ఈ నిషేధాన్ని అంగీకరిద్దామా?
విరసం మరోసారి నిషేధానికి గురైంది. తెలంగాణలో విరసం సహా పదహారు ప్రజాసంఘాలను నిషేధించారు. మార్చి 30 న తయారు చేసిన జీవో నెంబర్ 73లో పదహారు ప్రజా సంఘాలు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలని పేర్కొన్నారు. ఇవి మావోయిస్టు పార్టీ వ్యూహం ఎత్తుగడల ప్రకారం పనిచేస్తున్నాయన్నది ఆరోపణ. తెలంగాణ డిజిపి చీఫ్ సెక్రటరీకి 12 మార్చి 2021 న ఒక లెటర్ పంపారు. దానికి ప్రతిగా మార్చి 30న తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పేరుతో ఈ జోవో విడుదల అయింది. అయితే అది ఇరవై నాలుగు రోజుల తరువాత ఏప్రిల్ 23 న పత్రికలకు చేరవేశారు. మామూలుగా