ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరని ప్రశ్నించి, ‘మానవ చరిత్ర వికాసాన్ని’ తిప్పి చూపిన శ్రీశ్రీని, ఆయన మహాప్రస్థానాన్ని ఈ రోజు (నవంబర్ 30న) తిరుపతిలో కొందరు పల్లకిలో ఊరేగించారు. ఈ కాలపు వికృత, జుగుప్సాకర సన్నివేశమిది. ఆదర్శాలు, విలువలు, విశ్వాసాలు తలకిందులుగా ఊరేగిన దృశ్యమిది. మారుమూల బొరియల్లో వినిపిస్తుండిన మూలుగులు నడిరోడ్డు మీద వికటాట్టహాసమైన తీరు ఇది. శ్రీశ్రీని నిలువునా పాతేసి ఆయన శవానికి చేసిన సర్వాలంకృత వేడుక ఇది. మహాప్రస్థానం భారీ సైజ్లో అచ్చు వేయడమే విడ్డూరం. అది చదువుకోడానికి పనికి వచ్చేది కాదు. ఏ లాభాపేక్ష లేకుంటే దాన్ని సాహిత్యలోకంలోని, ప్రచురణ రంగంలోకి ‘ముచ్చట’