కాలమ్స్ కథా తెలంగాణ

*ఊడలమర్రి*లో విధ్వంస మూలాలు

సాహిత్యం ద్వారా సరికొత్త ప్రభావవంతమైన ఆలోచనల్ని పోగుచేసుకోవ‌డం ఇలాంటి  కథల ద్వారనే సాధ్యం అవుతుంది.పాఠకులను ఎదురుగా కూర్చొబెట్టుకుని ఉపాధ్యాయుని మాదిరిగా అద్బుతమైన ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. ప్రత్యక్షంగా తీర్పులు, పంచాయతీలు, పరిష్కారాలు పాఠకుడికి అవసరం అనిపించడంలేదు. కథను చదువుతున్న పాఠకుడి మనో అంతరంగంలో ఒక చిన్న అలజడిని, అల్లకల్లోల్లాన్ని సృష్టించినా రచయిత లక్ష్యం నెరవేర్చినట్లుగానే భావించాలి. ఈ దృక్పథంలో పరిశీలించినపుడు పి. చిన్నయ్య గారి కథలు అదే బలమైన ప్రభావాలను పాఠకుడి మనుసుపై తనదైన ముద్రను వేయడంలో 'ఊడలమర్రి' కథలకు ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రచయిత, పాఠకుడికి ఏ మాత్రం విసుగు కల్పించకుండా
కాలమ్స్ ఆర్ధికం

ఉపాధి డమాల్

కరోనా సెకెండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతి మనిషి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న దయనీయ స్థితి. ఒకవైపు జనాలు పిట్టల్లా రాలుతుండడంతో చావు భయం వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని భయానక వాతావరణంలో భారతీయ సమాజ జీవనం సాగిస్తోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భయాందోళన రాజ్యమేలుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో విఫల ప్రభుత్వంగా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్‌కు కూడా ఇప్పుడు ఊపిరాడడం లేదు. అన్ని వైపుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో మోడీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ స్థితిలో అంతర్జాతీయ పత్రికలు మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని
కాలమ్స్ లోచూపు

అస్తిత్వాలు, ఆధునికత, ప్రగతిశీల సామాజిక పరివర్తన

అస్తిత్వాలు,అస్తిత్వవాదాలు ఒకటి కాదు. కాబట్టి అస్తిత్వాల చర్చ అస్తిత్వవాద చర్చ మాత్రమే కానవసరం లేదు. ఇలా అంటున్నామంటే,అస్తిత్వ వాదాలను  పట్టించుకోనవసరం లేదని కాదు.అస్తిత్వాల విముక్తి కోసం అస్తిత్వవాదాలను సీరియస్ గా పట్టించుకొని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తించడమని అర్థం.     చరిత్రలో ప్రాచీనకాలం నుండే మానవ అస్తిత్వాలు ఉనికిలో ఉంటూ వస్తున్నాయి.ఆ అస్తిత్వాలన్నీ మారకుండా  ఒకే విధంగా లేవు. వేర్వేరు స్థల కాలాలలోని  ఉత్పత్తి సంబంధాలతో వాటికున్న సంబంధాల పరస్పర ప్రభావాలను బట్టి అవి మారుతూ  ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఒకే కాలంనాటి నిర్దిష్ట అస్తిత్వాలను పరిశీలించినా, అవి వేర్వేరు దేశాలలో విభిన్నంగా ఉండి వేర్వేరు చలన క్రమాలను కలిగి ఉంటాయి.కనుక
కాలమ్స్ లోచూపు

గుండెల్నిమండించే మంటో కథలు

మన దేశంలో ఒక జీవన విధానంగా చెప్పబడుతున్న హిందూమతం నిజానికి చరిత్రలో ఒక జన జీవనహనన విధానంగానే అమలవుతూ వస్తున్నది. మిగతా మతాల కంటే దుర్మార్గంగా ఇది అసమానతలను దైవ సృష్టిగా వ్యాఖ్యానించి, వాటిని ప్రజలు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేసింది. ఫలితంగానే బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థ, కులాంతరాల కట్టడుల వ్యవస్థ ఉనికిలోకి వచ్చి పాలకుల చేతుల్లో అవి విభజన అస్త్రాలుగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రలో ప్రజల్ని విభజించి పాలించడం కొత్తేమీ కాదు గాని, వలసవాద పాలనాంతంలో 1947 లో జరిగిన దేశవిభజన విలయం మాత్రం అతిపెద్ద చారిత్రక విషాదం. ఎందుకంటే, గురజాడ అన్నట్టుగా మతాలు మాసి
కాలమ్స్ ఆర్ధికం

భావ స్వేచ్ఛ‌కు డిజిటల్ సంకెళ్లు

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ప్రచార ఉధృతిలో చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. సామాన్యులకు, సంక్షోభంలో ఉన్న రైతులకు, అణగారిన వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగే ఒక్క చర్య చేపట్టలేదు. సమర్థ పాలన స్థానే అసమర్థత, ఏ మాత్రం పారదర్శకత, సమిష్టి నిర్ణయాలు లేని, నియంతృత్వ పోకడలున్న పాలకుడే మోడీలో కనిపిస్తాడు. కొవిడ్ మహమ్మారి విలయ తాండవం చేసిన, చేస్తున్న కాలంలోనూ మోడీ, ఆయన లెప్టినెంట్ అమిత్ షాల అనాలోచిత, ప్రజావ్యతిరేక చర్యలు దేశ అభివృద్ధిని అతలాకుతలం చేశాయి. మోడీ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి.
కాలమ్స్ లోచూపు

అంటరానితనం గాయాలకు అక్షరభాష్యం ‘అకడమిక్ అన్ టచ్ బులిటీ’

ఏ కాలం నాటి సామాజిక చలనాలైనా ఆ కాలపు సమాజంలోని వర్గ పోరాటాల మీదే ఆధారపడి ఉంటాయి.ఆయా పోరాటాల ఉధృతిని బట్టే ఆ సామాజిక చలనాలు వేగవంతం అవుతాయి. పోరాట శక్తులు ఎంతగా విద్యావంతమై సైద్దాంతీకరణ చెందితే అంతగా అవి చారిత్రిక ఫలాలను అందిస్తాయి. ఉదాహరణకు, నక్సల్బరీ విస్ఫోటనం తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి చలనాలు చాలా వేగవంతమయ్యాయి. ఈనాటి అకడెమిక్ విద్యా రంగంతో పోలిస్తే ఆనాటి ప్రభుత్వరంగ విద్యలో అంతరాల వ్యవస్థ లేదు. ప్రైవేట్ పెట్టుబడి ఇంకా చొరబడలేదు. సాపేక్షికంగానైనా ఉమ్మడి పాఠశాల విధానం అమలులో ఉండేది. దాని వల్ల విద్యార్థుల్లో సామాజిక వాస్తవికత పట్ల సరైన
కాలమ్స్ అలనాటి రచన

యుద్ధ కాల‌పు మాన‌వీయ క‌థ‌నం

రష్యన్ మూలం: చింగీజ్ ఐత్ మాతోవ్,  తెలుగు అనువాదం: ఉప్పల లక్ష్మణరావు యుద్ధం....అది  సృషించే విలయం, విధ్వంసం వర్ణనాతీతం. జయాపజయాలు ఏ దేశానివైనా ఓడిపోయేది నిస్సందేహంగా పేద, మధ్యతరగతి వాళ్ళే. బిడ్డలను కోల్పోయిన తల్లులు, భర్తలను కోల్పోయిన భార్యలు. ఎవరి పాపం? ఎవరి స్వార్ధం? నిర్మలంగా, ప్రశాంతంగా సాగిపోతున్న ఒక మామూలు సంసారంలో యుద్ధం సృష్టిచే భీభత్సమే ఈ కథ‌.  భర్తనూ, ముగ్గురు పిల్లలనూ కోల్పోయి, నిస్సహాయంగా బ్రతుకుతున్న తొల్గొనాయ్ కధే ఈ “తల్లీ-భూదేవి”  “ఒక్క గింజను నాకివ్వు. పది కంకులు నీకిస్తాను.” అని భూదేవిని కూడా ఒక పాత్రను చేసి, భూమిని సద్వినియోగం చేసుకోండి అని రచయత
కాలమ్స్ సమకాలీనం

తబ్లీగీ జమాత్ కరోనా జిహాద్ అయితే మరి కుంభమేళా?

"కరోనా ఆయా౼ మౌలానా లాయా" అనే వ్యంగ్యపూరితమైన, అపహాస్యమైన, అవమానకరమైన, నేరారోపణతో కూడిన ఈ మాటలు గత సంవత్సరం సామాజిక మాధ్యమాలల్లో ప్రదానంగా ఉత్తర భారతంలో ఎక్కువగా వినిపించినవి. కరోనా చైనా సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చుట్టేసే తరుణంలో అంతటా అలుముకున్న భయం భారతదేశం లోను విస్తరించింది. మునుపెన్నడూ చూడని ఒక మహా విపత్తు  అన్ని దేశాలను వణికించింది. యూరప్ లో అతి వేగంగా విస్తరించి, అమెరికాను ముంచెత్తిన కరోనా ఇండియా ను చేరడానికి పెద్దగా ఆలస్యమేమి చేయలేదు. ప్రపంచ వైద్య రంగం ఎన్నడూ ఎరుగని, అంతుపట్టని అదృశ్య జీవి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆ
కాలమ్స్ కథావరణం

“దుఃఖానికి ఆసరా మనిషే!-అంటున్న కథ

ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. మనిషి లోపలి ఒంటరితనాల గురించి, బాహ్యప్రపంచంలో మనిషి ఎదుర్కొనే  ఒంటరితనాల గురించిన కథలు మనల్ని కల్లోల పరుస్తాయి. కలవర పెడతాయి. అప్పటిదాకా రాని ఆలోచనలు ఇలాంటి కథలు చదివితే కొత్తగా పుట్టుకు వస్తాయి. ఏవో ఖాళీలు, ఏవో అంతరాలు, మరేవో అడ్డుగోడలు ఒక్కసారిగా కథలో కనిపిస్తాయి. అవన్నీ అంతకు ముందు మనం చూసినవే, అయినా చూసినా  నిజంగా చూడలేనివి. అప్పటిదాకా చూసినదాన్నే, చూసినా చూడలేని దాన్నే కొత్తగా చూపించేవే మంచి కథలు. నడవడం స్థానంలో పరిగెత్తడం మొదలయ్యాక వేగం పెరిగాక, మనుషులకు దూరంగా మనుషులు కదలటం మనుషులు దూరంగా మనుషులు వెళ్లిపోవడం చాలా
కాలమ్స్ కథ..కథయ్యిందా!

పితృస్వామ్యపు విరుగుడు ను చిత్రించిన చాయ్ గ్లాసు

చాయ్ గ్లాసు కథను రాసింది , నిత్య. ఈ కథ మొదట అరుణతారలో అచ్చయ్యాక , సామాన్యుల సాహసం కథాసంకలనంలో కూడా వచ్చింది.కథ, పదకొండేళ్ల వ్యవధితో మూడు దృశ్యాలను చిత్రిస్తుంది. 1994నుంచి 2005 మధ్య దండకారణ్యంలో ఆదివాసీ సమూహంలో నూతన మానవులు ఎలా ఉధ్భవించారో చెబుతుంది కథ. కథలోని  కథకురాలు 1994లో పారెనార్ గ్రామానికి రావడం, అక్కడ ఒక చిన్న పిల్లవాడి ప్రవర్తనలో పితృస్వామ్యాన్ని ఆమె గమనించడం. ఆలోచనలో పడటం. రెండో దృశ్యంలో 2000లో సంవత్సరంలో దండకారణ్యంలో జనతన సర్కార్లు ఏర్పడటంతో విద్యా వ్యవస్థ వేళ్లూనుకోవడం. భూంకాల్ స్కూళ్ల నిర్వహణలో కథకురాలు వుండటం కన్పిస్తుంది. మూడో దృశ్యంలో మొదటి