వ్యాసాలు

డప్పు క‌ళ‌

డప్పు-డోలక్ ల‌ను జననాట్యమండలి ఎందుకు స్వీక‌రించింది? ఎలా వినియోగించింది? ఏం ప్రయోజనం నెరవేరింది? వాటిని వినియోగించడంలో ఏ లక్ష్యం సాధించారు? శబ్దం, దరువు – ప్రదర్శనలో గాని పాత్ర బాణీలు మారినప్పుడు ఏ విధంగా డప్పుశాస్త్రం రాయడం, నాలుగు తాళాలు అభివృద్ధి చేయడం ఇంకా భవిష్యత్‌లో అవకాశాలు. పాటకు ఈ వాయిద్యానికి మధ్య సమన్వయం గురించి వివరణలో రాగాలు మారినపుడు ఎలా? జననాట్యమండలి రచయితలు, కళాకారులు ప్రజల జానపద బాణీలతోనే తమ మెజారిటీ పాటలను, రాశారు. కాబట్టి ప్రధానంగా జానపద పాటలకు ప్రధానంగా ప్రజలు వాడే  వాయిద్యం డప్పు కనుక జననాట్యమండలి కూడా అదే వాయిద్యాన్ని తన ప్రధాన
వ్యాసాలు

మాడ్ టూ మ‌న్యం  

పాట‌ల వెల్లువ ర‌మేష్‌ వీరుల మరణం వారి జ్ఞాపకాలతో మనసును బరువెక్కిస్తోంది. ఆ బరువు కారే కన్నీళ్లతో కాస్త‌ తేలికవుతోంది. అ బరువు అక్షరాలలోకి తర్జుమా అవుతే చరిత్రలో వారి త్యాగాలు సదా నిలిచిపోతాయి. ఆ బరువు స్టూప నిర్మాణంలో నిక్షిప్తమైతే, అనునిత్యం మన కళ్ల ముందు వారి జ్ఞాపకాలు నిలుస్తూ తమ ఆదర్శాలతో మనకు మార్గద‌ర్శ‌కం చేస్తుంటాయి. అలా ఆ బరువు వారి ఆశయాల సాధనతో  ప్రజల హృదయాలను తేలికపరుస్తుంది. వారి ఆశయాల సాధన కృషిలో మరింత పట్టుదలగా నిమగ్నమవుతామంటూ ప్రతిన బూనుతూ మా సోదర కళాకారుడు కామ్రేడ్‌ డప్పు రమేశ్‌కు  వినమ్రంగా విప్లవ నివాళులర్పిస్తున్నాం. 1998లో
వ్యాసాలు

చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి

(చుండూరు మార‌ణ కాండ మీద అక్టోబ‌ర్ 1991న విప్లవ రచయితల సంఘం, జనసాహితీ సాస్కృతిక సమాఖ్య, ప్రజా రచయితల సమాఖ్య త‌ర‌పున విడుద‌ల చేసిన ఈ క‌ర‌ప‌త్రాన్ని సి. రామ్మోహ‌న్‌గారు రాశారు. ఆయ‌న స్మృతిలో పున‌ర్ముద్ర‌ణ‌) చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి భూస్వామ్య, దోపిడి, పీడన సంస్కృతులను నేలమట్టం చేయండి. గురజాడ, వీరేశలింగం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణగారల సంఘ సంస్మరణోద్యమానికి గుంటూరు జిల్లా కేంద్రస్థానం, త్రిపురనేని హేతువాదఉద్యమం, జమీందరీ వ్యతిరేక ఉద్యమాలు, గుంటూరు జిల్లాను కదిలించివేసినవి. పన్నుల సహాయనిరాకరణ ఉద్యమం, పల్నాడు రైతాంగ తిరుగుబాటు, కన్నెగంటి హనుమంతు అమరత్వం చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఆధునిక సాహిత్యంలో
వ్యాసాలు

గుండెలపై రాసుకున్న గోండుల సాహిత్యం

సాహు (కొమురం భీమ్‌ నవలా రచయితలలో ఒకరైన సాహు ఆఖరి వ్యాసం. 1993 ఫిబ్రవరి 13, 14 తేదీలలో హైదరాబాద్లో జరిగిన దళిత రచయితల, కళాకారుల మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలలో ఈ వ్యాసాన్ని సమర్పించారు. మార్చి 16 ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ వ్యాసాన్ని పున‌ర్ముద్రిస్తున్నాం.-  వ‌సంత‌మేఘం టీమ్)  సూర్య వంశ దేవతల్‌  కేత దర్శ సితార  సూర్య వంశ రాజధాని  మావబూడె మాతారా  కచ్చీ బాండేగ్‌ మావాసొత్తా  కయ కాల్‌ కుటియాతా  మావా రాజ్‌ బుడేమాతా  సూర్య వంశ దేవతల అంశంగా చెప్పుకునే గిరిజనులు వాళ్ళ రాజ్యాలు పతనమయి, క్షతగాత్రులై ఆయుధాలు కోల్పోయి అడవులలో జంతువుల్లా వేటాడబడుతూ
వ్యాసాలు

థ‌ల్‌ముత్తు, నాట్యరాజన్‌ల‌ను స్మ‌రించుకుందాం  

హిందుత్వ కౌటిల్య మాతృభాషా వాదం భాష అలోచనల ప్రత్యక్ష వాస్తవానికి రూపం - మార్చ్‌థ‌ల్‌ముత్తును త‌ల‌చుకోనివాడునాట్య‌రాజ‌న్‌ను గుర్తు చేయనివాడుతేనెలొలుకు ప‌లుకుల‌తో ఎంతభాషాభిమానాన్ని చాటుకున్నాచాణక్య‌నీతి చెల్ల‌దుగాక చెల్ల‌దుబ్రాహ్మ‌ణ దుర‌హంకార‌వాదంహిందీ ఆధిప‌త్య దుర‌భిమానంమ‌ట్టిగ‌ర‌వ‌క త‌ప్ప‌దు మన ప్రియమైన భారత దేశం అనేక భాషలకు, సంప్రదాయాలకు, జాతులకు, మూలవాసుల సముదాయాలకు, సంస్కృతులకు నిలయం. వైవిధ్యం దీని ప్రత్యేకత. వాటిని సంరక్షించుకోవడం మనందరి విధి. అవి ఈనాడు పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటి అస్తిత్వం తీవ్ర ప్రమాదంలో ఉంది. తెగలు లుప్తమవుతున్నాయి. భాషలు అడుగంటిపోతున్నాయి. తర తరాల వారసత్వ సంపద వినాశనపు అంచులలో అస్థిత్వానికై కొట్టుమిట్టాడుతున్నవి. యేడాది పొడుగుతా ఐక్య రాజ్య సమితి పేరు మీదనో,
వ్యాసాలు

వీరమాత కామ్రేడ్‌ అనసూయమ్మకు నివాళి!

అనసూయమ్మ 2022, జనవరి 30న తన 97వ యేట హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆమె మావోయిస్టు నాయ‌కుడు   అమరుడు కామ్రేడ్‌ సంతోష్‌ (మహేష్‌)కు కన్నతల్లి. దండ‌కార‌ణ్య సాహిత్య సాంస్కృతికోద్య‌మ ప‌త్రిక 'రుంకార్ అమెకు తలవంచి వినమ్ర శ్రద్దాంజలి అర్చిస్తున్నది. ఆమె బంధు మిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. అనసూయమ్మ దాదాపు 80 యేళ్ల క్రితం ఎర్రంరెడ్డి లక్ష్మారెడ్డి స‌హ‌చ‌రిగా వర్తమాన జనగామ జిల్లా కడవెండిలో అడుగుపెట్టింది. విసునూరు దొరలతో వీరంగమాడి, కరడుగట్టిన భూస్వామ్యానికి బీటలుబార్చిన తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య అమరత్వం రూపంలో తొలిత్యాగాన్ని అందించిన గ్రామంగా కడవెండి తెలంగాణ చరిత్రలో చెరిగిపోని ముద్రవేసుకుంది. పుట్టిన వర్గం, ముఖ్యంగా
వ్యాసాలు

దియే జల్తే హై!

రాజేంద్రబాబు అర్విణి అది అక్టోబర్‌ 6 2021. రాంమోహన్‌ కు రోజూ 6, 7 కిలోమీటర్లకు తక్కువకాకుండా మార్నింగ్‌ వాక్‌ చేసే అలవాటు. వనస్థలిపురం లో పార్కులు, రోడ్లు అన్నీ కలగలిపి తిరిగేవాడు. ఆ రోజు కూడా మార్నింగ్‌ వాక్‌ లో భాగంగా దాదాపు 6 కిలోమీటర్ల నడక పూర్తి చేసాడు. ఎప్పటి లాగా దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. అనారోగ్య లక్షణాలు చూచాయగా కూడా ఏమీ లేవు. ఆ రోజు... ఆ క్షణాలు... ఆ కాలం అలాగే ఘనీభవించి పోయి ఉంటే ఎంత బాగుండేది! ఆ తర్వాత మూడవ రోజు... అది అక్టోబర్‌ 9 - ఆ
వ్యాసాలు

మ‌న‌  కాలపు మావోయిస్టు జీవన సందేశం

ప‌ద్మ‌కుమారి (అమ‌రుల బంధు మిత్రుల సంఘం త‌ర‌పున అచ్చ వేయ‌ద‌ల్చుకున్న సాయుధ‌ శాంతి స్వ‌ప్నం పుస్త‌కానికి ప్రచురణకర్తగా రాసిన ముందుమాట‌) కా. మున్నా అమరుడయ్యాక   ఆర్‌కే నాకు పదే పదే గుర్తుకొచ్చాడు.  శిరీష దు:ఖాన్ని దగ్గరిగా చూశాను కాబట్టి.. ఇప్పుడు ఆర్‌కే మనసు ఎలా ఉంటుంది? అనే ఆలోచన కలిగింది.  ఉద్యమంలో   పని చేసిన రోజుల్లో ఆయన నాకు తెలుసు. ఇప్పుడు    ఈ విషాదంలో ఎలా ఉండి ఉంటాడో అనుకున్నాను. రాంగుడా ఎన్‌కౌంటర్‌లో మున్నాతోపాటు మరో ముప్పై ఒక్క మంది అమరులయ్యారు. ఇంత మంది దుఃఖాన్ని ఆయన మోయాల్సి వచ్చింది కదా అనిపించింది.                 కుటుంబ వ్యవస్థలో నాది
వ్యాసాలు

నా అనుభ‌వాలు

ఒక గ్రామంలో  –పిల్లల దగ్గర నుండి..  మంచికంటి             ఊహ తెలిసినప్పటి నుండి సంఘర్షణ...   బతకడంలో సంఘర్షణ... చుట్టూ ఉన్న మనుషుల మధ్య సంఘర్షణ... అర్థం కాని ఎన్నో రకాల జీవితాలు...  ఉపాధ్యాయ వృత్తి లోకి ప్రవేశించిన తరువాత అక్కడ కూడా  సంఘర్షణ. ఉండాల్సినవి ఉండాల్సినట్టు కాకుండా... చేయాల్సిన వాళ్లు చేయాల్సిన పనులు చేయకుండా ఉండడం ఎంతో బాధ... ఎంతో అసహనం....            మనం ఏమీ చేయలేమా! చెయ్యాలి.... ఏదో చేయాలి.. బాల్యం నుండి  ఉన్న ఆలోచన అదే. గ్రామంలోనూ బడిలోనే  కాదు.. జీవితంలో కూడా ఏదో చెయ్యాలి... ఏదో సాధించాలి.. ఇలా  ఎన్నో అర్థం కాని
వ్యాసాలు

నిరంతర చలనశీలి, 

పాలమూర్‌ అపురూప హృదయం రామ్మోహన్‌సార్‌ విద్య నారాయణస్వామి           1985   జనవరి 12 రాత్రి పది దాటింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో  ఉన్నం మేము నలుగురం. చాలా చలిగా ఉండినదా రాత్రి. పొగమంచు కురుస్తున్నది. ఊపిరి తీసి వదిలితే పొగ వస్తున్నది సిగరెట్‌ తాగినట్టు. మాకది గమ్మత్తుగ ఉండెడిది. ఇగ సిగరెట్‌ యెందుకు ఇట్లే పొగ మబ్బులు చేస్తె చాలు అనుకునెటోల్లము. ఆ సాయంత్రం చాలా సేపు శివారెడ్డి సార్‌ దగ్గర ద్వారకా లో గడిపిన. ‘రాత్రికి  గద్వాల పోతున్నం సార్‌’ అన్న.           ‘విరసం సాహిత్య పాఠశాల జరుగుతున్నదక్కడ మేమంత కలిసి పోతున్నం’ అన్న  ‘తప్పకుండ