సంపాదకీయం

చికాగో నుండి నోయిడా దాకా కార్మిక వర్గ పోరాటాలకు జేజేలు

భారత పోరాటాల చరిత్రలో మరొక పోరాటం నమోదు అయింది. గత దశాబ్ద కాలంలో దేశంలో ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం, రైతు ఉద్యమాలు, సిలింగేర్, తిజీమాలి లాంటి ఆదివాసీ పోరాటాలు జరిగాయి. ఇప్పుడు నోయిడా కార్మిక ఆందోళన వాటి సరసన చేరింది. వీటిలో దేనికవే ప్రత్యేకమయిన పోరాటలు. మరొకవైపు ఇవన్ని కార్పొరేట్ హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు. ఈ తరహా పోరాటాలే దేశంలో అరకొరగా మిగిలి ఉన్న పోరాట, ప్రజాస్వామిక వాదులకు ఊపిరి అవుతున్నాయి. వీటిని కాపాడుకోవటం అనేది దేశ ప్రజలకు అవసరం, ఆవశ్యకత.                  నోయిడాలో 82 ఫ్యాక్టరీలకు చెందిన కార్మికులు ఏప్రిల్ మొదటి వారం నుంచి సమ్మె
సంపాదకీయం

మార్చి 31 తర్వాత..

... కూడా లోకం ఉంటుంది. దాని చరిత్ర ఉంటుంది. దాన్ని నిర్మించుకుంటూ మోసుకపోతున్న మహా మానవాళి చిరస్థాయిగా ఉంటుంది. మనుషులంటే పోటెత్తే భావోద్వేగాలు కదా.. అవీ ఉంటాయి. మనుషులంటే తీవ్రమైన ధిక్కార ప్రతిఘటనలు కదా.. అవీ పదిలంగా ఉంటాయి. మనుషులంటే స్వేచ్ఛాగానాలూ, విముక్తి ఆకాంక్షలూ, సుందర లోకాల స్వప్న రాగాలూ. అవీ వినిపిస్తూనే ఉంటాయి. కన్నీరూ, కఠినమైన ఆచరణా కలిసి రూపొందిన ఒక నిర్మాణం విధ్వంసమైందేగాని, దాని రక్తమాంస సంలీన చైతన్యం తుడిచిపెట్టుకపోయేది కాదు. మార్చి 31 తర్వాత కూడా మానవ సృజన కలాపమైన విప్లవం తిరిగి ఏదో ఒక మారుమూల లేచి నిలబడుతుంది. మరింత నాణ్యంగా, గంభీరంగా,
సంపాదకీయం

సామ్రాజ్యవాద యుద్ధం మహిళల్ని విముక్తి చేస్తుందా?

ఇరాన్‌లో మత ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2022లో మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. మహ్సా అమిని అనే కుర్దిష్ మహిళ మరణం ఈ ఉద్యమాన్ని రగిలించింది. హిజాబ్ సరిగా ధరించలేదనే నేరానికి ఆమెను మోరల్ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కస్టడీలో ఆమె మరణించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఇరాన్ ఆమ్మాయిలు బహిరంగంగా హిజాబ్‌లను మంటల్లో కాల్చేయడం, పొడవాటి జుట్టును కత్తిరించి పడెయ్యడం ప్రపంచమంతా చూసింది. నిరసన ప్రదర్శనల్లో వందలాది యువతీ యువకులు పోలీసు హింసకు బలయ్యారు. వేలాది మంది జైళ్లపాలయ్యారు. ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతప్తితో
సంపాదకీయం

కార్మిక సమ్మెకు సంఘీ భావం

ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం కావడానికి కార్మిక వర్గం సమాయుత్తమాతుంది. పన్నెండు ఏళ్ల నరేంద్ర మోదీ  పాలనలో కార్మిక, కర్షక వర్గ  విధానాల పట్ల అనుసరి స్తున్న వైఖరి పట్ల అసంతృప్తి ఉంది.  ఇప్పటికే భారత దేశ రైతులు రోడ్లపై నిలబడి ఉన్నారు.వ్యవసాయం ఏమాత్రం లాభసాటి కాదని  చివరకు పోరాట రూపమే మిగిలిందనే నమ్మికతో వున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేలాది మంది రైతులు రోడ్లపై నిల్చున్నారు. ఈ దేశానికి సంబంధించి నంతవరకు  కార్మికులు, కర్షకులు పునాదిగా ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా    ఉన్నారు. రైతులు ఈనాటికీ తమకు ఉన్న
సంపాదకీయం

ప్రతీకలు కూడా దేశద్రోహమట! పౌరహక్కుల సంఘంపై అక్రమ కేసు

భాషకంటే ప్రతీకలు ప్రాచీనమైనవి. మనుషులు తమ వ్యక్తీకరణకు సంకేతాలను, ప్రతీకలనే మొదట సాధనం చేసుకున్నారు. ప్రకృతి పరిశీలనలో కలిగిన భావోద్వేగాలను, భయోద్విగతలను కొండ గుహల్లో బొమ్మలు గీచినట్లు ఆధారాలు ఉన్నాయి. అసలు మానవ ఊహ తొలి వ్యక్తీకరణలు నిర్దిష్ట భాషార్థం సంతరించుకోకముందు గీతల్లో, చిత్రాల్లో ఉన్నట్లు చూడవచ్చు. ఆ తర్వాత తమ సామాజిక   నిరసనలను, కోపాలను, విజయాలను కూడా ప్రతీకాత్మం చేశారు. మానవ నాగరికతా వికాసంలో ఊహా వ్యక్తీకరణలకు ఇంత పురాతన సంప్రదాయం ఉన్నది. చివరికి భగవంతుడ్ని కూడా అప్పటి దాకా ఏ ఏ విశేషణాలతో, ప్రతీకలతో గౌరవించారో వాటినే తిరగేసి ఆగ్రహావేశాలతో నిందా స్తుతి చేశారు. రాజులకు
సంపాదకీయం

రాజ్యాంగం చెప్పినవన్నీ చేశారా? ఉమ్మడి పౌరస్మృతి తేవడానికి..

ప్రజా క్షేత్రం గురించి బీజేపీకి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసో అర్థమయ్యే కొద్దీ మనకు ఆందోళన పెరుగుతుంది. మామూలుగా  కామన్‌సెన్స్‌లో భాగంగా సంఫ్‌ుపరివార్‌  ఈ సమాజాన్ని మధ్య యుగాల్లోకి తీసికెళుతుందనే విమర్శ చాలా మంది చేస్తుంటారు. తన మీద ఇలాంటి అభిప్రాయం ఉన్న ఈ సమాజంతో  సంఫ్‌ు ఎట్లా వ్యవహరిస్తుంది? నిజంగానే ఈ దేశంలోకి ముస్లింలు రాకముందటి రోజులే ఉజ్వలమైనవని,  కాబట్టి  సమాజాన్ని  అక్కడికి తీసికెళతానని అనగలుగుతుందా? సంఫ్‌ుపరివార్‌కు ఇలాంటి భావజాలంలో కూడా ఉన్నది. ఒక ‘అద్భుతమైన’ గతాన్ని ఊహించి  చెప్పి, దాని చుట్టూ భావోద్వేగాలు లేవదీసి, ‘ఇతరుల’ మీద విద్వేష విషాన్ని నింపి, ‘తనదే’ అయిన
సంపాదకీయం

ప్రజా యుద్ధమే కా. హన్మంతు జీవన సందేశం

మావోయిస్టు పాక హన్మంతు అంత్యక్రియలకు పదిహేను వేల మంది వచ్చారని పత్రికలు రాశాయి. ఈ మాటకు మీలో కొందరైనా  'ఆఁ వస్తార్లెండీ, చనిపోయినప్పుడు. చివరిసారి చూద్దామని. ఆదేమీ ఆ ఉద్యమ బలం కాద'ని అంటారు. అందులో ఏ అర్థ‌మూ లేద‌ని అంటారు. ఇంత జన సందోహం ఆయనకు వీడ్కోలు పలికిందని అంటే 'మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నార'నే మేధావులు మీలో ఉంటారు. జీవితం, మరణం అవిభాజ్యమనే ఎరుక ప్రజలకు ఉంటుందని అంటే, 'సిద్ధాంతం గురించి మాట్లాడకుండా ప్రజల కామన్సెన్స్ చూసి సంతృప్తి చెందుతున్నార'ని అనే వాళ్లు మీలో తప్పక ఉంటారు. ఇంతకూ ప్రజల్లో ఎవరు ఉన్నారు? వాళ్ల మనో ప్రపంచాన్ని
సంపాదకీయం

అకాడమీ  ఎందుకు  అవార్డులిస్తుందో  రచయితలకు తెలియదా?

మంచికో చెడుకోగాని తేనెతుట్టె మరోసారి కదిలింది. అకాడమీ అవార్డుల మీద తీవ్రమైన చర్చే జరిగింది. ఫేస్‌బుక్‌ మీద కాబట్టి ఇంతకంటె గొప్పగా ఉండాలని ఆశించేందుకు లేదు. నింపాదిగా, నిలకడగా మాట్లాడుకోలేకపోవడం, తక్షణ ప్రతిస్పందనతో సరిపెట్టుకోవడం ఇవాల్టి మేధో సంస్కృతి. అట్లని అంతా ఇదే కాదు. తెలుగులో ఓపికగా జరుగుతున్న అత్యవసరమైన మేధో అన్వేషణ కూడా ఉన్నది. కేంద్ర సాహిత్య అకాడమీ గురించి, అది అవార్డులను ప్రకటించే పద్ధతి గురించి గతంలో కూడా చాలా వాద వివాదాలు జరిగాయి. అయితే ఇప్పటికైనా ఈ చర్చ అన్ని రకాల అవార్డులు, సన్మానాలు, పురస్కారాల గురించి  మరింత దృఢంగా ముందుకు సాగవలసి ఉన్నది.
సంపాదకీయం

భారత విప్లవోద్యమ దశలన్నీ ఆయన జీవితంలో…

మన చుట్టూ ఎందరో ఉంటారు. వాళ్లలో కొందరిని మర్చిపోవచ్చు.   ఇతరులను ప్రభావితం చేయగల వాళ్లను అంత సులభంగా మర్చిపోలేం. మన ఆలోచనలనో, లోకాన్ని పరిశీలించే చూపునో, జీవించే పద్ధతినో  వాళ్లు ముట్టుకొని ఉంటారు. ఈ అంశకు కాలంతోపాటు ఎదిగే స్వభావం ఉంటే.. వాళ్లు మన జ్ఞాపకాలను, ఉద్వేగాలను, అనుబంధాలను దాటి చరిత్ర పరిధిలోకి వెళతారు. అంటే ఆలోచనలను ప్రభావితం చేసే దశ నుంచి భౌతిక పరిస్థితులను మార్చే  క్రమంలో కూడా  వాళ్లు భాగం అవుతారు. చరిత్రను నిర్మించే పని మొదలు పెడతారు. ఈ సమాజం అందించే ఏ ప్రత్యేకతలు లేని మామూలు మనుషులు ఈ పనిలో భాగమైతే ఎంత
సంపాదకీయం

అల్లూరి నుంచి హిడ్మా దాకా అదే రక్తసిక్త చరిత్ర

అమరులు మడావి హిడ్మా, రాజే, సహయోధుల ఎన్‌కౌంటర్‌ హత్యలు ఏ దుర్మార్గమైన సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ బ్రాహ్మణీయ ఫాసిస్ట్‌ స్వభావానికి దాఖలా! రాజ్య వైఖరి ప్రభుత్వాలతో మారుతుందా, మారిన పరిస్థితులతో మారుతుందా? మారిన పరిస్థితులు అంటే ఏమిటి! బిహార్‌ ఎన్నికల తర్వాత, టు లవ్‌ విత్‌ సర్‌ కాదు, సర్‌తో కళ్ళు తెరుచుకున్న ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించమని చెప్తున్నారు. ఎన్నడో చెప్పాడు చారుమజుందార్‌ ఈ మాట. ఎప్పుడో చేసి చూపింది నక్సల్బరీ పంథా. హిడ్మా ఆయన సహాయోధుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు చూడండి. శత్రువు చాలా స్పష్టంగా ఏం చేస్తున్నాడు. 2024 ఎన్నికల ముందు నుంచే