సాహిత్యం వ్యాసాలు

ఇవ్వాల్టి రేపటి కవిత్వం

“ఈ వేళప్పుడు” గురించి ఏడాదిగా ఆలోచిస్తున్నాను. 'ఇది చదివి తోచింది రాయిమని అరసవిల్లి కృష్ణ ఇచ్చారు. సుమారు దశాబ్ద కాలపు కవిత్వం. చదువుతోంటే ప్రతిసారీ 'ఈ వేళనే కవిత్వం చేస్తున్నారా? అనిపించేది. ఇందులో వర్తమానం గురించే లేదు. వర్తమానం రూపొందుతున్న తీరు మన పఠన అనుభవంలోకి వస్తుంది. ఇదీ ఈ కవిత్వంలోని ప్రత్యేకత. ..  ఇలాంటివేవో రాద్దామని నవంబర్‌ 18 ఉదయం ఐదున్నరకే నిద్రలేచి మొదలు పెట్టాను. కాసేటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు మొదలయ్యాయని ఫోన్లు. అ సంగతి అరసవిల్లి కృష్ణకు చెప్పాలను కాల్‌ చేస్తే కలవలేదు. మళ్లీ ప్రయత్నించాను. కలవలేదు.  *ఈ వేళప్పుడు” ఆయన
సంపాదకీయం

శ్రీ‌శ్రీ‌కి ప‌ల్ల‌కి మోత‌

ప్ర‌భువెక్కిన ప‌ల్ల‌కి కాదోయ్‌ అది మోసిన బోయీలెవ్వ‌ర‌ని ప్ర‌శ్నించి,  ‘మాన‌వ చ‌రిత్ర వికాసాన్ని’ తిప్పి చూపిన శ్రీ‌శ్రీ‌ని, ఆయ‌న మ‌హాప్ర‌స్థానాన్ని ఈ రోజు (న‌వంబ‌ర్ 30న‌) తిరుప‌తిలో కొంద‌రు ప‌ల్ల‌కిలో ఊరేగించారు. ఈ కాల‌పు వికృత‌, జుగుప్సాక‌ర స‌న్నివేశ‌మిది. ఆద‌ర్శాలు, విలువ‌లు, విశ్వాసాలు త‌ల‌కిందులుగా ఊరేగిన దృశ్య‌మిది.  మారుమూల బొరియ‌ల్లో వినిపిస్తుండిన మూలుగులు న‌డిరోడ్డు మీద విక‌టాట్ట‌హాసమైన తీరు ఇది. శ్రీ‌శ్రీ‌ని నిలువునా పాతేసి ఆయ‌న శ‌వానికి చేసిన‌  స‌ర్వాలంకృత వేడుక ఇది.  మ‌హాప్ర‌స్థానం భారీ సైజ్‌లో అచ్చు వేయ‌డ‌మే విడ్డూరం. అది చ‌దువుకోడానికి ప‌నికి వ‌చ్చేది కాదు. ఏ లాభాపేక్ష లేకుంటే దాన్ని సాహిత్య‌లోకంలోని, ప్ర‌చుర‌ణ రంగంలోకి ‘ముచ్చ‌ట‌’
వ్యాసాలు

సార్థ‌క జీవి ఆలూరి ల‌లిత‌

విప్ల‌వోద్య‌మం మ‌నుషుల‌ను  అద్భుతంగా తీర్చిదిద్దుతుంద‌నడానికి  ల‌లిత‌గారే ఉదాహ‌ర‌ణ‌.  సంప్ర‌దాయ జీవితం నుంచి  అజ్ఞాత  ఉద్య‌మ  జీవితానుభ‌వం గ‌డించేదాకా ఆమె ఎదిగారు.   ఒక మామూలు గృహిణిగా   జీవితాన్ని ఆరంభించి త‌న కుటుంబం ఉద్య‌మ కేంద్రంగా మారే క్ర‌మానికి దోహ‌దం చేశారు. ఆ కుటుంబం ఉద్య‌మ‌కారుల,  అమ‌ర వీరుల‌ కుటుంబంగా ఎదిగే మార్గంలో ల‌లిత‌గారి అడుగుజాడ‌లు ఉన్నాయి. ఇదంతా ఆమె ఒక్క‌రే సాధించి ఉండ‌రు. అస‌లు ఆమె గురించి విడిగా ఎవ్వ‌రూ మాట్లాడ‌లేరు. భుజంగ‌రావుగారితో క‌లిపే చూస్తారు. ఇది పితృస్వామ్య కోణం కాదు. విప్ల‌వోద్య‌మంలో, సాహిత్య ర‌చ‌న‌లో ఆ ఇద్ద‌రి క‌ల‌యిక అలాంటిది. నిజానికి ల‌లిత‌గారి ప్ర‌స్తావ‌న‌, ప్ర‌మేయం లేకుండా భుజంగ‌రావుగారికి ఉనికి
సాహిత్యం వ్యాసాలు

రారా విమర్శలో ఆధునికత ఎంత?

రాచమల్లు రామచంద్రారెడ్డి  గురించిన అంచనా లేకుండా తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ పురోగతిని నిర్ధారించలేం.  సాహిత్య విమర్శలోని కొన్ని అంశాల్లో ఆయన  ప్ర‌త్యేక ముద్ర‌ వేశారు.  విమర్శలోకి ఒక వరవడిని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మంచి వచనం రాసిన కొద్ది మందిలో ఆయన ఒకరు. చాల సూటిగా, నేరుగా, పదునుగా ఆయన వాక్య విన్యాసం ఉండేది.   తన రచనలతో ఆయన విమర్శ రంగాన్ని ముందుకు తీసికెళ్లారు.  అయితే ఆయన ఎంత ముందుకు తీసికెళ్లారు?  ఆందులో ఆయన ప్రత్యేకత ఏమిటి?  పరిశీలించాలి. విమర్శలో  నిక్కచ్చిగా ఉంటాడని  ఆయనకు  పేరు.  కాబట్టి ఆయన విమర్శను కూడా అలాగే చూడాలి.     మనం
సంపాదకీయం

సాహిత్య విమ‌ర్శ‌కు సొంత కార్య‌క్షేత్రం లేదా?

ఈ న‌డ‌మ ఏదో ఒక రూపంలో సాహిత్య విమ‌ర్శ గురించిన చ‌ర్చ‌లు  జ‌రుగుతున్నాయి . ఇప్పుడు  ఆ చ‌ర్చా సంద‌ర్భాల గురించి   మాట్లాడ‌బోవ‌డం లేదు.  అవి కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను  ప‌రోక్షంగా ముందుకు తీసుకొచ్చాయి.  అవి మాట్లాడుకుంటే చాలు.   సాహిత్య విమ‌ర్శ ప‌ని ఏమిటి? దానికి  సొంత కార్యక్షేత్రం ఏదైనా ఉన్న‌దా?    విమ‌ర్శ అనేది సాహిత్యం మీద‌,  సాహిత్య‌కారుల మీద ఆధార‌ప‌డిన ప‌రాన్న‌జీవి మాత్ర‌మేనా?     ర‌చ‌యిత‌ల‌ను పొగిడి వాళ్ల మెప్పు పొంద‌డంతో విమ‌ర్శ కార్య‌క్షేత్రం ముగిసిపోతుందా?  అనేవి ఆలోచించాలి.  నిజానికి సాహిత్యం గురించి   మాట్లాడుకొనేట‌ప్ప‌డు *సాహిత్య విమ‌ర్శ‌* ఆట‌లో అరిటిపండులా మారిపోతోంది. నేరుగా దాని గురించి
సంపాదకీయం

విప్లవంలో శాంతి నిర్వచనం

ఆర్‌కె మరణానంతర జీవితాన్ని ఆరంభించాడు.  రెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది. ఆయనతో, ఆయన నిర్మించిన విప్లవోద్యమంతో రక్తమాంసాల, మేధో సంబంధం ఉన్నవాళ్ల దగ్గరి నుంచి, ఆయన రాజకీయాలతో ఏకీభావం లేని వాళ్ల దాకా అందరూ కన్నీరు కార్చుతున్నారు.   అది కేవలం ఒక మరణానికి సాటి మనుషుల ప్రతిస్పందన  కాదు. అదీ ఉంటుంది. అది అత్యంత మానవీయమైనది. నాగరికమైనది. దానితోపాటు ఆర్‌కెను ఒక వ్యక్తిగాకాక భారత విప్లవోద్యమానికి ప్రతీకగా భావించారు. విప్లవంలో రూపొందిన ఆయన మూర్తిమత్వం విప్లవానికి నిదర్శనమని అనుకున్నారు. అందుకే ఈ
సాహిత్యం వ్యాసాలు

వివాదాస్పద వ్యక్తిత్వం

ఎంవి రమణారెడ్డి వాక్యం సరళంగా ఉంటుంది. ఆయన  ఏది రాసినా, మాట్లాడినా    నేరుగా  అర్థమైపోతారు. ఆయన వ్యక్తిత్వం దీనికి పూర్తి వ్యతిరేకం.  అందులో అనేక ఎత్తుపల్లాలున్నాయి.  ఆగాధాలు ఉన్నాయి.   చిక్కుముళ్లు ఉన్నాయి.  అలాంటి ఎంవిఆర్‌ గురించి సరళంగా   ఏం చెప్పినా అది తప్పే అవుతుంది. ఆయన్ను పట్టిచ్చే ఒకే ఒక వాక్యం రాయడం ఎవ్వరికైనా కష్టమవుతుంది. ఒక ప్రశంసాత్మక వాక్యం రాస్తే దాని పక్కనే ప్రశ్నించే వాస్తవం వచ్చి నిలదీస్తుంది.   ఆయన సామాజిక, రాజకీయ జీవితం  గుంటూరు మెడికల్‌ కాలేజీ విద్యార్థి దశలోనే ఆరంభమైంది. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల ప్రచార వేదికగా ప్రభంజనం పత్రిక ఆరంభించారు. విరసం
సంపాదకీయం

అమ్మకానికి దేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశం మీదికి కొత్త పదాన్ని, పథకాన్ని వదిలారు. దాని పేరు నేషనల్‌ మానెటైజేషన్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఎంపి). జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ ప్రణాళిక. అంటే జాతీయ ఆస్తులను అమ్ముకొని ద్రవ్యంగా మార్చుకోవడం.  అబ్చే.. ఇది అమ్మేయడం కాదు. కేవలం లీజుకు ఇవ్వడమే. ఆస్తి పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఆస్తుల మీద అధికారం, అనుభవం మాత్రమే కార్పొరేట్లకు ఉంటాయని   కేంద్ర ప్రభుత్వం అంటోంది. కొద్ది మంది మేధావులేమంటున్నారంటే..బీజేపీ వాళ్లకు ఆర్థిక వ్యవస్థను నడపడం రాదు.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి కొద్ది మంది ఇది అసమర్థ ప్రభుత్వం.. అందుకే ఇలాంటి పనులు
సంపాదకీయం

జూలై 4: చీకటి రోజుల వెలుగు గానం

తెలంగాణలో నిషేధాన్ని మోస్తూ ఈ జులై 4లోకి విరసం ప్రయాణిస్తోంది.   గత కొన్నేళ్లుగా తీవ్రమవుతున్న నిర్బంధం గత ఏడాది జులై నాటికే పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం మార్చి 30 నుంచి ఇప్పుడది మరోసారి నిషేధంగా మారింది. ఇదేమీ కొత్త కాదు. కానీ ప్రతిసారీ అనుభవం కొత్త‌దే.  కొత్త ధిక్కారమే.ప్ర‌తి అణచివేతా కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది, సృజనాత్మక వెల్లువలకు దారి తీస్తుంది. ఈ విష‌యం చెప్ప‌డానికి సుదీర్ఘ గతంలోకి వెళ్లనవసరం లేదు. ఈ ఒక్క ఏడాది  ప్రజలు,  సృజనజీవులు గడించిన అనుభవాలే చాలు.  మహా మానవ విషాదంగా మారిన కొవిడ్‌  మధ్య ఈ ఏడాది గడిచిపోయింది. అది
సాహిత్యం కథలు

అమ్మ పాటల పుస్తకం

సాయంకాలం సిస్టం షెడౌన్‌ చేస్తూ ఆఫీసుకు అన్నం డబ్బా, నీళ్ల బాటిల్‌ తీసుకొని  లేచాను. గ్రిల్‌ తలుపు ఒకటి తీశాను. ఓరగానే. ఇంకాపూర్తిగా తెరవలేదు. బైటి గేటు తీసుకొని వచ్చి వాళ్లు  జొరబడ్డారు. గ్రిల్‌ రెండు తలుపులు బార్లా తీసుకొని వచ్చేశారు. పదిహేను మంది ఉంటారేమో.    వాళ్లలో ఒకాయన తాము ఎవరో చెప్పుకున్నాడు. ఇంకో ఆయన మెడలోని  రాజముద్ర చూపుకున్నాడు. నేను కంగారు పడుతున్నాననుకొని ‘మీరు కూచోండి.. కూచోండి’ అని సిస్టం ముందున్న కుర్చీని ఇటు తిప్పారు.    నేను ఫ్యాన్‌ స్విచ్‌ వేస్తూ ‘మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నా’ అన్నాను.    ఒకాయన ఒకింత చిన్నగా నవ్వాడు.    ‘ఎలా అనుకున్నారు?