కథ..కథయ్యిందా! కాలమ్స్

‘పొదగని గుడ్ల‌’లో పర్యావరణ విధ్వంపం

అభివృద్ధి ని అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు.మానవ సౌకర్యాల కల్పనలో అభివృద్ధి అనే ప్రక్రియ మనం వూహించలేనన్ని రూపాలను సంతరించుకుంది. ఆ అభివృద్ధి పాదాల వొత్తిడి కింది ప్రకృతి, వ్యక్తులూ నలిగిపోవడం కూడా అనేక రూపాలుగా వుంది. ఒక వైపునేమో కావాల్సినంత, రావాల్సినంత అభివృద్ధి అందనితనం వెక్కిరిస్తుంటే మరోవైపు అదే అభివృద్ధి కొందరికి యెక్కువగా అంది , దానివల్ల విపరీత పరిణామాలు కూడా చోటుచేసుకోవడం కన్పిస్తుంది. ఈ అసమ అభివృద్ధి మనుషుల జీవితాలను కల్లోలం చేయడంతో పాటు ప్రకృతిలో కూడా దుష్పరిణామాలకు దారితీయడాన్ని సునిశిత దృష్టి గల రచయితలు పట్టుకుంటారు. తమ సృజనతో  చదువరులలో  ఎరుక కల్గిస్తారు.అలాంటి కథ కె.వీ.కూర్మ‌నాథ్ 
కథ..కథయ్యిందా! కాలమ్స్

చేదు మిగిల్చిన చెక్కెర కర్మాగారపు కథ ‘కంకాళం’

దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ పరిధిలో పనిచేస్తున్న అనేక సంఘాలు, సరళీకరణ ప్రైవేటీకరణ విధానాల దెబ్బకు కుదేలవడం తొంబైల తర్వాత  ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలో అమలవుతున్న మిక్సెడ్ ఎకానమీ ప్రైవేటు వేటుకు గురవడం కూడా యీ కాలంలోనే జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కొద్దిగా ప్రతిఘటించడం తొలినాళ్లలో జరిగింది. అయితే సహకార రంగంలోని నూలు మిల్లులూ, చెక్కెర కర్మాగారాలూ చాలా సులభంగా ప్రైవేటు కుట్రలకు గురికావడం జరిగింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో చెక్కెర వినియోగదారులకు  చుక్కలు చూపించిన వైనం వొకవైపూ, వినియోగదారులకు విదేశీ చెక్కెరను సరఫరా చేయడాన్ని ప్రభుత్వాలు సమర్థించుకోవడం ఒకవైపు ఏకకాలంలో జరిగిపోయాయి. ప్రతిమ గారు
కవిత్వంలోకి కాలమ్స్

కొంచెం స్వేచ్ఛ కోసం క‌వితాలాప‌న

“You need a body to preserve your soul, not a set of abstract principles.”― Ahmed Mostafaచాలా విరామం త‌ర్వాత మ‌ళ్లీ.  క‌విత్వంలోంచి, క‌విత్వంలోకి.  జీవితంలోకి.  ఒకింత ధైర్యంతో  పునః ప్రారంభిస్తున్నాను. శివారెడ్డిగారి గారి కవితను నాకున్న పరిమితులలో మీతో పంచుకోవడం. అదీ ఒక కవితా సంపుటిలోంచి ఒక్క కవితనే. తనొచ్చిన దారిని మరువని వ్యక్తిత్వంతో అదే వాక్యంతో అదే గొంతుతో నిరంతరం జ్వలించడం, అక్షరాకాశంలో  మెరవడం శివారెడ్డి గారి సొంతం. ఇది తనకు తానుగా ఏర్పరచుకున్న దారి. ఆ దారిలో అనేక కొత్త పుంతలను చూపుతూ నడిపించడం తన ప్రత్యేకత. తనకు తానుగా ఎప్పుడూ
ఆర్ధికం

పొంతన లేని జిడిపి వృద్ధి అంకెలు

దేశ జిడిపికి సంబంధించి జాతీయ గణాంకాల కార్యాలయం ఫిబ్రవరి 29న విడుదల చేసిన గణాంకాలు ఆశ్చర్యపరిచాయి. నిపుణులను కలవరపరిచాయి. ప్రభుత్వ అంచనాలను, స్వంత డేటాను తారుమారు చేసింది. కారణం ఏమి కావచ్చు? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన ముడో త్రైమాసికం (క్యూ3)లో జిడిపి 8.4 శాతం పెరిగిందని ఎన్‌ఎస్‌ఓ గణాంకాలు చూపుతున్నాయి. క్యూ1, క్యూ2 వృద్ధి రేటును కూడా సవరించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధిరేటు విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. ఇంతకుముందు త్రైమాసికంలో నమోదైన 8.1 శాతంతో పోల్చితే ఇది అధికం. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 4.5 శాతం వృద్ధి
కథావరణం కాలమ్స్

” హత్యకు గురైంది ఎవ‌రు? పిచ్చివాడు అయింది ఎవరు? నిజాలు తెలిసేది ఎప్పటికీ? “

కథలను చివరి వరకూ  బ్రతికించేది..జీవద్భాషే అనిపిస్తుంది ఈ కథలను చదివినప్పుడు.అవును!కథా లక్షణాల బరువులను సూత్రీకరణలను,  నియమాలను, వస్తువు ,శైలి, శిల్పంఇలాంటివి కాసేపు పక్కన పెడితేనికార్సయిన జీవద్భాష లో మనుషులు సహజంగా మలినం లేకుండా మాట్లాడుకుంటే, రచయిత ప్రమేయమే లేదనేంత  సహజత్వం ఉంటేఅవి "మునికాంతనపల్లి" కథలు అవుతాయి.ఇవి కథలు కావు కతలు. ఊహించి రాసినవి కావు, కల్పనలు అసలే కావు. కొంచెం అలా నెల్లూరు జిల్లా దాకా వెళ్లి వస్తే, అక్కడ  మనం వినాల్సిన గుండెలు గొంతులు,మనసులు చాలా ఉన్నాయని, మనం తప్పకుండా వినాల్సిన సత్యాలు చాలా కాలం చాలా  మరుగునే ఉండిపోయాయని, ఇన్నేళ్లకు ఆ గొంతుల్ని ఆ గుండెల్ని
లోచూపు కాలమ్స్

త‌త్వ‌శాస్త్ర ప్ర‌థ‌మ వాచ‌కం

తత్వశాస్త్రం అంటే సామాన్యులకు అర్థంకాని  నిగూఢమైన విషయమని చాలామంది అనుకుంటారు. అందుకు భావవాద తత్వవేత్తలు, ఆధ్యాత్మికవాదులు వాస్తవికతను మరుగుపరిచి , తత్వశాస్త్రం పట్ల మార్మికతతో వ్యవహరించడమే ప్రధాన కారణం. ఇహలోకంలోని  సామాజిక జీవితంతో సంబంధం లేని, మానవ అనుభవంలోకి రాని 'పరలోకపు' విషయాలతో గందరగోళపరచడం వల్ల సామాన్యజనం తత్వశాస్త్రాన్ని నిగూఢమనుకునేలా చేశారు. పైగా ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని దైవ సృష్టి అనడంతో ప్రజల్ని నిమిత్తమాత్రుల్ని చేశారు. అందుకే విప్లవ రచయిత చెంచయ్య గారు ప్రకృతిని, ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అనే ప్రశ్నే సరైంది కాదని ఈ పుస్తకంలో అంటారు. ఎందుకంటే- ఎవరు సృష్టించారన్న ప్రశ్నలోనే అది 'సృష్టించబడిందన్నది వాస్తవం'
సమకాలీనం వ్యాసాలు

‘నయా ఉదార వాద’ ఆర్థిక విధానాలు – శ్రీలంక సంక్షోభం

(నయా ఉదారవాదం అనే పదం నిజానికి ఒక misnomer – తప్పు సంకేతాన్ని ఇచ్చే పదం. కానీ కొన్ని సామ్రాజ్యవాద విధానాల సమాహారానికి నయా ఉదారవాదం అనే పేరు పడినందుకు మాత్రమే ఆ పదాన్ని ఈ వ్యాసంలో ఉపయోగించాను. సారాంశంలో అది సామ్రాజ్యవాద విధానమే, నయా వలసవాద దోపిడీ పద్ధతే.) దక్షిణ అమెరికా దేశాలలో పింక్ వెల్లువ తిరుగుబాట్లు, అరబ్ దేశాలలో జరిగిన అరబ్ వసంత తిరుగుబాట్లు, అమెరికా, యూరోప్ దేశాలలో జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ ఉద్యమాల తరువాత అంత పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు ఎగిసి పడుతున్న దేశం శ్రీలంక. ప్రజల తిరుగుబాటువల్ల తప్పనిసరి పరిస్థితిలో
కవి నడిచిన దారి కాలమ్స్

స్వగతం

జీవితం మనది కాని దిశలో సాగుతున్నప్పుడు, అంతా నిరాకారంగా ఉంటుంది. ఆ  మలుపు దగ్గర నిలబడి మనం తీసుకునే ఒక నిర్ణయం మన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశం చేస్తుంది. అలాంటి మలుపు ఒకటి నా జీవితంలో జరిగింది. అదే ఈ రోజున నన్ను మీ ముందిలా నిలబెట్టింది. ప్రకాశం జిల్లా నల్లమల అడవిని ఆనుకుని ఉన్న ఊళ్లలో మాది ఒకఊరు. సుంకేసుల గ్రామం. మా పూర్వీకులు అక్కడే నివసించారు.ఇప్పటికి మాఅన్నలు, బాబాయిలు అక్కడే జీవనం చేస్తున్నారు. మా నాన్నని వాళ్ళ మేనమామ అంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడే తీసుకువచ్చి, కొలకలూరు బెంజిమెన్ గారి హాస్టల్లో చదివించి, రైల్వే లో
లోచూపు కాలమ్స్

జీవన పునరుత్పత్తి సౌందర్యాన్ని చాటి చెప్పే ‘లద్దాఫ్ని’ కథలు

తన మొదటి కథా  సంకలనమే ఇంత ప్రభావశీలంగా ఉండడానికి అసలు జీవితం పట్లనే  షాజహానా గారి దృక్పథానికి  లోతైన, బలమైన పునాదులు ఉండడమే ప్రధాన కారణం. తన జీవితానుభవాల్లోంచి మాత్రమే కాకుండా, తన లాంటి వివక్షితులైన  మైనార్టీ సమూహపు పీడిత  ముస్లిం ప్రజల జీవిత వాస్తవికతా సంపర్కంలోంచి ఏర్పడడం వల్ల ఆమె దృక్పథానికి ఎంతో శక్తి సమకూరింది. ఆ శక్తితో నవనవోన్మేషంగా, సాహసోపేతంగా జీవిస్తూ ఆమె సృజించిన కళాత్మక డాక్యుమెంటులే యీ 14 ‘లద్దాఫ్ని- ముస్లిం స్త్రీ కథలు’.  నిత్యం అణిచివేయబడి  ధ్వంసమవుతున్న జీవితాన్ని తిరిగి ప్రజలు ఎలా పునర్నిర్మించుకుంటారో ఆమె కథలు పాఠకులకు చక్కగా  దృశ్యమానం చేస్తాయి. పైగా,
ఆర్ధికం కాలమ్స్

ఎవ‌రి ఉద్దీపన?

కరోనా వ్యాధి మానవ జీవితాల్ని చిదిమి వేస్తున్నది. భవిష్యత్‌ ఎలా ఉంటుందోనన్న భయం ఆందోళన కలిగిస్తున్నది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరం ఉన్నవారికి సాయం చేయడం, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా  పాలకుల ప్రాథమిక కర్తవ్యం. అందువల్ల కరోనా కష్టకాలం నుంచి ప్రజలను ఆదుకోవడం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. మానవతా దృష్టితో చూసినా ఈ సంక్షోభ సమయంలో బాధిత ప్రజలకు అండగా నిలువడం అత్యంతావశ్యకం. యూరప్‌, అమెరికా వంటి దేశాల్లో ఆచరిస్తున్న విధానాన్ని సైతం పక్కన పడేసి నాటు వైద్య పద్ధతుల నాశ్రయించడం మోడీ ప్రభుత్వ విధానంగా ఉంది.  కొవిడ్‌ వ్యాధిని నియంత్రించడంలో గానీ, బాధితులను