ప్రొ. సాయిబాబ కేసులో ఎల్గార్ పరిషత్ కేసు మూలాలు
ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన వారిలో కొందరికి సాయిబాబాతో 'ప్రత్యక్ష సంబంధం'లో ఉన్నాయని చార్జిషీట్లో పూణే పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 2018 చివర్లో మొదటిసారిగా పూణే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా వున్న కేసు దర్యాఫ్తు పైన “భారీగా ఆధారపడుతున్నాం” అని చెప్పారు.. అప్పటికే సాయిబాబాను, మరో ఐదుగురిని గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన మానవ హక్కుల కార్యకర్తలపై తమ కేసును తయారుచేసుకోవడానికి సాయిబాబాకు గడ్చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించడంపై వారు దృష్టి సారించారు. 2020