సంపాదకీయం

ఎన్నికల తరువాత ..

‘ఎన్నికల వేడి’ అంటారు కదా. అది ఎన్నికలయ్యాక చల్లారిపోతుంది. మళ్లీ ఏవో ఎన్నికలు వచ్చే దాకా అంతా చల్లదనమే. పోలింగ్‌ పాలకుల తలరాత మారుస్తుంది. కొత్త వాళ్లు అధికారంలోకి రావచ్చు. పాత వాళ్లే కొనసాగవచ్చు. అద్భుతాలు జరిగినా, జరగకపోయినా ఏదో ఒక రకంగా ‘పాలించడబడటం’ ప్రజలకు మామూలవుతుంది. వేడి చల్లారిపోవడం, కొత్తపోయి పాతపడటం  అంటే ఇదే. కాకపోతే మొన్నటి సాధారణ ఎన్నికలకు కొంత ప్రత్యేకత ఉంది. ప్రధాన స్రవంతి పత్రికల్లో కూడా ఇది కనిపించింది. బీజేపీ కూటమికి, ఇండియా కూటమికి మధ్య భావజాల ఘర్షణగా కూడా  చూశాయి. నిజానికి ఇది దిన పత్రికలకు అందే వ్యవహారం కాదు. వాటి  
సంపాదకీయం

అనాగరిక అన్యాయ నేర చట్టాలు

ఇంకో అయిదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా బిజెపి ప్రభుత్వం భారతదేశ క్రిమినల్‌ చట్టాలను మారుస్తూ పార్లమెంటులో బిల్లు పాస్‌ చేసుకుంది. అప్పుడు 143 మంది సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్నారు. పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదు. ప్రజా జీవితాన్ని ఎంతగానో శాసించే ఈ చట్టాల కోసం ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాత ప్రభుత్వానికి మూడొంతుల మెజారిటీ లేదు. కనుక ప్రతిపక్ష సభ్యుల మద్దతు లేకుండా చట్టాలు చేయలేదు. అయితే దానికి మెజారిటీ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన మూడు నేర చట్టాలు జులై 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ
సంపాదకీయం

విభజన చట్టం చంద్రబాబుకు గుర్తుందా?

ఈ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌ ఎడాపెడా వాగ్దానాలు చేశారు. ఇద్దరూ చాలా సౌకర్యంగా ఒకటి మర్చిపోయారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు చేసిన విభజన చట్టం. దానికి పదేళ్ల వయసు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ‘నవ్యాంధ్ర’ను నిర్మిస్తానన్నాడు. కానీ విభజన చట్టం గురించి ఊసెత్తలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్‌ రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు. విభజన చట్టం నోరెత్తలేదు.  చెరి ఐదేళ్లు వంతులవారి రాష్ట్రాన్ని పాలించారు. ఈ పదేళ్లలో తాయిలాలకు లోటు లేదు. ఉచితాలకు అంతులేదు. పోటీపడి సామాజిక పింఛన్లు వాగ్దానాలు చేశారు. తోచిన వరకు ఇచ్చారు. కానీ
సంపాదకీయం

ఈ ఎన్‌కౌంటర్‌లు మనకు పట్టవా?

మే 10వ తేదీన బీజాపూర్‌ జిల్లా పిడియా అడవుల్లో జరిగినట్లు చెప్పబడుతున్న ఎన్‌కౌంటర్‌లో 12 మంది మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ 12 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉండే అవకాశం ఉందని, ఈ ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్‌, దంతేవాడ, సుకుమా జిల్లాల ఎస్‌పిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, వీరితోపాటు ఐజి సుందర్‌రాజ్‌ నిరంతరం సంబంధంలో ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నాడని, ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో 10వ తేదీ ఉదయానికి ఆరుగురు చనిపోయినట్లు తెలిసిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒక టివి చానెల్‌ ఎంతో ఉద్యోగపూరితంగా ప్రసారం చేసింది. స్టూడియో నుంచి ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఉన్న సచిన్‌ అనే
సంపాదకీయం

మోడీ, ముస్లింలు – అర్బన్ మావోయిస్టులు

ఆస్తి పునః పంపిణీ (జిత్‌నే ఆబాదీ ఉత్‌నే హక్‌). ముస్లింలకు రిజర్వేషన్‌ అనే అంశాలపై ప్రధాని మోడీ రాజస్థాన్‌లో ఏం మాట్లాడాడో, స్వయంగా ఆయననోట దేశంలో చాల మంది ఇప్పటికే విని ఉంటారు. అది కాంగ్రెస్‌ మానిఫెస్టో కాదు ముస్లింలీగ్‌ మానిఫెస్టో అని అంతకన్నా అర్బన్‌ మావోయిస్టుల మానిఫెస్టో అని ఆయన అన్నాడు. అంటున్నాడు. గుజరాత్‌ శాసన సభ ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఇప్ఫుడు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో లోక్‌సభలు ఎన్నికల దాకా ఆస్తి పునః పంపిణీ అర్బన్‌ మావోయిస్టుల ప్రతిపాదన అని ఆయన పునరుద్ఘాటిస్తున్నాడు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపాయికి, అద్వానీకి కూడ ఐడియాలాగ్‌ (సిద్ధాంత
సంపాదకీయం

కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర కోసమే కగార్‌

కొన్ని కొత్త పదాలు మన చెవిన పడేనాటికే అవి జీవితంలో భాగమైపోతాయి. జరగాల్సిన విధ్వంసమంతా జరిగిపోతుంది. మనం ఆ తర్వాత ఎప్పటికో గుర్తిస్తాం. పాలకులు ఒక పథకం ప్రకారమే ఈ పని చేస్తారు.  ఫాసిస్టు పాలకులైతే ఇక చెప్పనవసరమే లేదు. ఏ వైపు నుంచి ఎట్లా కమ్ముకొని వస్తారో ఊహించలేం. మనం దేనికది విడిగా విశ్లేషించుకుంటూ, ఒక్కోదాంట్లో తలమునకలవుతుంటాం. వాళ్లు మాత్రం అన్నిటినీ కలిపి ప్రజలపై ఎక్కుపెడతారు. దీన్ని మనం తెలుసుకోవడం ఏమోగాని అడుగడుగునా మనల్ని అనేక సందేహాలు వెంటాడుతుంటాయి.  ఏది హిందుత్వ? ఏది సనాతన? ఏది కార్పొరేటీకరణ? ఏది సైనికీకరణ? వాటి మధ్య సంబంధమేమిటి? తేడాలేమిటి? అనే
సంపాదకీయం

టీఎం కృష్ణ: కళా సాంస్కృతిక చర్చా సందర్భం

లోకం పట్టని ఒక చిన్న ప్రపంచంలోకి దేశ రాజకీయాలన్నీ వచ్చి చేరాయి. శిష్టులకు తప్ప ఇతరులకు చోటులేని రంగం గురించి మామూలు మనుషులు మాట్లాడుతున్నారు. భక్తిమార్గానికి తప్ప మరి దేనికీ అవకాశం లేని కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని కొత్త ప్రమాణాలు పరీక్షిస్తున్నాయి.  రసజ్ఞులకే పరిమితమైన  ఇహపరాలను దాటి ఇదంతా సామాజిక చర్చా సందర్భమైంది. దీనికంతా కారణం టిఎం కృష్ణ అనే కర్ణాటక సంగీత విద్వాంసుడికి మద్రాసు సంగీత అకాడమీ ‘సంగీత కళానిధి’ అనే అవార్డు ప్రకటించడం. దాని మీద ఆ రంగంలోని ప్రముఖులు నిరసన తెలపడం.  వాళ్లు సంగీత అకాడమీ  తమకు అంతక ముందు  ఇచ్చిన అవార్డులను వెనక్కి
సంపాదకీయం

2024 ఎన్నికలు – హిందూ రాష్ట్ర స్థాపన

ఇప్పుడు దేశంలో ఎన్నికల కాలం నడుస్తున్నది. గత కొంత కాలంగా సాగుతున్న ఓట్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 2024 ఎన్నికలు ఈ దేశ  గమనాన్ని  నిర్ణయిస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, మరోసారి ఆ పార్టీ వస్తే దేశం ఏమైపోతుందని ఆందోళనపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  మూడోసారి  బిజెపీ అధికారంలోకి రావడం అంటే ‘హిందూ రాష్ట్ర’ స్థాపన అధికారికంగా ప్రారంభం కావడమే. ఇప్పటికే దానికి అవసరమైన సన్నాహాలను బీజేపీ పూర్తి చేసుకున్నది. సకల సాధనాలను ఉపయోగిస్తున్నది.  మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని నిర్ణయించే ఎన్నికలు కూడా
సంపాదకీయం

రాముడ్ని కాదు, రైతును చూడండి

ప్రతి ఉద్యమం సమాజానికి ఒక మేల్కొలుపు వంటింది. అది వాస్తవ పరిస్థితి పట్ల కళ్లు తెరిపించి మార్పు కోసం దారి చూపిస్తుంది. అయోధ్య రామున్ని అడ్డం పెట్టి హిందూ మెజారిటీని భక్తితో, ముస్లింలు తదితర మైనారిటీలను భయంతో కళ్లు, నోరు మూసుకునేలా చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంది బిజెపి. పాత ఎత్తుగడే కానీ ఇప్పుడు ఇనుమడిరచిన ఉత్సాహంతో, మీడియాను తన వశం చేసుకున్నాక రెట్టించిన బలంతో పాచిక వేసింది. రాముడొచ్చాడు అని దిక్కులు మోగేలా అరిచింది మీడియా. రాముడొచ్చాడు కాచుకోండి అన్నారు ఫాసిస్టులు. ఆ భజన మోతలో, ఆ ఆర్భాటంలో మణిపూర్‌ల కేకలు వినపడలేదు, అదానీల దోపిడి కనపడలేదు. ఇంకా
సంపాదకీయం గెస్ట్ ఎడిటోరియల్

రాజ్యాంగాన్ని, రాజ్యాంగవాదాన్ని విమర్శించకూడదా?

విజయవాడలో ఇటీవల జరిగిన 29 వ మహాసభల సందర్భంగా విరసం ఒక కీనోట్‌ పేపర్‌ను విడుదల చేసింది. దాని శీర్షిక ‘‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’’. ఆ కీనోట్‌ పేపర్‌ ను కా.పి. వరలక్ష్మి మహాసభల్లో ప్రవేశపెట్టారు. దానిపై మహా సభలు ప్రారంభం కాకముందే చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాతా మౌఖిక, లిఖిత రూపాల్లో అనేక ప్రతిస్పందనలు వెలువడ్డాయి. ఆ ప్రతిస్పందనలలో విరసాన్ని తప్పుపడుతూ ఈ కింది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.                                                                        విరసం రాజ్యాంగవాదాన్ని విమర్శిస్తున్నదంటే అంబేద్కర్‌ను విమర్శిస్తున్నట్టని, రాజ్యాంగం ద్వారా అందాల్సిన హక్కులు, రక్షణలు దళితులకు, పీడిత సమూహాలకు దక్కకుండా చేసే ఉద్దేశం విరసానికున్నదని కొందరు భావించారు. రాజ్యాంగం