కరోనా అయితేనేం..? కుబేరులకు కాసుల పంటే
భారత్లో ప్రజావ్యతిరేక కార్పొరేటు అనుకూల మోడీ ప్రభుత్వ విధానాల వల్ల అత్యధిక ప్రజలు కొనుగోలు, ఆదాయాలను కోల్పోతోంటే అపర కుబేరులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నారు. మార్చి 2న హురున్ గ్లోబల్ 10వ వార్షిక నివేదిక రిచ్ లిస్టు 2021 భారత్లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 209కి చేరిందని తెలిపింది. 100 కోట్ల డార్ల సంపద కలిగి ఉన్న వారిని బిలియనీర్ అంటారు. ప్రస్తుత డాలర్ మారకం రేటు ప్రకారం రూ.7400 కోట్ల పైమాటే. మొత్తం 209 మందిలో 177 మంది బిలియనీర్లు భారత్లోనే నివసిస్తుండగా మిగిలిన వారు విదేశాల్లో స్థిరపడ్డట్లు నివేదిక వెల్లడించింది. అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల