సంపాదకీయం

మావోయిస్టురహిత భారత్‌‍లో 2024 ఎన్నికలు

త్రిపుర ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్షా, 2024 లోక్సభ ఎన్నికలు మావోయిస్టురహిత భారత్లో జరుగుతాయని జోస్యం చెప్పాడు. ఎన్నికలు ఎప్పుడూ పాలకవర్గపార్టీ (ల) హితం కొరకే జరుగుతాయి గానీ మావోయిస్టుపార్టీకో మరో విప్లవ పార్టీకో హితం కూర్చడానికి జరగవు. పైగా మావోయిస్టు పార్టీ తన పూర్వరూపాల్లో కూడ అంటే 1969 ఏప్రిల్ 22న ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చి ప్రజలను ఈ బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలకు దూరంగా ఉండమనే చెప్తున్నది. ఆ విషయంలో ఎంతవరకు ప్రజల్ని ఎన్నికల భ్రమ నుంచి దూరం చేయగలిగిందనేది ఎన్నికలలో పోలయిన ఓట్లతో నిర్ణయించే గణాంకపద్ధతి కాదు.
సంపాదకీయం

ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధ సేనాని

స్టాలిన్‌ వ్యతిరేకతతో మొదలై కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మారిపోయిన వాళ్లు చరిత్రలో కోకొల్లలు..’ అని చలసాని ప్రసాద్‌ డజన్ల పేర్లు ఉదహరించేవారు. ఇరవయ్యో శతాబ్దపు విప్లవాల్లో, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల్లో స్టాలిన్‌ అంత జనామోద నాయకుడు లేరు. ఆయనలాగా విమర్శలు మోసినవాళ్లూ లేరు. బహుశా ఒక వెనుకబడిన పెట్టుబడిదారీ దేశంలో విప్లవోద్యమానికేగాక సోషలిస్టు నిర్మాణానికి కూడా నాయకత్వం వహించడం ఆయన ప్రత్యేకత. ఆ శతాబ్ది విప్లవాల ప్రత్యేకతల్లాగే ఆ కాలపు సోషలిస్టు నిర్మాణ ప్రత్యేకతలను కూడా పరిగణలోకి తీసుకొని చూడ్డానికి ఇప్పుడు చరిత్ర మనకు అవకాశం ఇచ్చింది. అందుకే ఇప్పటికీ విప్లవమన్నా, సోషలిజమన్నా స్టాలిన్‌ అజరామర పాత్ర మీద  అంతులేని
సంపాదకీయం

అదాని-ఆర్‌ఎస్‌ఎస్‌: భారత ఆర్థిక వ్యవస్థ

మత, ఆర్థిక వ్యవస్థల సంబంధం మీద చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏ సందేహం లేనిది ఆర్‌ఎస్‌ఎస్‌కే. “గురూజీ” చెప్పినట్లు తమది సాంస్కృతిక సంస్థ కదా..పిందూ మతాన్ని ఉద్ధరించే సంస్థ కదా.. అదాని గొడవ మనకెందుకులే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకోలేదు. ఈ దేశంలోని పేదల గురించి, వాళ్ల కష్ట నష్టాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఆర్థికంగా 'నష్ట* పోతున్నాడని, ఆయన తరపున వకాల్తా తీసుకున్నది. అదాని గ్రూప్‌ ఆర్థిక సామ్రాజ్యం నేరాల పుట్ట అని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ బైట పెట్టడగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు వచ్చింది.
సంపాదకీయం

కార్పొరేట్ స్వామ్యంలో ప్రజలపై యుద్ధం

పాణి రాజకీయ అధికారం అనే మాటకు కాల క్రమంలో చాలా అర్థాలు మారాయి. ఎవరి అధికారం, ఎలాంటి అధికారం అనే మాటలకు ప్రజాస్వామ్యంలో నిశ్చయ అర్థాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాలు వాటిని రూఢపిరిచాయి. భారత రాజ్య రూపాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం నిర్వచించింది. దీని ప్రకారం భారత భూభాగంపై సర్వంసహాధికారం ఈ దేశ ప్రజలది. ఆ ప్రజలు ఎన్ని సాంఘిక, సాంస్కృతిక వివక్షలతోనైనా బతుకుతూ ఉండవచ్చు. ఎన్ని రూపాల దోపిడీకైనా గురి కావచ్చు. కానీ వాళ్లకు రాజకీయాధికారం ఉన్నదని రాజ్యాంగం నమోదు చేసింది. ప్రజల తరపున దాన్ని అమలు చేసే ఏజెంటే ప్రభుత్వం. రాజనీతి శాస్త్రంలోని ఈ మౌలిక
సంపాదకీయం

ఎన్నికలు – మరోసారి అర్బన్ నక్సల్స్, ముస్లింలే టార్గెట్

అర్బన్ నక్సల్ అంటే ఎవరు? అటువంటి వారున్నారా ? భారత ప్రభుత్వపు పార్లమెంట్ రికార్డ్ ల ప్రకారం అయితే లేరు. ఈ సంగ‌తి   కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే ప్రకటించారు. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి వారికి మాత్రం ప్రతి సభలో, సమావేశంలో అర్బన్ నక్సల్స్ గుర్తుకువస్తారు. ఈ నెల 23 న గుజరాత్ లో పర్యావరణం పై రాష్ట్రాల మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో  దేశప్రగతిని అర్బన్ నక్సలైట్లు  అడ్డుకుంటున్నారని  మోదీ అన్నాడు. దేశంలో 6000కు పైగా అప్లికేషన్ లు పర్యావరణ అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాయని తెగ బాధ‌పడ్డాడు.  వీటివల్ల పెట్టుబడి
సంపాదకీయం

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఫాసిజాన్ని నిలువరిస్తుందా?

రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ సారి ముస్లిం లపై ఈ దాడులు నిర్వహించింది.  ముస్లిం యువకులకు లీగల్ అవేర్ నెస్, కరాటేలో శిక్షణ ఇచ్చిందనే నెపంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై తెలంగాణ పోలీసులు జులై 2022 లో దేశద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో అప్పడే తెలంగాణ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్న సమయంలో  దీనిని ఎన్ఐఏ కు బదిలీ చేశారు.  దాడులుకు గురి అయింది ముస్లింలు,  చేసింది బిజెపి నేతృత్వంలోని ఎన్ఐఏ అనే విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ దాడుల‌కు వున్న రాజ‌కీయ ప్రాధాన్య‌త
సంపాదకీయం

రాజ్యాన్ని సవాల్‌ చేస్తున్న సిలింగేర్‌, హస్‌దేవ్ పోరాటాలు

దశాబ్దాల మానవ నాగరికతలో ఆదివాసీ పోరాటాలు, వాటి యొక్క ప్రతిఫలనాలు భారతదేశ ప్రజాస్వామ్యానికి కొత్తవికాదు. అయితే ఎప్పటికప్పుడు ఆ పోరాట రూపాలు మారుతూ వస్తున్నాయి. ప్రతి కొత్తతరం తమదయిన అస్తిత్వం కోసమే కాదు, భారత ప్రజల తరపున నూతన పోరాట రూపాలను రూపొందించుకుంటున్నది. ఇది ఆదివాసీల జీవన్మరణ సమస్య కాదు. వారి వ్యక్తిత్వంలోనే కలగలసిన మనుషుల కోసం జీవించడమనే ఆకాంక్ష బలీయమైనది. వనవాసి నవలలో ఆదివాసి మహిళ భానుమతి నాకు భారతదేశమంటే తెలియదు అంటుంది. అరణ్యం మాత్రమే మా ఊరు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి నమూనా వెనుక దాగిన విధ్వంసీకరణలో భానుమతి ఆ మాట అనగలిగింది. ఒక దేశ
సంపాదకీయం

వాళ్లది విధ్వంస సంస్కృతి

కొందరు నిర్మిస్తుంటారు. మరి కొందరు కూలదోస్తుంటారు. ఇళ్లు, వీధులు, ఊళ్లు మాత్రమే కాదు. జీవితాన్ని కూడా కూలదోస్తారు. తరతరాలుగా మానవులు నిర్మించుకున్న సంస్కృతిని నేల మట్టం చేస్తారు. మానవాళి నిర్మించుకున్న నాగరికతను ధ్వంసం చేస్తారు. పాలకులు కూలదోస్తుంటారు. ప్రజలు లేవదీస్తుంటారు. ఢల్లీిలో సంఘ్‌ ప్రభుత్వం ముస్లిం జనావాసాలను బుల్డోజ్‌ చేయడం కేవలం ఒక తాజా విధ్వంస ఉదాహరణ మాత్రమే. మైనారిటీల ఇండ్ల మీదికి బుల్డోజర్లను తోలడం, పేదల తల మీది నీడను తొలగించడం, బ‌తుకు తెరువును నేల‌మ‌ట్టం చేయ‌డం ఒక ప్రతీకాత్మక విధ్వంసం. అందువల్ల కూడా దేశమంతా ఈ విధ్వంస చిత్రాన్ని నేరుగా పోల్చుకోగలిగింది. అంతక ముందే సకల
సంపాదకీయం

నిత్య నిర్మల నర్మదా ప్రవాహం

ఆమెను ఎప్పుడో ఒకసారి చూశాను. వ్యక్తిగత పరిచయాలు అక్కరలేని సామాజిక వ్యక్తిత్వాన్ని కొంతమంది సంతరించుకుంటారు. అప్పుడు మనం ఎక్కడ చెయి పెట్టినా వాళ్ల అద్భుత స్పర్శ మనల్ని పులకింపజేస్తుంది. మనం ఏది ఆలోచిస్తున్నా వాళ్లు ఒక వెలుగు రేఖ మనపై ప్రసరిస్తారు. మనం ఏ పని చేస్తున్నా వాళ్లు ఆసరాగా వచ్చి నిలబడతారు.  మనం ఏదో  వెతుకుతోంటే మన ముందు దారి పరిచిపోతారు.  సామాజికులుగా, సామూహిక చైతన్య ప్రతినిధులుగా మారినవాళ్లకే ఇది సాధ్యమవుతుంది. నర్మద అలాంటి జీవితం గడిపింది. అలాంటి వారితో కలిసి జీవించింది. దశాబ్దాల కఠోర జీవితాన్ని చైతన్యవంతంగా, ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా గడిపింది. వేలాది మందిని ప్రభావితం
సంపాదకీయం

ఆర్కె  స్మృతి నేరం కాదు

పాణి కామ్రేడ్‌ ఆర్కె మరణించి కూడా మనకు  ఒక  భరోసాను ఇచ్చాడు. ఈ చీకటి రోజుల్లోనూ ధైర్యాన్ని అందించాడు. తన విస్తారమైన ప్రజా జీవితంలో వలె మరణానంతరం కూడా  మనలో ఆశను రగిల్చాడు.    ఆర్కె జ్ఞాపకాల, రచనల సంపుటి ‘సాయుధ శాంతి స్వప్నం’ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. పుస్తకాలను ప్రచురణకర్తకు ఇచ్చేయాలని, ప్రింటర్‌ మీద పెట్టిన కేసు చెల్లదని ప్రకటించింది. న్యాయ పీఠాలు అన్యాయ స్థావరాలుగా మారిపోయిన వేళ ఇలాంటి తీర్పు వెలుబడిరది. తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద  పోలీసులు ఈ కేసును నమోదు