కొందరు నిర్మిస్తుంటారు. మరి కొందరు కూలదోస్తుంటారు. ఇళ్లు, వీధులు, ఊళ్లు మాత్రమే కాదు. జీవితాన్ని కూడా కూలదోస్తారు. తరతరాలుగా మానవులు నిర్మించుకున్న సంస్కృతిని నేల మట్టం చేస్తారు. మానవాళి నిర్మించుకున్న నాగరికతను ధ్వంసం చేస్తారు. పాలకులు కూలదోస్తుంటారు. ప్రజలు లేవదీస్తుంటారు. ఢల్లీిలో సంఘ్ ప్రభుత్వం ముస్లిం జనావాసాలను బుల్డోజ్ చేయడం కేవలం ఒక తాజా విధ్వంస ఉదాహరణ మాత్రమే. మైనారిటీల ఇండ్ల మీదికి బుల్డోజర్లను తోలడం, పేదల తల మీది నీడను తొలగించడం, బతుకు తెరువును నేలమట్టం చేయడం ఒక ప్రతీకాత్మక విధ్వంసం. అందువల్ల కూడా దేశమంతా ఈ విధ్వంస చిత్రాన్ని నేరుగా పోల్చుకోగలిగింది. అంతక ముందే సకల