పాలస్తీనా సందర్భంలో ప్రమాదకరంగా మారిన సోషల్ మీడియా
భారతదేశం అరుదైన రికార్డును సాధించింది. సోషల్ మీడియా అబద్ధాల ప్రచారంలో ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఇండియా చాలా ముందుంది. ఈ ఘనత సాధించిన సందర్భం ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్ అనుకూల, ముస్లిం వ్యతిరేక సోషల్ మీడియా పోస్టుల్లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారంలో 70 శాతానికి పైగా భారతదేశం నుండి ప్రచారమవుతున్నాయని డిజిటల్ డేటాను పరిశీలించే ఒక నివేదిక చెప్పింది! ఈ స్థాయిలో ఇజ్రాయెల్ పక్షం తీసుకుని భారతీయులు సోషల్ మీడియా యుద్ధం చేయడం చూసి ప్రపంచం విస్తుపోతోంది. స్వయంగా ఇజ్రాయెల్ కూడా ఇంతగా తనను తాను సమర్థించుకొని ఉండదు. వందేళ్ల పాలస్తీనా-ఇజ్రాయెల్ సంఘర్షణా చరిత్రలో ఎన్నడూ లేని