ఏడాదిగా కగార్ విధ్వంసం
కేంద్ర హోం మంత్రి అమిత్షా గత ఏడాది డిసెంబర్ 13 నుంచి మూడు రోజులు చత్తీస్ఘడ్లో పర్యటించాడు. ఆ సందర్భంగా ఆయన ‘మావోయిస్టు రహిత భారత్ అనే స్వప్నం సాకారమవుతోంద’ని అన్నాడు. ‘మావోయిస్టులందరినీ చంపేయడానికి భద్రతా బలగాలు సిద్ధంగా, ఉత్సాహంగా ఉన్నాయ’ని అన్నాడు. ఆ తర్వాతి రోజు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. అక్కడ బాబాసాహెబ్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మొదటి మాట ఆదివాసీ హక్కుల గురించి, మావోయిస్టు ఉద్యమం గురించి పట్టించుకునేవారికే వినిపించింది. మిగతా వాళ్లకు కూడా వినిపించే ఉండొచ్చు. కానీ మౌనం పాటించారు. తెలుగు సమాజంలోని గౌరవనీయ పాత్రికేయులు, మేధావులు, రచయితలు ఇందులో మొదటి వరుసలో