మెరుపులాంటి, భాస్వరంలాంటి కవిత్వం
మట్టి గాయపడినా , చెట్టు గాయపడినా , మనిషి గాయపడినా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్షరాలతో యుద్దాన్ని ప్రకటిస్తాడ. సానుభూతి కాదు. సంఘీభావం ముఖ్యమనే మాటపై నిలబడుతాడు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రోజుల్లో ఉదయ్ కవిత్వం ఈ ఫాసిస్టు దాడికి ప్రతిదాడిలాంటిది. గాయానికి మందులాంటిది. ఈ మనుషుల కోసం, సమానత కోసం, బువ్వ కోసం, భుక్తి కోసం తనువు రాలే వరకు పోరాడుతున్న మిత్రులను గుండెకు హత్తుకుంటాడు. పోరాట గీతాల్ని ఆలపిస్తాడు. అమరత్వాన్ని కీర్తిస్తాడు,. అమరుల బాటల్లో నడవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తాడు. మనల్ని సమాయత్తం చేస్తాడు. ఈ నేల చెప్పే గాథలను, కన్నీళ్లను మనలో ఒంపుకుందాం. ఈ