ఆర్ధికం

టారిఫ్‌ ఉత్పాతానికి షేర్‌మార్కెట్‌ పతనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతోన్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచమంతటా నెలకొంది. వాణిజ్య యుద్ధానికి తెర లేపి ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లను కుప్పకులేలా చేసిన ట్రంప్‌ విధానాలు మరిన్ని ప్రమాదాలను సృష్టించనుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలకిందులు చేయాలన్న (డీ డాలకైజేషన్‌) సంకల్పం... అందువల్ల ట్రంప్‌ చర్యలతో అమెరికా భారీగా లాభపడుతుందన్న గుడ్డి విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసానంగా ఏప్రిల్‌ 3 నుంచి అంతర్జాతీయ
ఆర్ధికం

మందగమనంలో ఆరిక్థ వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థపై అతిగా ప్రచారం చేస్తున్న ప్రధాని మాటలని నమ్మని పెట్టుబడిదారులు విశ్లేషకులు. దేశ ఆర్థిక  వ్యవస్థపై మోడీ సర్కారు గతంలో ఎన్నడూ లేని హైప్‌ను సృష్టిస్తున్నది. తమ పాలనలో భారత్‌ 5వ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పుకుంటున్నది. ఇదంతా తమ పాలనలో తీసుకున్న విధాన నిర్నయాల కారణంగానేనని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ నుంచి ఆ పార్టీ కీలక నాయకుల వరకు ఇదే మాటలు చెప్తున్నారు. టివీ డిబేట్లలో, సోషల్‌ మీడియాలో తమ, తమ అనుబంధ గోడీ మీడియా ద్వారా ఆర్థిక వ్యవస్థపై హైప్‌ను బిజెపి ఊదరగొడుతున్నది. అయితే, పెట్టుబడిదారుల్లో మాత్రం
ఆర్ధికం

ఆక్స్ఫామ్: ప్రజల్ని దోచేసున్న గుత్త సంస్థలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 20-25 తేదిలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్య్లూఇఎఫ్‌) 2025 వార్షిక సమావేశం తొలి రోజున (జనవరి 20) ఆక్స్‌ఫామ్‌ సంస్థ ‘టేకర్స్‌ నాట్‌ మేకర్స్‌’ పేరుతో ఆర్థిక అసమానతల నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడిరచింది. బిలియనీర్ల సంపద మునుపెన్నడు లేనంతగా పెరిగిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న ప్రజలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నారని నివేదిక నొక్కి చెప్పింది. రోజు రోజుకు ప్రపంచంలోని ధనిక, పేద ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. మానవజాతి చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఎరగని అసమానతలపర్వం ఇప్పుడు సమాజాన్ని
ఆర్ధికం

మందగమనంలో భారత ఆర్థిక వ్యవస్థ

కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం,  స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం,  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం..వంటి లక్ష్యాలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ కేవలం మాటల గారడీతో అభివృద్ధి సాధ్యం కాదని గత పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా చూశాం. మరోవైపు మోడీ ప్రచారానికి భిన్నమైన వాస్తవ దృశ్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్నాయి. వర్తమాన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను దట్టమైన చీకట్లు కమ్ముకొన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా క్షీణించిందనేదీ చేదు నిజం. వాస్తవానికి ‘ఆర్థిక వినాశనం’ అని చెప్పవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుంది.
ఆర్ధికం

‘బేరు’ మంటున్న రూపాయి

విశ్వగురుగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా రికార్డ్‌ పతనాన్ని చవి చూస్తోంది. 2014 మేలో డాలర్‌కు 63 రూపాయలుగా ఉన్న మారకం 2024 డిసెంబర్‌ నాటికి జీవితకాల కనిష్ట స్థాయి రూ.85.25కి పడిపోయింది. ఈ స్థాయిలో పతనం కావడం ముందెన్నడూ లేదు. చరిత్రలో ఇదివరకూ ఎప్పుడూ లేని విధంగా రూపీ క్షీణించడంతో పేద, సామాన్య ధనిక భారతీయులందరిపై ప్రత్యక్షంగా... పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస పతనంతో రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శనను కనబర్చుతోంది. గడిచిన ఐదేండ్లలో ఈ కరెన్సీ 20 శాతం పైగా పడిపోయింది.
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతోంది మోడీ ప్రభుత్వం. మోడీ మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 24 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా తగ్గింది. రుణభారం పెరిగిపోతోంది. విదేశీ నిధులు రావడం
ఆర్ధికం

 అస్తవ్యస్త ఆర్థికం – మానవాభివృద్ధి  డొల్ల

భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతున్న మోడీ సర్కార్‌... దీనికి భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 54 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా   తగ్గింది. రుణభారం పెరిగిపోతుంది. విదేశీ నిధులు రావడం లేదు. రూపాయి మారక విలువ పడిపోయింది. ప్రజల ఆదాయాలు తగ్గడంతో ప్రజల
ఆర్ధికం

సెబీలో ‘హిండెన్ బర్గ్’ తుఫాన్

 18 నెలల క్రితం అదానీ గ్రూప్ ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మరోసారి 'సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా' అంటూ 'ఎక్స్'లో ఆగష్టు 10న పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్స్, షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్  ఫండ్స్ లో, బెర్ముడా (బ్రిటిష్), సింగపూర్లో లో గౌతమి ఆదానీ అన్న వినోద్ అదానీ నెలకొల్పిన కంపెనీలో 'సెబి చైర్ పర్సన్' మాధవి పూరి బుచ్' తో పాటు ఆమె భర్త 'ధవళ్ బుచ్'
ఆర్ధికం

కొలువుల సంక్షోభం

అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడిరది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసతం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్‌ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ‘కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌( సిబిఐ) జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం నడుస్తున్న సంవత్సరం (2024) అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూస్తుందని వెల్లడిరచింది. ఫలితంగా 2024లో లక్షలాది ఉద్యోగాలకు కోత పడుతుందని తెలిపింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు 2023లో 3.9 శాతం ఉండగా 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని సిబిఐ వెల్లడిరచింది.
ఆర్ధికం

రుణ ఊబిలో ప్రపంచ దేశాలు

ప్రపంచ దేశాల రుణభారం ప్రమాదకర స్థాయిలో పెరగడం వల్ల ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఇవాళ ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు అసాధారణంగా 97 ట్రిలియన్‌ డాలర్ల రుణభారాన్ని కలిగి ఉన్నాయి. ఈ మొత్తం దాదాపు ప్రపంచ వార్షిక ఆర్థిక ఉత్పతి కంటే ఎక్కువ. 2023లో అభివృద్ధి చెందుతున్న దేశాలు 847 బిలియన్‌ డాలర్ల వడ్డీని చెల్లించాయి. ఇలాంటి ఆర్థిక ఒత్తిళ్ల మధ్య భవిష్యత్‌ ఆలోచనలను కార్యరూపం దాల్చేలా వ్యవహరించడం కష్టతరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక మాంద్యం, మహమ్మారి లేదా ప్రకృతి విపత్తులు వంటి షాక్‌లకు ప్రభుత్వాలు శీఘ్రంగా స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తున్నాయని తాజాగా ఐఎంఎఫ్‌