ఇంటర్వ్యూ సంభాషణ

హక్కుల భావజాలాన్ని హిందుత్వ అంగీకరించదు

1. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులను హక్కుల నాయకుడిగా ఎలా చూస్తున్నారు? వామపక్ష భావాలుగల మేధావుల పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్న బిజెపి రాజ్యాంగ సూత్రాలకు దూరంగా వెళ్లిపోయింది. ప్రజాస్వామ్య ప్రాతిపదికన పరిపాలనను తిరస్కరించి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలపరంగా పరిపాలన సాగించాలనుకోవడం సమస్యకు మూలం. పరిపాలన పరంగా భారత రాజ్యాంగానికి, హిందుత్వ భావజాలానికి మధ్య వున్న తేడాను బిజెపి చెరిపివేసింది. దీని వల్ల సమాజం చాలా నష్టపోతున్నది. తనకు నచ్చని భావజాలంతో వున్న వారిపై దాడులకు దిగుతోంది. మనుషుల విశ్వాసాలను ప్రమాణంగా తీసుకొని వేరు చేస్తుంది. వేరైన వారిని ఏరివేయాలని పరితపిస్తోంది. అందుకు గాను జాతీయ దర్యాప్తు
వ్యాసాలు సంభాషణ

పాలకవర్గాలలో మరో కలకలం

సెప్టెంబర్‌ మూడవ వారంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా టీ.ఓ.ఐ. (టాయ్‌) లో సౌమిత్రాబోస్‌ ఒక వార్త రాశాడు. మావోయిస్టులు భద్రతా బలగాలలోకి, దుర్గా వేడుకలలోకి, స్లమ్స్‌ లలోకి తమ శక్తులను చొప్పంచడానికి నూతన పథకం రూపొందిస్తున్నారనీ శీర్షిక పెట్టాడు. పోలీసుల, భద్రతా బలగాల ఇబ్బందులను అవకాశంగా తీసుకొని సానుభూతిపరులను సమీకరించుకోవడం; మహారాష్టలో మావోయిస్టులకు సంబంధించిన 84 అనుబంధ సంఘాల పైన ఇప్పటికీ ప్రజా భద్రతా చట్టం అమలులో వుంది; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ లలో ఆ చట్టాన్ని వినియోగించుకొనే పట్టణాలలో వారి ప్రమాదాన్నిలేకుండా చేశారు అనే హైలైట్స్‌ పెట్టాడు. ఆ పక్కనే పార్టీ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి స్థానికులను
సంభాషణ

ఇది తెలంగాణ ప్రశ్నా స్ఫూర్తిపై నిషేధం!

తెలంగాణలో పనిచేస్తున్న పదహారు ప్రజా సంఘాలను తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధిస్తున్నట్టు జి ఓ ఎం ఎస్ నం 73 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు అప్రజాస్వామికమూ, రాజ్యాంగ వ్యతిరేకమూ, తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకమూ మాత్రమే కాక, ఈ జీవో రచనలో, విడుదలలో లెక్కలేనన్ని అసంగతాలున్నాయి. మొట్టమొదట మార్చ్ 30న జారీ అయినట్టు, ఆ రోజునుంచే అమలు లోకి వచ్చేటట్టు ప్రకటించిన ఈ జీవో పత్రికలకు, ప్రచారసాధనాలకు, ఇరవై నాలుగు రోజుల తర్వాత, ఏప్రిల్ 23 సాయంత్రం అందింది. ఏ జీవో అయినా వెలువడిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి బహిరంగంగా రావాలి గాని మూడు
సంభాషణ

అంతిమ వీడ్కోలుపై నిషేధమా ?

తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజా సంఘాలను నిషేధించింది. సాహిత్య రంగంలో పనిచేస్తున్న విరసం మొదలు విద్యార్థి సంఘాలు, హక్కుల సంఘాలను తెలంగాణ ప్ర‌భుత్వం నిషేధించింది. వీటిలో అమరుల బంధుమిత్రుల సంఘం కూడా ఉంది. ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  చనిపోయిన విప్లవకారుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం, వారి అంత్యక్రియలు విప్లవ సాంప్రదాయంలో జరిపించేప‌ని ఈ సంఘం చేస్తోంది. చనిపోయిన వారికి చివరి వీడ్కోలును వారు నమ్మిన పద్ధ‌తుల‌లో జరపడం  ఒక మానవీయ విలువ‌.   ఇది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే నిషేధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో విప్లవకారుల అంత్యక్రియలకు ఇప్పుటి తెలంగాణ ప్రభుత్వపు పెద్దలలో అనేక మంది హాజరైన వాళ్లే.  అధికారంలోకి
సంభాషణ

ప్రజా సంఘాలపై నిషేధం ఫాసిస్టు చర్య

తెలంగాణ ప్రభుత్వం కొత్త గా నిషేధించిన ప్రజాసంఘాలన్నీ అణగారిన వర్గాల కోసం రాజ్యాంగ బద్ధ హక్కుల కోసం నిబడ్డవే.  ఇన్ని సంఘాలపై ఇంత పెద్ద ఎత్తున నిర్బంధం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో పనిచేసే రచయితలు కళాకారులు పౌరహక్కుల కార్యకర్తలు రైతులు కార్మికులు మహిళలు ఆదివాసీలు విద్యార్థులు రాజకీయ కార్యకర్తలు అందరూ ప్రభుత్వం దృష్టిలో సంఘ విద్రోహ శక్తులు కావడం ఆశ్చర్యం.  ఇప్పుడు నిషేధానికి గురైన ఈ ప్రజాసంఘాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమంలో అగ్ర భాగంలో నిలబడినవే. అధికారంలో భాగస్వాములు కాకుండా ప్రజల పక్షంలో నిలబడి ఉండటమే నేరమైంది. ప్రజా
ఇంటర్వ్యూ

పిటిషన్ల కన్నా సమిష్టి పోరాటం ముఖ్యం

 (స్వలింగ వివాహాలను స్పెషల్ మ్యారేజి యాక్ట్ ప్రకారం గుర్తించాలని  కోరుతూ  ట్రాన్స్ జెండర్  సమూహం  పిటిషన్ ల పై సుప్రీం కోర్ట్ ఇటీవల స్పందిస్తూ .. దీని మీద పార్లమెంట్  చట్టం చేయాలని ప్రభుత్వానికి చెప్పింది. దీనిపై   కృషాణు (krishanu)  అనే క్వియర్  స్పందన ఇది)    1. ఈ తీర్పు పై మీ ప్రతి స్పందన ఏమిటి ? చాలా నిరాశ కు గురయ్యాను  కానీ , ఇలా  జరగదని  నేను అనుకోలేదు. 2. ఇప్పటి వరకు  ఈ సమస్య తెలియని  పాఠకుల కోసం  ఈ పిటిషన్ నేపథ్యాన్ని కాస్త  వివరిస్తారా .. 2020 లో  క్వీర్ జంటలు
ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

వ‌ర్త‌మాన క‌థ‌కుల‌కు గ‌ట్టి వెన్నెముక లేదు

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  గ‌త  సంచిక‌లో ఇద్ద‌రు  సాహిత్య‌కారుల అభిప్రాయాలు  ప్ర‌చురించాం. ఈ సంచిక‌లో మ‌రో ఇద్ద‌రి స్పంద‌న‌లు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1.     కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని
ఇంటర్వ్యూ

వ్య‌క్తి స్వేచ్ఛలేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీకి అవ‌కాశ‌మే లేదు

ప్రొ. ప‌ద్మ‌జా షా (ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోయే రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తీవ్రంగానే ప్ర‌భావితం చేస్తాయ‌ని ప్రొ. ప‌ద్మ‌జాషా(జ‌ర్న‌లిజం విభాగం, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం) అంటున్నారు. ఇండియాలో లిబ‌రల్ డెమోక్ర‌సీ పాదుకొన‌డానికి అవ‌కాశం లేని సామాజిక ఆర్థిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.  వ్య‌క్తి స్వేచ్ఛ లేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీ ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆమె ఇంట‌ర్వ్యూ పాఠ‌కుల కోసం..వ‌సంత‌మేఘం టీం) 1. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఫాసిస్టు తీవ్రతను ఎట్లా అంచనా వేయవచ్చు? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బట్టి పరిణామాలు ఉంటాయి. మళ్ళీ ఫాసిస్ట్ శక్తులు పెద్ద ఎత్తున గెలిచి వస్తే దేశంలో చాలా
సంభాషణ

ఈ మట్టిని తొలుచుకొని లేచిన ఆదివాసీ రైతు వీరుడు

(అమరుడు కామ్రేడ్‌ కేండ్రుక సింగన్న స్మృతిలో...) అది సెప్టెంబర్‌ మాసం మధ్య రోజులు. మేము నారాయణ పట్నా గుండా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాం. నారాయణ పట్నా బ్లాక్‌ వచ్చేసరికి అంతా హడావిడిగా కనిపిస్తున్నది. దారి పొడుగునా ప్రజల నుండి అమితమైన ఆదరణ వ్యక్తమవుతున్నది. మేము బహిర్గతం కాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, మా అలికిడి ఏ మాత్రం అర్థమైనా, జనం నిద్ర మంచాలపై నుండి లేచి బారులు తీరి చేతులు కలుపుతున్నారు. ఈ ఆప్యాయత మా అలసటను మాయం చేస్తున్నది. ఎక్కడకు వెళ్లినా  మా సంఖ్యకు మించి ‘డొప్ప’ల్లో ఆహారం వస్తున్నది. మా ప్రయాణం కొంచెం ముందుకు
ఇంటర్వ్యూ సంభాషణ

మా ఉద్యమానికి ఆయువుపట్టు భూమి సమస్యే

(శాంతి చ‌ర్చ‌ల స‌మ‌యంలో చ‌ర్చ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ స్పేస్ ప‌త్రిక కా. ఆర్కేతో చేసిన ఇంట‌ర్వ్యూ ఇది. బులిటెన్‌6(న‌వంబ‌ర్ 10, 2004)లో అచ్చ‌యింది. ఇందులో  విప్ల‌వం, వ‌ర్గ‌పోరాటం, శాంతి, స్వావ‌లంబ‌న‌, రాజ్యాధికార స్వాధీనం, ప్రాంతీయ స‌మ‌స్య‌లు మొద‌లైన ఎన్నో అంశాల‌పై ఆలోచ‌నాత్మ‌క స‌మాధానాలు చెప్పాడు. ఇప్ప‌టికీ ఇందులో చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోగా మ‌రింత జ‌టిలంగా త‌యార‌య్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయ‌న డెమోక్ర‌టిక్ స్పేస్ ను ప్ర‌భుత్వం ఇవ్వ‌దు. అది అయాచితంగా రాదు. మ‌న‌లాంటి దేశాల్లో ప్ర‌జాస్వామికీక‌ర‌ణ పోరాటాల ద్వారా, విప్ల‌వాల ద్వారానే సాధ్యం.. అని అన్నాడు. ఈ రోజుకూ విప్ల‌వ‌, ప్ర‌జా పోరాటాల‌న్నిటికీ దారి చూసే భావ‌న‌లు