ఆర్ధికం

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న మాంద్యం

కొవిడ్‌ తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో  పులి మీద పుట్రలా యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం రావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుంగిపోతుందన్న భయాలు పెరుగుతున్నాయి.  ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లూటిఓ) మాంద్యం తప్పదని హెచ్చరిస్తోంది. డాలర్‌ దెబ్బకు  ప్రపంచ దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. డాలర్‌ డామినేషన్‌ దినదినం పెరుగుతోంది. ప్రపంచం మరో ఉత్పాతానికి దగ్గరగా చేరుకుంటోంది. ద్రవ్యోల్బణం, రుణభారం,  మాంద్యం ఒకపక్క,  ఇంధన కొరతలు,  ఆకలికేకలు,  ఎంతకీ వీడని కొవిడ్‌ వైరస్‌,  యుద్ధ ప్రభావం మరోవైపు కలిసి ఏకకాలంలో మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాంద్యం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది 2008 ఆర్థిక సంక్షోభమే.
కాలమ్స్ ఆర్ధికం

కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం

''వట్టిమాటలు కట్టిపెట్టవోయ్‌ గట్టిమేలు తలపెట్టవోయ్‌'' అన్నారు మహాకవి గురజాడ. కానీ, దీనికి విరుద్ధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లుగా వ్యవహారిస్తోంది. మోడీ అసత్యాలు, అర్థ సత్యాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో సుపరిపాలన అందించానని, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకున్నానని, బయో-ఎకానమీ 8 రెట్లు వృద్ధి చెందినట్లు మోడీ స్వయంగా ప్రకటించాడు. మరోవైపు పర్యావరణ నిబంధనలు 'అభివృద్ధికి ఆటంకం' అని మోడీ చెబుతున్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఇది డొంక తిరుగుడుగా మద్దతు పలుకడమే అవుతుంది. నిజానికి బయో-ఎకానమీ అంటే పర్యావరణానికి హానిచేసే శిలాజ ఇంధనాల వాడకం నుండి
ఆర్ధికం

అసమానతలు చంపేస్తున్నాయి… ఆక్స్ ఫామ్

 ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్‌ తాజా నివేదిక ‘ఇన్‌ ఇక్వాలిటి కిల్స్‌’ను ఏప్రిల్‌ 17న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రోజుకు వేలమంది మరణాలకు కారణమైన హింసాత్మక ఆర్థిక విధాన ఫలితంగా అసమానతలు తీవ్రమయ్యాయి. అత్యంత సంపన్నులు-పేదల మధ్య అంతరం బాగా పెరిగింది. పెరుగుతున్న అసమానత వల్ల మహిళలు, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కొవిడ్‌ విపత్తుకు ప్రతిస్పందనగా అసమానతలు పెరగడానికి దారితీసిందని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంక్‌, సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ అంచనాలపై, పరిశోధనలపై ఆధారపడి ఆక్స్‌ఫామ్‌ తన నివేదికను రూపొందించింది.  నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు దేశాన్ని
కాలమ్స్ ఆర్ధికం

శ్రమజీవుల రణన్నినాదం

                                                                                          'ప్రజలను కాపాడండి- దేశాన్ని రక్షించండి' అన్న ప్రధాన నినాదంతో కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై మార్చి 28, 29 తేదీలలో రెండు రోజుల సార్వత్రిక సమ్మెతో దేశ కార్మికవర్గం సమర శంఖం పూరించింది. బిజెపికి అనుబంధంగా ఉన్న బి.ఎం.ఎస్‌ తప్ప మిగిలిన పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యలు, సంఘాల సంయుక్త వేదికలు పిలుపునిచ్చిన రెండురోజుల సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం 'ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మనీయం... దేశాన్ని కాపాడుకుంటాం.. ప్రజల్ని రక్షించుకుంటాం... కార్మిక కోడ్‌లను తిప్పికొడతాం... కార్మిక చట్టాలలో ప్రతిపాదిత మార్పులను రద్దు చేయాలి, ఏ రూపంలో
ఆర్ధికం

యుద్ధ ఆవరణలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

  యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా, ఇయు, నాటో దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనున్నాయి. కొవిడ్‌ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు భారీగా ధన వ్యయం చేశాయి. అదిప్పుడు ద్రవ్యోల్భణానికి దారి తీస్తోంది. కొవిడ్‌ కాలంలో దెబ్బతిన్న సరఫరా గొలుసులు ఇప్పటికి పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. గోరు చుట్టుపై రోకలి పోటులా ఇంతలోనే యుక్రెయిన్‌ సంక్షోభం వచ్చి పడింది. యుద్ధం ఎంత ఎక్కువ కాలం సాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతగా నష్టం వాటిల్లనుంది. యుద్ధం దీర్ఘకాలం
ఆర్ధికం

ఆహార నిల్వలున్నచోట  అకలి కేకలు

 ఎ.నర్సింహారెడ్డి           వ్యవసాయ రంగంలో వినూత్న పరిశోధనల ఫలితంగా పంటల ఉత్పత్తి పెరుగుతున్నా నేడు చాలా దేశాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న దీనదృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు పర్యావరణ విధ్వంసం, వీటికి తోడు అనేక దేశాల్లో అంతర్గత యుద్దాలు వెరసి ఆహారకొరత కోట్లాది మంది జీవితాలను నరకంగా మారుస్తున్నది. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిగ్గుతేల్చాయి. తగిన పోషకాహారం అందక పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోనూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట
కాలమ్స్ ఆర్ధికం

పెరుగుతున్న అస‌మానతలు పెట్టుబడి దోపిడీకి సంకేతం

ఆదాయం, సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో
కాలమ్స్ ఆర్ధికం

విస్ఫోటనంలా నిరుద్యోగం, పేదరికం

నూతన సంవత్సరానికి ఒమిక్రాన్‌ స్వాగతం పలుకుతున్నది. గత సంవత్సరం కొవిడ్‌ మిగిల్చిన చేదు అనుభవాలను గుర్తు చేసుకోవాలంటే భయమేస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం తెంపేసింది. మానవత్వాన్ని మంట గలిపింది. మర్చిపోలేని బాధలను మిగిల్చింది. ఆప్తులను కోల్పోయాం. కడసారి చూపుకు నోచుకోలేకపోయాం. అంత్యక్రియలు అనాథల తరహాలో జరిగాయి. ప్రజల ఆశలను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఛిద్రం చేసింది. కోట్లాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉపాధి పోయింది. మానవ సంబంధాలు మారిపోయాయి. పేదలు నిరుపేదలు అయ్యారు. కానీ, అదానీ, అంబానీ వంటి సంపన్నుల సంపద అనూహ్యంగా పెరిగింది. అందుకే నూతన సంవత్సరం ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశలు లేవు. సెకండ్‌
కాలమ్స్ ఆర్ధికం

అసమానతల భారతం

'మన ప్రజాస్వామ్యం మేడిపండు... మన దరిద్రం రాచపుండు' అన్నాడోక కవి. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఎందువల్లనంటే ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడ భారతదేశంలో పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా  సామాన్యుల బతుకులు మారడం లేదు. దేశాన్ని దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు దేశ సంపదను దోచుకుని విదేశాలకు తరలించడం, స్విస్‌ బ్యాంకుల్లో వేల కోట్ల నల్లధనాన్ని దాచిన జాతీయ నాయకులు మళ్లీ ప్రజలలోకి వచ్చి దేశానికి సేవ చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. గత పాలకుల శాపమే నేటికీ పేదరికం వేధిస్తున్నదని
కాలమ్స్ ఆర్ధికం

ఎందుకీ ఆర్డినెన్సులు ?

మోడీ ప్రభుత్వం పార్లమెంటుతో, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే నిస్సిగ్గుగా తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కొరకే  చట్టాలు చేస్తోంది. సమకాలీన రాజకీయాలు ప్రజలను, పార్లమెంటును విస్మరిస్తున్నాయి. నవంబర్‌ 26 నుంచి శీతకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ, ఆ సమావేశాల ప్రారంభానికి పది రోజుల ముందే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌ చట్టం 2003, ఢిల్లీ  స్పెషల్‌ పోలీసు ఎష్టాబ్లిష్‌మెంట్‌ చట్టం 1941ల సవరణలతో నవంబర్‌ 15న ఇడి, సిబిఐ డైరెక్టర్ల గరిష్ట పదవి కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ రెండు ఆర్డినెన్సులు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన