిత్యం వ్యాసాలు

కుల వివక్షను ఎత్తిపట్టిచూపిన ‘‘గోసంగి’’ కావ్యం

ఉత్పత్తి పై ఆధిపత్యం పాంపాదించుక్ను వర్గాలు సాహిత్య కళృారంగాలపై కూడా తమ పెత్తనాన్ని కొనసాగిస్తాయి.న మనిషి భాష నేర్చి నాటినుంచి కథ కవిత్వం వుంటున్నదన్నది సత్యం. ఉత్పత్తిపై ఆధిపత్యంకోల్పోయిన  కారణంగా ఉత్పత్తిని చేసిన వర్గాలు సాహిత్య కళా రంగాలపై కూడా ఆధిపత్యంలేని వారయ్యారు. ఇది ఎలా జరిగిందన్న చర్చ ప్రస్తుతం కాదు. ఉత్పత్తి వర్గాల సాహిత్యం మౌఖికంగానే మిగిలిపోయింది. సంపదేకాదు అక్షరాన్ని కైవసం చేసుకున్న వర్గాల ఉత్పత్తి వర్గాన్ని విస్మరించాయి. ఒకవేళ ఉత్పత్తి వర్గాల ప్రసక్తి వచ్చినా వక్రీకరించో, తమ ప్రతి పాఠ్యాంశానికి కావలసిన విధంగానూ వాడుకున్నారు. ప్రబంధ యుగమంతా విశిష్టాద్వైత ప్రచార సాహిత్యమని త్రిపురనేని మధుసూదనరావు గారంటారు.
వ్యాసాలు సాహిత్యం

సంస్కృతి కోసం పోరాటాలు-వర్గపోరాటం

మాట తీరు సంస్కృతి. ఆలోచనా తీరు సంస్కృతి. బతుకు తీరు సంస్కృతి. ఒక్కమాటలో చెప్పాలంటే- మనుషులు పరస్పరం సంబంధాలు నెరపుకునే ప్రాథమిక తలాన్నే సంస్కృతి అనవచ్చు. ఈ సంస్కృతీ మాధ్యమం ద్వారానే మనుషులు సంపర్కంలోనూ, సంఘర్షణలోనూ ఉంటారు. అయితే సంస్కృతిని అర్థం చేసుకోవడంలో గాని, విశ్లేషించడంలో గాని విభిన్నత ఉండడానికి ప్రధాన కారణం ఆర్థిక కోణంలోనే గాక పలు రకాలుగా భారత సమాజం విభజితమై ఉండడమే. ఇలాంటి విభజితమైన సంక్షుభిత సమాజంలో సంస్కృతిని ఒకే ముద్దగా చూడలేం. అందుకే మార్క్సిస్టులుగా మనం భారత ఉపఖండంలో భిన్న సమాజాలు, భిన్న సంస్కృతులు ఉన్నాయని అంటాం. కనుక సంస్కృతిని కేవలం సానుకూలమైన
వ్యాసాలు

ప్రజలు, ఉద్యోగులు, పాలకులు 

శత్రువైరుధ్యాలుగా ప్రచారమవుతున్న మిత్రవైరుధ్యాలు అసమసమాజంలో విభిన్నవర్గాల (సామాజిక, ఆర్థిక, మత, ప్రాంతాల) మధ్య గల మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా మార్చి, తమ పబ్బం గడుపుకోవడం నేటి పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అనునిత్యం ఉపాధికై జీవనసమరం జేస్తున్న సామాన్య ప్రజలకు పై కుట్రను అర్థంజేసుకొనే చైతన్యం వుండదు. అసమానతలవల్ల, తమకు అందనిది మరెవరికో అందుబాటులో వున్నప్పుడు, తమకూ అదే స్థాయి కావాలనే కోరిక కన్నా, పైవాడు ఆ సౌకర్యాలు పొందగూడదనే వాంఛ కలగడం సహజం. దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. అలాంటి మానసిక స్థితికి కారణం నేటి అసమ వ్యవస్థే. విద్యావంతులైనవారూ ఆ మానసిక స్థితికి గురవుతున్నప్పుడు, సామాన్యుని నిందించడంలో
సాహిత్యం వ్యాసాలు

చింతామణిపై నిషేధం చెల్లేనా?

సుమారు వందేళ్ల కిందటి(1923) ‘జనరంజక’ చింతామణి నాటకాన్ని ఆంధ్రపద్రేశ్‌ ప్రభుత్వం నిన్న(17.1.2022) నిషేధించింది. కొద్ది రోజుల కింద ఆర్య వైశ్య సంఘం వాళ్లు ఈ నాటకం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని, నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  వాళ్ల కోరిక మీదకు ప్రభుత్వం నిషేధించింది. కానీ నిషేధానికి కారణాలు చెప్పలేదు.   కాళ్లకూరి నారాయణరావు రాసిన ఈ నాటకాన్ని కాకినాడలోని సుజనరంజనీ ప్రెస్‌ తొలిసారి అచ్చేసింది. ఆ తర్వాత అనేకసార్లు పునర్ముద్రణ అయింది. బహుశా లక్షల కాపీలు ఐదు తరాల పాఠకుల దగ్గరికి చేరి ఉంటాయి. వేలాది ప్రభుత్వ గ్రంథాలయాల్లో చోటు సంపాదించుకొని ఉంటాయి. సొంత గ్రంథాలయాల్లో భాగమై
వ్యాసాలు

14 సంవత్సరాల తరువాత నిర్దోషులుగా తీర్పు

14 సంవత్సరాల 19 రోజుల తరువాత ప్రశాంత్ రాహి, చంద్రకళ తదితరులను ఉత్తరాఖండ్  కోర్టు UAPA కేసులో నిర్దోషులుగా ప్రకటించింది  2022 జనవరి 7న, ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లోని జిల్లా- సెషన్స్ జడ్జి ప్రేమ్ సింగ్ ఖిమల్ కోర్టు, దేశద్రోహం, రాజద్రోహం, UAPA నిందితులు ప్రశాంత్ రాహి, అతని జీవన సహచరి చంద్రకళతో పాటు మరో ఇద్దరిని నిరోషులుగా ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో 14 సంవత్సరాల 19 రోజుల పాటు సాగిన ఈ ప్రసిద్ధ కేసులో అనేక కోణాలు వున్నాయి. 2007 డిసెంబర్ 17 న డెహ్రాడూన్‌లోని ఆరాఘర్ దగ్గర ప్రశాంత్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు
వ్యాసాలు

సంస్కృతి – మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం

(విర‌సం 28వ మ‌హాస‌భ‌ల కీనోట్ పేప‌ర్‌లోని కొన్ని భాగాలు పాఠ‌కుల కోసం- వ‌సంత‌మేఘం టీం) సంస్కృతి ఉత్పత్తి :   సాహిత్యం, కళలలాగే సంస్కృతి సామాజిక ఉత్పత్తి.  సంస్కృతిలో నుంచే  కళలు, సాహిత్యం పుట్టుకొస్తాయి. సామాజిక ప్రపంచంలో మనిషి ఆవిర్భవించినట్లే సామాజిక సంబంధాల నుంచి సంస్కృతి రూపొందుతుంది.  అన్ని సామాజిక అంశాలకంటే ఎక్కువగా  సంస్కృతి  మనిషిని  పెనవేసుకొని ఉంటుంది.  సంస్కృతి మానవ భౌతిక జీవితావరణకు సంబంధించిందే కాదు. మానవ మనో ప్రపంచంలోనూ ఉంటుంది. మనిషి ప్రవర్తనలో, ఆలోచనా రీతుల్లోనే ఉంటుంది.  సంస్కృతి తనకు తగినట్లు మనుషుల మనో ప్రపంచాన్ని డిజైన్‌్‌ చేసుకుంటుంది. అది భౌతిక ప్రపంచంలో వలె మనస్సులో  కూడా
సాహిత్యం వ్యాసాలు

నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి

అలిశెట్టి ప్రభాకర్ ను సామాజిక సంక్షోభం వున్నచోట వుండనీయలేదు. ఆ కల్లోల సమాజంలోని తుఫాను ఆయన జీవితంలో భీభత్సాన్ని సృష్టించింది. సృష్టించబడుతున్న కల్లోలాలకు కారణాలు వెదుక్కున్నాడు. ఆ కారణాలు, ఆవేశం, నిరసన కవితాత్మకమైంది. కవిత్వం రాయడానికి గొప్పగా చదువుకొనోక్కరలేదని నిరూపించాడు. స్పందించే గుణముంటే చాలు. ఆ స్పందనను ఒక క్రమంలో పేర్చుకునే నేర్పు స్పందించే గుణమే అందిస్తుంది. ఆ క్రమమే అలిశెట్టి. ఆదే ఆయన కవితాగుణం. అణచివేత, సంక్షోభాలకు కారణాలను శాస్త్రీయంగా అంచనా వేసుకోవడానికి విరసం అలిశెట్టికి చేయూత నిచ్చింది. ఆ శాస్త్రీయపు అంచనాలతో సామాజిక కుళ్ళును, కౌటిల్యాన్ని తూర్పారబట్టాడు. అట్లని నిందించడడమే పనిగా పెట్టుకోలేదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని
వ్యాసాలు సమీక్షలు

జీవితం మలచిన కవి

'పూలపరిమళం'లో కోడం కుమారస్వామి రాసిన ఇరవయ్యేళ్ల (2000-20) నలభై ఎనిమిది కవితలు ఉన్నాయి. కాలంగా రెండు దశాబ్దాలు దీర్ఘకాలమే. ఇంకో కొత్త తరానికి ఆహ్వానం పలికి చోటిచ్చే కాలం. ఆయన సంవత్సరానికి రెండు మూడు కవితలకు మించి రాసినట్లు లేదు. అందులోనూ 2004 నుంచి 2007 దాకా రాసినట్లు లేదు. 2014 నుంచి కొంచెం ఎక్కువగా రాస్తున్నాడు. ఆయన జీవితం చాల మాగిన సారవంతమైన మట్టి బతుకు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికిన కోట్లాది కష్టజీవుల్లో అతను ఒకడు. ఈ అన్ని రుతువుల్లోనూ, అన్ని అననుకూలతలలోనూ, ఆహారాన్వేషణలో దానినే మనం బతుకు తెరువు అంటున్నాం. ఆయన