ఇవ్వాల్టి రేపటి కవిత్వం
“ఈ వేళప్పుడు” గురించి ఏడాదిగా ఆలోచిస్తున్నాను. 'ఇది చదివి తోచింది రాయిమని అరసవిల్లి కృష్ణ ఇచ్చారు. సుమారు దశాబ్ద కాలపు కవిత్వం. చదువుతోంటే ప్రతిసారీ 'ఈ వేళనే కవిత్వం చేస్తున్నారా? అనిపించేది. ఇందులో వర్తమానం గురించే లేదు. వర్తమానం రూపొందుతున్న తీరు మన పఠన అనుభవంలోకి వస్తుంది. ఇదీ ఈ కవిత్వంలోని ప్రత్యేకత. .. ఇలాంటివేవో రాద్దామని నవంబర్ 18 ఉదయం ఐదున్నరకే నిద్రలేచి మొదలు పెట్టాను. కాసేటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు మొదలయ్యాయని ఫోన్లు. అ సంగతి అరసవిల్లి కృష్ణకు చెప్పాలను కాల్ చేస్తే కలవలేదు. మళ్లీ ప్రయత్నించాను. కలవలేదు. *ఈ వేళప్పుడు” ఆయన