అమ్మకానికి దేశం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశం మీదికి కొత్త పదాన్ని, పథకాన్ని వదిలారు. దాని పేరు నేషనల్ మానెటైజేషన్ పైప్లైన్(ఎన్ఎంపి). జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ ప్రణాళిక. అంటే జాతీయ ఆస్తులను అమ్ముకొని ద్రవ్యంగా మార్చుకోవడం. అబ్చే.. ఇది అమ్మేయడం కాదు. కేవలం లీజుకు ఇవ్వడమే. ఆస్తి పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఆస్తుల మీద అధికారం, అనుభవం మాత్రమే కార్పొరేట్లకు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం అంటోంది. కొద్ది మంది మేధావులేమంటున్నారంటే..బీజేపీ వాళ్లకు ఆర్థిక వ్యవస్థను నడపడం రాదు.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి కొద్ది మంది ఇది అసమర్థ ప్రభుత్వం.. అందుకే ఇలాంటి పనులు








