కవిత్వం

మరువలేని క్షణం

ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది పాల కోసం తల్లడిల్లుతున్న ఆ బిడ్డను చూసి పాలకై తన రొమ్ములను ఎగేసి గుద్దుకున్న ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది రాజ్యం నేరస్తులను సత్ప్రవర్తనతో రిలీజ్ చేసినప్పుడు "బిల్కీస్ బానో" మనోవేదనకు కారణమైన ఆ న్యాయస్థాన అన్యాయాన్ని కన్నీళ్ళతో లెక్కించిన నిస్సహాయపు ఆ క్షణాల్ని ఎలా మరువగలం? ఓ నినాదం మన మస్తిష్కంలో మతాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలంతా మానవత్వాన్ని మరిచి మతానికై పరుగులు తీస్తున్నప్పుడు "బార్బీ మసీదు"లను కూలగొడుతున్నప్పుడు న్యాయం అన్యాయాన్నే మరలా అనుసరించినప్పుడు టీవీల ముందు కండ్లల్లో ఒత్తిడేసుకుని మనమంతా నోరు మెదపకుండా చూస్తున్న మతస్వార్థ మానవత్వపు ఆ క్షణాల్ని మనం
కవిత్వం

అమ్మ మాట

నాలుగు గోడల మధ్య నుంచి నలుగురి మధ్యలో నిలవాలన్న నలుగురిలో గెలవాలన్న నలుగురిని గెలిపించాలన్నా నాలుగు అక్షరాలు నేర్చు కోవాలని చెబుతూ ఉండేది అమ్మ!! నాలుగు అడుగులు వేయాలన్న నాలుగు రాళ్ళు పోగేయలన్న నలుగురిని సంపాదించు కోవలన్న నలుగురికి సాయo చేయాలన్న నాలుగు అక్షరాలు నేర్చు కోవాలని చెబుతూ ఉండేది అమ్మ!! గుడి తలుపులు బడి తలుపులు ఎప్పుడు ఎదురుచుస్తుoటాయి నీ ఎదుగుదలకు తోడ్పడుతుంటాయి గుడి బడి తల్లి తడ్రులు లాంటి వాళ్ళని మంచి కథలతో ఎన్నే నీతులు బోధిస్తూ ఎప్పుడు హితాన్ని మరవకూడదని సత్ మార్గంలో పయనించలని పరుల ఘోషకు కారణం కాకూడదని చెబుతూ ఉండేది అమ్మ!!
కవిత్వం

చెలిమి బంధాన నడక

వయసుని మరచిన మండు వేసవి ఆకాశంలోకి తొంగి చూస్తూ ఆ వేసవి గాలుల నడుమ మొహం నిండా చెమటతో బాల్యం తాటి చెట్టుపై ఉన్న కాయలను తినాలని ఆశ ప్రకృతిలో మమేకమైన అమాయకత్వం పచ్చని పైరుల మధ్య కూర్చోని..ముచ్చటిస్తూ... తాటి ముంజలు తింటున్నా... అన్న, చెల్లి, తమ్ముడు... ఆ మాటల మధ్య సంధ్యాకాలం దాటుతోంది పశ్చిమాన ఆస్తమా సూర్యుని చూస్తూ... మళ్ళీ వేకువనో, వసంతానో కలుద్దామని వెనుతిరిగారు.
కవిత్వం

పల్లిపట్టు నాగరాజుమూడు కవితలు

1 కుటిలమేధయాగం -------------------------- కంటిలో నలుసట్టా పడితేనే కళ్లు రుద్దుకునే మనం పొరకముల్లు గుచ్చుకుంటేనే వెదికి మరీ తీసిపారేసే మనం * బతుకుదారుల్లో బలిజముళ్లను చల్లుతుంటే బర్రిమీద వానకురిసినట్లుండమే అర్థంగావట్లేదు.!? * మనిషితనానికే శత్రువయినోడు మనుషుల బాగెట్టా ఆలోసిస్తాడు మనిషి మెదడు ప్రాణంతో కదలటం సహించలేనోడు మనిషి బుర్రకు పదునుపెట్టే సదువెట్టా వుండనిస్తాడు * కాయని కాయని పండుని పండని ఉన్నదున్నట్టు కంటితో చూడలేని కుంటిచూపులోడు మురికిని మురికని చెబితే ఒప్పుకుంటాడా.? అజ్ఞానాన్ని కడుక్కోమన్న ప్రతిసారి అంధకారపుగెవుల్లో తోయడానికే ఎత్తులేస్తాడు గాని ఇదిగో మరకని వేలెత్తి చూపనిస్తాడా?! చూపుడు వేలుపై ప్రశ్నను మొలవనిస్తాడా?? * దీపాలు వెలిగే దారుల్ని
కవిత్వం

ఆట పాటల రూపు

ఆట వైతివా అన్న పాట వైతివా జనహోరు గుండెల్లో రాగమైతివా ధన ధన మోగెడప్పు దరువువైతివా...."2" ఎగిసేటి ఉద్యమాల గురువువైతివా...2" పొడిసేటి పొద్దుల్లో వెలుగుగైతివా "ఆట వైతివా" వెలివాడ బతుకుల్లో ఎట్టి చూసినవ్ ఏతలన్ని పోయే పోరు బాట వట్టినవ్ ప్రశ్నించే పాటవై మేలు కొల్పినావు .."2"... పాలకుల గుండెల్లో దండోరావైనవ్ " ఆట వైతివా" నల్లమల అడవులన్ని కలియతిరిగినవ్ నమ్ముకున్న పేదప్రజల గోసచూసినవ్ సమ సమాజ స్థాపన ధ్యేయమన్నవు..."2" అమరులే..ఆదర్శ మూర్తులన్నావు "ఆట వైతినా" పసిపాప నవ్వంత స్వచ్ఛమైంది స్వార్థమే లేనట్టి ప్రయాణం నీది సామ్రాజ్యవాదం పై పోరాటం నీది...."2" దాన్ని కొనసాగించే నినాదం మాది.
కవిత్వం

కొత్తాట నేర్చుకుందాం

ఆకురాలు కాలం,అడవిలో రాలుతున్న ఆకుల సవ్వడిఆ సవ్వడికిసుడిగాలి తోడవుతూఆ సుళ్ల చక్రబంధంలో రాలిన ఆకులుసుళ్లు తిరుగుతూ దుమ్ము లేపుతూగలగల పైకెగురుతున్న శబ్దాల మోత ఆ మోత మరే శబ్దాలను విననివ్వడమే లేదురాలిన ఆకులతో బోసిపోయిన అడవివన్నెలుడిగి, గ్రీష్మ తాపానికి తహతహలాడుతోంది.ఆరు రుతువులలో అడవిఆరు రకాలుగా ముస్తాబవుతోందికానీ, గ్రీష్మమే దాని వన్నెలన్నీ దోచుకుంటుందిచిందులన్నీ చెరిపివేస్తుంది.నిన్నటి వరకు పచ్చదనాన్ని కప్పుకున్న మానులన్నీఆకుల సోయగాలు మటుమాయమైనట్టే,బోసిపోయిన అడవి పల్చబడిందా అనే సందేహం....లేదుకదూ!పచ్చని ఆకులు పండుటాకులై రాలడం సహజంరాలిన ఆకులు ఎండటం,ఎండిన ఆకులు ఎలుగడితో కాలడం అడవిలో అంతకన్నా సహజంఆకులు రాలిన చెట్లు వసంతంలోచిగురిస్తాయి, అడవి వన్నెలన్నీ మళ్లీ మొదలవుతాయిచిగురించిన ఆకులు, మొగ్గ తొడుగుతాయి,మొగ్గలు,
కవిత్వం

కోయ కవితలు రెండు

విప్లవం ఒక చిన్నారిని కవిగా మలిచింది . విప్లవకారుడిగా తీర్చి దిద్దింది . ఈ కవి సల్వాజుడుం రోజుల్లో తల్లి వేలు పట్టుకొని వచ్చి బీ.ఆర్.ను తొలిసారి చూశాడు , తరువాత ఉద్యమంలో చేరాడు. కంప్యూటర్ గురూజీగా పేరు పొందిన సుప్రసిద్ధ రచయిత్రి, అమర యోధ రేణుక అలియాస్ మిడ్కో వద్ద కంప్యూటర్ శిక్షణ పొందాడు. 1 . మా ప్రాణం బీ.ఆర్నా కళ్ల నుండి నెత్తుటి ధారలునేల రాలుతుంటే,నీ త్యాగం, నీతో, నే గడిపిన క్షణాలనుపదే పదే గుర్తు చేస్తున్నాయినీతో గడిపిన ప్రతి క్షణంనాలో నీ త్యాగాన్ని ఎత్తిపడుతోందినీ అమర స్మృతులనువిశ్వ పీడిత ప్రజ సదా స్మరిస్తారురణభూమిలో
కవిత్వం

ఇద్దరు స్త్రీలు కలిసి చాయ్ తాగినప్పుడు..

లోకంలో అంతా బానే ఉంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి టీ తాగినప్పుడు కాలం ఊపిరి బిగబెడుతుంది అనాస పువ్వు మెరుస్తుంది అల్లం ఆవిరైపోతుంది నిమ్మగడ్డి తిరగబడుతుంది దాల్చన చెక్క చేయవలసినదానికన్నా తక్కువ పాపం చేస్తుంది బోధి ధర్మ మేల్కొంటాడు ఇద్దరు స్త్రీలు కలిసి చాయ్ తాగినప్పుడు వాయువీణలు కంపిస్తాయి, డోళ్ళు దొర్లిపోతాయి,మనసు హృదయాన్ని కలుస్తుంది, భాగం సంపూర్ణమవుతుంది,ఇద్దరు మహిళలు కలిసి టీ తాగినప్పుడుమందుల దుకాణం వారు నవ్వుతారు, మద్యం సర్వ్ చేసేవారు రాగం తీస్తారు పీఠాధిపతులు ధర్మశాస్త్రాలు ఉటంకిస్తారు నీలగిరి డార్జిలింగ్ను కలుస్తుంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చాయ్ తాగినప్పుడు పచ్చని నురుగు, రత్నపు మంచు,పురాతన కడాయి, స్నేహ
కవిత్వం

భూమిని మాటాడనివ్వు…

మనమింకా‌ బతికే వున్నామా? ఇదేదో‌ భేతాళుని‌ భుజాన‌ వేలాడే రాజు ప్రశ్న కాదు వాదనలు‌ ముగిసిన‌ వేళ వాడొక్క మాటతో‌ ఫుల్ స్టాప్ పెట్టేసే వేళ అటూ ఇటూగా సరిపెట్టుకుంటే నువ్వూ నేనూ కోల్పోయేదేమీ లేదు వాడి తుపాకీ‌ మొన ముందు వారి మానం ఛిద్రమైన వేళ కోర్టుల ముందు నగ్నంగా నిలబడిన తల్లులను వంచించిన నీ న్యాయం నీకు నైతిక విజయమా? కోల్పోయిన మానానికి కళ్ళు లేని‌ న్యాయం ధర కడుతుందా? తాను రుజువు చేయలేని ఆ పదముగ్గురినీ వాకపల్లిలో నిలబెడితే న్యాయమేదో బిగ్గరగా వినబడేది కదా? పదారేళ్ళ నీ విచారణకు తమ కొంగు చివర కట్టుకున్న
కవిత్వం

కిటికీ

జైలు గదుల ఉక్కపోతల నుండి ఉపశమనం కోసం అతడు కిటికీ తెరిచాడు ఎదురుగా సముద్రం... బయటి సముద్రం లోపటి సముద్రం అలయ్ బలాయ్ తీసుకున్న చోట ఆకాశం నక్షత్ర కాంతుల వెదజల్లింది సహనానికి మారు పేరైన భూమి తన విముక్తి కోసం సంకెళ్లకు చేతులిచ్చి సహనంగా ఎదురుచూసే రేపటిలోకిచూపులు సారించే మానవ మహా సంకల్పానికి జే జే లు పలికింది