మీరీ పుస్తకం చదివారా ?

1917లోనే అచ్చయిన చతురిక..!

ఈ నవల తొలి పుటలో పరిశోధనల చరిత్రకెక్కని నవల అంటూ ఈ నవలను సేకరించి ముద్రించిన తెలకపల్లి రవి చెప్పుకున్నారు. నిజమే చరిత్రకెక్కని, చరిత్రలో చోటివ్వని అనేక విషయాలు కర్నూలు సాహిత్య చరిత్రలో ఉన్నాయి. కర్నూలు జిల్లా సాహిత్య చరిత్రను పరిశీలించినట్లైతే ప్రపంచంలోనే తొలి తెలుగుపదం ‘అన్‌ధిర లోహము’ అనగా ఆంధ్రలోకము అనే పదం కర్నూలు జిల్లా కన్నమడకలలో లభించినది.ఇది అత్యంత ప్రాచీన శాసనంగా గుర్తించారు. తొలి తెలుగుపదం ‘నాగబు’ అని నిర్ధారించినప్పటికీ అంతకుముందే ‘ఆంధ్రలోకము’ అనే పదమున్నప్పటికీ సాహిత్యకారులు, చరిత్రకారులు సమాజక్షేత్రంలోకి తీసుకెళ్ళలేకపోయారు. ఆ పదం కర్నూలుజిల్లాలో లభించడం అరుదున విషయం.  ప్రపంచానికి బౌద్ధ సిద్ధాంతాలను ప్రవచించిన
మీరీ పుస్తకం చదివారా ?

ఇంకెన్నాళ్ళీ యుద్ధం?

“నీ దేవుడైన  యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము., నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబధ్ధ సాక్ష్యము చెప్పకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యెద్దునైనను, అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.’’ (బైబిల్‌ లోని పాత నిబంధన  గ్రంథం నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం నుండి 17 వరకు) ఈ మాటలు ఇజ్రాయల్‌ ప్రజలొక్కటే కాదు, బైబిల్‌ను బలంగా నమ్మే నేతలకు తెలీదా? పైన పేర్కొన్న బైబిల్‌ వాక్యాలకు
కథావరణం కాలమ్స్

కులం ఎట్లా పుట్టింది? కుల వివక్షత ఎట్లా పోతుంది?

కులం ఎట్లా పుట్టింది? కుల వివక్షత ఎట్లా పోతుంది?" సమాజంలోని అసమానతల కారణంగా అభివృద్ధికి చాలా దూరంలో ,చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన దళితుల గురించిన ఆత్మగౌరవ కథలు ఎన్నో వచ్చాయి. తెలుగు సాహిత్యంలో ఈ రకం ఆత్మగౌరవ కథలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. తమ పరిస్థితుల గురించి స్వానుభవంతో వ్రాసుకున్న రచనలు. పరోక్షంగా సామాజిక సాంఘిక పరిస్థితులను అర్థం చేసుకుని సహానుభూతితో రాసిన రచనలు. నంబూరి పరిపూర్ణ గారి కథాసంపుటి "ఉంటాయి మాకు ఉషస్సులు" లోని ఈ కథ పేరు "అనల్ప పీడనం" . అసలు సమాజంలోని అసమానతలకు కారణం అయిన  కులవివక్షత ఎలా మొదలైంది? కులం ఎలా
ఆర్ధికం

ఆక్స్ఫామ్: ప్రజల్ని దోచేసున్న గుత్త సంస్థలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 20-25 తేదిలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్య్లూఇఎఫ్‌) 2025 వార్షిక సమావేశం తొలి రోజున (జనవరి 20) ఆక్స్‌ఫామ్‌ సంస్థ ‘టేకర్స్‌ నాట్‌ మేకర్స్‌’ పేరుతో ఆర్థిక అసమానతల నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడిరచింది. బిలియనీర్ల సంపద మునుపెన్నడు లేనంతగా పెరిగిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న ప్రజలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నారని నివేదిక నొక్కి చెప్పింది. రోజు రోజుకు ప్రపంచంలోని ధనిక, పేద ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. మానవజాతి చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఎరగని అసమానతలపర్వం ఇప్పుడు సమాజాన్ని
క్యా చల్రా .? కాలమ్స్

మూడు రాజధానుల ముచ్చట ముగిసిన అధ్యాయం కాదు

 నేటి (21/11) జగన్ ప్రభుత్వ ప్రకటన అందర్నీ ఆశ్చర్యం లో ముంచిందనడంలో సందేహం లేదు. మొన్నటి మోడీ ప్రకటన, మూడు వ్యవసాయచట్టాల రద్దు, నేటి మూడురాజధానుల చట్టం రద్దులలో కొన్ని సారూప్యతలున్నా, కొన్ని తేడాలూ వున్నాయి. సారూప్యత, ఇరువురూ తాము మంచిబుద్ధితో చట్టాలు తెచ్చినా వాటి ప్రయోజనాల గురించి కొంతమందిలో కలిగిన అపోహలు తొలగించడంలో విఫలమయ్యామని, అందువల్ల తాము వాటిని రద్దుచేయక తప్పలేదని విచారం వ్యక్తం చేస్తూ ప్రకటించారు. తాము అనుసరించిన విధానాలలోని  తప్పులను అంగీకరించక, తామేదో ప్రజల్ని ఉద్ధరించే ప్రయత్నాలు జేస్తే, కొందరు... అందరూ కాదు, అడ్డుపడ్డారని వాపోయారు. ఈ సారూప్యతలటుంచుతే, మోడీ వెనుకంజకు కారణం రాబోయే
కథ..కథయ్యిందా! కాలమ్స్

పీడిత ప్రాంతాల కథ

పి.చిన్నయ్య రాసిన 'మెట్ట భూమోడు' , పీడిత ప్రాంతాల కథ.పీడిత ప్రజలవైపు నిలబడటం మనందరికీ తెలిసిన ఆదర్శభావం.ఈ కథ ఆ విలువ ను విస్తృతం చేస్తూ పీడిత ప్రాంతాల వైపు నిలబడమంటుంది.ఈ కథలో పీడిత ప్రాంతాన్ని ప్రేమించే ప్రొటాగనిస్టుది ఆ పీడిత ప్రాంతమే అయ్యుండవచ్చు.దాంతో తన ప్రాంతాన్ని తాను ప్రేమించక యేంచేస్తాడు అనుకోవచ్చు.అయితే యీ ప్రొటాగనిస్టుకు సుభిక్షమైన పచ్చని పంటలతో తులతూగే కాలువల ప్రాంతంలో స్థిరపడే, ఆస్తులు చేసుకొనే అవకాశం వచ్చినా వద్దనుకొని మెట్టభూముల్లోకి వెళ్తాడు.ఎందువల్ల?ఈ కథలోని ప్రొటాగనిస్టు టీచర్.కోదాడలో కాపురముంటూ, నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద వున్న రామచంద్రాపురం హైస్కూలు లో వుద్యోగం.ప్రజాసంఘాల వెనుక తిరిగే,
ఆర్ధికం

మందగమనంలో భారత ఆర్థిక వ్యవస్థ

కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం,  స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం,  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం..వంటి లక్ష్యాలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ కేవలం మాటల గారడీతో అభివృద్ధి సాధ్యం కాదని గత పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా చూశాం. మరోవైపు మోడీ ప్రచారానికి భిన్నమైన వాస్తవ దృశ్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్నాయి. వర్తమాన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను దట్టమైన చీకట్లు కమ్ముకొన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా క్షీణించిందనేదీ చేదు నిజం. వాస్తవానికి ‘ఆర్థిక వినాశనం’ అని చెప్పవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుంది.
లోచూపు కాలమ్స్

తెహ్జీబ్ జిందాబాద్ !

అసమ సమాజంలో జీవితం బరువు మోసే వాళ్ళే దేన్నైనా అర్థం చేసుకోగలరు. కొన్ని కొన్ని సార్లు అపార్ధం చేసుకోనూవచ్చు. అలా అపార్థం చేసుకోవడం కూడా ఒక రకంగా అర్థం చేసుకునే క్రమమే.కనుక అపార్థం చేసుకున్నవాళ్ళకే ఎప్పటికైనా సరిగ్గా  అర్థం చేసుకోగలిగే అవకాశాన్ని (చారిత్రిక)జీవితానుభవాలే అందిస్తాయి. అలా సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే నిర్భయంగా ప్రశ్నిస్తారు. బలంగా ప్రతిఘటిస్తారు. రాజీ లేకుండా పోరాడుతారు. వాళ్లే ప్రజలు. అలాంటి ప్రజల్లో సహజంగానే సహజీవన సంస్కృతి(తెహ్ జీబ్) ఉంటుంది. స్పష్టాస్పష్టంగానే కావొచ్చు ఎన్నో ప్రజాస్వామిక విలువలు ఉంటాయి. వారికి విభిన్న మతాల పట్ల తమవైన లౌకిక వైఖరులు ఉంటాయి. తమవైన ప్రత్యేక భక్తి
బహుజనం కాలమ్స్

‘బ్లాక్‌ ఇంక్‌’లో పిల్లల కన్నీరు

ఓ అమ్మాయి చెప్పింది, ‘మేము కన్‌వర్టెడ్‌’ అని. ‘అది కాదమ్మా! మీరు బి.సి.నా? ఎస్సీనా? ఇంకేదైనానా?’ అన్నప్పుడు, ‘నాకు తెలీదు సర్‌, మేము దేవున్ని నమ్ముకున్నం’ అంది. అప్పుడు ఆ సంభాషణను పొడిగించలేదు. క్రైస్తవానికి మారి ‘కన్‌వర్టెడ్‌’ అని పిలిపించుకున్నా కులం పేరుతో ఈసడిరపులు, కులవివక్షలు, అణచివేతలు కొనసాగుతూనే ఉంటాయి. మతం మారినందుకు కులాన్ని వదిలేసి చూడదు సమాజం.   అందుకే తమను 'అంటరాని'గా చేసిన మతం నుంచి తప్పించుకునిపోయినా సరే, ఎన్నేళ్లైనా అంటరానిగానే ఇంకా బతుకులీడుస్తున్నారు ‘కన్‌వర్టెడ్స్‌’. పైగా వెళ్ళిన మతంలోనూ అంటే క్రైస్తవ మతంలోనూ వచ్చిన కులం ఆధారంగానే సమూహాలుగా విడిపోయి ఆ మతంలోనూ ఈ కుల జాడ్యాన్ని
ఆర్ధికం కాలమ్స్

ఎందుకీ ఆర్డినెన్సులు ?

మోడీ ప్రభుత్వం పార్లమెంటుతో, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే నిస్సిగ్గుగా తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కొరకే  చట్టాలు చేస్తోంది. సమకాలీన రాజకీయాలు ప్రజలను, పార్లమెంటును విస్మరిస్తున్నాయి. నవంబర్‌ 26 నుంచి శీతకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ, ఆ సమావేశాల ప్రారంభానికి పది రోజుల ముందే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌ చట్టం 2003, ఢిల్లీ  స్పెషల్‌ పోలీసు ఎష్టాబ్లిష్‌మెంట్‌ చట్టం 1941ల సవరణలతో నవంబర్‌ 15న ఇడి, సిబిఐ డైరెక్టర్ల గరిష్ట పదవి కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ రెండు ఆర్డినెన్సులు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన