కాలమ్స్ ఆర్ధికం

అసమానతల భారతం

'మన ప్రజాస్వామ్యం మేడిపండు... మన దరిద్రం రాచపుండు' అన్నాడోక కవి. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఎందువల్లనంటే ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడ భారతదేశంలో పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా  సామాన్యుల బతుకులు మారడం లేదు. దేశాన్ని దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు దేశ సంపదను దోచుకుని విదేశాలకు తరలించడం, స్విస్‌ బ్యాంకుల్లో వేల కోట్ల నల్లధనాన్ని దాచిన జాతీయ నాయకులు మళ్లీ ప్రజలలోకి వచ్చి దేశానికి సేవ చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. గత పాలకుల శాపమే నేటికీ పేదరికం వేధిస్తున్నదని
కాలమ్స్ ఆర్ధికం

ఎందుకీ ఆర్డినెన్సులు ?

మోడీ ప్రభుత్వం పార్లమెంటుతో, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే నిస్సిగ్గుగా తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కొరకే  చట్టాలు చేస్తోంది. సమకాలీన రాజకీయాలు ప్రజలను, పార్లమెంటును విస్మరిస్తున్నాయి. నవంబర్‌ 26 నుంచి శీతకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ, ఆ సమావేశాల ప్రారంభానికి పది రోజుల ముందే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌ చట్టం 2003, ఢిల్లీ  స్పెషల్‌ పోలీసు ఎష్టాబ్లిష్‌మెంట్‌ చట్టం 1941ల సవరణలతో నవంబర్‌ 15న ఇడి, సిబిఐ డైరెక్టర్ల గరిష్ట పదవి కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ రెండు ఆర్డినెన్సులు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన
కాలమ్స్ ఆర్ధికం

శ‌ర‌వేగంగా పెరుగుతున్న అస‌మాన‌త‌లు

బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల నుంచి భారత పాలకవర్గాలైనా దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు అధికార మార్పిడి జరిగి 75 ఏండ్లు కావస్తోంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ అని ఘనంగా పాలకవర్గాలు చెబుతున్నాయి. అయినా ఈ దేశ ప్రజలు కనీసం కడుపు నిండా తిండిలేక, ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి సరిపోయే బట్టలేక, సరైనా వైద్యం అందక, నాణ్యమైన విద్య లేక కోట్లాదిమంది సతమతమవుతున్నారు. నోరున్నా న్యాయం కావాలని అడగలేని అభాగ్యులు కోటాను కోట్లు ఉన్నారు. దీనికి కారణం మన పాలకుల అప్రజాస్వామిక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, ఫాసిస్టు అణచివేత ధోరణులు అని స్పష్టమవుతోంది. అన్ని
కాలమ్స్ ఆర్ధికం

ఇండో- పసిఫిక్ లో ఆకస్ చిచ్చు

ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న అగ్రరాజ్యాలు భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో తమకనుకూలమైన రీతిలో కూటములు ఏర్పరచుకుంటున్నాయి. ఆఫ్ఘాన్ నుంచి అవమానకరమైన రీతిలో నిష్క్రమించిన అగ్రరాజ్యం అమెరికా పోయిన పరువును నిలుపుకోవడానికి నానా తంటాలు పడుతుంది. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల రక్షణ కూటములు కడుతున్నది. పులి మాంసం తినడం మానేసిందన్నట్లు ఇక యుద్ధం ముగిసింది అంటూనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త పన్నాగంతో సెప్టెంబర్ 15న బ్రిటీష్, ఆస్ట్రేలియాతో కలిసి చేసుకున్న మిలిటరీ ఒప్పందానికి ఆ మూడు దేశాల పేర్లు గుది గుచ్చి 'ఆకస్'గా వ్యవహరించబోతున్నారు. దీంతో అమెరికాకు యూరోపియన్ యూనియన్ తో ఇంతకాలం ఉన్న సత్సంబంధాలు బెడిసి కొట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు
కాలమ్స్ ఆర్ధికం

మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు

మూడు దశాబ్దాల‌ క్రితం ప్రవేశపెట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు వృద్ధిని పెంచాయి కాని ఉపాధిని పెంచలేదు. సంపద పెరిగింది కాని పంపిణీ జరుగలేదు. పెట్టుబడులు పెరిగాయి కానీ అవి ఉత్పత్తి రంగంలో కాకుండా సేవా రంగాల్లోకి వెళ్లాయి. ఆర్థిక సంస్కరణల తదుపరి పలు ప్రభుత్వ రంగాల నుంచి తన వాటాను ఉపసంహరించుకుంటున్న కారణంగా ప్రభుత్వ రంగంలో ఉపాధి సన్నగిల్లింది. ఫలితంగా రిజర్వేషన్‌ సదుపాయం అట‌కెక్కింది. సామాజిక న్యాయం పాతాళానికి తోయబడింది.  మరోవైపు ప్రభుత్వమే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానాలకు ఒడిగట్టడంతో తక్కువ వేతనాలకు కార్మికులు పనిచేస్తున్నారు. దేశ ప్రగతిని మానవాభివృద్ధిలో కాకుండా ఆర్థిక వృద్ధితో అంచనా వేస్తున్నారు.
కాలమ్స్ ఆర్ధికం

సంప‌ద ఒక వైపు – ఆక‌లి మ‌రో వైపు

ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు ఆర్థిక సంక్షోభం... కారణాలేమైనా దేశంలో సగటు జీవుల‌ బతుకు ఆగమైంది. ఉపాధికి దూరమై, ఆదాయం లేక పస్తులుంటున్నారు. ఆకలి అనేది ప్రభుత్వాల దుష్టత్వానికి నిదర్శనం. ఆకలి సమస్యను పరిష్కరించే చర్యలకు పాలకులు పూనుకోకపోవడం విషాదం. ఆకలితోనో, పోషకాహార లోపంతోనో మరణించడానికి కారణం తగినన్ని ఆహారధాన్యాలు లేకపోవడం కాదు. ఏప్రిల్‌ 2021 నాటికి దేశంలో 564.22 లక్షల టన్నుల ఆహార నిల్వలున్నాయి. ఆకలితో ఉన్నవారికి ఆహార పదార్థాల్ని అందించలేని పాలకుల వైఫల్యం. సమాజ మనుగడకు  విరామ మెరుగక పరిశ్రమిస్తూ మానవజాతి పురోగమనానికి దారులు వేస్తున్న ప్ర‌జ‌ల  ఆకలి చావు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం
కాలమ్స్ ఆర్ధికం

ఎవ‌రి ఉద్దీపన?

కరోనా వ్యాధి మానవ జీవితాల్ని చిదిమి వేస్తున్నది. భవిష్యత్‌ ఎలా ఉంటుందోనన్న భయం ఆందోళన కలిగిస్తున్నది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరం ఉన్నవారికి సాయం చేయడం, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా  పాలకుల ప్రాథమిక కర్తవ్యం. అందువల్ల కరోనా కష్టకాలం నుంచి ప్రజలను ఆదుకోవడం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. మానవతా దృష్టితో చూసినా ఈ సంక్షోభ సమయంలో బాధిత ప్రజలకు అండగా నిలువడం అత్యంతావశ్యకం. యూరప్‌, అమెరికా వంటి దేశాల్లో ఆచరిస్తున్న విధానాన్ని సైతం పక్కన పడేసి నాటు వైద్య పద్ధతుల నాశ్రయించడం మోడీ ప్రభుత్వ విధానంగా ఉంది.  కొవిడ్‌ వ్యాధిని నియంత్రించడంలో గానీ, బాధితులను
కాలమ్స్ ఆర్ధికం

ఆధిపత్య లక్ష్యంతో బైడెన్‌ విదేశాంగ విధానం

అమెరికా అధ్యక్ష పీఠంపై  ఎవరున్నా దాని సామ్రాజ్యవాద విధానాల్లో మార్పు ఉండదన్న విషయాన్ని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ తన భౌగోళిక రాజకీయ విధానాల ద్వారా రుజువు చేస్తున్నారు. ట్రంప్‌ విధానాల వల్ల దూరం జరిగిన మిత్రులను ఒకటి చేసే పనిలో బైడెన్‌ నిమగ్నమై ఉన్నారు. కొంత కాలంగా జి-20 దేశాల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా అమెరికా నాయకత్వంలోని పాత సామ్రాజ్యవాద కూటమి అయిన జి-7 దేశాల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక తిరిగి అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం పాత మిత్రులందరిని సమన్వయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు..
కాలమ్స్ ఆర్ధికం

ఉపాధి డమాల్

కరోనా సెకెండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతి మనిషి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న దయనీయ స్థితి. ఒకవైపు జనాలు పిట్టల్లా రాలుతుండడంతో చావు భయం వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని భయానక వాతావరణంలో భారతీయ సమాజ జీవనం సాగిస్తోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భయాందోళన రాజ్యమేలుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో విఫల ప్రభుత్వంగా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్‌కు కూడా ఇప్పుడు ఊపిరాడడం లేదు. అన్ని వైపుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో మోడీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ స్థితిలో అంతర్జాతీయ పత్రికలు మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని
కాలమ్స్ ఆర్ధికం

భావ స్వేచ్ఛ‌కు డిజిటల్ సంకెళ్లు

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ప్రచార ఉధృతిలో చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. సామాన్యులకు, సంక్షోభంలో ఉన్న రైతులకు, అణగారిన వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగే ఒక్క చర్య చేపట్టలేదు. సమర్థ పాలన స్థానే అసమర్థత, ఏ మాత్రం పారదర్శకత, సమిష్టి నిర్ణయాలు లేని, నియంతృత్వ పోకడలున్న పాలకుడే మోడీలో కనిపిస్తాడు. కొవిడ్ మహమ్మారి విలయ తాండవం చేసిన, చేస్తున్న కాలంలోనూ మోడీ, ఆయన లెప్టినెంట్ అమిత్ షాల అనాలోచిత, ప్రజావ్యతిరేక చర్యలు దేశ అభివృద్ధిని అతలాకుతలం చేశాయి. మోడీ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి.