కాలమ్స్ బహుజనం

ఉద్యమగీతం

రజ్మియా అంటే ఉద్యమగీతం. తెలంగాణ ముస్లింకవులు తెలుగులో,ఉర్దులో రాసిన కవితల సంకలనం ఈ పుస్తకం. దీనికి సంపాదకుడు స్కైబాబ(ఎస్.కె.యూసుఫ్ బాబ). ’నసల్’కితాబ్ ఘర్,తెలంగాణ ముస్లిం రచయితల వేదికలు ఈ పుస్తకాన్ని ప్రచురించాయి. అక్బర్,ఫవాద్ తంకానత్ లు తెలుగు,ఉర్దులలో ముఖచిత్రాలు గీశారు. తెలుగులో 36 మంది(75 పేజీలు), ఉర్దులో 31మంది(68పేజీలు) కవుల కవితలతో కూడిన పుస్తకామిడి.డిసెంబర్ 2012 లో పుస్తక ప్రచురణ జరిగింది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆ నేపథ్యంలో రాసినవే ఇందులోని కవితలన్నీ. ఈ పుస్తకంలోని కవితలలో విభిన్న ఇతివృత్తాలను కవులు ఎంపిక చేసుకున్నారు. ప్రాథమికంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చుట్టూ తిరిగినా,కవితల్లో
కాలమ్స్ అలనాటి రచన

ఓ బాలిక డైరీ

మూలం: ఆన్ ఫ్రాంక్                                           తెలుగు అనువాదం: బీనా దేవి ప్రపంచంలోనే మహా నియంత. ఎటువంటి నేరమూ చేయని లక్షలాది యూదు జాతీయులను కేవలం ‘యూదులుగా పుట్టడమే వాళ్ళ నేరమని’ భావించి, మారణహోమం చేయించిన నర రూప రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అతను పరిపాలిస్తున్న కాలంలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఒక ఇంట్లో అటక లాంటి భాగంలో తన కుటుంబంతో సహా  గడిపిన  ఒక యూదు బాలిక ఆన్ ఫ్రాంక్.  జర్మన్ లో ఫ్రాంక్ ఫర్డ్ నగరంలో 1929 జూన్ 12 వ తేదీన పుట్టింది ఆన్ ఫ్రాంక్. తండ్రి ఒట్టో ఫ్రాంక్. తల్లి
కాలమ్స్ లోచూపు

భూమి,సంస్కృతి,నాగరికత

నేటి అర్ధ వలస,అర్థ భూస్వామ్య సామాజిక వ్యవస్థలో ఈ దేశం పట్ల పాలకవర్గాల దృష్టికోణం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానుకూలంగా ఉండదు. ఒకప్పుడు గురజాడ ‘’దేశమంటే మట్టి కాదోయ్/ దేశమంటే మనుషులోయ్’’ అనంటే, నేటి పాలకులు దేశమంటే మట్టి మీద బతికే మనుషులు కాదు, ఆ మట్టి చుట్టూ పాతిన సరిహద్దులు, ఆ మట్టి కింద ఉన్న ఖనిజ వనరులేనని భావిస్తున్నారు. వాటిని తెగనమ్మి, పెట్టుబడిదారీ అభివృద్ధివైపే పాలకులు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ అభివృద్ధిలో ప్రజల నిజమైన అస్తిత్వ అభివృద్ధికి, జ్ఞానచైతన్యాల అభివృద్ధికి ఏ మాత్రం చోటు లేదు.ఉన్నదల్లా పెట్టుబడి వృద్ధియే. మనదేశంలో రైళ్ల విస్తరణ వల్ల సాపేక్షికంగా