సంపాదకీయం

ఏడాదిగా కగార్‌ విధ్వంసం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత ఏడాది డిసెంబర్‌ 13 నుంచి మూడు రోజులు చత్తీస్‌ఘడ్‌లో పర్యటించాడు. ఆ సందర్భంగా ఆయన ‘మావోయిస్టు రహిత భారత్‌ అనే స్వప్నం సాకారమవుతోంద’ని అన్నాడు. ‘మావోయిస్టులందరినీ చంపేయడానికి   భద్రతా బలగాలు సిద్ధంగా, ఉత్సాహంగా ఉన్నాయ’ని అన్నాడు. ఆ తర్వాతి రోజు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యాడు.  అక్కడ బాబాసాహెబ్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మొదటి మాట ఆదివాసీ హక్కుల గురించి, మావోయిస్టు ఉద్యమం గురించి పట్టించుకునేవారికే వినిపించింది. మిగతా వాళ్లకు కూడా వినిపించే ఉండొచ్చు. కానీ మౌనం పాటించారు. తెలుగు సమాజంలోని గౌరవనీయ పాత్రికేయులు, మేధావులు, రచయితలు ఇందులో మొదటి వరుసలో
సంపాదకీయం

షరతులు వర్తిస్తాయి…

ఏ వివాదానికైనా పరిష్కారం ఉండవలసిందే. అసలు వివాదమే లేనప్పుడు పరిష్కారం వెతకడం వృధా ప్రయాస.  భారతదేశానికి ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. యోగి పాలనలో ఏం జరుగుతోందో  తెలిసిన విషయమే. గుజరాత్ నమూనా తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రయోగం కొనసాగుతోంది. ప్రజల దైనందిక జీవనంలో జోక్యం ఎక్కువవుతోంది. ఈ జోక్యం బహురూపాలలో వ్యక్తం అవుతోంది.  ఈ నమూనా భారతదేశం అంతటా విస్తరించవచ్చు. భారతదేశ పని సంస్కృతిలో ఉన్న సంబంధాన్ని విడదీసే ప్రయత్నం యోగి ప్రభుత్వం చేస్తోంది. క్షురక, దర్జీ వృత్తులలో ఉన్న పురుషుల దగ్గరకు స్త్రీలు వెళ్ళకూడదు. స్త్రీలు తమ అవసరాల కోసం స్త్రీల దగ్గరికి వెళ్ళాలి.
సంపాదకీయం

ఇదొక హిందుత్వ దారి…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రెండు  ప్రధానమైన విషయాలు చర్చనీయాంశంగా వున్నాయి.మొదటిది భావ ప్రకటనా  స్వేచ్ఛపై నియంత్రణ. రెండవది కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతన వాదిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం . ఈ రెండు విషయాలు పరిష్పర ఆధారితాలు. భావ ప్రకటన స్వేచ్ఛను తెలుగుదేశం పార్టీ  తన ప్ర త్యర్థి జగన్ కాంగ్రెస్ నుండి లాక్కోవడం  మాత్రమే కాదు. ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసుల దగ్గర పంచాయితీ ,అరెస్టులు ఉంటాయనే విషయాన్ని చంద్రబాబు, పవన్ చెబుతున్నారు. వందలాదిమంది   యూట్యూబర్లను  పోలీస్ స్టేషన్ కు పిలిచి రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు.    పదేళ్ల కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో 
సంపాదకీయం

విప్లవ మానవుడు అమరుడు జి ఎన్ సాయిబాబా

విరసం ప్రపంచ విప్లవ మానవుడిగా పేర్కొన్న అమరుడు కామ్రేడ్ జి ఎన్ సాయిబాబా ఎక్కడ పుట్టి చేతులతో పాకుతూ, బుద్ధితో జ్ఞానాన్ని పొందుతూ చేతనతో వివేకాన్ని పెంచుకుంటూ నిజంగానే ప్రపంచమంతా తిరుగుతూ విప్లవ ప్రస్థానం చేసాడు. అమలాపురం పక్కన ఒక వ్యవసాయ కూలీగా మారిన పేద రైతు ఇంట్లో పుట్టి చదువు కోసం ఆ ఊరు చేరేనాటికి అది కోనసీమ. ఆయన జీవితం మాత్రం తండ్రి నాడు చిన్న రైతుగా కొంత భూకమతం కలిగి ఉన్నా బతుకు దుర్భరమై సాయిబాబా, పోలియో బాధితుడైన సాయిబాబా చదువుకుంటేనైనా భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు సాహసం చేసి అమలాపురానికి తరలివచ్చారు. అయితే సాయిబాబా
సంపాదకీయం

సాహచర్య వంతెన..

ఇటు చూడు కన్నీళ్ళతో నిండిన నీకళ్ళను నాకు చూపియ్యడానికి   సిగ్గుపడకు... ఈ రోజైనా కన్నీటి వర్షాలు వరదలు పెట్టనివ్వు       -కబీర్. అక్టోబర్ 4వ తేదీన ముప్పైమంది మావోయిస్టుల హననం జరిగిన వారం రోజుల తర్వాత సాయిబాబా మరణించాడు. దుఃఖానికి ఒక కొలత ఉండాలి. దానికొక అడ్డు కూడా ఉండాలి. కానీ నిర్వికల్పసంగీతంలా భారత సమాజంలో దుఃఖం ప్రవహిస్తుంది. దుఃఖతీవ్రత సాయిబాబ దగ్గర  ఆగింది.   2013 విరసం  జనరల్ బాడీ సమావేశం కావలిలో జరుగుతుండగా ఢిల్లీలో సాయిబాబా  నివాసంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  ఉన్నదని  వరవరరావు మా దృష్టికి  తీసుకువచ్చారు. యూపీఏ పాలనలో కేసు నమోదు అయింది. తర్వాత
సంపాదకీయం

శ్రామిక జన గాయకుడు

ప్రజాకళాకారుడు ఉన్నవ నాగేశ్వరావు ఆకస్మికంగా మరణించాడు. తీవ్రమైన అనారోగ్యాన్ని దాచుకొని భూమిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఒక మనిషి భౌతిక నిష్క్రమణ చుట్టూ ఉన్న సమాజానికి అక్కరలేదు. రక్త సంబంధాలు, అభిరుచులు, కళా, సాహిత్య  సాహచర్యంలో వున్నవారికి ఆందోళన కలిగిస్తాయి.  ఈ ఆవేదన జీవితం కొనసాగింపులో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కామ్రేడ్ నాగేశ్వరరావు విప్లవ రాజకీయాలలోకి వచ్చిన కాలం నుండి మరణం వరకు ఆ రాజకీయాలకు వాహికగా పనిచేశాడు . కళారంగం ద్వారా తాను చేయదగిన పనిని నిర్వర్తించాడు. 1997లో ఏర్పడిన ప్రజా కళా మండలి లో చేరి మరణించే నాటికి కోశాధికారిగా ఉన్నాడు. ఉన్నవ నాగేశ్వరరావుది గుంటూరు జిల్లా
సంపాదకీయం

ఏసేబు ఒక్కడే కాదు.. వేలు , లక్షలు 

జీవించి ఉండగానే మరణానంతర వైభవానికి కూడా అన్నీ సిద్ధం చేసుకొనే వాళ్లున్న చోట మరణించి జీవించడం మొదలు పెట్టేవాళ్లు దిగ్భ్రాంతికరంగా తయారవుతారు. అలాంటి వాళ్లను  అంగీకరించడానికి మనసు సిద్ధం కాదు. అసలు వాళ్లున్నట్లు కూడా తెలియదనే రక్షణ వలయంలో సేదతీరుతాం. ఒకవేళ తెలిసి ఉంటే వాళ్లను మినహాయింపు అనుకుంటాం. తీసి పక్కన పెట్టేస్తాం. మన నిరాశలకు, నిట్టూర్పులకు, చరిత్రపట్ల పిల్ల చేష్టలకు తగిన దారికి ఇలాంటి వాళ్లు అడ్డం లేకుండా చూసుకుంటాం. సుఖమయ వాదనల విశాల రంగస్థలానికి  ఈ ఏర్పాట్లు అవసరం మరి. వాదననలను ప్రతిసారీ సత్యాన్వేషణ కోసమే చేస్తామనే గ్యారెంటీ ఏమీ లేదు. ఆసత్యానికి ఆవలి అంచున 
సంపాదకీయం

అనగనగా ఒక ఏనుగు

అనగనగా ఒక ఏనుగు ఉండేదట. అది అడవిలో స్వేచ్ఛగా తిరిగేదట. ఒకరోజు అది నదీ తీరం వెంబడి ఆహారం వెదుక్కుంటూ ఒక గ్రామంలోకి ప్రవేశించిందట. గ్రామంలోకి వచ్చిందే గాని అది ఎవరి జోలికి రాలేదట. కానీ కొందరు మనుషులే ఏమనుకున్నారో ఏమో.. పేలుడు పదార్థాలు పెట్టిన పైనాపిల్ పండును దానికి పెట్టారట. ఆ ఏనుగు దాన్ని నోట్లో వేసుకోగానే అది పేలిపోయిందట. రక్తమోడుతున్న గాయంతో అది ఊరు విడిచి పారిపోయిందట. కొద్ది రోజులకు అది చచ్చిపోయిందట. అప్పుడు అది గర్భంతో ఉన్నదట. అందువల్ల కడుపులో బిడ్డ కూడా చచ్చిపోయిందట. ఇంత ఘోరానికి పాల్పడిన ఆ గ్రామానికి భయంకరమైన శాపం
సంపాదకీయం

తెలంగాణలో మళ్లీ ఎన్‌కౌంటర్లు

చరిత్ర మళ్లీ మొదటికే వచ్చింది. తెలంగాణలో మళ్ళీ ఎనకౌంటర్లు మొదలయ్యాయి. మూడేళ్ళ తరువాత మళ్ళీ తెలంగాణ నేల విప్లవకారుల రక్తంతో తడిసింది. జూలై 25న దామరతోగు  అడువుల్లో జరిగిన కాల్పులలో నలమారి అశోక్‌ అలియాస్‌ విజేందర్‌ చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. మరొక వైపు అనారోగ్యంతో ఉన్న అశెక్‌ను  పట్టుకుని చంపివేసినట్టు విప్లవ పార్టీ ప్రకటించింది. వీటిలో వాస్తవాలు ఏవైనా.. ఎన్‌కౌంటర్ల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటని తేలాల్సి ఉన్నది.   ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ సమాజం  ప్రభుత్వాన్ని అడగవల్సిన ప్రశ్న ఇది. ఒక్క ఎన్‌కౌంటర్‌కే ఇలా అడగవచ్చునా? అనేవాళ్లు కూడా ఉంటారు.  కానీ ఇది ఇక్కడితో ఆగే వ్యవహారం
సంపాదకీయం

ఎన్నికల తరువాత ..

‘ఎన్నికల వేడి’ అంటారు కదా. అది ఎన్నికలయ్యాక చల్లారిపోతుంది. మళ్లీ ఏవో ఎన్నికలు వచ్చే దాకా అంతా చల్లదనమే. పోలింగ్‌ పాలకుల తలరాత మారుస్తుంది. కొత్త వాళ్లు అధికారంలోకి రావచ్చు. పాత వాళ్లే కొనసాగవచ్చు. అద్భుతాలు జరిగినా, జరగకపోయినా ఏదో ఒక రకంగా ‘పాలించడబడటం’ ప్రజలకు మామూలవుతుంది. వేడి చల్లారిపోవడం, కొత్తపోయి పాతపడటం  అంటే ఇదే. కాకపోతే మొన్నటి సాధారణ ఎన్నికలకు కొంత ప్రత్యేకత ఉంది. ప్రధాన స్రవంతి పత్రికల్లో కూడా ఇది కనిపించింది. బీజేపీ కూటమికి, ఇండియా కూటమికి మధ్య భావజాల ఘర్షణగా కూడా  చూశాయి. నిజానికి ఇది దిన పత్రికలకు అందే వ్యవహారం కాదు. వాటి