దండకారణ్య సమయం ఇంటర్వ్యూ

“ఆపరేషన్ కగార్” సైనిక గడువు అదివాసులను అంతం చేయడానికే : సోనీ సోరి

(బస్తర్ లో ఈ రోజుల్లో ఒక మారణహోమం జరుగుతోంది. అక్కడ నక్సలైట్ల పేరుతో అర్ధ సైనిక బలగాలు పెద్ద ఎత్తున ఆదివాసీలను హత్య చేస్తున్నాయి. ఆదివాసీల భూమిని కార్పొరేట్ సంస్థలకు ఎలా స్వాధీనం చేయాలి అనేది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి అంటున్నారు. మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి మీనా కందసామి సోనీ సోరీతో మాట్లాడారు. ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూ ను ఇక్కడ అందిస్తున్నాము - ఎడిటర్) మీనా కందసామి: కార్యకర్తల అరెస్టుల పెరుగుదల గురించి నా మొదటి ప్రశ్న. మూల్‌వాసీ బచావో మంచర్ (ఎంబిఎం)
సంభాషణ

జీవితమే విప్లవమైన యోధుడు

రాయలసీమ నుంచి ఒడిసా దాకా.. కామ్రేడ్‌ చలపతి 1989 నుండి తన జీవితాన్నంతా విప్లవంలో గడిపాడు.   ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని మత్యం కొత్తపల్లిలో పుట్టాడు. చిత్తూరులో చదువుకొని, మదనపల్లిలో సెరికల్చర్‌ ఉద్యోగంలో చేరాడు. 1988లో పార్వతీపురానికి ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాడు. అక్కడ విప్లవ రాజకీయాలు పరిచయం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లిపోయాడు. మొదట ఆ ప్రాంతంలో  కేంద్ర ఆర్గనైజర్‌గా పని చేసాడు. 1990లో చలపతి ఉద్దానం దళ కమాండర్‌ అయ్యాడు. జీడివీక్కల వరిశ్రమలలో కూలిరేట్ల  పోరాటాల నుండి భూముల ఆక్రమణ పోరాటాలకు నాయకత్వం వహించాడు.   అన్ని రకాల
సంభాషణ

తెలుగు రచయితలారా.. బుద్ధిజీవులారా

ఆపరేషన్‌ కగార్‌ మనందరిపై సాగుతున్న కార్పొరేట్‌ ఫాసిస్టు యుద్ధం- దండకారణ్య మూలవాసీ రచయితలు, కళాకారులు ఐక్య ఉద్యమాలతో ఓడిద్దాం.. పోరాట కళా సాహిత్యాలను సృజిద్దాం హిందుత్వ కార్పొరేట్‌ ఇండియాకు వ్యతిరేకంగా భారత ప్రజల పక్షాన నిలబడదాం దండకారణ్యానికి తెలుగు రచయితలకు, మేధావులకు దగ్గరి సంబంధం ఉంది. తెలుగు ప్రాంతాల నుంచి విప్లవకారులు వచ్చాకనే సువిశాల బస్తర్‌లోని, గడ్చిరోలీలోని ఆదివాసీ కళలు బైటి ప్రాంతాలకు పరిచయం అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న యుద్ధం మమ్మల్ని సమూలంగా నిర్మూలించడంతోపాటు మా కళలను ధ్వంసం చేయడానికి కూడా నడుస్తున్నది.  కగార్‌ పేరుతో సాగుతున్న ఈ యుద్ధం మా ఒక్కరి మీదే జరుగుతున్నదని మేం
సంభాషణ

ఇల్లు వర్సెస్ రోడ్డు

“ఇల్లు ఖాళీ చేసినప్పుడు…” ఈ కవిత 88 లో అచ్చుకి దిగింది. కరీంనగర్ పల్లెటూళ్ళలో ఎక్కడో పడివున్న నా మొహం మీకు చూపించింది. కాబట్టి దాని పట్ల నాకు వల్లమాలిన అమ్మతనం లాంటిదేదో వుంది.అసలు అందులో ఏం ఉంది? నన్ను దాచిపెట్టిన నాలుగ్గోడలు , వాటిమీద పెంచుకున్న ప్రేమ ప్లస్ కోపం, రాసుకున్న నిట్టూర్పులు , ఇంతే కదా. “పట్టా మార్చిన పడక్కుర్చీలా, నే వున్న ఇల్లు \ కొత్త శరీరం కోసం ఎదురుచుస్తు౦ది\భయానికీ ఓటమికీ , ఎడారితనానికీ మీసాలు దిద్ది హుందాగా కనిపి౦చేందుకు \ కరడు కట్టిన స్వార్ధానికి పురి విప్పిన అసూయకీ తెల్లటి చొక్కా తొడిగి
సంభాషణ

సంభల్: కల్పించిన నిశ్శబ్దం

మరోసారి 'మందిర్-మస్జిద్' వివాదంపైన పోలీసులతో జరిగిన ఘర్షణలో స్థానిక ముస్లిం పురుషులు మరణించిన, శతాబ్దాల నాటి ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ పట్టణంలో నిర్జన వీధుల నిశ్చలత భారంగా వుంది. మసీదు వెలుపల జరుగుతున్న పథ్‌రావ్ (రాళ్లు విసరడం) మధ్య హసన్ తన తమ్ముడిని వెతకడానికి వెళ్లినప్పుడు ఒక బుల్లెట్ లేదా ఒక పదునైన ముక్క తగిలి  అతని కుడి చేతిని గాయపరిచింది. అది ఎటు వైపు నుంచి వచ్చిందో -స్థానిక ప్రజలా లేదా పోలీసుల వైపు నుంచా అనేది - చూడలేకపోయాడు. ఎవరు కాల్చుతున్నారో కూడా గమనించలేదు. పోలీసులు మొదట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ తర్వాత చేర్చిన సంభల్
సంభాషణ

ఒక వీరునికి కడసారి వీడ్కోలు

2024 అక్టోబర్ 14,హైదరాబాద్, మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్ మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవిఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొడవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద... రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషినిచివరిసారి చూడడం కోసం జనం తోసుకుని వస్తున్నారు. జోహార్ కామ్రేడ్ సాయిబాబా అంటూ నినదిస్తున్నారు. అక్కడంతా ఉద్రిక్తంగా వుంది. ఒక ఉద్వేగం, విషాదం కలిసి అక్కడ ప్రవహిస్తున్నాయి.వందలమంది స్త్రీలు
సంభాషణ

బస్తర్‍లో నిర్బంధ రూపాలు

(ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 9, 10తేదీల్లో హైదరాబాదులో జరిగిన ఆలిండియా సదస్సు ప్రసంగం) అందరికీ లాల్ జోహార్. ఈరోజు ఇంత మందిని చూసి నాలో కాస్త ఆశ కలిగింది. మనం ఎప్పుడూ బస్తర్ గురించే మాట్లాడుతుంటాం, అందరూ దాని గురించే చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు పరిష్కారం లేదు. ఇదే అతి పెద్ద సమస్య. ఎంతకాలమని చనిపోతూ వుంటాం? ఇలా ఎంతకాలం జరుగుతుంది? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, దేశానికి వివరించాలి. పోరాటం ఎందుకోసం జరుగుతోంది? నక్సలిజం అనే ఒక పదాన్ని పదే పదే వాడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల
సంభాషణ

కగార్ అమరుల స్థూపాల కూల్చివేత సందర్భంలో ఇంద్రవెల్లి, హుస్నాబాద్

చావంటే భయం లేని వాళ్లకు భయపడి చంపేశాడు. చచ్చి అమరత్వం పొందిన వాళ్లకు భయపడి స్థూపాలను డైనమెట్లతో కూల్చేసాడు. నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్లకు జోహార్లు, నక్సలైట్లు నాతో చేతులు కలిపితే ఢల్లీి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరవేస్తానని నర్సంపేట, ములుగు, ఏటూరు నాగారం సభల్లో వాగ్దానం చేసిన (విప్లవకారుల దృష్టిలో ప్రగల్బాలు పలికిన) ఎన్‌.టి.ఆర్‌. 1985 సెప్టెంబర్‌ 3న డాక్టర్‌ రామనాథం హత్యతో తీవ్ర నిర్బంధం ప్రారంభించాడు. అక్కడి నుంచి పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల నాయకుల హత్యలను, టాడా ప్రయోగాన్ని, మిస్సింగ్‌ కేసులను (కొడవటి సుదర్శన్‌ ఆర్‌.వై.ఎల్‌. కార్యకర్త) కె.ఎస్‌. వ్యాస్‌ నాయకత్వంలో కుఖ్యాతి వహించిన గ్రేహౌండ్స్‌ను
సంభాషణ

పోలీసులకు ఈ నాటిక మీద  కోపమెందుకు ?

వాస్తవం వేరు వాస్తవికత వేరు అని విన్నాను. వాస్తవానికున్న మూలాన్ని విశ్లేషిస్తే వాస్తవికత అవుతుందని కూడా విన్నాను. వాస్తవికత కళగా మారితే మూలంలోని సమస్య విస్తృత ప్రచారాన్నందుకుంటుంది. ప్రజల్లోకి చొచ్చుకు పోతుంది. ఇలా ప్రజల్లో ప్రచారం కావటం పాలక వర్గాలకు నచ్చదన్న విషయం విదితమే. ఈ నెల నాల్గవ తేదీన హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జల్‌ జంగల్‌ జమీన్‌ హమారా అన్న లఘునాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో వస్తువు ఆదివాసులు కార్పొరేట్‌ విస్తరణను అడ్డుకుంటారు. ప్రభుత్వం వారిని అణచివేస్తుంది. పోలీసు కాల్పుల్లో ఒక పాప  మరణిస్తుంది.  పిల్లలు ప్లకార్డులు పట్టుకుని ఈ
సంభాషణ

విప్లవంలో రూపొందిన మానవుడు

కామ్రేడ్‌ చీమల నరుసయ్య నవ యవ్వన ప్రాయంలోనే అడవి దారి పట్టాడు. అప్పటికి ఆయన వయసు రెండుపదులు నిండి వుంటాయేమో! అప్పటివరకు ఆయన గురించి మాకు తప్ప బయట ఎవరికి తెలుసు? 1978లో ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రాఘనేడు భూస్వాములను ‘సార్లు’ (మల్లోజుల కోటేశ్వర్లు) అపహరించి రైతాంగ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన నాటికి నరుసయ్య ఇంకా వెలుగులోకి రాలేదు. కేశోరాం సిమెంట్‌ కంపెనీలో కార్మిక నాయకుడిగా చలామణి అవుతూ గూండాగిరి, దాదాగిరి చలాయించే హసనొద్దీన్‌ను నక్సలైట్లు మట్టుబెట్టిన నాటికి కూడ నరుసయ్య సాధారణ ఊరి యువకుడే. మా పొరుగూరు పాల్తెం గన్ను పటేల్‌ ఆగడాలపై ప్రజాపంచాయతీ జరిపిన