ఒక జర్నలిస్టు చెలామణిలో లేకుండా అయిన తీరు
భారతదేశంలో ఖైదులో ఉన్న జర్నలిస్టులకు ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ అంటే ఏమిటి? 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో జైలు ఊచల వెనుక ఉన్న ఇద్దరు జర్నలిస్టులు - జార్ఖండ్కు చెందిన రూపేష్ కుమార్ సింగ్, జమ్ము కశ్మీర్ జర్నలిస్ట్ ఇర్ఫాన్ మెహరాజ్ల కోసం 'ఫ్రీ స్పీచ్ కలెక్టివ్' ఈ ప్రశ్నను సంధిస్తోంది. 'వాండే' మ్యాగజైన్ ఎడిటర్ ఇర్ఫాన్ మెహరాజ్ను, 2023 మార్చి 20నాడు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద నమోదు చేసిన ఆరోపణలపై అరెస్టు చేసారు. ఆయనపై విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. కాశ్మీర్లోని సంక్లిష్ట రాజకీయాలు, దాని










