ప్రజా ప్రయోజనం కోసం శాంతి కోరుకుంటున్నాం
(శాంతి చర్చల కోసం లేఖ రాసిన మావోయిస్టు నాయకుడు రూపేశ్ బస్తర్ టాకీస్ యు ట్యూబ్ ఛానెల్ వికాస్ తివారీతో చేసిన సంభాషణ ఇది . దేశమంతా శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్న తరుణంలో శాంతి గురించి , ప్రజా ప్రయోజనాల గురించి , విప్లవం గురించి తెలుసుకోడానికి మావోయిస్టు ఉత్తర - పశ్చిమ కమిటీ నాయకుడి అభిప్రాయాలు ఉపయోగపడతాయని పాఠకులకు అందిస్తున్నాం - వసంత మేఘం టీం ) వికాస్ తివారీ: ఛత్తీస్ఘడ్లో నాలుగు దశాబ్దాల నుంచి మావోయిజం ఉన్నది. నాలుగు దశాబ్దాల నుంచి మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యలో